మాదిరి ప్రశ్నలు
1. అమరావతి వద్ద బౌద్ధ స్తూపానికి పునాదులు వేసింది
జ: నాగాశోకుడు
2. భట్టిప్రోలు శాసనం వేయించింది
జ: కుబేరుడు
3. ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి గ్రంథం
జ: ఐతరేయ బ్రాహ్మణం
4. ఆంధ్రుల గురించి పేర్కొన్న తొలి విదేశీయుడు ఎవరు?
జ: మెగస్తనీస్
5. దక్షిణ భారతదేశానికి జైనమత విస్తరణను గురించి పేర్కొన్న గ్రంథం
జ: పరిశిష్ఠ పర్వం
6. తొలి తెలుగు పదం 'నాగబు' ఏ శాసనంలో కనిపించింది?
జ: అమరావతి
7. జంతుబలి అవశేషాలు బయల్పడిన 'బిల్లసర్గం' గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి?
జ: కర్నూలు
8. ప్రాచీన కాలం నాటి రాగి పనిముట్లు లభించిన 'కీసరపల్లి' ఏ జిల్లాలో ఉంది?
జ: కృష్ణా
9. గొర్రె ఆకారం సమాధిపెట్టె లభించిన 'శంఖవరం' ఏ జిల్లాలో ఉంది?
జ: కర్నూలు
10. ఆదిమానవుడి చిత్రకళా అవశేషాలు/ ఆధారాలు లభించిన చింతకుంట ఏ జిల్లాలో ఉంది?
జ: కడప
11. రాతి గొడ్డలి బయల్పడిన 'కామకూరు' ఏ జిల్లాలో ఉంది?
జ: నెల్లూరు
12. బూడిద దిబ్బలు బయల్పడిన 'పాళ్వాయి' ఉన్న జిల్లా
జ: అనంతపురం
13. సతీసహగమనాన్ని సూచించే స్త్రీ, పురుష కళేబరాలు లభించిన సమాధి
జ: ఏలేశ్వరం
14. ఆర్య సంస్కృతిని దక్షిణాపథానికి విస్తరించింది
జ: అగస్త్యుడు
15. స్థానిక మతాచారాలను అధర్వణ వేదంలో చేర్చింది
జ: అపస్తంభుడు