• facebook
  • whatsapp
  • telegram

విపత్తు - నిర్వహణ

మాదిరి ప్ర‌శ్న‌లు

1. అంతర్జాతీయ విపత్తు కుదింపు మూడో సదస్సు ఎక్కడ జరిగింది?
జ: 2015 మార్చి - సెండాయ్ ‌

 

2. కిందివాటిని జతపరచండి.
వాయువు                     అంశం/ప్రభావం

i) మిథైల్‌ ఐసోసైనేట్‌        a) జైవిక వ్యవస్థ

ii) ఏజెంట్‌ ఆరెంజ్‌           b) కిరణ ధార్మిక

iii) రేడియో తరంగాలు     c) రసాయనిక

iv) మైకోటాక్సిన్స్‌            d) పారిశ్రామిక

     i    ii   iii   iv
జ:  d   c     b    a

 

3. రాస్టార్, వెక్టార్‌ నమూనాలు ఎందులో భాగాలు?
జ: భౌగోళిక సమాచార వ్యవస్థ

 

4. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ భూతల కేంద్రం (Earth Station) ఎక్కడ ఉంది?
జ: షాద్‌నగర్‌

5. కిందివాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం కానిది?

     1) పేదరికం, ఆకలిని నిర్మూలించడం           2) ఉత్పత్తి, వినియోగాన్ని పెంపొందించడం
     3) క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం     4) లింగ సమానత్వం, మహిళా సాధికారత
జ: 3 (క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం)

 

6. గ్రీన్‌పీస్‌ ఉద్యమం మొదట దేనికి వ్యతిరేకంగా జరిగింది?
జ: అణు వ్యతిరేకత

 

7.  కిందివాటిలో జల కాలుష్యం  వల్ల రాని వ్యాధి?
 1) కలరా      2) కామెర్లు      3) మలేరియా      4) డయేరియా
జ: 3 (మలేరియా)

 

8. కిందివాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి.
1) జాతీయ హరిత ట్రైబ్యునల్‌      2) జీవ వైవిధ్య చట్టం
3) జాతీయ వన్యప్రాణి చట్టం        4) జల కాలుష్య నియంత్రణ చట్టం
జ: 3421

 

9. పర్యావరణంపై భారత పార్లమెంట్‌ చేసిన చట్టాల్లో సరికానిది.   
1) పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986             2) బయోస్ఫియర్‌ చట్టం - 1988
3) వాయు కాలుష్య నియంత్రణ చట్టం - 1981      4) హాట్‌స్పాట్‌ చట్టం - 2006
జ: 2 (బయోస్ఫియర్‌ చట్టం - 1988)

10. కిందివాటిలో సరైంది? 
a) క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం వాతావరణ మార్పునకు సంబంధించింది. 
b) మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఓజోన్‌ తరుగుదలకు సంబంధించింది.
జ: a, b సరైనవి

 

11. కిందివాటిలో సరికానిది? 
1) అంతర్జాతీయ సునామీ దినోత్సవం - నవంబరు 5    
2) అంతర్జాతీయ అటవీ దినోత్సవం - మార్చి 20
3) అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం - ఏప్రిల్‌ 22            
4) అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం - మే 22
జ: 2 (అంతర్జాతీయ అటవీ దినోత్సవం - మార్చి 20)

 

12. కిందివాటిని జతపరచండి.

 సమావేశం   వేదిక
i) ఓజోన్‌ తగ్గుదల సదస్సు  a) న్యూదిల్లీ
ii) అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు b) కిగాలి
iii) COP - 24 సదస్సు c) న్యూయార్క్‌
iv) సుస్థిరాభివృద్ధి  లక్ష్యాల సదస్సు d) కెటోవీస్
  e) పారిస్‌

జ: i-,b ii-a, iii-d, iv-c

13. కిందివాటిలో సరైంది ఏది?
   1) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2015 - 30 వరకు వర్తిసాయి 
   2) SDG లో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి
   3) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2015, సెప్టెంబరు 25న ఆమోదించారు
జ: 1, 2, 3 సరైనవి

 

14. అప్పికో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
జ: కర్ణాటక

 

15. కిందివాటిలో పర్యావరణ ఉద్యమాలకు సంబంధించి సరికానిది?
   1) క్షిపణులకు వ్యతిరేకంగా బాలియాపాల్‌ ఉద్యమం జరిగింది.
   2) మేధాపాట్కర్‌ ‘నర్మద బచావో’ ఆందోళన చేపట్టారు.
   3) ఝార్ఖండ్‌లో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జంగిల్‌ బచావో ఉద్యమం జరిగింది. 
   4) యురేనియం వ్యతిరేక ఉద్యమం నిశ్శ‌బ్ద లోయలో  జరిగింది.
జ: 4 (యురేనియం వ్యతిరేక ఉద్యమం నిశ్శ‌బ్ద లోయలో జరిగింది.)

16. కిందివాటిని జతపరచండి.

i) ధరిత్రీ సదస్సు a) జోహెన్నస్ ‌బర్గ్‌ - 2002
ii) పర్యావరణ సదస్సు  b) హైదరాబాద్‌ - 2012
iii) జీవవైవిధ్య సదస్సు c) స్టాక్‌హోం - 1972
iv) సుస్థిరాభివృద్ధి సదస్సు  d) రియో - 1992

       i   ii   iii   iv
జ: d   c    b    a

 

17. జీవావరణ పిరమిడ్‌లో మొదటి మెట్టులో ఉన్నదెవరు?
జ: ఉత్పత్తిదారులు

 

18. కిందివాటిలో జాతీయ విపత్తు నిర్వహణ సపోర్ట్‌ ప్రోగ్రాంను నిర్వహించేది?
   1) ISRO      2) GIS      3) NRSA      4) NGRI
జ: 3 (NRSA)


19. క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
జ: 2005, ఫిబ్రవరి 16

20. జాతీయ కార్యాచరణ ప్రణాళిక వాతావరణ మార్పు కోసం 2016 డిసెంబరులో ఎన్ని జాతీయ ప్రణాళికలను అమలుపరిచింది?
జ: 8

 

21. కిందివాటిలో సరైనవి గుర్తించండి.  
     1) 2016 కరవు నిర్వహణ కరదీపిక దీర్ఘకాలిక కరవు 33% ఉన్నట్లు పేర్కొంది.
     2) కరవు పీడిత ప్రాంతం కింద 35% ఉన్నట్లు పేర్కొంది.
     3) 10% కంటే ఎక్కువ అవపాతం లోపించినట్లయితే దాన్ని వాతావరణ కరవు అంటారు.
జ: 1, 2, 3 సరైనవి

 

22. కిందివాటిని జతపరచండి.

అంశం శాతం
i) కరవు ప్రభావం a) 10%
ii) వరద ప్రభావం b) 59%
iii) భూకంప ప్రభావం c) 12%
iv) తుపాన్ల ప్రభావం d) 68%
  e) 15%

    i   ii   iii   iv
జ: d   c    b    a

23. నైలోమీటర్‌ సాధనాన్ని దేన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు?
జ: వరదలు

 

24. కిందివాటిలో ఉష్ణ మండల చక్రవాత వర్గీకరణ వేగానికి సంబంధించి సరికానిది. 
 1) తుపాన్‌ స్ట్రోమ్‌ : 62 - 88 కేఎంపీహెచ్‌         2) వాయుగుండం : 31 - 49 కేఎంపీహెచ్‌ 
  3) అల్పపీడన ద్రోణి : 50 - 61 కేఎంపీహెచ్‌      4) సూపర్‌ సైక్లోన్‌ : 221 కేఎంపీహెచ్‌ పైన
జ: 3 (అల్పపీడన ద్రోణి : 50 - 61 కేఎంపీహెచ్‌) 

 

25. కొరియాలీస్‌ ఎఫెక్ట్‌ ప్రకారం చక్రవాతాల గమనానికి సంబంధించి సరైంది.
     1) ఉత్తరార్ధ గోళంలో చక్రవాతాలు సవ్య పద్ధతిలో వీస్తాయి. 
     2) దక్షిణార్ధ గోళంలో అపసవ్య పద్ధతిలో వీస్తాయి.
జ: 1, 2 రెండూ సరైనవికావు

 

26. కిందివాటిలో సరైంది ఏది? 
       1) హజార్డ్‌ అనే పదం అరబిక్‌ భాష నుంచి వచ్చింది. 
       2) డిజాస్టర్‌ అనే పదం ఫ్రెంచ్‌ భాష నుంచి ఆవిర్భవించింది.
జ: 1, 2 సరైనవి

27. కిందివాటిలో ప్రకృతి విపత్తుల్లో భాగం కానిది?
1) హిమపాతాలు  2) ఉరుములు, పిడుగులు  3) వన నిర్మూలన    4) ఉష్ణశీతల గాలులు
జ: 3 (వన నిర్మూలన)

 

28. ప్రస్తుతం దేశంలోని ఎన్ని రాష్ట్రాలు ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాయి?
జ: 27

 

29. భారతదేశంలో భౌగోళికంగా కరవులు ఎక్కువగా ఏ ప్రాంతంలో సంభవిస్తున్నాయి?
జ: పశ్చిమ - దక్షిణ భారత్‌

 

30. విపత్తు సంభవించినప్పుడు అవసరమైనవి?
       1) అత్యవసర స్పందన, సహాయం        2) పునరావసం, పునర్నిర్మాణం
       3) సంసిద్ధత                                       4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

31. కిందివాటిలో సరికానిది.  
1) జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (NDRF) విపత్తు చట్టం సెక్షన్‌ 44 ప్రకారం ఏర్పాటు చేస్తారు.
2) NDRF కేంద్ర హోంమంత్రి నిర్వహణలో ఉంటుంది.
3) NDRF లో ప్రస్తుతం 12 బెటాలియన్లు ఉన్నాయి.
4) ప్రస్తుతం 10వ CRPF బెటాలియన్‌ విజయవాడలో ఉంది.
జ:  4  

32. ప్రపంచంలో సంభవించే వైపరీత్యాల్లో కిందివాటిలో సరికానిది? 
       1) భూకంపాల వల్ల 8% నష్టం కలుగుతుంది         2) వరదల వల్ల 30% నష్టం కలుగుతుంది
       3) చక్రవాతాల వల్ల 21% నష్టం కలుగుతుంది.       4) కరవుల వల్ల 20% నష్టం కలుగుతుంది.
జ: 4 (కరవుల వల్ల 20% నష్టం కలుగుతుంది.)

 

33. ఏదైనా భౌగోళిక ప్రాంతంలో లేదా ఒక కమ్యూనిటీలో సంభవించే వైపరీత్యాల వల్ల జరిగే నష్ట తీవ్రత, పరిధి, పరిస్థితులు దేనికి దారితీస్తాయి?
జ: దుర్బలత్వం

 

34. 1999, ఆగస్టు 20న విపత్తు నిర్వహణపై అత్యున్నతాధికార కమిటీని ఎవరి అధ్యక్షతన వేశారు?
జ: జె.సి. పంత్‌

 

35. విపత్తు తీవ్రతను సాధారణంగా దేన్ని బట్టి అంచనా వేస్తారు?
జ: ప్రాణ, ఆస్తి నష్టం

 

36. కిందివాటిలో విపత్తులు, వాటి నోడల్‌ మంత్రి బాధ్యతలను జతపరచండి.

  విపత్తు   మంత్రి
i) పరిశ్రమలు - రసాయనాలు A) హోంమంత్రి
ii) హిమపాతాలు B) వ్యవసాయ మంత్రి
iii) కరవులు C) రక్షణ మంత్రి
iv) NDRF D) పర్యావరణ - అటవీ మంత్రి
  E) పరిశ్రమల మంత్రి

      i     ii   iii   iv
జ: D   C    B   A

37. కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి.
1) జాతీయ విపత్తు నిర్వహణ మొదటి సమావేశం న్యూదిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో 2006, నవంబరు 29న జరిగింది.
2) జాతీయ విపత్తు నిర్వహణ సమావేశాలకు ప్రధాన మంత్రి అధ్యక్షత వహిస్తారు.
జ: 1, 2 సరైనవి

 

38. కిందివాటిని జతపరచండి.

  కమిటీ   ఛైర్‌పర్సన్‌
i) కేబినెట్‌ కమిటీ  A) కేంద్ర హోంమంత్రి
ii) జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ B) హోం కార్యదర్శి
iii) జాతీయ కార్యనిర్వహణ కమిటీ C) కేబినెట్‌ కార్యదర్శి
iv) విపత్తు సమన్వయ కమిటీ D) ప్రధానమంత్రి

    i    ii    iii   iv
జ: D   C    B    A

 

39. అంతర్జాతీయ విపత్తు తగ్గింపు మూడో సదస్సు 2015, మార్చి 18న ఎక్కడ జరిగింది?
జ: సెండాయ్‌

40. నూతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక (NDMP) ను 2016, జూన్‌ 1న న్యూదిల్లీలో ఎవరు విడుదల చేశారు?  
జ: ప్రధానమంత్రి  

 

41. కిందివాటిని జతపరచండి.

  సంస్థ    కార్యాలయం
i) అంతర్జాతీయ విపత్తు తగ్గింపు సంస్థ  A) బ్యాంకాక్‌ 
ii) ఆసియా విపత్తు ప్రతిస్పందన సంస్థ  B) జెనీవా
iii) సార్క్‌ విపత్తు తగ్గింపు సంస్థ  C) నాగ్‌పుర్‌
iv) నేషనల్‌ సివిల్‌ డిఫెన్స్‌ కాలేజీ D) దిల్లీ
  E) పుణె

      i    ii   iii   iv
జ: B   A   D   C

 

42. కింది అంశాల్లో సరైనవాటిని గుర్తించండి.
       1) అంతర్జాతీయ సునామీ అవగాహన దినోత్సవం - నవంబరు 5
       2) జాతీయ విపత్తు అవగాహన దినోత్సవం - అక్టోబరు 29
       3) అంతర్జాతీయ విపత్తు కుదింపు దశాబ్దం - 1990 - 2000
జ: 1, 2, 3

43. దీర్ఘకాలిక విపత్తు ప్రణాళిక అభివృద్ధిని ఏ రకమైన విపత్తు స్థాయిలో సూచిస్తారు?
జ: L3

 

44. ‘జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక’ (NDMP)లో మొత్తం ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి?
జ: 14

 

45. కింది అంశాల్లో సరైనవి. 
1) విపత్తు సహాయ నిధిని ఏర్పాటుచేయాలని 9వ ఆర్థిక సంఘం మొదట సిఫారసు చేసింది.
2) 13వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు జాతీయ విపత్తు సహాయక నిధిని 2010, ఏప్రిల్‌ 1న ప్రారంభించారు.
3) 14వ ఆర్థిక సంఘం 2015-20కి గాను ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,489 కోట్లను సిఫారసు చేసింది.
జ: 1, 2, 3

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - కాలుష్య కారకాలు

పర్యావరణం సరళమైంది, సంక్లిష్టమైంది. అది శుద్ధంగా ఉన్నంతవరకు సరళంగా ఉంటుంది. కానీ కొన్ని అనూహ్య మార్పులు సంభవించినప్పుడు సంక్లిష్టంగా మారుతుంది. ఇలా పర్యావరణంలో వివిధ మార్పులు సంభవించడాన్నే కాలుష్యం అంటారు.


  కాలుష్య కారకాలు భౌతిక ఏజెంట్లుగా వ్యవహరిస్తాయి. ఇవి ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉండి పర్యావరణం నుంచి గ్రహించే వనరుల భౌతిక, రసాయనిక, శారీరక ధర్మాల్లో మార్పులు వచ్చినప్పుడు పర్యావరణం కలుషితమవుతుంది. ఇలా పర్యావరణానికి ఉన్న స్వాభావిక లక్షణాలైన భౌతిక, రసాయనిక అంశాల్లో పరిణామాలు ఏర్పడటాన్నే కాలుష్య కారకాలు అంటారు. ఈ కారకాల్లో ప్రధానంగా నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం; వాయు, ఘన వ్యర్థ పదార్థాలు, థర్మల్, రేడియో ఆక్టల్‌ కాలుష్యాలు ప్రధానమైనవి.


జల కాలుష్యం: 


  జీవరాశులకు గాలి, ఎండ ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. భూ ఉపరితలంపై 71 శాతం నీరు ఆవరించి జీవరాశులకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. మానవుడి శరీరంలో 90% నీరు ఉంటుంది. ఆక్సిజన్, హైడ్రోజన్‌ వాయువుల 1 : 2 నిష్పత్తి సమ్మేళనాల ద్వారా ఏర్పడిన ద్రవపదార్థమే నీరు. ఇది జీవజాల సహజ ప్రధాన వనరు. కాబట్టి నీటిని అత్యంత విలువైన వనరుగా పరిగణిస్తారు. నీరు లేకపోతే భూమిపై జీవం ఉండదు.

ఉదా: 1986 ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం గంగానదిలో కాలుష్యాన్ని తగ్గించడానికి ‘గంగా యాక్షన్‌ ప్రణాళిక’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని 2000 మార్చిలో ఉపసంహరించారు. మళ్లీ ఈ నది 1760 కి.మీ. పొడవున కలుషితమవడంతో 2014 డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర జలవనరుల శాఖ నిర్వహణలో గంగానది కాలుష్యాన్ని తొలగించడానికి ‘నమామి గంగా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ప్రధాన కారణాలు:


* మానవ వ్యర్థాలు మేటవేయడం, గృహాల్లోని వ్యర్థాలు
* పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనిక క్రిమి సంహారకాలు
* విషపూరితమైన లోహ మూలకాలు, మందులు, వ్యర్థాలు మొదలైన వాటివల్ల నీరు కలుషితమవుతుంది.


ప్రభావాలు:


* జల కాలుష్యం అనేక దుష్ఫలితాలకు దారి తీస్తుంది.
* స్వచ్ఛమైన నీరు అనేక రకాల వ్యర్థాల వల్ల మురుగు నీరుగా మారి నీటి స్వచ్ఛతను క్షీణింపజేస్తుంది.
ఉదా: నీటిని శుద్ధి చేయడానికి హాలోజన్‌ బిళ్లలను వినియోగించాలి.

* నీటిలో అనేక వ్యర్థాలు కలవడం వల్ల వివిధ రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. నీటి కాలుష్యం వల్ల ప్రధానంగా కలరా, కామెర్లు (జాండీస్‌), డిఫ్తీరియా, డయేరియా లాంటి వ్యాధులు సంక్రమిస్తాయి.
ఉదా: డయేరియా వ్యాపించినప్పుడు వేడి చేసిన నీరు, టీ డికాషన్, లేత కొబ్బరి నీళ్లను తాగాలి.
* చమురు శుద్ధి ద్వారా వచ్చే వ్యర్థాలు, ఇతర ఉత్పత్తులు సముద్రంలో కలవడం వల్ల ఆ నీరు కలుషితమవుతుంది.

ఉదా: సముద్రాల్లోని వ్యర్థాల వల్ల చేపల్లో హైడ్రోకార్బన్ల సంఖ్య పెరిగి క్యాన్సర్‌ కారక వ్యాధులు సంక్రమిస్తున్నాయి.
* నదులు, సముద్రాల్లో అనేక కలుషితాల ద్వారా ఆక్సిజన్‌ తగ్గి వాతావరణంలోని ఉష్ణోగ్రత మార్పునకు
దారితీస్తుంది. ఈ మార్పు జలచరాల పునరుత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

ఉదా: మానవ జీవ వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల నత్రజని శాతం పెరిగి, ఆక్సిజన్‌ తగ్గి జీవులు మరణిస్తున్నాయి. దీనివల్ల ప్రస్తుతం బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరుగుతుంది.
* నీటి కాలుష్యాన్ని బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ పారామీటర్‌ ద్వారా అంచనా వేస్తారు.


ధ్వని కాలుష్యం:

  ప్రస్తుతం పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ఆధునికీకరణ వేగంగా జరుగుతుండటంతో ధ్వని కాలుష్య పరిమాణం పెరుగుతుంది.

తీవ్రమైన శబ్దాన్నే ధ్వని అంటారు. శబ్దం అనేది శక్తికి ఒక రూపం. ఎలాంటి కంపనమైనా శబ్దాన్ని సృష్టిస్తుంది. శబ్దం వాయు, ఘన, ద్రవ మాధ్యమాల ద్వారా ప్రయాణిస్తుంది. కొన్నిసార్లు శబ్దాల స్థాయి తీవ్రంగా, మరికొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. పీడన స్థాయిని బట్టి ధ్వనిని యూనిట్‌లలో కొలుస్తారు. ధ్వని తీవ్రతను డెసిబుల్స్‌లో (db) సూచిస్తారు.

* పీడనాన్ని బట్టి ధ్వనిని రెండు రకాలుగా వర్గీకరించారు.
            1) శబ్ద తీవ్రత                   2) శబ్ద స్థాయి
* ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పగటి సమయంలో 45 db, రాత్రివేళలో 35 db; సగటున 50 - 90 డెసిబుల్స్‌ మధ్య ఉండే శబ్దాన్ని ధ్వనిగా పేర్కొంది. గరిష్ఠంగా 120 డెసిబుల్స్‌ ధ్వని పీడనాన్ని మానవులు సురక్షితంగా వినగలుగుతారు. 120 డెసిబుల్స్‌ పీడనం కంటే ఎక్కువగా ఉండే ధ్వనులు పర్యావరణంలో హానికరమైన ప్రభావాలను ఉత్పన్నం చేసి ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తాయి.


జాతీయ కాలుష్య నియంత్రణ మండలి (NCPB) ప్రకారం వివిధ ప్రాంతాల్లో ఉండాల్సిన శబ్ద స్థాయి:  


1) పారిశ్రామిక ప్రాంతాలు : 65 - 75 db
2) వాణిజ్య ప్రాంతాలు : 50 - 60 db
3) నివాస ప్రాంతాలు : 40 - 50 db
4) ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, నిశ్శబ్ద ప్రాంతాలు : 30 - 40 db
ఉదా: దిల్లీలో శబ్ద కాలుష్యానికి గురవుతున్న 60 ఏళ్ల వయసున్న వారిని మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలోని ‘వృత్తిపరమైన, పర్యావరణ ఆరోగ్య కేంద్రం’ అధ్యయనం చేసింది. వారు వయసుతో నిమిత్తం లేకుండా సాధారణ వయసు కంటే 15 ఏళ్లు ముందుగానే వినికిడి సమస్య బారిన పడుతున్నట్లు వెల్లడించింది. అంటే సైన్స్‌ ప్రకారం 75 ఏళ్లకు రావాల్సిన వినికిడి సమస్యలు 60 ఏళ్లకే వస్తున్నాయి.


కారణాలు:
* లౌడ్‌ స్పీకర్లు, సైరన్ల వాడకం పెరగడం
* నగరాలకు సమీపంలో ఉన్న పారిశ్రామిక యంత్రాల ధ్వనులు
* థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు; గనులు, ఖ్వారీల బ్లాస్టింగ్‌
* విమానాశ్రయాలు, వివిధ వాహనాల ద్వారా వెలువడుతున్న ధ్వని

ప్రభావాలు:
* ధ్వని కాలుష్యం పర్యావరణ స్వచ్ఛతను, వివిధ ప్రాణులను ప్రభావితం చేస్తుంది.
* మానవుల శరీరంలోని వివిధ వ్యవస్థలు చేసే పనులకు అడ్డుపడుతుంది.
ఉదా: నరాలపై ఒత్తిడి పెరగడం, నిద్రలేమి, జీర్ణక్రియ సరిగ్గా పనిచేయకపోవడం, అధిక రక్తపోటు లాంటివి సంభవిస్తాయి.
* నాడులు సక్రమంగా పనిచేయకపోవడానికి కారణం ధ్వని కాలుష్యం.
ఉదా: రక్తంలో కొవ్వు శాతం పెరగడం, గర్భస్థ శిశువులకు వచ్చే ప్రమాదాలు.
* తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
* ధ్వని కాలుష్యం వల్ల నరాల బలహీనత, హైపర్‌టెన్షన్, మైగ్రేన్, ఒత్తిడి పెరుగుతాయి.
ఉదా: కార్డియో వ్యాస్కులర్, జీర్ణవ్యవస్థ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారుతుంది.


కిరణధార్మిక (న్యూక్లియర్‌) కాలుష్యం:

  అణు విద్యుత్, అణు సంబంధిత పరిశ్రమలు, అధునాతన వైద్య పరికరాల నుంచి వెలువడే కిరణధార్మిక వ్యర్థాలను రేడియో ధార్మిక కాలుష్యం అంటారు. థోరియం, యురేనియం, ఆక్టీనియం, రేడియం, గాలి, నీరు భూమిపై నిక్షిప్తమై ఉంటాయి. ఈ ఖనిజాలు న్యూక్లియర్‌ రియాక్టర్లలో పరమాణు కేంద్రకాన్ని విచ్ఛిన్నం చేసి విద్యుత్, కిరణధార్మిక వ్యర్థాలను విడుదల చేస్తాయి.
ఉదా: ఒక అణుబాంబు పేలితే 50% శక్తి, 33% ఉష్ణం, 17% కిరణధార్మిక దుమ్ము వెలువడుతుంది.


కారణాలు:
* అణు విద్యుత్‌ శక్తి కర్మాగారాలు
* అణు సంబంధిత పరిశ్రమలు
* వైద్య పరికరాలుగా ఉపయోగించే ఎమ్‌ఆర్‌ఐ సీటీ స్కాన్, ఎక్స్‌రే, రేడియోఆక్టివ్‌లు


ప్రభావాలు:
* శరీరం అలసిపోయి కండరాలు దెబ్బతినడం, లుకేమియా, అకాల వార్థక్యం, ఆయువు తగ్గడం, అంగవైకల్యం వస్తాయి.

ఉదా: 1986, ఏప్రిల్‌ 26న రష్యాలోని ఉక్రెయిన్‌లో జరిగిన చెర్నోబిల్‌ అణు దుర్ఘటన వల్ల ఏర్పడిన రేడియేషన్‌ ప్రభావానికి 50% మంది ప్రజలు మరణించారు. కొంతమంది వెంట్రుకలు ఊడిపోయి, క్రోమోజోమ్‌లు దెబ్బతిని, అనేక క్యాన్సర్‌ వ్యాధుల బారినపడ్డారు.

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - సమకాలీన అంశాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 2016లో ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
జ: మే 10

 

2. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించిన నగర వాయు గుణాత్మక డేటాబేస్ ఆధారంగా అత్యంత కలుషిత మురికివాయువును కలిగి ఉన్న నగరం ఏ దేశంలో ఉంది?
జ: ఇరాన్

 

3. గోల్డెన్ మసీర్ చేప పునరావాసం, సంరక్షణ కోసం వాటిని కృత్రిమంగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్రం ఏది?
జ: హిమాచల్‌ప్రదేశ్

 

4. ఏ చేపను భారత నదీజలాల పులిగా పేర్కొంటారు?
జ: గోల్డెన్ మసీర్ చేప

 

5. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జ: మే 22

 

6. అసోచామ్ (ASSOCHAM) - KPMG సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వెలువరించడంలో మన దేశం ఎన్నో స్థానంలో ఉంది?
జ: 5వ

7. కిందివాటిలో దేనికి భారతదేశ జీవవైవిధ్య పురస్కారం 2016 లభించింది?
ఎ) సునాబేడా పులుల సంరక్షణా కేంద్రం               బి) కుద్రేముఖ్ జాతీయ పార్క్
సి) పక్కే పులుల సంరక్షణా కేంద్రం                       డి) మేగమలై వన్యప్రాణి సంరక్షణా కేంద్రం
జ: సి( పక్కే పులుల సంరక్షణా కేంద్రం)

 

8. ఆసియాలోనే ప్రప్రథమ గిప్స్ రాబందుల పునర్‌ప్రవేశ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
జ: హరియాణా

 

9. కిందివాటిలో రాబందుల జనాభా గణనీయంగా తగ్గడానికి కారణమైన ప్రధాన రసాయనం ఏది?
జ: డైక్లోఫినాక్

 

10. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించడానికి ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ఆమోదం తెలిపింది?
జ: 1972

 

11. మనదేశంలో నగర జంతువును ప్రకటించిన మొట్టమొదటి నగరం ఏది?
జ: గువాహటి

 

12. ప్రపంచంలో అటవీ నిర్మూలనను నిషేధించిన మొదటి దేశం ఏది?
జ: నార్వే

13. 'మరుభూమీకరణపై పోరు' ప్రపంచ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
జ: జూన్ 17

 

14. ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవాన్ని ఏ నెలలో జరుపుకుంటారు?
జ: జూన్

 

15. సముద్రాలు, సరస్సులు, నదులు లాంటి జల సంబంధ అంశాల కొలతలు, వర్ణనకు సంబంధించిన అధ్యయనాలు చేసే అనువర్తిత శాఖగా దేన్ని పేర్కొంటారు?
జ: హైడ్రోగ్రఫీ

పర్యావరణం సంబంధ‌ సమకాలీన అంశాలు

1. ఇటీవల NABARD (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) కింది ఏ పర్యావరణ సంబంధ సంస్థతో ప్రధాన గుర్తింపు ఒప్పందం (AMA - Accreditation Master Agreement) పై సంతకం చేసింది?
జ: GCF - గ్రీన్ క్లైమేట్ ఫండ్

 

2. GCF కి సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలేవి?
i) దీన్ని దక్షిణ కొరియాలో స్థాపించారు.
ii) దీన్ని UNFCC (United Nations Framework Convention on Climate Change) అధీనంలో ఉన్న సంస్థగా పేర్కొనవచ్చు.
iii) 2015లో అమల్లోకి వచ్చిన పారిస్ ఒప్పందానికి ఇది కేంద్ర బిందువు.
iv) సుమారు 24 మంది సభ్యులు ఉన్న ఒక బోర్డు అధీనంలో దీని పరిపాలన సాగుతుంది.
v) అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులను నిరోధించడానికి దీన్ని స్థాపించారు.
జ: i, ii, iii, iv , v

 

3. పులుల సంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టైగర్ డేని (Global Tiger or International Tiger day) సాధారణంగా ఏ రోజు నిర్వహిస్తారు?
జ: జులై 29

4. సెయింట్ పీటర్స్‌బర్గ్ డిక్లరేషన్ కిందివాటిలో దేనికి సంబంధించింది?
    ఎ) అంతరిస్తున్న పాముల సంరక్షణ, వాటి జనాభా పెంపుదల.
    బి) పులుల సంరక్షణ, 2022 నాటికి ద్విగుణీకృత పులుల సంఖ్యను సాధించడం.
    సి) ఖడ్గమృగాలను జాతీయ పార్కుల్లో సంరక్షించడం.
    డి) సింహాలను కొత్త ప్రదేశాలకు పంపి వాటి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం.
జ: బి (పులుల సంరక్షణ, 2022 నాటికి ద్విగుణీకృత పులుల సంఖ్యను సాధించడం)

 

5. సెయింట్ పీటర్స్‌బర్గ్ పులుల సదస్సు (St. Peters Burg Tiger Summit) ఎప్పుడు జరిగింది?
జ: 2010

 

6. 2017 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ పులుల దినోత్సవం ప్రధాన నినాదం ఏమిటి?
జ: పులుల సంరక్షణార్థం శుద్ధమైన ఆవరణ శాస్త్రం (Fresh Ecology for Tiger's Protection)

 

7. 'వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్' గణాంకాల ఆధారంగా పులుల జనాభాకు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలేవి?
i) 1915 నాటికి సుమారు ఒక లక్షగా ఉన్న పులుల సంఖ్య గడిచిన శతాబ్దంలో సుమారు 97 శాతం మేర నష్టానికి గురైంది.
ii) ప్రస్తుతం పులులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్ర స్థానంలో ఉంది. సుమారు 2,226 పులులు ఉన్నాయని అంచనా.
iii) గడిచిన కొన్ని దశాబ్దాలతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో పులుల సంఖ్యలో పెరుగుదల కొంత ఆశాజనకంగా ఉంది.

iv) భారత్, బంగ్లాదేశ్ సంయుక్త భాగస్వామ్యంలో ఉన్న పెద్ద మడ అడవి సుందర్‌బన్ ప్రపంచంలోనే అత్యధికంగా పులులు ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది.
జ: i, ii, iii, iv

 

8. కిందివాటిలో ప్రపంచంలోనే మొదటి హరిత మెట్రో వ్యవస్థగా సంపూర్ణంగా తయారైన మెట్రో రైలు వ్యవస్థ ఏది?
    ఎ) న్యూయార్క్ మెట్రో రైల్వే కార్పొరేషన్ (NMRC)    బి) ఆస్ట్రేలియా మెట్రో రైల్ ప్రైవేట్ లిమిటెడ్ (AMRL)
    సి) దిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (DMRC)                డి) జపాన్ మెట్రో రైల్వే ఏజెన్సీ (JMRA)
జ: సి (దిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (DMRC))

 

9. ఇటీవల 'నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా' ఏడు ప్రాజె క్టులను ఆమోదించింది. అయితే 'నేషనల్ మిషన్ ఫర్ క్లీన్' గంగాకు సంబధించి కిందివాటిలో ఏది సత్యం?
   i) ఇది నేషనల్ గంగా కౌన్సిల్ కార్యశీలక శాఖ
   ii) దీన్ని 2011లో స్థాపించారు.
   iii) దీని నిర్వహణ శైలిలో పరిపాలన శాఖ, కార్యనిర్వాహక శాఖ అనే రెండంచెల వ్యవస్థ నిర్మాణం కనిపిస్తుంది.
జ: i, ii, iii

 

10. దోహా సవరణ (Doha Amendment) కింది ఏ పర్యావరణ ఒప్పందానికి సంబంధించింది?
జ: క్యోటో ప్రోటోకాల్

11. క్యోటో ప్రోటోకాల్‌కు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలు?
   i) క్యోటో ప్రోటోకాల్ మొదటి నిబద్ధతా సమయం 2008 నుంచి 2012 వరకు
   ii) క్యోటో ప్రోటోకాల్ ద్వితీయ నిబద్ధతా సమయం (Second Commitment) 2013 నుంచి 2020 వరకు
   iii) ఇది ఒక అంతర్జాతీయ హరిత గృహ ప్రభావ కారక వాయువుల ఉద్గార నియంత్రణా ఒప్పందం
   iv) ఇది 2005 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది
జ: i, ii, iii, iv

 

12. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇటీవల ఏ నగరంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న జీవక్షయం కాని ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని మధ్యంతరంగా రద్దు చేసింది?
జ: దిల్లీ

 

13. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జ: ఆగస్టు 12

 

14. 2017లో ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మన దేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రి డా.హర్షవర్థన్ ప్రారంభించిన కార్యక్రమం?
జ: గజ యాత్ర

15. కింది వాయువుల్లో దేన్ని కాలుష్యకారకం కానిదిగా చెప్పవచ్చు?
      ఎ) కార్బన్ డై ఆక్సైడ్       బి) పొగ       సి) సల్ఫర్ డై ఆక్సైడ్       డి) నైట్రోజన్
జ: డి (నైట్రోజన్)

 

16. ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత ప్రాంతాన్ని ఇటీవల ఆవిష్కరించారు. ఇది ఎక్కడ ఉంది?
జ: అంటార్కిటికా

 

17. 2017లో నిర్వహించిన ఏనుగుల జనాభా గణనలోని అంశాల ఆధారంగా మన దేశంలో కింది ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఏనుగులు ఉన్నట్లు పేర్కొనవచ్చు?
జ: కర్ణాటక

 

18. ఆవరణ వ్యవస్థ సేవా అభివృద్ధి పథకం (Eco System Service Improvement Project) ను నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్‌లో భాగంగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) ద్వారా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏయే రాష్ట్రాల్లో ప్రారంభించనుంది?
      i) చత్తీస్‌గఢ్       ii) మధ్యప్రదేశ్       iii) గుజరాత్
జ: i, ii మాత్రమే

 

19. గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ అనేది కింది ఏ సంస్థకు సంబంధించింది?
జ: ప్రపంచ బ్యాంకు (World Bank)

20. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న Eco System Service Improvement Project కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు?
జ: 5

 

21. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్ట్ కిందివాటిలో దేనికి సంబంధించింది?
ఎ) సౌర, పవన, ఇతర పునరుద్ధరింపదగిన వనరుల నుంచి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌శక్తిని సమకాలీకరణం (Synchronisation) చేయడానికి నిర్దేశించింది.
బి) జీవ పునరుత్పత్తిని ప్రదర్శించే వనరుల ఉత్పత్తి, వినియోగానికి నిర్దేశించింది.
సి) పంటలు, పండ్ల వృక్షాల వ్యర్థ పదార్థాల నుంచి నవీన పద్ధతుల ద్వారా విద్యుత్ ఉత్పాదన మెరుగుపరచడానికి
డి) సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాశ్చాత్య సాంకేతికతను ప్రవేశపెట్టడానికి నిర్దేశించింది.
జ: ఎ (సౌర, పవన, ఇతర పునరుద్ధరింపదగిన వనరుల నుంచి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌శక్తిని సమకాలీకరణం (Synchronisation) చేయడానికి నిర్దేశించింది)

 

22. పర్యావరణ సమతాస్థితి కొనసాగాలంటే భూమిపై ఉండాల్సిన అటవీ శాతం ఎంత?
జ: 33

 

23. బయోస్ఫియర్ రిజర్వ్ ప్రాజెక్ట్‌ను మన దేశంలో ఎప్పుడు ప్రారంభించారు?
జ: 1986

24. వృక్ష ప్లవకాలు (Phyto planktons) అనేవాటిని కింది ఏ ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల జాబితాలో చేర్చవచ్చు?
జ: జలావరణ వ్యవస్థ (Aquatic Eco - System)

 

25. పాదరసం వల్ల కలిగే మినామిటా వ్యాధిని (Minamita) మొదటిసారిగా ఏ దేశంలో గుర్తించారు?
జ: జపాన్

 

26. మన దేశంలో అత్యధికంగా టైగర్ రిజర్వ్‌లు ఉన్న రాష్ట్రం ఏది?
జ: మధ్యప్రదేశ్

 

27. భారతదేశానికి సంబంధించిన కింది ఏ ప్రాంతంలో మడ అడవులు అత్యధికంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి?
జ: పశ్చిమ్ బంగ

 

28. ప్రపంచంలో అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తున్న జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం?
జ: ఖతర్

 

29. సల్ఫర్ డై ఆక్సైడ్ వల్ల కలిగే కాలుష్యానికి ప్రధాన సూచికగా కింది ఏ జీవులను పేర్కొనవచ్చు?
జ: లైకెన్లు

30. కిందివాటిలో పర్యావరణంలో కర్బన వలయానికి, కార్బన్ డై ఆయాక్సైడ్ ప్రవేశానికి సంబంధమున్న అంశాలు ఏవి?
   i) కిరణజన్య సంయోగక్రియ    ii) శ్వాసక్రియ   iii) కర్బన పదార్థాల విచ్ఛిత్తి    iv) అగ్ని పర్వతాల విస్ఫోటనం
జ: ii, iii, iv మాత్రమే 

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవ వైవిధ్యం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. అత్యధిక జీవ వైవిధ్యం కలిగి ఉన్న దేశం ఏది?
జ: బ్రెజిల్

 

2. అత్యధిక జీవ వైవిధ్యం ఉన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
జ: 16వ

 

3. కిందివాటిలో జీవ వైవిధ్యానికి విఘాతం కలిగించే అంశం ఏది?
ఎ) ఆవాసాల వినాశనం      బి) అన్యజాతుల చొరబాటు      
సి) సహజ వనరుల మితిమీరిన వాడకం    డి) అన్నీ
జ: డి (అన్నీ)

 

4. హాట్‌స్పాట్‌లను ప్రతిపాదించింది ఎవరు?
జ: నార్మన్ మైర్స్

 

5. భారతదేశంలో ఉన్న హాట్‌స్పాట్‌లు ఎన్ని?
జ: 4

 

6. కొత్తగా ఆవిర్భవించి, ఒక ప్రాంతానికే పరిమితమైన జీవజాతులు చూపే స్థానీయత ఏది?
జ: నియో ఎండమిజమ్

7. కిందివాటిలో అతిపెద్ద జీవ వైవిధ్య స్థాయి ఏది?
ఎ) జన్యు వైవిధ్యం  బి) జాతి వైవిధ్యం  సి) జీవావరణ వైవిధ్యం  డి) పైవేవీకాదు

: సి (జీవావరణ వైవిధ్యం)
 

8. కిందివాటిలో జీవ వైవిధ్యం వల్ల కలిగే ప్రయోజనాలేవి?
ఎ) ఆహ్లాదపు ప్రయోజనాలు  బి) నైతిక ప్రయోజనాలు సి) ఉత్పాదక ప్రయోజనాలు డి) అన్నీ
జ: డి (అన్నీ)

 

9. సక్యులెంట్ కరూ ప్రాంతం ఏ మండలంలోని హాట్‌స్పాట్‌గా గుర్తించవచ్చు?
జ: ఆఫ్రికా

 

10. కిందివాటిలో అత్యధిక హాట్‌స్పాట్‌లున్న మండలం?
ఎ) ఆఫ్రికా  బి) ఆసియా పసిఫిక్  సి) యూరప్, మధ్య ఆసియా డి) ఏదీ కాదు
జ: బి (ఆసియా పసిఫిక్)

 

11.  ,  ,   లు వరుసగా ఆల్ఫా, బీటా, గామా వైవిధ్యాలను సూచిస్తే వీటి మధ్య సంబంధం ఏది?
జ: 
 <   <  

12. జీవ వైవిధ్యం పదాన్ని రోసన్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు?
జ: 1985

 

13. కిందివాటిలో భారతదేశంలోకి ప్రవేశించిన అన్యదేశ జాతి మొక్కలేవి?
ఎ) కాంగ్రెస్ గ్రాస్       బి) లాంటనా        సి) ఐకార్నియా        డి) అన్నీ
జ: డి (అన్నీ)

 

14. జీవ వైవిధ్య సంపద ......
జ: భూమధ్య రేఖా ప్రాంతం వైపు వెళుతున్న కొద్దీ పెరుగుతుంది.

 

15. కిందివాటిలో సుమారు 50% జీవ వైవిధ్య సంపదను కలిగి ఉంది .......
ఎ) ఉష్ణమండల వర్షారణ్యం బి) సమశీతోష్ణ వర్షారణ్యం సి) ప్రవాళ భిత్తికలు  డి) గడ్డి భూములు

జ: ఎ (ఉష్ణమండల వర్షారణ్యం)

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - సమకాలీన అంశాలు

  ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు (e-waste) సంబంధించి అసోచామ్ (ASSOCHAM) - KPMG సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించాయి. ఇ-వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రపంచ దేశాలన్నింటిలో భారత్ అయిదో స్థానంలో నిలిచిందని ఈ అధ్యయనం వెల్లడించింది. మనదేశంలో ఏటా సుమారు 18.5 లక్షల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు విడుదలవుతున్నాయి.


  ఝార్ఖండ్‌లో గంగానది సంరక్షణ, గ్రామీణ శుభ్రత కోసం కేంద్ర ప్రభుత్వం తొమ్మిది ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది. ఈ రాష్ట్రంలో గంగానది ప్రవహిస్తున్న 83 కి.మీ. తీరప్రాంతానికి ఆనుకుని ఉన్న సుమారు 78 గ్రామాల్లో స్వచ్ఛత, శుభ్రత, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇవి సహకరిస్తాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన United Nations Developmet Programme వీటికి సాంకేతిక సాయం అందించనుంది.


అత్యంత కాలుష్య వాయువు...


* నగర వాయు గుణాత్మక డేటాబేస్ (Urban Air Quality Database) - 2016 ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల వెలువరించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషితమైన వాయువును ఇరాన్‌లోని జబోల్ నగరంలో గుర్తించారు.

* హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మత్స్య సంవర్థక శాఖ గోల్డెన్ మసీర్ చేప (Golden Mahseer Fish ) పునరావాసం, సంరక్షణ కోసం వాటిని కృత్రిమంగా వృద్ధి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. విచక్షణారహితంగా వేటాడటం, ఆవాసాలు కోల్పోవడం, కాలుష్యం కారణంగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ చేపల సంతతి క్షీణించిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గోల్డెన్ మసీర్ చేప ఎక్కువకాలం బతికే మంచినీటి చేప. దీన్ని 'భారత నదీజలాల పులి'గా (Tiger of Indian Rivers) పిలుస్తారు. IUCN(International Union of Conversion of Natural Resources) ఈ చేపను అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో చేర్చింది.
*  అసోంలోని గువాహటి నగర జంతువు (City Animal) ను ప్రకటించిన మొట్టమొదటి నగరంగా చరిత్రలో నిలిచింది. ప్రత్యేకంగా నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ ద్వారా గంగానది డాల్ఫిన్ (Gangetic River Dolphin) ను గువాహటి నగర జంతువుగా ఎంపిక చేశారు. ఈ డాల్ఫిన్‌ను అధికారికంగా భారత జాతీయ జల జంతువుగా (National Aquatic Animal of India) ప్రకటించారు. దీన్ని స్థానికంగా సిహు (Sihu) అని పిలుస్తారు. ప్లాంటానిస్టా గేంగటికా (Plantanista Gangetica) అనే శాస్త్రీయనామం కలిగిన ఈ డాల్ఫిన్‌ను గంగా పులి (Tiger of Ganga) గా కూడా వ్యవహరిస్తారు. భారత ప్రభుత్వం ఈ డాల్ఫిన్‌ల జనాభా పునరుద్ధరణ, వ్యాప్తిని అధ్యయనం చేయడానికి 1997 లో సంరక్షణా కార్యక్రమాన్ని (Ganges River Dolphin Conservation Programme) ప్రారంభించింది.
*  ప్రపంచంలో అటవీ నిర్మూలనను (Deforestation) నిషేధించిన మొట్టమొదటి దేశంగా నార్వే చరిత్రలో నిలిచింది. నార్వే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు నార్వే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నార్వేలో ఇకపై అటవీ నిర్మూలనకు కారణమయ్యే ఎలాంటి చర్యలనూ అంగీకరించరు.

* ఆసియాలోనే ప్రప్రథమ గిప్స్ రాబందుల పునర్‌ప్రవేశన కార్యక్రమాన్ని (Gyps Vulture Reintrodution Programme) పింజోర్‌లోని జటాయు సంరక్షణ, ప్రజనన కేంద్రం (Jatayu Conservation Breeding Centre) లో హరియాణా ప్రభుత్వం ప్రారంభించింది. హిమాలయాల్లోని గ్రిఫాన్ రాబందులతో ఈ గిప్స్ రాబందులకు దగ్గరి పోలికలు ఉంటాయి.


* రాబందుల ఆహారమైన పశువుల కళేబరాల్లోని డైక్లోఫినాక్ అనే ఔషధం వల్ల రాబందులు మూత్రపిండ సంబంధ వ్యాధులకు గురవుతున్నాయి. (పశువుల్లో నొప్పుల నివారణకు డైక్లోఫినాక్ ఔషధం ఉపయోగిస్తుంటారు). దీంతో కేంద్ర ప్రభుత్వం 2006లో పశువులకు డైక్లోఫినాక్ వాడకాన్ని నిషేధించింది.


దినోత్సవాలు

*  అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని (International Biodiversity Day) మే 22న నిర్వహిస్తారు.


*   జీవవైవిధ్య సంరక్షణ, స్థిరమైన అభివృద్ధిపై సరైన అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.


*   'జీవవైవిధ్యం - ప్రధాన జీవన స్రవంతి: ప్రజలు వారి జీవనోపాయాల కొన సాగింపు' (Mainstreaming Biodiversity; Sustaining people and their livelihoods) అనేది 2016 ఏడాదికి జీవవైవిధ్య దినోత్సవ నినాదం.


* ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని (World Migrating Bird Day) 2016 మే 10న నిర్వహించారు. వలస పక్షుల నివాసాలు, సంతతిని సంరక్షించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.


*  ' వలస పక్షుల అక్రమ సంహారం, వాణిజ్యాలను ఆపేయండి' (Stop the lilegal Killing, Taking and Trading of Migratory Birds) అనేది 2016 ఏడాది నినాదం.


* ఐక్యరాజ్య సమితి 2006 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.


* ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని (World Oceans Day) 2016 జూన్ 8న నిర్వహించారు. సముద్ర ఆవాసాల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ఉద్దేశం. సముద్రాల్లో ప్లాస్టిక్ సంబంధ వ్యర్థ పదార్థాల నిర్మూలనను ఈ ఏడాది లక్ష్యంగా నిర్ణయించారు. 2016 ఏడాదికి 'ఆరోగ్యకరమైన సముద్రాలు, ఆరోగ్యవంతమైన గ్రహం' (Healthy Oceans, Healthy Planet ) అనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2008లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించడానికి ఆమోదం తెలిపింది. అయితే 1992లో బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో జరిగిన ధరిత్రీ సదస్సులో కెనడా తొలిసారిగా దీన్ని ప్రతిపాదించింది.


* ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (World Environment Day) 2016 జూన్ 5న నిర్వహించారు. 'జీవనం కోసం వన్యంలోకి' (Go Wild for Life) అనేది 2016 పర్యావరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. పర్యావరణాన్ని, వన్య ప్రాణులను సంరక్షించడమే ప్రపంచ పర్యావరణ దినోత్సవ లక్ష్యం. పులులపై అవగాహన కల్పించడానికి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016 జూన్ 5న టైగర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 1972లో ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆమోదం తెలిపింది. 1973లో మొట్టమొదటి పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.


ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం..


* ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవాన్ని (World Hydrography day) 2016 జూన్ 21న నిర్వహించారు. 'హైడ్రోగ్రఫీ - చక్కగా నిర్వహిస్తున్న సముద్రాలు, జల మార్గాలకు ఒక కీలక అంశం' (Hydrography - the key to well managed seas and water ways) అనేది 2016 ఏడాది నినాదం. సముద్రాలు, సరస్సులు, నదులు లాంటి జల సంబంధ అంశాల కొలతలు, వర్ణనకు సంబంధించిన ఒక అనువర్తిత శాఖగా హైడ్రోగ్రఫీని పేర్కొనవచ్చు. అంతర్గత జలాశయాలు, సముద్రాల్లో నావిగేషన్‌ను చక్కగా నిర్వహించడానికి ఈ శాస్త్ర పరిజ్ఞానం తోడ్పడుతుంది.


మరుభూమీకరణపై పోరు దినోత్సవం


* మరుభూమీకరణపై పోరు దినోత్సవాన్ని (The World Day to Combat Deforestation) ప్రపంచవ్యాప్తంగా జూన్ 17న నిర్వహించారు. ఎడారులు, కరవు భూములు ఏర్పడకుండా ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవడమే దీని లక్ష్యం. 'భూ హాని పట్ల తటస్థత సాధన దిశగా సంఘటిత సహకారం' అనేది 2016 ఏడాదికి ఈ దినోత్సవ ముఖ్యఉద్దేశం. 'భూమిని కాపాడు, నేలను పునరుద్ధరించు, ప్రజలను పనిలో నియమించు' (Protect Eath, Restore Land, Engage People) అనేది 2016 నినాదంగా ప్రకటించారు. ఈ దినోత్సవాన్ని తొలిసారిగా 1995లో నిర్వహించారు.


*  అరుణాచల్‌ప్రదేశ్‌లోని తూర్పు కామెంగ్ జిల్లాలో ఉన్న పక్కే పులుల సంరక్షణ కేంద్రానికి (Pakke Tiger Reserve) భారత దేశ జీవవైవిధ్య పురస్కారం (India Biodiversity Award) 2016 లభించింది.

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవవైవిధ్యం

భారతదేశంలో పరిరక్షణ చట్టాలు, సంస్థల ఏర్పాటు


  ప్రకృతిలో ఎన్నో ప్రత్యేకతలు.. మరెన్నో వైవిధ్యాంశాలు. మొక్కలు, జంతువులు, జీవరాశులు.. లక్షలాది రకాల్లో ఉండే ఇవన్నీ ప్రకృతిలో భాగమే. ఇలాంటి విభిన్న అంశాల జీవ వైవిధ్యం (బయో డైవర్సిటీ) ఎంత ఎక్కువగా ఉంటే పర్యావరణానికి అంత ప్రయోజనకరం. 'ఆధునికీకరణ' ప్రభావంతో జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు బయో డైవర్సిటీకి పెద్దపీట వేస్తున్నాయి. భారతదేశం దీనికి మరింత ప్రాధాన్యం ఇస్తూ అనేక రకాలుగా జీవ వైవిధ్యాన్ని అభివృద్ధి చేసే చర్యలు చేపడుతోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జీవ వైవిధ్యానికి సంబంధించిన ప్రత్యేక అధ్యయన సమాచారం ఏపీపీఎస్సీ అభ్యర్థుల కోసం..

జీవ సమాజంలోని జీవుల మధ్య ఉండే విభిన్నతను 'జీవ వైవిధ్యం' అంటారు. ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన జీవుల సంఖ్య, భిన్నత్వ ం, మార్పు చెందే తత్వాలన్నీ జీవ వైవిధ్యానికి సంబంధించినవే. అందుకే ప్రకృతిని గమనిస్తే విభిన్న రకాల వృక్షాలు, జంతువులు, జీవులు కనిపిస్తాయి.


జీవ వైవిధ్య స్థాయులు


  జీవ వైవిధ్య క్రమానుగత స్థాయి ప్రకారం ప్రధానంగా 3 రకాలు. అవి..
1. జన్యుపర జీవ వైవిధ్యం (జెనిటిక్ బయోడైవర్సిటీ)
2. జాతిపర జీవవైవిధ్యం (స్పీసిస్ బయోడైవర్సిటీ)
3. ఆవరణ వ్యవస్థల జీవవైవిధ్యం (ఇకో సిస్టమ్ బయోడైవర్సిటీ)


జన్యుపర జీవవైవిధ్యం


  ఇది ఒక జాతిలో ఉండే జీవవైవిధ్యం. అంటే ఒకే జాతికి చెందిన జీవుల మధ్య ఉన్న విభిన్నతలకు సంబంధించింది. జీవుల జీవకణాల్లోని క్రోమోజోముల్లోని జన్యువులు ఆ జీవి వ్యక్తిగత లక్షణాలను నిర్ధారిస్తాయి.
ఉదా: జన్యుపర జీవవైవిధ్యం కారణంగా కొందరు సన్నగా, లావుగా, పొడవుగా, పొట్టిగా, తెల్లటి చర్మంతో, వివిధ రంగుల్లో ఉండటం; ఒకే జాతికి చెందిన కుక్కలు, పిల్లులూ, పుష్పాలు మొదలైనవి.


జాతిపర జీవ వైవిధ్యం


  శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించినా, నేటికీ భూగోళంపై కచ్చితంగా ఎన్ని జాతులకు చెందిన జీవులున్నాయో ఎవరికీ తెలియదు.
* భూమ్మీద 10-14 మిలియన్ల జాతులు/ జీవులున్నట్లు అంచనా. ఇవి చాలావరకు కీటకాలు, సూక్ష్మజీవులే.


ఆవరణ వ్యవస్థల జీవ వైవిధ్యం


  దీనిలో ఒక భౌగోళిక ప్రాంతంలోని అరణ్యాలు, పచ్చిక బయళ్లు, ఎడారులు లాంటి భౌమావరణ వ్యవస్థలు; నదులు, సరస్సులు, నదీ ముఖద్వారాలు, తీర ప్రాంతాలు, మహా సముద్ర ప్రాంతాలు లాంటి జలావరణానికి చెందిన విభిన్న ఆవాసాలకు సంబంధించిన జీవ వైవిధ్యం ఉంటుంది. ఇందులో శీతోష్ణస్థితి ప్రముఖ పాత్ర వహిస్తుంది.
ఉదా: భూమధ్యరేఖ వర్షారణ్యంలో జీవ వైవిధ్యం అధికస్థాయిలో ఉండగా, అందుకు భిన్నంగా ఉష్ణ ఎడారులు, ధ్రువ ప్రాంతాల్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.
* ఆహారం, నివాసం, ఆరోగ్యం కోసం అనాదిగా మానవులు భూగోళపు జీవ వైవిధ్యంపై ఆధారపడుతున్నారు.


కాలుష్య ప్రభావం


  జీవ వైవిధ్యం సహజ, వ్యవసాయ వ్యవస్థల ఉత్పాదకతలను పెంపొందిస్తుంది. ఆధునిక నాగరకత ఫలితంగా ఉత్పన్నమవుతున్న కాలుష్యం మానవుడు నివసిస్తున్న ప్రాంతాలన్నింటిలోని జీవ వైవిధ్యంపై అనేక రకాల వ్యతిరేక ప్రభావాలను చూపుతోంది.
ఉదా: అటవీ ప్రాంతాలను పంట భూములు, రహదారులు, క్వారీలు, గనులుగా మారుస్తున్నారు.


జీవావరణ సమతౌల్యం


  ఒక జీవ సంఘంలో కాలానుగుణంగా జీవావరణం ద్వారా క్రమంగా సంభవించే మార్పులుంటాయి. ఇవి మినహా జన్యుపరమైన.. జాతులు, ఆవరణ వ్యవస్థల మధ్య ఉండే జీవ వైవిధ్యం స్థిరంగా ఉండి, అది సహజసిద్ధమైన క్రియాశీల సమతాస్థితిలో ఉంటే, అలాంటి స్థితిని జీవావరణ సమతౌల్యం అంటారు.
* ఈ సమతౌల్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ ప్రభావం మరీ ముఖ్యమైంది.
* భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరగడం, హిమ సంపాతాలు, వరదలు, కరవు కాటకాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఆయా ప్రభావిత ప్రాంతాల్లో జీవావరణ సమతౌల్యాన్ని ప్రభావితం చేస్తాయి.
* జీవావరణ సమతౌల్య పరిరక్షణ కోసం అనుసరణీయ, దీర్ఘకాలిక, శాస్త్రీయ అవలోకనంతో వెంటనే చర్యలు చేపట్టాలి.


జాతిపర జీవ వైవిధ్యంలో మ్యాపింగ్


  బ్రిట్స్, పాల్ విలియమ్స్, డికీయిర్‌రైట్, చారిస్ హంప్ రేజర్ శాస్త్రవేత్తలు ప్రపంచంలో జీవవైవిధ్య పటాలను మొదటిసారి తయారు చేశారు. వీరు జీవ వైవిధ్య మ్యాప్‌లో 'వరల్డ్ మ్యాప్‌'ను అభివృద్ధి చేశారు. దీనిలో మూడు రకాలున్నాయి.


1. ఆల్ఫా పటాలు (ఆల్ఫా మ్యాప్స్)
ఇందులో ప్రత్యేక ప్రాంతాల్లో మొత్తం జాతిపర సంఖ్యలను పొందుపరిచి, విశ్లేషణాత్మకమైన వివిధ ప్రాంతాల్లో జీవ వైవిధ్య అధ్యయన పటాల్లో గుర్తించారు.


2. బీటా పటాలు (బీటా మ్యాప్స్)
ఇందులో జీవ వైవిధ్య నిర్మాణాలు, జాతిపర నిర్మాణాలు, పోలికలు, సంఘాలు, కొలతలు, ఆవరణ సమతౌల్యంలో జాతిపర మార్పులను ఈ పటాల్లో గుర్తించారు.


3. గామా పటాలు (గామా మ్యాప్స్)
ఇందులో భౌగోళిక ప్రాంతాల్లో జాతిపర మార్పుల గణాంకాలు, వాటికి అయిన ఖర్చుల్లాంటి వివరాలను ఈ పటాల్లో పొందుపరిచారు.


తడి భూభాగాలు (వెట్ ల్యాండ్స్)

  భూమి ఉపరితలంపై నీటితో ఉన్న ప్రాంతాల్లో ఆవరణ వ్యవస్థలను సంరక్షించడానికి, వివిధ జీవులను, వృక్షాలను, నేలలను, వన్య ప్రాణులను కాపాడటానికి ఈ ప్రాంతాలు ఉపయోగపడతాయి.
రామ్‌సర్ సమావేశం (రామ్‌సర్ కన్వెన్షన్): ఇరాన్‌లో 1971, ఫిబ్రవరి 2న అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యత్వం ఉన్న దేశాలు రామ్‌సర్ ఒప్పందంపై సంతకం చేశాయి. 1975, డిసెంబరు 21న ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కొన్ని తడి ప్రాంతాలను గుర్తించారు. (వివరాలను పట్టిక-1లో చూడండి.)


వన్యమృగ సంరక్షణపై అంతర్జాతీయ సమావేశం


  ప్రపంచంలో జరిగిన 5 ప్రధాన అంతర్జాతీయ వన్యప్రాణి సమావేశాల్లో భారత్ పాల్గొంది. మనదేశంలో పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
* అంతర్జాతీయ వ్యాపార అటవీ వృక్ష జాతులు (Flora), జంతు జాతులు (Fauna) సమావేశంలో 1976, జులై 20న భారతదేశం సంతకం చేసింది.
* మానవ, జీవావరణ కార్యక్రమాన్ని (ఎంఏబీ- మ్యాన్ అండ్ బయోడైవర్సిటీ) యునెస్కో 1971లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 2012 నాటికి 117 దేశాల్లో 598 బయోస్ఫియర్ సంస్థలు సభ్యత్వం తీసుకున్నాయి.
* జీవవైవిధ్య సమావేశం 1992, జూన్ 5న రియో డీ జెనీరోలో జరిగింది.


భారతదేశంలో జీవవైవిధ్యం


  ప్రపంచంలో భారతదేశం 12వ మెగా జీవవైవిధ్య దేశం. మన దేశం ప్రపంచంలో 2.5 శాతం భౌగోళిక వైశాల్యం కలిగి ఉంది. ప్రపంచంలో 7.8 శాతం జాతిపర వైవిధ్యం భారత్ సొంతం. ఇదో రికార్డు. ప్రపంచంలో ఇండో-మళాయన్ అత్యంత విస్తీరణ ప్రాంతం.
* మన దేశంలో వృక్ష సంబంధ జాతులు 46,000 ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 7 శాతం. ఇందులో 33 శాతం వ్యాధుల బారిన పడుతున్నాయి.
* మన దేశంలో సుమారు 15,000 రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో 6 శాతం. ఇందులో 1500 రకాలు జాతిపర వ్యాధుల బారిన పడుతున్నాయి.
* దేశంలో సుమారు 81,000 జంతుపర జాతులున్నాయి. ప్రపంచ జంతు సంపదలో ఇది 6.5 శాతం. (జంతు జాతుల వివరాలకు పట్టిక-2 చూడండి.)

* భారత్ 1972లో వన్య మృగ సంరక్షణ చట్టాన్ని చేసింది. అంతకు ముందు 5 జాతీయ హోదా కలిగిన పార్కులు ఉండేవి.
* వన్యమృగ సంరక్షణ సవరణ చట్టాన్ని 2006లో చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 4 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా జాతీయ పులుల అటవీ అథారిటీ, వన్యమృగ క్రైమ్ కంట్రోల్ బ్యూరోలను ఏర్పాటు చేశారు.


జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళిక

  జాతీయ వన్యమృగ బోర్డును 1982లో కేంద్రం ఏర్పాటు చేసింది. మొదటి జాతీయ వన్యమృగ ఆచరణ ప్రణాళికను 1983లో ప్రారంభించారు.


జాతీయ జీవ వైవిధ్య చట్టం

  ఈ చట్టాన్ని 2002లో చేశారు. 2003, అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కిందకు
1. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ (ఎన్‌బీఏ),
2. జాతీయ జీవ వైవిధ్య బోర్డ్(ఎస్‌బీబీ),
3. జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ (బీఎంసీ) వస్తాయి. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ సంస్థను చట్టబద్ధ హోదాతో చెన్నై (2003)లో ఏర్పాటు చేశారు. భారత్‌లోని పలు జీవ వైవిధ్య సంస్థల వివరాలివి..
* వన్యమృగ సంస్థ - 1996లో డెహ్రాడూన్‌లో ఏర్పాటు.
* భారత వన్యమృగ బోర్డు - 2001 డిసెంబరు 7న పునర్‌నిర్మాణం
* జంతు సంక్షేమ డివిజన్లు - 2002 జులై నుంచి అమలు
* జంతు సంక్షేమ జాతీయ సంస్థ (ఎన్ఐఏడబ్ల్యూ) - ఫరీదాబాద్ (1960 చట్టం ప్రకారం ఏర్పడింది)
* బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1890 ఫిబ్రవరి 13న స్థాపించారు
* జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - 1916 (కోల్‌కతా)లో ఏర్పాటు


భారతదేశంలో జీవ వైవిధ్య సంరక్షణలు


1. ఎలిఫెంట్ ప్రాజెక్టు: 1992 ఫిబ్రవరిలో ఎలిఫెంట్ ప్రాజెక్టును స్థాపించారు. దేశంలో ప్రస్తుతం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 32 ఎలిఫెంట్ ప్రాజెక్టులున్నాయి. ఇవి ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉన్నాయి. (భారత్‌లోని ఎలిఫెంట్ ప్రాజెక్టు / రిజర్వ్ వివరాలు పట్టిక-3లో చూడండి.)

టైగర్ ప్రాజెక్టు
భారత ప్రభుత్వం 1973, ఏప్రిల్ 1న పులుల (టైగర్ రిజర్వ్) ప్రాజెక్టును ప్రారంభించింది. దేశంలో మొదటి ప్రాజెక్టు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. (మన దేశంలోని టైగర్ రిజర్వ్ ప్రాంతాల వివరాలు పట్టిక-4లో చూడండి.)

బయోస్ఫియర్ రిజర్వ్

ప్రాదేశిక, తీర ప్రాంత ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి యునెస్కో చట్రం కింద మానవ, జీవావరణ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో 1986లో బయోస్ఫియర్‌ను స్థాపించారు. దేశంలో మొదటి బయోస్ఫియర్ నీలగిరి. ప్రస్తుతం దేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వ్‌లున్నాయి. వీటిలో 9 ప్రపంచ బయోస్ఫియర్ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. దేశంలోని 7 బయోస్ఫియర్‌లను యునెస్కో దత్తత తీసుకుంది. (భారతదేశంలోని బయోస్ఫియర్ రిజర్వ్‌ల వివరాలు పట్టిక-5లో చూడవచ్చు.)

మెరైన్ నేషనల్ పార్క్‌లు
మన దేశంలో 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద గుజరాత్ ప్రభుత్వం అటవీశాఖ ఆధ్వర్యంలో గల్ఫ్ ఆఫ్ కచ్‌లో; జామ్‌నగర్ జిల్లా ఓకా, జోదియాల వద్ద 1982లో 270 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో మెరైన్ నేషనల్ పార్కు ప్రారంభించింది. ఇది దేశంలోనే మొదటి జాతీయ మెరైన్ పార్కు.

దేశంలో ప్రధాన ప్రవాళభిత్తిక (కోరల్ రీఫ్) కోసం గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ అఖాతం, గల్ఫ్ ఆఫ్ కచ్, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో ఏర్పాటు చేశారు. వివరాలివి...

1. పాక్ అఖాతం - తమిళనాడు (రామేశ్వరం)
2. గల్ఫ్ ఆఫ్ మన్నార్ - తమిళనాడు (ట్యూటికోరిన్)
3. అండమాన్, నికోబార్ - బంగాళాఖాతం
4. గల్ఫ్ ఆఫ్ కచ్ - గుజరాత్
5. లక్షద్వీప్ - అరేబియా సముద్రం


భారతదేశంలోని ప్రవాళ భిత్తికల పరిశోధనా సంస్థలు

  డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్‌మెంట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్- అహ్మదాబాద్
జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - కోల్‌కతా
కేంద్ర మెరైన్ ఫిషరీస్ పరిశోధన సంస్థ - మదురై
సెంటర్ ఫర్ ఎర్త్ స్టడీస్ - త్రివేండ్రం
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ - గోవా


మాదిరి ప్రశ్నలు
 

1. కిందివాటిలో భారత జాతీయ జలచరం (అక్వాటిక్ ఆనిమల్) ఏది?
ఎ) డాల్ఫిన్ బి) తాబేలు సి) తిమింగలం డి) ఏదీకాదు
జ: (ఎ)

 

2. సమాజంలో అన్ని స్థాయి జీవుల మధ్య విభిన్నతను ఏమంటారు?
ఎ) పర్యావరణం బి) జీవ వైవిధ్యం సి) సమాజం డి) వైవిధ్యం
జ: (బి)

 

3. జీవ వైవిధ్య క్రమానుగత స్థాయులు ఎన్ని రకాలు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
జ: (బి)

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అభివృద్ధి - నిరాశ్రయత

  అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో వ్యవసాయ, పారిశ్రామిక, నీటిపారుదల, విద్యుత్, గనులు లాంటి రంగాలు కీలకమైనవి. ఈ రంగాలను ఆధారంగా చేసుకుని నూతన పరిశ్రమలు నిర్మించాలి. అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దఎత్తున భూములు అవసరం. వాటిని సేకరించాలంటే ఆ ప్రాంత భూ యజమానులు, స్థానికులు, వృత్తి కార్మికులు, కళాకారులు, కార్మికులు, ప్రజలు నిరాశ్రయులవుతారు. ఇలా వారు దేశాభివృద్ధి కోసం తమ జీవనం, వృత్తులు, ఆస్తులు, సంస్కృతి సంప్రదాయాలను వదులుకోవాల్సి వస్తుంది.
భారీ నీటి ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పరిశ్రమలు, తీరప్రాంత కారిడార్లు, మైనింగ్ కార్యకలాపాలకు మౌలిక సదుపాయాలు, వాటి నిర్మాణాలకు సంబంధించి కొన్ని వేల ప్రజలు తమ భూములు - నివాసాలు కోల్పోవడంతో నిరాశ్రయత (Displacement) ఏర్పడుతుంది.


* అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల అనేక సమస్యలు ఉంటాయి. ప్రధానంగా....


1) పర్యావరణానికి హాని జరుగుతుంది


2) అడవుల హననం


3) జీవ వైవిధ్యం నశిస్తుంది


4) వన్యమృగ సంపద తరిగిపోతుంది


5) తెగలు తమ సంస్కృతి, సంప్రదాయాలు కోల్పోవాల్సి వస్తుంది.


6) ప్రజలు భూములు, జీవనోపాధి కోల్పోతారు.


7) వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతుంది


8) ఆహార భద్రత కొరత


9) ప్రజా ఆందోళనలు, సామాజిక అశాంతి పెరుగుతాయి.


పునరావాస అంశాలు (Rehabilitation Aspects)


నిర్వాసితులు/ నిరాశ్రయులు

ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు, సెజ్‌లు, మైనింగ్, పారిశ్రామిక, ఆర్థిక, తీరప్రాంత కారిడార్లు, నౌకాశ్రయాలు, మౌలిక సదుపాయాలు లాంటి నిర్మాణాల వల్ల ఇళ్లు, భూములు, జీవనోపాధి కోల్పోయిన ప్రజలను నిర్వాసితులు అంటారు.


పునరావాసం
నిర్వాసితులు/ నిరాశ్రయులను దీర్ఘకాల ప్రాతిపదికన వేరే ప్రాంతాలకు తరలించి వారు జీవనోపాధి కోల్పోకుండా కావాల్సిన మౌలిక, జీవన/ ప్రాథమిక సౌకర్యాలు కల్పించడాన్ని పునరావాసం అంటారు.


ప్రాజెక్టుల నిర్మాణంలో సమస్యలు... 


* ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి పునరావాసం, పరిహారం విషయంలో అనేక సందర్భాల్లో ఉద్యమాలు, నిరసనలు తీవ్రస్థాయిలో జరిగాయి. ప్రధానంగా కింది ప్రాజెక్టుల విషయంలో ఉద్యమాలు జరిగాయి.


* ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు


* తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు


* గుజరాత్‌లో నర్మదా నదిపై సర్దార్ సరోవర్ ప్రాజెక్టు విషయంలో గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజలకోసం చాత్రా యువ సంఘర్షణ్ వాహిని, సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్ (సూరత్) లాంటి సంస్థలు ఆందోళనలు చేశాయి.


* నర్మదా బచావో పేరుతో మేధాపాట్కర్ ఉద్యమం చేపట్టారు.


తెహ్రి డ్యామ్ - ఉత్తర్ ప్రదేశ్: దీన్ని భాగీరథి నదిపై నిర్మించాలని భావించారు. ఇది పూర్తయితే 107 గ్రామాల్లో 9,563 కుటుంబాలకు చెందినవారు నిర్వాసితులవుతారని అంచనా. సుందర్‌లాల్ బహుగుణ 1996లో 72 రోజులు, తర్వాత 56 రోజులు సత్యాగ్రహం చేశారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వీరేంద్ర దత్, సక్లాని, తెహ్రి బంద్ విరోధి సంఘర్షణ సమితి అధ్యక్షుడు విద్యాసాగర్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.


శ్రీకాకుళం - కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం: దీన్ని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్మిస్తోంది. అయితే స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.


* గంగవరం (విశాఖ) పోర్టులో పెట్రోనెట్‌కు చెందిన LNG ప్రాజెక్టు నిర్మాణంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.


* విశాఖ - ఫార్మాసిటీ, పశ్చిమ బంగలో టాటా నానో ప్రాజెక్టు


* మహారాష్ట్ర - ఇచ్చంపల్లి ప్రాజెక్టు


* కింది ప్రాజెక్టుల్లో గనుల తవ్వకంపై సమస్యలు ఉన్నాయి.
ఎ) ఝార్ఖండ్‌లోని రాంచి, హజరీబాగ్
బి) మధ్యప్రదేశ్‌లోని జయంత్ ప్రాజెక్టు
సి) ఉత్తర్ ప్రదేశ్‌లోని సింగ్రౌలి ప్రాజెక్టు, బీనా ప్రాజెక్టు
డి) చత్తీస్‌గఢ్ - వేదాంత ప్రాజెక్టు
ఇ) గుజరాత్ - సాయాజి ఐరన్ పరిశ్రమ
ఎఫ్) తమిళనాడు - నైవేలి లిగ్నైట్ ప్రాజెక్టు


స్వచ్ఛంద సంస్థల పాత్ర 


* గుజరాత్‌లో ఉబై డ్యామ్ నిర్వాసితుల తరపున ఉబైన నిర్మాణ సమితి పోరాడుతోంది.


* చోటా నాగపూర్‌లో కోయిల్ కరోజన సంఘటన,


* సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం చాత్ర యువ సంఘర్షణ వాహిని, ద పక్టన్ రిసెర్చ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్, డెవలప్‌మెంట్ గ్రూప్ సొసైటీలు,


* సూరత్‌లో ఆర్చ్ వాహిని ఆఫ్ మంగోలి, రాజ్‌పిప్లా సోషల్ సర్వీసెస్ లాంటి సంస్థలు ఆయా ప్రాజెక్టుల నిర్వాసితుల హక్కులు, పునరావాస కల్పన, కనీస అవసరాల కోసం ఉద్యమాలు చేపట్టాయి.


గిరిజన పంచశీల్ - పునరావాస కల్పన చర్యలు


* ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నిరాశ్రయులైన ఆదివాసులు, గిరిజనులకు పునరావాసం కల్పించడానికి, గిరిజన అభివృద్ధి సంస్థ జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో ఆమోదించిన 5 సూత్రాలను ట్రైబల్ పంచశీల్ అంటారు. అవి:
1) ఆదివాసుల జీవన విధానంపై ఎలాంటి ఆంక్షలు విధించరాదు.
2) ఆదివాసీ సహజ సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించాలి.
3) ఆదివాసీ నివాస ప్రాంతాలకు దగ్గర్లోనే పునరావాసం కల్పించాలి.
4) పునరావాసం వారి దగ్గరలో లేకుంటే సారవంతమైన వ్యవసాయ భూముల వద్ద పునరావాసం కల్పించాలి.
5) ఆదివాసీ పునరావాస కేంద్రాల్లో పాఠశాలలు, తాగు, సాగునీరు, ఆరోగ్య కేంద్రాలు, సారవంతమైన భూమి లాంటి సదుపాయాలు కల్పించేలా కృషి చేయాలి.


సరైన పునరావాసం లభించాలంటే.........


* ప్రాజెక్ట్ నిర్మాణ ప్రయోజనాల్లో నిర్వాసితులకు భాగస్వామ్యం కల్పించాలి.


* పునరావాస కేంద్రాలు వారి పాత జీవన విధానానికి దగ్గరగా ఉండాలి.


* భూమిని కోల్పోయిన వారికి భూమిని అందించాలి.


* పని భద్రత కల్పించాలి.


* యువకుల కోసం ఉపాధి నైపుణ్య, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.


* ప్రభుత్వ ఉద్యోగాలు, ఆయా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలి.


* ఆవాస కల్పనలో నిర్వాసితులు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి.


భూసేకరణ విధానం 


ఏదైనా ప్రజా అవసరం నిమిత్తం భూమిని సేకరించాలని ప్రభుత్వం భావించినప్పుడు ప్రాథమిక పరిశీలన కోసం ఒక ప్రకటన (Notification) ఇస్తుంది.


* ఆ ప్రకటనపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ప్రకటన తేదీ నుంచి 30 రోజుల్లోపు కలెక్టర్‌కు తమ అభ్యంతరాలు తెలుపుకోవచ్చు.


* క్షేత్రస్థాయిలో సేకరించాల్సిన భూములను పరిశీలించే సందర్భంలో భూమికి ఏదైనా నష్టం జరిగితే, సరైన పరిహారం చెల్లిస్తారు.


* ప్రాథమిక పరిశీలన తర్వాత కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు.


* ఆ నివేదిక ప్రకారం భూమి సరైందే అని ప్రభుత్వం భావిస్తే దాని మేరకు ఒక డిక్లరేషన్ వెలువడుతుంది. వెంటనే దానికి అనుగుణంగా భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది.


* ఈ క్రమంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకునే భూముల యజమానులు/ హక్కుదారులు కలెక్టర్‌కు తమ హక్కుల సాక్ష్యాధారాలు అందజేయాలి.


* భూ విస్తీర్ణం, కొలతలకు సంబంధించి ఉన్న అభ్యంతరాలను కలెక్టరుకు తెలపవచ్చు.


* సదరు అభ్యంతరాలు, యాజమాన్య హక్కులు, భూమి మార్కెట్ విలువపై కలెక్టర్ విచారణ జరుపుతారు.


అవార్డు జారీ, పరిహారం చెల్లింపు


* విచారణ అనంతరం భూమిని స్వాధీనం చేసుకునే అంశాలతో పాటు ఒక అవార్డును ప్రభుత్వం లేదా కలెక్టర్ జారీ చేయాల్సి ఉంటుంది.


* స్వాధీనం చేసుకునే భూమికి చెల్లించే పరిహారం గురించి ఆ అవార్డ్ ప్రకటనలో స్పష్టంగా తెలియజేయాలి.


* నష్టపరిహార మొత్తం ఎవరికి చెల్లించాలో ఆ అవార్డులో పేర్కొనాలి. దానికి అనుకూలంగా పరిహారం చెల్లిస్తారు.


* సదరు నష్టపరిహారం తీసుకోవడానికి భూ యజమాని నిరాకరించినా, ఆ భూ యజమాని అందుబాటులో లేకపోయినా లేదా నష్టపరిహార మొత్తం చాలామందికి పంపిణీ చేయాల్సి ఉన్నా, పంపిణీలో ఇబ్బందులు ఎదురైనా ఆ మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.


నష్టపరిహారం - న్యాయస్థానం అధికారాలు 


భూసేకరణ ప్రజా అవసరాల కోసమేనా, కాదా అనే అంశం మినహా భూ సేకరణను ప్రశ్నించే, నిలువరించే హక్కు, అధికారం ఎవరికి లేదు.


* ఒక వ్యక్తి తనకు ఉన్న కొద్ది భూమిని పూర్తిగా కోల్పోయినా అతను భూసేకరణ అడ్డుకోలేడు. అతడు చేయవలసిందల్లా సాధ్యమైనంత ఎక్కువ నష్టపరిహారం పొందడం మాత్రమే.


* ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చాలా తక్కువ మొత్తమని, అది మార్కెట్ విలువకు సరిపోలేదని, అందువల్ల పరిహారం పెంచాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.


* ఆ సందర్భంలో న్యాయస్థానం ఆ అంశాల ఆధారంగా పరిహారం పెంచాల్సిందిగా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
చట్టం అమలు - ప్రభావం: భూసేకరణ చట్టం 1894 ప్రభుత్వానికి తిరుగులేని అధికారాలను కల్పించింది.


* ఈ చట్టం అమలు వల్ల ఇప్పటిదాకా ప్రభుత్వ భూసేకరణ నిరాటంకంగా కొనసాగుతోంది.


* ప్రభుత్వాలకు ఈ అధికారాలు లేకుంటే భారీ ప్రాజెక్టులు, విస్తరణ, అభివృద్ధి నిర్మాణాలు, ప్రభుత్వ పథకాల అమలు సాధ్యం కాకపోయి ఉండేది.


విమర్శ: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (SEZs) పేరుతో వేలాది ఎకరాల వ్యవసాయ సాగు భూమిని అనేక ప్రయివేట్ కంపెనీలకు, తమ సంబంధీకులకు ప్రభుత్వాలు అప్పగిస్తున్నాయనేది ప్రధాన విమర్శ.


* వ్యవసాయ భూములను సేకరించడం వల్ల ఆహార భద్రతకు సమస్యగా మారుతోంది.


* భూసేకరణ వల్ల వేలాది ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. అటవీ భూమి సేకరణ వల్ల విలువైన అటవీ సంపద, పశుపక్ష్యాదులు, వనమూలికలు, అరుదైన పశుసంపద కోల్పోతున్నాం.


ప్రభుత్వ భూసేకరణ చట్టాలు 


  నూతన ప్రాజెక్టులు, సెజ్‌లు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, భారీ పరిశ్రమలు, తీరప్రాంత కారిడార్లు నిర్మాణానికి, మౌలిక సదుపాయాలు కల్పనకు వేలాది ఎకరాల భూమి అవసరం. అలాంటి సందర్భంలో ప్రభుత్వం చట్టం ద్వారా భూమిని స్వాధీనం చేసుకుంటుంది. భారతదేశంలో బ్రిటిష్ కాలంనాటి 1894 చట్టంతోపాటు సవరించిన మరికొన్ని అంశాలు ఉన్నాయి.
1) భూసేకరణ చట్టం 1894 (బ్రిటిష్ కాలం)
2) భూసేకరణ పునఃస్థాపన, పునరావాస చట్టం - 2013 (UPA)
3) భూసేకరణ ఆర్డినెన్స్ - 2014 (NDA)


భూస్వాధీనతా/ భూసేకరణ చట్టం - 1894


ప్రజల వద్ద ఉన్న భూమిని, స్థలాలను, కొన్ని సందర్భాల్లో అవసరమైతే భవనాలను కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకునే విధానాన్ని భూసేకరణ అంటారు.


* భూసేకరణ అనేది ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం, నీటిపారుదల, విద్యుత్ పరిశ్రమల ఏర్పాటు, విస్తరణ వంటి సందర్భాల్లో ప్రభుత్వం అవసరమైన భూములను సేకరించే విధానం.


* భూసేకరణ వల్ల వేలమంది నిరాశ్రయులవుతారు. వారికి పునరావాసం, నష్టపరిహారం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.


* ప్రభుత్వాలు భూములు సమీకరించే పద్ధతి బ్రిటిష్ పాలనాకాలంలో ప్రారంభమైంది. దానికోసం చేసిన చట్టమే భూసేకరణ చట్టం. దీన్ని 1894లో రూపొందించారు.


కొన్ని అంశాలు 


* ఈ చట్టం అత్యంత పురాతనమైంది


* బ్రిటిష్ వలస పాలనలో 1894లో దీన్ని రూపొందించారు.


* కేంద్ర, రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాన్నే అమలు చేస్తున్నాయి.


* ఈ చట్టం 'భూసేకరణ అనేది ప్రభుత్వ ఏకస్వామ్య అధికారం'గా పేర్కొంటుంది.


* ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు సరైన నిబంధనలు ఈ చట్టంలోనే ఉన్నాయి.


* ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రజోపయోగాలు, ప్రజల అవసరాల కోసమే భూసేకరణ జరగాలి.


ప్రజోపయోగం అంటే 


భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించాలంటే అది తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిందై ఉండాలి. ప్రజా అవసరాల నిమిత్తం మాత్రమే భూసేకరణ జరగాలి.


* గ్రామాలు, పట్టణాల్లో క్రమబద్ధమైన అభివృద్ధి కోసం భూమిని స్వాధీనం చేసుకోవడం.


* గ్రామీణ భూముల విస్తీర్ణం, వాటి క్రమబద్ధమైన అభివృద్ధి కోసం


* ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ నియంత్రణలోని కార్పొరేషన్‌ల అభివృద్ధి, విస్తరణ, స్థాపనల అవసరాల కోసం భూమిని సేకరించడం.


* ప్రభుత్వం చేపట్టే వివిధ విధానాల అమలు కోసం లేదా వివిధ పథకాల అమల్లో భాగంగా ప్రభుత్వం తన నిధులతో భూములను సేకరించడం.


* ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన వారికి గృహ అవసరాలకు కేటాయించే భూమి కోసం స్వాధీనం చేసుకోవడం.


* పేదవారికి, భూమిలేని వారికి గృహ/ నివాస స్థలాల కేటాయింపు కోసం భూమిని స్వాధీనం చేసుకోవడం.


* ప్రభుత్వం ప్రారంభించిన ఏదైనా విద్యా, గృహ నిర్మాణ, ఆరోగ్య సంబంధ పథకం లేదా మురికివాడల నిర్మూలన పథకం కోసం భూమిని సేకరించడం.


* ఏదైనా ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణం కోసం భూమి సేకరించడం.


* ప్రభుత్వం, ప్రభుత్వ అనుమతితో ఏదైనా స్థానిక సంస్థ ప్రారంభించిన ఏదైనా అభివృద్ధి పథకం కోసం భూమి సేకరించడం.

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిర అభివృద్ధి 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 'పర్యావరణాన్ని ఒక్క మానవజాతి మాత్రమే కలుషితం చేస్తోంది. జీవావరణ వ్యవస్థలో మానవజాతి ఒక్కటే సిగ్గుపడాల్సిన జాతి లేదా సిగ్గుపడటానికి కారణం కలిగి ఉంటుంది' అని పేర్కొన్నది?
జ: మార్క్‌ట్వెయిన్

 

2. 'భూగోళంపై లభించే వనరులు జీవకోటి అవసరాలు తీర్చడానికి సరిపోతాయి కానీ ఏ ఒక్కరి దోపిడీకి సరిపోవు' అని పేర్కొన్నది ఎవరు?
జ: మహాత్మాగాంధీ

 

3. 'సహజ వనరులు అనంతంగా లభిస్తాయనే సంప్రదాయవాదం వీడి నేటి మానవుడు భూగోళాన్ని పరిమిత వ్యవస్థగా భావించాలి' అని అభిప్రాయపడింది ఎవరు?
జ: కెన్నెత్ బౌల్డింగ్

 

4. పర్యావరణం - ఆర్థిక వ్యవస్థల అనుబంధం దృష్ట్యా కిందివాటిలో సరైంది?
    ఎ) పర్యావరణం ఆర్థిక కార్యకలాపాలకు అవసరమైన ఉత్పాదితాలను అందిస్తుంది.
    బి) పర్యావరణం ఆర్థిక కార్యకలాపాల వల్ల ఏర్పడే వ్యర్థాలను విలీనం చేసుకుంటుంది.
    సి) ఎ, బి                                                                                                                 డి) పైవేవీ కాదు
జ: సి (ఎ, బి)

5. కిందివాటిలో పర్యావరణ విధి ఏమిటి?
    ఎ) సహజ వనరులను అందించడం            బి) సౌలభ్యాలను అందించడం
    సి) వ్యర్థాలను విలీనం చేసుకోవడం             డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

 

6. సైమన్ కుజ్నెట్స్ పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని కింది ఏ అంశాల ద్వారా వివరించాడు?
    1. ఆర్థికాభివృద్ధి                 2. పర్యావరణం నాణ్యతా స్థాయి
    3. పేదరికం స్థాయి             4. ఆదాయ వ్యత్యాసాల స్థాయి                5. జనసాంద్రత
జ: 1, 2, 3, 4, 5

 

7. తిరగబడిన 'U' ఆకార రేఖ (Inverted 'U' shaped curve) ద్వారా తలసరి ఆదాయంలో పెరుగుదల, పర్యావరణ క్షయం మధ్య సంబంధాన్ని సూచించింది ఎవరు?
జ: సైమన్ కుజ్నెట్స్

 

8. నిలకడ గల ఆర్థికాభివృద్ధి (Sustainable development) భావన అంటే...?
  ఎ) పర్యావరణం ప్రజల జీవన ప్రమాణాలకు బహిర్గతంగా తోడ్పడటం.
  బి) నేటి ప్రజలు అనుభవిస్తున్న జీవన ప్రమాణాల స్థాయిని ఏ మాత్రం తగ్గకుండా భావితరాలకు అందించడం.
  సి) సహజ వనరులు, మానవ నిర్మిత వనరులతో కూడిన మూలధనం భావితరాలకు అందుబాటులో ఉండటం.
  డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

9. పర్యావరణ పరిరక్షణ ద్వారా నిలకడ గల ఆర్థికాభివృద్ధి సాధించాలంటే వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి?
    1. వనరుల వాడకం తగ్గించడం (Reduce)
    2. వ్యర్థాల నుంచి సాధ్యమైనంత ప్రయోజనం రాబట్టడం (Recover)
    3. ప్రయోజనం కోల్పోకుండా తిరిగి ఉపయోగించగల వస్తువుల తయారీ (Recycle)
    4. పునఃఉపయోగం, సాధ్యమైనన్నిసార్లు తిరిగి ఉపయోగించడం (Reuse)
జ: 1, 2, 3, 4

 

10. నిలకడ గల ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు ఏవి?
    1. వృద్ధి లేదా ఆదాయాల్లో పెరుగుదల        2. అభివృద్ధి కొనసాగింపు
    3. క్షీణత నియంత్రణ                                  4. జీవవైవిధ్య రక్షణ
జ: 1, 2, 3, 4

 

11. హెచ్. డాలీ (1990 లో) కొనసాగించగలిగిన ఆర్థికాభివృద్ధికి తెలియజేసిన నియమాలు ఏవి?
1. పునరుద్ధరించగల వనరులను పునఃకల్పన రేటుకు (Regeneration rate) మించి ఉపయోగించరాదు.
2. పునరుద్ధరించడానికి వీల్లేని వనరులు ప్రత్యామ్నాయ వనరులు లభించే రేటు కంటే ఎక్కువ రేటులో ఉపయోగించకూడదు.
3. పర్యావరణం విలీనం చేసుకోగలిగిన సామర్థ్యం కంటే ఎక్కువ పరిమాణంలో కాలుష్య పదార్థాలను పర్యావరణంలోకి విసర్జించరాదు.
జ: 1, 2, 3

12. ఉష్ణగతిక శాస్త్రం (Thermo Dynamics) మొదటి సూత్రం ఏమని తెలుపుతుంది?
జ: ఇంధనం (శక్తి) పరిమితి స్థిరంగా ఉంటుంది. దాన్ని సృష్టించడం లేదా విధ్వంసం చేయడం సాధ్యం కాదు.

 

13. ఆర్థిక కార్యకలాపాల పరిమాణం పెరిగేకొద్దీ నియమరహితం పెరిగి, ప్రయోజనకరమైన పదార్థాల లభ్యత తగ్గడం ద్వారా నాగరికతలు క్షీణించేలా 'ఎంట్రోపి' సూత్రం (ఉష్ణగతికశాస్త్రం రెండో సూత్రం) శపించిందని పేర్కొన్నది ఎవరు?
జ: జార్జెస్ క్యూ - రోజన్

 

14. గ్రీకు దేశంలో ప్రకృతి వనరులను పునరుద్ధరించగల శక్తి కలిగి, పర్యావరణ సమతూకాన్ని నెలకొల్పే దేవతగా ఎవరిని విశ్వసిస్తారు?
జ: గైయా

 

15. కాలుష్యం ద్వారా కలిగే పర్యావరణ హానిని 'సామాజిక వ్యయం (Social Cost)' అన్నది ఎవరు?
జ: ఎ.సి. పిగూ

 

16. 1914 లోనే 'హరించుకుపోయే వనరుల అభిలషణీయ వినియోగరేటు' అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
జ: ఎల్. గ్రే

 

17. పర్యావరణంపై బ్రండ్‌ట్లాండ్ అధ్యక్షతన 'ప్రపంచ సంఘం (World Commission on Environment and Development)' ఎప్పుడు ఏర్పాటైంది?
జ: 1987

18. బ్రండ్‌ట్లాండ్ సంఘం (Brundtland Commission) సమర్పించిన నివేదిక పేరేంటి?
జ: మన ఉమ్మడి భవిష్యత్ (Our Common Future)

 

19. 'భావితరాల ప్రజలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యంతో రాజీపడకుండా, వర్ధమాన తరం తన అభివృద్ధి అవసరాలను తీర్చుకోగలగడమే నిలకడ గల అభివృద్ధి (Sustainable development)' అని నిర్వచించింది?
జ: బ్రండ్‌ట్లాండ్ కమిషన్

 

20. 'ఒక నిర్ణీత కాలంలో ప్రకృతి పర్యావరణ ఆస్తులతోసహా ముత్తాతల నాటి నుంచి లభించిన మొత్తం ఆస్తులను యథాస్థితిలో ఉంచగలిగేదే నిలకడ గల అభివృద్ధి' అని నిర్వచించింది ఎవరు?
జ: జె.టి. విన్‌పెన్ని

 

21. కిందివాటిలో నిలకడ గల అభివృద్ధిలోని అంతర్గత అంశాల్లో లేనిది ఏది?
    ఎ) ఆర్థికాంశాలు                         బి) సాంఘిక అంశాలు
    సి) పర్యావరణ అంశాలు              డి) రాజకీయ అంశాలు
జ: డి (రాజకీయ అంశాలు)


22. ఆర్థిక వ్యవస్థలో ఉండే మూలధనాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
    1. భౌతిక మూలధనం (KM)       2. మానవ మూలధనం (KH)        3. ప్రకృతి వనరులు (KN)
జ: 1, 2, 3

23. కాలక్రమేణా జాతీయ మూలధన నిల్వ తరగకుండా ఉండే నేపథ్యంలో నిలకడ గల అభివృద్ధి సాధ్యమవుతుందనే 'స్థిర మూలధన నిల్వ నియమాన్ని (Constant Capital Stock Rule)' ప్రతిపాదించింది ఎవరు?
జ: పియర్స్

 

24. ఏ నియమాన్ని అతిబలహీన నిలకడ వృద్ధి లేదా సోలో నిలకడ వృద్ధి స్థితి అంటారు?
జ: రెండో నిలకడ గల వృద్ధి నియమం

 

25. బలమైన నిలకడ గల వృద్ధి నియమం ఏది?
జ: నాలుగో నిలకడ గల వృద్ధి నియమం

 

26. బలమైన నిలకడ గల వృద్ధి సాధించడానికి...
జ: ప్రకృతి మూలధనం నిల్వ స్థిరంగా ఉండాలి

 

27. 'జరిగేలా చూడటం (Making it happen)' అనే పరిశోధనా వ్యాసంలో నిలకడ గల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు రూపొందించింది ఎవరు?
జ: రాల్ఫ్ రూక్‌వుడ్

 

28. రాల్ఫ్ రూక్‌వుడ్ ప్రతిపాదనలకు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) ప్రకృతి వనరుల దుర్వినియోగాన్ని విడనాడి వాటి పరిమితమైన స్థితిని గౌరవించాలి
బి) పర్యావరణానికి హానిచేసే అత్యున్నత ఆచరణలను కనుక్కుని వాటిని ప్రతికృతి (Replication) చేయాలి.
సి) నిలకడ గల అభివృద్ధి నియమాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి దీర్ఘకాల ఉద్దేశాలను రూపొందించాలి.
డి) పర్యావరణ సహాయనిధిని ఏర్పాటు చేయాలి.
జ: బి (పర్యావరణానికి హానిచేసే అత్యున్నత ఆచరణలను కనుక్కుని వాటిని ప్రతికృతి (Replication) చేయాలి.)

29. అపసరణ నియమం (Law of Divergence) ప్రకారం....
జ: ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవవైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతం అంత ఎక్కువగా సంరక్షించబడుతుంది.

 

30. కాలుష్యం స్థాయిని సాంఘికంగా అభిలషణీయ స్థాయికి నియంత్రించడానికి, కాలుష్యం వల్ల సంఘానికి ఏర్పడుతున్న హానికి సమానంగా పన్నుల విధానాన్ని రూపొందించాలని 'కాలుష్య పన్ను'ను ప్రతిపాదించింది ఎవరు?
జ: పిగూ

 

31. సామాన్యుల దుర్ఘటన (Tragedy of Commons) భావనను ప్రవేశపెట్టింది ఎవరు?
జ: విలియం ఫోస్టర్ లాయిడ్

 

32. ఎన్విరాన్‌మెంట్ (పర్యావరణం) అనే ఆంగ్ల పదం 'ఎన్విరానర్' అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది?
జ:  ఫ్రెంచి        

 

33. ఎన్విరాన్ అనే పదానికి అర్థం...?
జ: చుట్టూ ఉన్న
 

34. 'భూమి అనేది ఒక రోదసి నావలాంటిది. ఇందులో ప్రాణాధారమైన వనరులు పరిమితంగా ఉంటాయి. మానవ జాతి వీటి వినియోగాన్ని బాగా పెంచుకోవడానికి బదులుగా, వీలైనంతవరకు తగ్గించుకుంటే మంచిది' అని హెచ్చరించింది ఎవరు?
జ: కెన్నెత్ బౌల్డింగ్

 

35. 'ఆవరణ వ్యవస్థ (Eco System)' అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది?
జ: ఎ.జి. టాన్‌స్లే

36. జీవవైవిధ్యం (Bio-Diversity) అనే పదాన్ని తొలిసారి ప్రతిపాదించింది ఎవరు?
జ: వాల్టర్ రోసెన్

 

37. 'సుస్థిరత్వం (Sustainability)' భావనను ప్రవేశపెట్టింది ఎవరు?
జ: ఐరోపా అటవీ అధికారులు

 

38. కింది అంశాలను జతపరచండి.   
1. ది సైలెంట్ స్ప్రింగ్                  a) రాచెల్ కార్సన్ (1962)

2. ది కాస్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్     b) మిషాన్ (1967)

3. లిమిట్స్ టు గ్రోత్                   c) మెడోస్ (1973)

4. అవర్ కామన్ ఫ్యూచర్            d) బ్రండ్‌ట్లాండ్ (1987)

జ: 1-a, 2-b, 3-c, 4-d
 

39. కింది ఏ సంవత్సరంలో 'ధరిత్రీ సదస్సు' జరిగింది? 
    ఎ) 1990       బి) 1991       సి) 1992      డి) 1993
జ: సి (1992)

 

40. అమెరికా 'సుస్థిరమైన అభివృద్ధి కోసం విద్యా దశకం'గా ఏ కాలాన్ని ప్రకటించింది?
జ: 2005 - 15

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ వనరుల పరిరక్షణ

  ఆర్థిక శాస్త్రవేత్తలు పర్యావరణ క్షయాన్ని మార్కెట్ వైఫల్యంగా పేర్కొంటారు. జీవాధార వ్యవస్థకు (Life Support System) అవసరమైన మూడు విధులను పర్యావరణం నిర్వహిస్తుంది. అవి: ఎ) సహజవనరులను అందించడం  బి) సదుపాయాలను అందించడం సి) ఆర్థిక కార్యకలాపాల వల్ల విడుదలైన కాలుష్యాలను విలీనం చేసుకోవడం  (తొట్టెగా ఉపయోగపడటం). అయితే ఈ విధులు మార్కెట్ పరిధిలోని అంశాలు కాకపోవడం వల్ల, పర్యావరణం అందిస్తున్న విధులకైన వ్యయాలను లెక్కించకపోవడం వల్ల మార్కెట్ ధరలు వాస్తవ ధరలను ప్రతిబింబించవు. వనరుల అభిలషణీయ ధరకు, మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసం ఉండటాన్నే 'మార్కెట్ వైఫల్యం'గా పేర్కొంటారు.


  మార్కెట్ వైఫల్యాలు సమాజంపై 'బాహ్య వ్యయాలు' (External Costs) పడేలా చేస్తాయి. రెండు పక్షాల మధ్య జరిగే ఆర్థిక కార్యకలాపాల వల్ల వారి పరిధిలోకి రాని మూడో పక్షం లేదా వ్యక్తిపై విధించే వ్యయం లేదా ప్రయోజనాన్ని 'బహిర్గత అంశాలు' (Externalities)గా నిర్వచించవచ్చు.
ఉదా: ఒక నదీతీరంలో రసాయన పరిశ్రమ, పర్యటక కేంద్రం ఉన్నప్పుడు రసాయన పరిశ్రమ విడుదల చేసే కాలుష్యాలు, వ్యర్థాలు నదీజలాలను కలుషితం చేయడం; నదీకాలుష్యం వల్ల పర్యటక కేంద్రం వ్యయాలు పెరిగి, లాభాలు తగ్గడం బహిర్గత అంశాల ప్రభావంగా చెప్పవచ్చు. బహిర్గత వ్యయాల వల్ల అభిలషణీయ పంపిణీ సామర్థ్యం దెబ్బతిని, సాంఘిక సామర్థ్యాన్ని పెంపొందించడం సాధ్యం కాదు. ఒక వస్తువు మార్కెట్ ధరను నిర్ణయించడంలో ఉత్పత్తి సంస్థలు బహిర్గత అంశాలను లెక్కించకపోవడంతో సాంఘిక లాభాలు లేదా వ్యయాల వ్యక్తీకరణ జరగడం లేదు. అందువల్ల వస్తూత్పత్తి అల్ప లేదా అధిక పరిమాణంలో జరిగి సమతౌల్యం లోపిస్తుంది.


బహిర్గత అంశాలు పంపిణీ వ్యవస్థపై రెండు రకాల ప్రభావాలను కలిగిస్తాయి.


1. రుణాత్మక ప్రభావం 2. ధనాత్మక ప్రభావం
 రుణాత్మక బహిర్గత అంశాల ప్రభావం వల్ల మార్కెట్ ఉత్పత్తి సాంఘికంగా అభిలషణీయ స్థాయిలో జరగకపోగా ఉపాంతహాని (అదనంగా సమాజానికి హాని) కలిగిస్తుంది. పర్యావరణ నష్టం జరిగి కాలుష్యం పెరుగుతుంది. బహిర్గత అంశాల ధనాత్మక ప్రభావం వల్ల సాంఘిక ప్రయోజనం ఏర్పడి, ఉత్పత్తి పెరుగుతుంది.


బహిర్గత అంశాల ప్రభావాన్ని నివారించే చర్యలు (Solutions of Externalities): బహిర్గత అంశాల ప్రభావం వల్ల ఏర్పడే మార్కెట్ వైఫల్యాల నుంచి మార్కెట్ వ్యవస్థను చక్కదిద్ది పంపిణీ సామర్థ్యం పెంచడానికి కింది చర్యలు ఉపకరిస్తాయి.


1. సాంఘిక నమ్మకాలు (Social Conventions): సంస్కృతిలో భాగంగా ఏర్పడే సాంఘిక నమ్మకాలు, ఆచారాలు, పాటించే పద్ధతులు పర్యావరణంపై పడుతున్న బహిర్గత ప్రభావం గురించి అవగాహనను పెంపొందిస్తాయి.
ఉదా: చిన్నవయసులో తల్లిదండ్రులు, గురువులు నేర్పే పద్ధతులు. వ్యర్థపదార్థాలను చెత్తబుట్టలో మాత్రమే వేయడం, వనరుల వాడకంలో పొదుపు మొదలైనవి. ఈ అలవాట్లు పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్యాల అదుపునకు తోడ్పడతాయి.


2. సంస్థలు విలీనం కావడం (Mergers): సంస్థలు విలీనం కావడం వల్ల బహిర్గత అంశాల ప్రభావాన్ని నివారించవచ్చు. అయితే అన్ని సందర్భాల్లో, ముఖ్యంగా వైయక్తిక వినియోగంలో ఇది సాధ్యం కాకపోవచ్చు.


3. కాలుష్యాలు, వ్యర్థాల పరిమాణంపై నియంత్రణలు విధించడం (Regular limits): కాలుష్యాలు, ఘనవ్యర్థాల పరిమాణంపై పరిమితులు విధించి, పరిమితిని మించి కాలుష్యాలు విడుదల చేసే సంస్థలకు అదనపు పన్నులు, జరిమానాలు విధించడం ద్వారా బహిర్గత వ్యయాల రుణాత్మక ప్రభావాన్ని తగ్గించవచ్చు.
 దిల్లీ ప్రభుత్వం కార్ల వినియోగంలో ప్రవేశపెట్టిన సరి-బేసి కార్ల వాడకం కాలుష్య నియంత్రణకు మంచి ఉదాహరణే. వ్యర్థాలను విడుదల చేసే కర్మాగారాల ఉత్పత్తిపై గరిష్ఠ పరిమితి విధించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చు.
 సులభంగా అమలుచేయడానికి వీలున్న ఈ కాలుష్య నియంత్రణ వల్ల, సంస్థల ఉత్పత్తి పరిమాణం అభిలషణీయ స్థాయి కంటే తగ్గడం, ఉత్పత్తి వ్యయం పెరగడం, ఉత్పాదక శక్తి వృథా కావడం లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా కాలుష్య పరిమాణాన్ని నిర్ధారించడం, సంస్థల వ్యర్థాలను కనుక్కోవడం అంత సులభం కాదు.


4. కాలుష్య పన్ను (Pigouvian Corrective Taxes): బహిర్గత అంశాల రుణాత్మక ప్రభావాన్ని చక్కదిద్దడానికి ఎ.సి. పిగూ 'కాలుష్య పన్నును' సూచించాడు. కాలుష్యస్థాయిని సాంఘికంగా అభిలషణీయ స్థాయికి నియంత్రించడానికి కాలుష్యం వల్ల సమాజానికి ఏర్పడుతున్న నష్టానికి సమానమైన ద్రవ్య విలువతో పన్నుల విధానాన్ని రూపొందించాలని పిగూ సూచించాడు. ఈ కాలుష్యపు పన్నునే పిగూవియన్ టాక్స్ (Pigouvian Tax) అంటారు. ఈ కాలుష్య పన్ను విధింపు కాలుష్య నియంత్రణకు పూర్తి పరిష్కారం కాకపోయినా, సంస్థలు ఉత్పత్తి చేస్తున్న హానికర కాలుష్యాలు, వ్యర్థాల పరిమాణాన్ని గుర్తించవచ్చు. వాటివల్ల పర్యావరణ క్షీణతకు ఏర్పడుతున్న వ్యయాలను నిర్ణయించి బాధ్యుల నుంచే పరిహారాన్ని (పన్నుల రూపంలో) వసూలు చేయవచ్చు.


5. సబ్సిడీల ద్వారా ధనాత్మక బహిర్గత అంశాలను ప్రోత్సహించడం (Encouraging Positibe Externalities through Subsidies): సంస్థల వల్ల చేకూరుతున్న సాంఘిక ప్రయోజనం సబ్సిడీకి సమానంగా ఉంటే అది సంస్థకు ప్రోత్సాహకరంగా ఉండటంతోపాటు ఇతర సంస్థలకు మార్గదర్శకం అవుతుంది. ఉత్పత్తి పరిమాణం కూడా అల్పస్థాయి నుంచి అభిలషణీయ స్థాయికి పెరిగి, ఆర్థిక వ్యవస్థ లబ్ధి పొందుతుంది.
ఉదా: విద్యుత్ ఉత్పత్తికి సోలార్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమలకు సబ్సిడీ ఇవ్వడం లేదా గృహ విద్యుత్ వినియోగదారులకు సోలార్ ప్యానెళ్ల కొనుగోలుకు సబ్సిడీ ఇవ్వడం మొదలైనవి. అయితే సాంఘిక ప్రయోజనం, సబ్సిడీలను లెక్కించడంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఉత్పత్తి పెరగకపోగా ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిని, సబ్సిడీలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.


6. పబ్లిక్ వస్తువుగా పర్యావరణం (Environment of Public good): పబ్లిక్ వస్తువులకు మూడు లక్షణాలు ఉంటాయి. అవి:
1. ఉమ్మడి వస్తువులుగా అందరికీ అందుబాటులో ఉండటం. ఉదా: గాలి.
2. వీటి వాడకం నుంచి ఎవరినీ నిరోధించడానికి అవకాశం లేకపోవడం.
3. ఈ వనరులు అవిభాజ్యాలు. అంటే వీటిని వైయక్తిక లేదా చిన్న యూనిట్లుగా విభజించి, వాటి వాడకానికి ధర నిర్దేశించే అవకాశం ఉండదు. ధర చెల్లించినా, చెల్లించకపోయినా అందరూ సమానంగా వాడుకునే అవకాశం ఉంటుంది.


  పర్యావరణం అందించే జీవవైవిధ్యం, ప్రకృతి సౌందర్యం, నదులు, జలాశయాలు, అడవులు, స్వచ్ఛమైన గాలి, నీరు, పబ్లిక్ వస్తువులకు ఉదాహరణలు. ఇవి సంఘానికి చెందిన సామూహిక ఆస్తి లేదా ఉమ్మడి ఆస్తి. మార్కెట్ వస్తువులకు నిర్ణయించినట్లు వీటి వాడకానికి ధర నిర్ణయించలేం. ఒకవేళ ఎవరైనా ధరను చెల్లించడానికి ఇష్టపడకపోతే అలాంటి వినియోగదారులను వాడకం నుంచి నిరోధించే అవకాశం లేదు. ఉమ్మడి ఆస్తి వస్తువులైన వీటిపై అందరికీ అధికారం ఉండటం వల్ల వాటి వాడకానికి అందరూ సమానంగా పోటీ పడతారు. దాంతో వీటిని ఎవరికీ చెందని వస్తువులుగా పరిగణించి వృథా చేయడం, విచక్షణారహితంగా వాడుతుండటంతో నిల్వలు తరిగిపోయి పర్యావరణ అసమతౌల్యానికి కారణం అవుతున్నాయి. పబ్లిక్ వస్తువులను విచక్షణారహితంగా ఉపయోగించడాన్ని నియంత్రిస్తూ, పరిమితులు విధిస్తూ, సంరక్షణ చర్యలు చేపడితే జీవవైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు. తద్వారా సమాజంలో పర్యావరణ వనరులపై బహిర్గత అంశాల రుణాత్మక ప్రభావాన్ని తగ్గించొచ్చు.


7. ఆస్తి హక్కు: పర్యావరణ వనరులపై బహిర్గత అంశాల రుణాత్మక ప్రభావాన్ని తగ్గించడానికి మరొక పరిష్కారం ప్రయివేట్ ఆస్తి హక్కులు. సమర్థవంతమైన ఆస్తిహక్కుల నిర్మాణమే సమతౌల్య మార్కెట్లకు పునాది. సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థకు మూడు లక్షణాలుంటాయి.
1) వనరులపై వ్యక్తులు, సంస్థలకు ప్రత్యేకంగా ఆస్తి హక్కులు ఉండి వాటికయ్యే వ్యయాలు, చేకూరే లాభాలు వారికి మాత్రమే చెందడం.
2) ఆస్తి హక్కును ఒక వ్యక్తి లేదా సంస్థ నుంచి మరో వ్యక్తి లేదా సంస్థకు మార్చడానికి వీలుండటం.
3) వనరులను ఇతరులు ఆక్రమించడానికి అవకాశం లేకుండా వాటి సొంతదారుడు వనరులను పరిమితంగా, సమర్థంగా వినియోగిస్తూ, వాటి పరిమాణం, నాణ్యత క్షీణించకుండా జాగ్రత్తగా చూసుకోవడం.
ఉదా: వ్యవసాయదారుడు తాను సేద్యం చేసే భూమిలో భూసారం తగ్గకుండా రసాయన ఎరువులు ఉపయోగించడం, పంటమార్పిడి చేయడం లాంటి చర్యలు తీసుకుంటాడు.

  తద్వారా పర్యావరణ వనరులను ఇష్టారీతిలో వినియోగించి వాటి క్షీణతకు కారణమవడం ఉండదు. అయితే ప్రకృతి వనరులపై ఆస్తిహక్కు అంటే మార్కెట్ వ్యవస్థలో కనిపించే ప్రయివేటీకరణే. దీనివల్ల ప్రకృతి వనరులపై కొద్దిమందికి ఆధిపత్యం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.


సామాన్యుల దుర్ఘటన (ఇక్కట్లు)

ఉమ్మడి ఆస్తివనరులైన పర్యావరణ వనరులపై సమాజంలోని వ్యక్తులందరికీ సమానమైన హక్కులుండటంతో సాంఘిక సంక్షేమాన్ని విస్మరించి, స్వలాభం కోసం విచక్షణారహితంగా వనరులను అవి అంతరించే స్థాయిలో దోపిడీ చేస్తారు. 1833లో విలియం ఫోస్టర్ లాయిడ్ (William Forster Lloyd) 'సామాన్యుల దుర్ఘటన' (Tragedy of Commons ) అనే భావనను ప్రవేశపెట్టాడు. దీనికి ఆధారం 'గ్రామీణ ప్రాంతాల్లో పాడిపశువుల పెంపకానికి, పచ్చిక బీళ్లను వాటి పచ్చదనం నశించే స్థాయిలో ఉపయోగించడంతో ఆ పచ్చిక బీళ్లు అంతరించడం' అనే అంశం.
 1968లో గారెట్ హార్డిన్ సామాన్యుల దుర్ఘటన సిద్ధాంతాన్ని జనాభా అభివృద్ధికి అన్వయించి అధిక సంతానం కుటుంబానికి లబ్ధి చేకూర్చినా, అధిక జనాభా వల్ల సమాజంపై రుణాత్మక ప్రభావం (Negative effect) పడుతుందని వివరించారు. ఉమ్మడి ఆస్తిగా ఉన్న పర్యావరణ వనరులను విచక్షణారహితంగా వినియోగించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. వనరుల వినియోగంపై ఆంక్షలు, నిబంధనల అమలు లాంటి చర్యలు చేపట్టడంతో పాటు జనాభా నియంత్రణను అనుసరించాలని ఆయన సూచించారు.

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం - కాలుష్య కారకాలు

గ‌త ప‌రీక్ష‌ల్లో అడిగిన ప్ర‌శ్న‌లు

1. మానవుడికి, పర్యావరణానికి హాని కలిగించని గరిష్ఠ శబ్ద స్థాయి ఎన్ని డెసిబుల్స్‌కు మించరాదు? (ఎస్సై - 2016)
జ: 120

 

2. 1986 ఏప్రిల్‌లో సంభవించిన చెర్నోబిల్‌ దుర్ఘటన ఒక (గ్రూప్‌ - 4, 2014; ఎస్సై - 2016)
జ: కిరణధార్మిక కాలుష్యం

 

3. కిందివాటిలో జల కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల్లో భాగం కానిది? (ఏఈఈ, గ్రూప్‌ - 2, 2017)
     1) కలరా                       2) జాండీస్‌
     3) మలేరియా                4) డయేరియా
జ: 3 (మలేరియా)

 

4. ఆసుపత్రుల వద్ద ఉండాల్సిన శబ్ద స్థాయి పరిధి (ఎఫ్‌బీవో - 2017)
జ: 30 - 40 db

 

5. ధ్వని పీడన యూనిట్‌ ప్రామాణికతలో ఉండాల్సినవి (ఎఫ్‌ఎస్‌వో - 2017)
      ఎ) శబ్ద స్థాయి     బి) శబ్ద తీవ్రత      సి) శబ్ద పీడనం
జ: ఎ, బి

6. 2014లో గంగానది కలుషితాన్ని తొలగించడానికి ప్రారంభించిన కార్యక్రమం? (గ్రూప్స్ - 2017)
జ: నమామి గంగా

 

మాదిరి ప్రశ్నలు

1. లుకేమియా, మాలిగ్నంట్‌ ట్యూమర్లు, ఆయువు తగ్గడం ఏ రకమైన కాలుష్యం వల్ల సంభవిస్తాయి?
జ: అణుధార్మిక కాలుష్యం

 

2. డెసిబుల్స్‌ వేటికి ప్రమాణాలు?
జ: ధ్వని

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిరాభివృద్ధి - వనరులు

20వ శతాబ్దం మధ్య కాలంలో ప్రపంచ సమాజం ప్రజల ఆకాంక్షలు, కోరికలను ప్రతిబింబించే విధంగా నడవాలనుకుంది. దీనికోసం ముఖ్యంగా శాంతి, స్వాతంత్య్రం, అభివృద్ధి, పర్యావరణం అనే నాలుగు అంశాలను ఎంచుకుంది. అయితే 1950వ దశకంలో అమెరికా వ్యవసాయసాగులో అవలంబించిన విధానాలు ఈ గమ్యానికి ఆటంకాన్ని కలిగించాయి. అగ్రరాజ్యం విరివిగా డీడీటీ (డైక్లోరో డైఫినైల్‌ ట్రైక్లోరో ఈథేన్‌) క్రిమిసంహారక మందును వినియోగించడంతో అధిక సంఖ్యలో జీవులు మరణించి పర్యావరణానికి విఘాతం కలిగింది. ఈ వినాశనాన్ని 1962లో రెచెల్‌ కార్సన్‌ (అమెరికా) ‘నిశ్శబ్ద వసంతం (సైలెంట్‌ స్ప్రింగ్‌)’ అనే పుస్తకంలో ప్రస్తావించాడు. ఇందులో ఆర్థికాభివృద్ధికి, పర్యావరణానికి మధ్య గల వైరుధ్యాన్ని తెలియజేశాడు. దీంతో పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. పర్యావరణాన్ని నిలకడ గల అభివృద్ధి ద్వారా సాధించాలనే ఉద్దేశంతో సుస్థిరాభివృద్ధి వెలుగులోకి వచ్చింది.


సుస్థిరాభివృద్ధికి మూలం

సుస్థిరత్వం అనే పదం మొదట 19వ శతాబ్దపు మధ్య కాలంలో ఐరోపా అటవీ అధికారులు ప్రవేశపెట్టిన ఒక ప్రక్రియ. ఆనాటి యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అడవులే ప్రధాన చోదక శక్తులుగా ఉండేవి. అక్కడ అటవీ సంపద తరిగిపోయినా తిరిగి ఆ ప్రాంతంలో మొక్కలను నాటి అడవులను సంరక్షించేవారు. భావితరాలకు అడవుల క్షీణత ఉండకూడదనే సంకల్పమే సుస్థిరత్వ అభివృద్ధికి దారితీసింది.


సుస్థిరాభివృద్ధి అంటే? 


పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే అభివృద్ధిని సుస్థిరాభివృద్ధి అంటారు. ఈ అభివృద్ధి ప్రక్రియలో పర్యావరణాన్ని విలీనం చేస్తారు. అంటే ప్రజల ప్రస్తుత అవసరాలను తీరుస్తూ, భావితరాల అవసరాలను తీర్చడంలో రాజీలేని మార్గం ద్వారా అభివృద్ధి కొనసాగించడాన్నే సుస్థిరాభివృద్ధి అంటారు. దీన్నే నిలకడ గల లేదా కొనసాగించగలిగే అభివృద్ధి అని పిలుస్తారు.


సుస్థిరాభివృద్ధి భావన


* 1972లో జరిగిన స్టాక్‌హోం ప్రపంచ మానవ పర్యావరణ సదస్సులో సుస్థిరత్వం అనే పదాన్ని ఉపయోగించారు. 1980లో ‘ప్రకృతి, సహజ వనరుల రక్షణ అంతర్జాతీయ సంఘం’ (IUCNNR - International Union for the Conservation of Nature and Natural Resources) మొదట సుస్థిరాభివృద్ధి అనే భావనను తెలియజేసింది.
* 1987లో గ్రొహర్లెమ్‌ బ్రుంట్‌లాండ్‌ అధ్యక్షతన జరిగిన ప్రపంచ పర్యావరణ అభివృద్ధి సంఘం (WCED - The World Commisson on Environment and Development) లో ‘మన ఉమ్మడి ప్రణాళిక’ నివేదికలో సుస్థిరత్వం అనే పదానికి అర్థాన్ని తెలియజేశారు.

* సుస్థిరత్వం మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
అవి: 1) అవసరాలు - వనరుల పంపిణీలో సంబంధాన్ని కలిగి ఉండాలి
     2) అభివృద్ధి - సామాజిక, ఆర్థిక విషయాల్లో మెరుగుదలను సూచించాలి.
     3) భవిష్యత్తు - రాబోయే తరాలకు స్థిరత్వాన్ని ఇవ్వాలి. 
* 1992 జూన్‌లో రియో - డి - జెనిరో (బ్రెజిల్‌)లో జరిగిన పృథ్వీ సదస్సులో ఐక్యరాజ్య సమితి ‘ఎజెండా - 21’ అనే ప్రపంచ ప్రణాళిక ద్వారా సుస్థిరాభివృద్ధిని కొనసాగించడానికి దోహదపడే విధంగా ప్రణాళికలను రూపొందించింది.
* 2002లో దక్షిణాఫ్రికా జోహన్నెస్‌ బర్గ్‌ సదస్సులో మొదటి సుస్థిరాభివృద్ధి సమావేశాన్ని నిర్వహించి సుస్థిరత్వం అనే భావనను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసింది.


సుస్థిరాభివృద్ధి భాగాలు


* కొనసాగించగలిగే అభివృద్ధిలో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి. ఇవి ఒకదాంతో ఒకటి సంబంధాన్ని కలిగిన స్వతంత్రమైన అంశాలు. ఇవి ఆర్థిక, సామాజిక, పర్యావరణ అంశాల మధ్య సమతూకాన్ని సాధించడం ద్వారా సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది.

సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యత 


ప్రపంచ స్థాయిలో సుస్థిరాభివృద్ధి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విద్యకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చింది. 2005 - 2015 కాలాన్ని సుస్థిరాభివృద్ధి కోసం విద్యా దశాబ్దంగా ప్రకటించింది.


సుస్థిరత్వం - సహస్రాభివృద్ధి లక్ష్యాలు 


  2000 సెప్టెంబరు 20 - 22 వరకు జరిగిన ఐక్యరాజ్య సమితి న్యూయార్క్‌ సాధారణ సభలో మిలీనియం డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఇందులో ఎనిమిది లక్ష్యాలు ఉన్నాయి. వీటిని 2015 సెప్టెంబరు 25 నాటికి సాధించాలని నిర్ణయించింది.


1) ఆకలి, పేదరికాన్ని నిర్మూలించాలి
2) ప్రాథమిక విద్యను అందించాలి
3) శిశు మరణాల సంఖ్యను తగ్గించాలి
4) ప్రసూతి ఆరోగ్యాన్ని పెంచాలి
5) వ్యాధులను నివారించాలి
6) పర్యావరణంతో కూడిన సుస్థిరాభివృద్ధి
7) లింగ సమానత్వం, మహిళా సాధికారిత
8) అభివృద్ధి లక్ష్యాల్లో ప్రతిదేశం భాగస్వామ్యం కావాలి


ఐక్యరాజ్యసమితి - సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 


  2015 సెప్టెంబరు 25 నుంచి 27 వరకు జరిగిన న్యూయార్క్‌ సర్వ ప్రతినిధుల సభలో ఐక్యరాజ్య సమితి 2015 - 2030 కాలానికిగాను సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను తీర్మానించి ప్రకటించింది. వీటిని ప్రపంచ దేశాలు 2030 వరకు సాధించాలి. వీటిలో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి.
 

లక్ష్యాలు


1) పేదరికాన్ని నిర్మూలించడం.
2) ఆకలిని పారద్రోలి, ఆహార భద్రతను సాధించడం.
3) మెరుగైన, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడం.
4) సమ్మిళిత, సమానత్వంతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం.
5) లింగపరమైన సమానత్వం, స్త్రీల సాధికారతను సాధించడం.
6) తాగునీరు, పరిశుభ్రతను అందుబాటులోకి తీసుకురావడం.
7) శిలాజేతర ఇంధన శక్తి సామర్థ్యాలను పెంపొందించడం.
8) అందరికీ పూర్తిస్థాయి ఉత్పాదక, ఉద్యోగితను కల్పించడం.
9) పారిశ్రామికీకరణ, నవకల్పనను ప్రోత్సహించడం.
10) ప్రపంచ దేశాల మధ్య అసమానతలను తగ్గించడం.
11) పట్టణాలు, మానవ ఆవాసాలు సురక్షితంగా ఉండేలా చేయడం.
12) ఉత్పత్తి నమూనాలు, వినియోగం అందుబాటులోకి తేవడం.
13) వాతావరణ మార్పులను అరికట్టడానికి సత్వర చర్యలు చేపట్టడం.
14) సముద్ర వనరులను పరిరక్షించడం.
15) జీవావరణాన్ని పరిరక్షిస్తూ అడవుల రక్షణ, ఎడారికీకరణ, నేల క్షీణతను అరికట్టడం.
16) అందరికీ న్యాయం, శాంతి అందుబాటులోకి తేవడం.
17) అభివృద్ధి సాధనలో ప్రపంచ దేశాలను భాగస్వామ్యం చేయడం.

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిరాభివృద్ధి - వనరులు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ఐక్యరాజ్య సమితి ‘సుస్థిరాభివృద్ధి కోసం విద్యా దశాబ్దం’ను ఎప్పుడు ప్రకటించింది? (డిప్యూటీ సర్వేయర్, 2017)
జ: 2005 - 2015

 

2. ‘ఎజెండా - 21’ దేనికి సంబంధించింది? (డీఎల్, 2017)
జ: సుస్థిరాభివృద్ధి

 

3. కిందివాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగం కానిది? (గ్రూప్‌ - 3, 2017)
   1) పేదరిక నిర్మూలన      2) ప్రపంచశాంతి, న్యాయాన్ని కాపాడటం 
   3) అందరికీ నాణ్యమైన విద్య      4) క్రీడా నైపుణ్యాలను పెంచడం
జ: 4 (క్రీడా నైపుణ్యాలను పెంచడం)

 

4. 2015 న్యూయార్క్‌ సాధారణ సభలో ఐక్యరాజ్య సమితి మొత్తం ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది? (ఏఈ, 2016)
జ: 17

 

5. యూఎన్‌వో సాధారణ సభ 2015 సెప్టెంబరులో నిర్వహించిన 70వ సదస్సులో ఏ తీర్మానాన్ని ప్రకటించింది? (గురుకుల పీజీటీ, 2018)
జ: సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు

 

6. సుస్థిరాభివృద్ధిపై మొదటి సదస్సును ఎక్కడ నిర్వహించారు?
జ: జోహన్నెస్‌ బర్గ్‌

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిర అభివృద్ధి

  అభివృద్ధి అనేది అతి ప్రాచీనమైన మానవ వ్యక్తిగత, సామూహిక కార్యక్రమం. దీనిలో భాగంగా గుహలు విడిచి గృహాలను నిర్మించారు. ఇది కుమ్మరి చక్రంతో మొదలైన మొదటి ఉత్పత్తి. ద్రవ్యం సంపద, సంతోషానికి మారుపేరుగా మారి పర్యావరణాన్ని బాధిస్తున్న విధ్వంసక ప్రక్రియ. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో జరిగిన వాతావరణ కార్యాచరణ సదస్సులో 16 ఏళ్ల స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్‌  ‘మా తరాన్ని ముంచేస్తారా’ అని పాలకులను ప్రశ్నించింది. నేటి తరం ఇలా ఎందుకు స్పందిస్తుందో అర్థం కావాలంటే మనిషి అభివృద్ధి భావనా ప్రస్థానాన్ని అవగాహన చేసుకోవాలి. ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు మొదట తక్కువ కాలంలో అభివృద్ధి చెందిన దేశాల్లో వాస్తవిక ఆదాయంలోని పెరుగుదలనే ఆర్థిక వృద్ధిగా పరిగణించారు. సాంకేతికతను అందిపుచ్చుకొని సంపదను వస్తువుల రూపంలో సేకరించి, మార్కెటింగ్‌ చేసుకోవడాన్నే ముఖ్యంగా భావించారు. ఈ క్రమంలో పర్యావరణ జాగ్రత్తలను విస్మరించారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం రాజకీయంగా స్వతంత్ర దేశంగా అవతరించిన భారత్‌ లాంటి దేశాలను పరిశీలిస్తే వెనుకబడిన దేశాలకు ఆర్థికవృద్ధితోపాటు ఆర్థికాభివృద్ధి కూడా అవసరమని తేల్చారు. దీర్ఘకాలంలో వాస్తవిక ఆదాయంతో పాటు సామాజిక, సంస్థాగత, సాంకేతిక మార్పులను తెలిపే విశాల ప్రక్రియను ఆర్థికాభివృద్ధి అని గుర్తించారు.   


  ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థికవృద్ధిలా సంపద సృష్టికి ప్రాధాన్యం ఇస్తుంది. అంటే జాతీయాదాయ పెంపుదలే ముఖ్యం. ఇది తక్కువ కాలంలో అధిక వృద్ధిరేటు కోసం ప్రయత్నిస్తుంది. ఉత్పత్తి ఉపాధికి దారితీసి మరెన్నో పరోక్ష ప్రయోజనాలను కల్పిస్తుంది. దీని వల్ల అభివృద్ధి జరుగుతుందనేది సైద్ధాంతిక విశ్వాసం. దీన్నే ట్రికిల్‌ డౌన్‌ థియరీ అంటారు. ఈ సిద్ధాంతం ఆధారంగానే అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేక ఆదాయ అభివృద్ధి పనులను చేపట్టాయి. మన దేశంలో 1951-1970 మధ్య కాలంలో సామాజిక అభివృద్ధి, గ్రామాల్లో భూసంస్కరణలు, వ్యవసాయ విస్తరణ, భారీ ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణం, హరిత విప్లవాలతో ఆర్థికాభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి.


ఆర్థిక సంక్షేమం 


  ఆర్థికాభివృద్ధి ఫలాలు కొన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. పేద ప్రజల స్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీన్ని అధిగమించడానికి ఆర్థిక సంక్షేమం ఏర్పడింది. అంటే పేద, బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. మన దేశంలో 1971 - 1990 కాలంలో అనేక పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ - పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇవి దారిద్య్రరేఖ కింద జీవించేవారి ప్రాథమిక అవసరాలను కొంతమేర తీర్చాయి. కానీ ఆశించిన ఫలితాలు కనిపించలేదు. ఈ పథకాలు ప్రజాస్వామ్య దేశాల్లో క్రమంగా ఓట్ల కోసం పేదలను ఆకర్షించే నినాదాలుగా మారాయి. వీటిలో జరిగే అవినీతి వల్ల ఖజానాపై భారం పెరిగింది.

ఆర్థిక సంక్షేమం = ఆర్థికాభివృద్ధి + ప్రత్యక్ష సంక్షేమ పథకాలు


మానవాభివృద్ధి 


  1991 నుంచి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ చాలా దేశాల్లో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాస్త్రవేత్తలు పునరాలోచనలో పడ్డారు. మానవుడి కేంద్రీకృతమైన అభివృద్ధి జరగాలని భావించారు. ముఖ్యంగా పేదలు స్వయంగా ఎదిగే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. సంక్షేమ పథకాల పేరుతో వారిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుగా మాత్రమే కాకుండా వారికి స్వేచ్ఛను ఇచ్చి సామర్థ్యాల మేరకు అభివృద్ధిలో చురుకైన భాగస్వాములను చేయాలి. ఇది వారి ఆర్థిక, సామాజిక సాధికారతకు దోహదపడుతుంది. ఇదే నిజమైన మానవాభివృద్ధి. ఆదాయంతోపాటు ప్రజలకు విద్య, ఆరోగ్యాన్ని అందించాలి. ప్రపంచ దేశాలు శ్రామికులను మానవ వనరులుగా గుర్తించి పలు చర్యలు చేపట్టాయి.

మానవాభివృద్ధి = ఆర్థికాభివృద్ధి  +  విద్య + ఆరోగ్యం


  మానవాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో అభివృద్ధికి ప్రధాన అంశమైన పర్యావరణం గురించి చర్చించలేదు. ప్రకృతి మనిషి కంటే ప్రాచీనమైంది. సృష్టిలోని జీవ, నిర్జీవ పదార్థాలను ఉపయోగించుకుని మానవ నాగరికత రూపుదాల్చింది. ప్రస్తుతం మనుషుల సంఖ్య పెరిగింది. దాంతోపాటు పర్యావరణంలో అనేక మార్పులు వచ్చాయి. అభివృద్ధి పేరుతో సహజ వనరులను అతిగా ఉపయోగించడం వల్ల నేటి తరానికి సహజ సంపద తగ్గిపోయింది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత వనరుల దుర్వినియోగం వేగంగా జరిగి కాలుష్యం అధికమైంది. ఇది రేపటి తరాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని ప్రపంచ మేధావులు, పర్యావణ వేత్తలు భావించారు. 1970 దశాబ్దంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని సమావేశాల్లో ఈ ఆలోచన ప్రారంభమైంది. 1980లో మొదటిసారిగా ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ యూనియన్‌ సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని ప్రయోగించింది. 1987లో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ కమిషన్‌ విడుదల చేసిన ‘అవర్‌ కామన్‌ ఫ్యూచర్‌’లో ఈ పదానికి శాస్త్రీయ నిర్వచనం ఇచ్చింది. దీన్నే సాధారణంగా బ్రంట్‌లాండ్‌ రిపోర్ట్‌ అని పిలుస్తారు. ‘భవిష్యత్తు తరాల అవసరాలు తీర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీయకుండా ప్రస్తుత తరాలు తమ అవసరాలను తీర్చుకునే అభివృద్ధే సుస్థిరాభివృద్ధి’.


*  ప్రజలందరి అవసరాలు ముఖ్యంగా పేదలకు ప్రాధాన్యత. 


*  పర్యావరణంపై సాంకేతికత విధించే పరిమితులు


*  ప్రస్తుత, భవిష్యత్తు తరాల మధ్య సమన్యాయం 


*  అభివృద్ధిని ముందు తరాలకు కొనసాగించడం. అందుకే దీన్ని కొనసాగించగల అభివృద్ధి అని కూడా అంటారు.


  ఈ నివేదిక తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధిపై చర్చలు, అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. 1992లో బ్రెజిల్‌లోని రియో-డి-జెనీరోలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ధరిత్రీ సదస్సులో అజెండా - 21 పేరుతో 21వ శతాబ్దంలో సుస్థిరాభివృద్ధి సాధనకు సాధ్యాసాధ్యాలు, పరిమితులను చర్చించారు. తర్వాత 20 ఏళ్లకు రియో నగరంలోనే రియో + 20 పేరుతో 2012లో సుస్థిరాబివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సు జరిగింది. ఈ సదస్సులో గత అనుభవాలను సమీక్షించారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు - ప్రభావంపై అవగాహన ఏర్పడింది. దీని ఆధారంగానే పారిస్‌ ఒప్పందం (2016) అమల్లోకి వచ్చింది.


భారత్‌ పనితీరు 


  ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి సూచిక - 2019 ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో డెన్మార్క్‌ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అమెరికా 35, చైనా 39, భారత్‌ 115వ స్థానంలో ఉన్నాయి. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక - బేస్‌ లైన్‌ రిపోర్ట్, 2018 తొలి నివేదిక ప్రకారం 100 పాయింట్లకు మన దేశం 58 పాయింట్లు సాధించింది. ఈ లక్ష్యాల సాధనలో హిమాచల్‌ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.


లక్ష్యాలు


ఐక్యరాజ్య సమితి 2015 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన పర్యావరణ సదస్సులో 2015 - 30 మధ్యకాలంలో అన్ని దేశాలు సాధించాల్సిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఆమోదించింది. 

    1) పేదరిక నిర్మూలన  
    2) ఆకలి చావులను పూర్తిగా తగ్గించడం 
    3) మంచి ఆరోగ్యం  
    4) నాణ్యమైన విద్య  
    5) లింగ సమానత్వం 
    6) పరిశుభ్రమైన నీరు, పరిసరాలు 
    7) పునరుజ్జీవన ఇంధన వాడకం 
    8) ఉపాధి, ఆర్థికవృద్ధి  
    9) పరిశ్రమలు, నూతన ఆవిష్కరణలు, అవస్థాపనా సౌకర్యాల కల్పన
    10) అసమానతల తగ్గింపు  
    11) సుస్థిర నగరాలు, సమాజాలు
    12) బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి 
    13) వాతావరణ మార్పులపై చర్యలు 
    14) నీటిలోని ప్రాణుల సంరక్షణ 
    15) నేలపై జీవుల రక్షణ 
    16) శాంతి, న్యాయం 
    17) ఉమ్మడి లక్ష్యాల కోసం భాగస్వామ్యం. 

    సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థూలంగా 17గా విభజించినప్పటికీ అవి ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి సామాజిక, ఆర్థిక, పర్యావరణపరంగా సుస్థిరంగా ఉండాలి. మొదటిసారి ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో వాతావరణ కార్యాచరణ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు పలువురు నేతలు, పర్యావణ శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఇప్పటివరకు సుస్థిరాభివృద్ధి కోసం చేపట్టిన చర్యలను సమీక్షించారు. సుస్థిరాభివృద్ధి అంటే అసలైన అర్థం నాలుగు కాలాల పాటు కాదు నాలుగు తరాల పాటు అందరినీ సంతోషపెట్టేది. 

P - People;  P - Planet;  P - Prosperity;  P - Partnership;  P - Peace  అనే 5 P'sను సాధించడానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉపయోగపడతాయి. 2000-2015 మధ్య ఎనిమిది సహస్రాబ్ది లక్ష్యాలు ఉన్నాయి.
ఒక చేపను ఒకరికి ఇస్తే ఒక రోజు మాత్రమే ఆకలి తీరుతుంది. అదే అతడికి చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం ఆకలి తీర్చుకుంటాడు. -  ప్రముఖ తత్వవేత్త - కన్ఫ్యూసియస్‌


సుస్థిరాభివృద్ధి - ప్రపంచ దేశాల కృషి


* ‘మానవ పర్యావరణం’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) 1972 జూన్‌ 5న స్టాక్‌ హోంలో ఓ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం పెరిగింది. 


* 1980లో ప్రపంచ సంరక్షణ వ్యూహం అనే పరిశోధనా పత్రంలో మొదటిసారి ‘కొనసాగించాల్సిన అభివృద్ధి’ అనే పదాన్ని వాడారు.


* 1987లో సుస్థిరాభివృద్ధి సాధన కోసం ఐక్యరాజ్యసమితి అప్పటి నార్వే ప్రధాని హార్లెం బ్రంట్‌లాండ్‌ నేతృత్వంలో World Commission on Environment and Development ను ఏర్పాటు చేసింది.


* సుస్థిరతపై అంతర్జాతీయంగా సహకారాన్ని పెంపొందించడానికి 1992లో ప్రపంచ దేశాధినేతలు బ్రెజిల్‌లోని రియోలో సమావేశమయ్యారు. దీన్నే UN Conference on Environment and Development, ధరిత్రీ సదస్సు, రియో సమ్మిట్‌గా పిలుస్తారు.


* రియో సదస్సు జరిగి 2012కి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రపంచ దేశాధినేతలు రియోలో సమావేశమై సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి చర్చించారు. ఇందులో చర్చకు వచ్చిన అంశాలకు 2015లో ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటినే అజెండా 2030 అని పిలుస్తారు. ఇందులో మొత్తం 17 లక్ష్యాలు, 169 ఉపలక్ష్యాలు ఉన్నాయి. 2016 జనవరి నుంచి ప్రారంభించి 2030 డిసెంబరు నాటికి వీటిని సాధించాలని తీర్మానించారు.


లక్ష్యాలు  


1. పేదరికాన్ని నిర్మూలించడం: 2030 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గించాలి. దీనికోసం సాంఘిక భద్రతా పథకాలు అమలుచేయాలి. ఆర్థిక వనరులపై అందరికీ సమాన హక్కులు ఉండేలా చూడాలి.


2. ఆకలిని నిర్మూలించడం: సురక్షితమైన పౌష్ఠికాహారాన్ని అందరికీ తగినంతగా అందుబాటులో ఉంచి, 2030 నాటికి ఆకలిని నిర్మూలించాలి.
* అయిదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగిన ఎత్తు (Stunting), ఎత్తుకు తగిన బరువు (Wasting) లేకపోవడం లాంటి అంశాల్లో అంతర్జాతీయ అంగీకార లక్ష్యాలను చేరుకోవాలి. 2025 నాటికి ఎత్తు తక్కువతో బాధ పడుతున్న పిల్లల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని, శారీరక బరువు సరిగాలేని వారి సంఖ్యను 5 శాతంలోపునకు తీసుకురావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
* 2030 నాటికి వ్యవసాయ ఉత్పాదకతను, చిన్న-కౌలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి.
* 2001 నవంబరులో ఖతార్‌లోని దోహాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ్బజూగివ్శీ ఓ సమావేశాన్ని నిర్వహించింది. దీన్నే దోహా రౌండ్‌గా పేర్కొంటారు. ఇందులో వ్యవసాయ ఎగుమతుల సబ్సిడీలను తొలగించాలని; ప్రపంచ వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న వాణిజ్యపరమైన షరతులు, ఆటంకాలను ఎత్తివేయాలని తీర్మానించారు.


3. అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలి
* 2030 నాటికి  ప్రతి లక్ష జననాలకు మాతృత్వ మరణాల రేటును 70కి తగ్గించాలి.
* 2030 నాటికి  ప్రతి 1000 సజీవ జననాలకు Neonatal Mortality Rate (0 - 28 రోజులు)ను 12కి తగ్గించాలి.
* అయిదేళ్లలోపు వయసున్న పిల్లల మరణ రేటును ్బగీ5లీళ్శి ప్రతీ 1000 సజీవ జననాలకు 25కి తగ్గించాలి.
* 2030 కల్లా ఎయిడ్స్, టీబీ, మలేరియా లాంటి వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలి. 
* 2030 నాటికి అంటువ్యాధులు కాని రోగాలను 1/3వ వంతు తగ్గించాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ జబ్బుల్లో గుండె సంబంధ వ్యాధులు ప్రథమస్థానంలో ఉండగా, క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉంది.
* ఆల్కహాల్, డ్రగ్స్‌ వినియోగం, రోడ్డు ప్రమాదాలు, పర్యావరణ కాలుష్యం, పొగాకు మొదలైన వాటి వల్ల సంభవించే మరణాలను 2030 నాటికి   పెద్ద మొత్తంలో తగ్గించాలి.
* ప్రజారోగ్యానికి సంబంధించి దోహా డిక్లరేషన్‌లోని TRIPS (Trade Related Aspects Of Intellectual Property Agreements)  ఒప్పందం ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరలకే నాణ్యమైన-సురక్షితమైన మందులు, టీకాలను అందించాలి.


4. నాణ్యమైన విద్య
* 2030 నాటికి బాలబాలికలందరికీ నాణ్యమైన పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, సెకండరీ విద్యను ఉచితంగా అందించాలి. ప్రమాణాలతో కూడిన సాంకేతిక, వృత్తి, టెరిటరీ విద్యలను అందుబాటు ధరల్లో ఉంచాలి. టెరిటరీ విద్య సెకండరీ విద్య పూర్తయ్యాక 3వ స్థాయిలో ఉంటుంది. ఇది సాధారణంగా కళాశాల విద్య.
* లింగ సంబంధ వ్యత్యాసాలను అన్ని స్థాయుల్లో నిర్మూలించాలి. 2030 నాటికి అర్హత కలిగిన ఉపాధ్యాయుల సంఖ్యను గణనీయంగా పెంచాలి.


5. లింగసమానత్వం, మహిళా సాధికారిత సాధించడం:
మహిళల పట్ల ఉన్న అన్ని రకాల వివక్షను రూపుమాపాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో వీరిపై జరిగే హింసను అరికట్టాలి. మహిళల అక్రమ రవాణా, లైంగిక దాడులు మొదలైన వాటిని నిర్మూలించాలి. బాల్య వివాహాలు, బలవంతపు పెళ్లిళ్లను నిరోధించాలి.
* ఆర్థిక, రాజకీయ, ప్రజా జీవితంలోని అన్ని స్థాయుల్లో మహిళా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. నిర్ణయాలు తీసుకునే చోట పురుషులతో సమానంగా వారికీ అవకాశాలు కల్పించాలి.
* ఆర్థిక వనరులు, భూయాజమాన్యం, సహజ వనరులు మొదలైన వాటిపై మహిళలకు సమాన హక్కులు కల్పించేలా సంస్కరణలు తేవాలి.


6. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం: 2030 నాటికి ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందుబాటు ధరకే పంపిణీచేయాలి. బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాలి.


7. అందుబాటు ధరల్లో శుద్ధ ఇంధనాలు అందించడం: 2030 నాటికి నమ్మకమైన శక్తి సేవలను అందరికీ అందుబాటు ధరల్లో అందించాలి. ప్రపంచ శక్తి వనరుల్లో పునర్వినియోగ శక్తి వనరుల వాటాను గణనీయంగా పెంచాలి.


8. ఆర్థికవృద్ధి, నాణ్యమైన ఉపాధిని సాధించడం: అల్పాభివృద్ధి దేశాల్లో కనీసం 7% జీడీపీ వృద్ధిని సుస్థిరంగా సాధించాలి.
* 2030 నాటికి ఉపాధి, విద్య లేదా శిక్షణలో లేని యువత వాటాను గణనీయంగా తగ్గించాలి. 
* 2025 నాటికి నిర్బంధ శ్రామికత్వం, బాలకార్మిక వ్యవస్థ, బానిసత్వం, మానవ అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించాలి.
* 2030 నాటికి అందరికీ ఉత్పాదక ఉపాధిని అందించాలి. సమాన విలువ ఉన్న పనికి సమాన వేతనాన్ని అందించాలి.
* కార్మికుల హక్కులను రక్షించాలి. పనివాళ్లకు ముఖ్యంగా వలస కార్మికులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలి.
* యువత ఉపాధి కోసం 2020 నాటికి  ప్రపంచ వ్యూహాన్ని అభివృద్ధిచేసి అమల్లోకి తేవాలి.


9. పరిశ్రమలు, మౌలిక వసతులు, ఆవిష్కరణలు: మానవ సంక్షేమం, ఆర్థికాభివృద్ధి పెంపొందించేందుకు నాణ్యమైన, నమ్మకమైన, సుస్థిర మౌలికవసతులను అభివృద్ధి చేయాలి.
* 2030 నాటికి  ఆదాయం, ఉపాధిలో పరిశ్రమల వాటాను గణనీయంగా పెంచాలి. దీనికోసం సుస్థిర, సమ్మిళిత పారిశ్రామికీకరణను ప్రోత్సహించాలి. అల్పాభివృద్ధి దేశాల్లో పరిశ్రమల వాటాను రెట్టింపు చేయాలి.
* అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలి.
* శాస్త్రీయ పరిశోధనలు ప్రోత్సహించాలి. 2030 నాటికి ప్రతి మిలియన్‌ జనాభాలో పరిశోధన రంగంలో పనిచేస్తున్నవారి సంఖ్యను గణనీయంగా పెంచాలి.


10. దేశం లోపల, వివిధ దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను తగ్గించాలి: 2030 నాటికి జనాభాలో అట్టడుగున ఉన్న 40% మంది ప్రజల ఆదాయ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ ఉండేలా చర్యలు చేపట్టాలి.
* వయసు, లింగ, అంగవైకల్యం, జాతి, పుట్టుక, మతం మొదలైనవాటితో సంబంధం లేకుండా అందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ సాధికారత కల్పించాలి.
* అసమానతలను ప్రోత్సహించే విధానాలు, చట్టాలను పూర్తిగా తొలగించాలి.
* అంతర్జాతీయ విత్త, ఆర్థిక వ్యవస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచాలి.
* అల్పాభివృద్ధి దేశాలకు అభివృద్ధి సాయం, విత్త వనరుల ప్రవాహాన్ని ప్రోత్సహించాలి. ఇందులో భాగంగానే ఎఫ్‌డీఐలను రాబట్టాలి.


11. నగరాలను నివాసయోగ్యంగా, సురక్షితంగా, సమ్మిళితంగా తయారుచేయడం: 2030 నాటికి అందరికీ సురక్షితమైన ఇళ్లను తక్కువ ధరలకు అందించాలి.
* ప్రజారవాణాను పెంచాలి.
* విపత్తుల వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించాలి.
* 2015, మార్చి 8న జపాన్‌లోని సెంధాయ్‌లో ఐక్యరాజ్యసమితి మూడో డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ సమావేశం జరిగింది. దీనికి ‘సెంథాయ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ 2015-30’ అని పేరుపెట్టారు. ఇందులో కొన్ని నిబంధనలను పేర్కొన్నారు. వీటిప్రకారం విపత్తులను తట్టుకునేలా సమగ్ర విధానాలను అమలుచేసే నగరాల సంఖ్యను పెంచాని తీర్మానించారు.
* పట్టణాల్లో వాయుకాలుష్యం, ఘనవ్యర్థాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.


12. సుస్థిర వినియోగం, ఉత్పత్తి విధానాల రూపకల్పన: ఉత్పత్తి, సరఫరా స్థాయిలో ఆహార వృథాను అరికట్టాలి. వినియోగదారు స్థాయిలో తలసరి ఆహార వృథాను సగానికి తగ్గించాలి.
* 2030 నాటికి  నివారణ, RRR (Reduce, Reuse and Recycle) ద్వారా వ్యర్థాల సృష్టిని తగ్గించాలి.
* అభివృద్ధి చెందుతున్న దేశాలకు వినియోగం, ఉత్పత్తిలో సుస్థిర పద్ధతులను అవలంబించేందుకు తగిన సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా మద్దతు ఇవ్వాలి.
* వృథా వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న ఇంధన సబ్సిడీలను హేతుబద్ధీకరించాలి.


13. పర్యావరణ మార్పు, దాని ప్రభావంపై సత్వర చర్యలు: సహజ విపత్తులు, శీతోష్ణస్థితి సంబంధ విపత్తులను తట్టుకోగలిగే సామర్థ్యాన్ని అందరిలో బలోపేతం చేయాలి.
* దేశ ప్రణాళిక, విధానాలు, వ్యూహాల్లో శీతోష్ణస్థితి మార్పులను సమీకృతం చేయాలి.
* వీటికి సంబంధించిన (ముందస్తు హెచ్చరిక, మార్పులు తగ్గించగలగడం, వాటిని తట్టుకోగలగడం) విద్య, చైతన్య కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి.
* శీతోష్ణస్థితి మార్పుల ప్రభావాలను తట్టుకునేలా UNFCCC (United Nations Framework Convention on Climate Change) కింద అభివృద్ధి చెందిన దేశాలు సంవత్సరానికి 100 బిలియన్‌ డాలర్లను అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చేందుకు అంగీకరించాయి. వీటిని సాధ్యమైనంత త్వరగా అమలుచేయాలి.


14. సముద్రాలు, జలవనరుల సంరక్షణ: అన్నిరకాల సముద్ర కాలుష్యాలను తగ్గించాలి. ముఖ్యంగా భూసంబంధ కార్యకలాపాల ద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించాలి.
* సముద్రాల ఆమ్లీకరణను తగ్గించాలి. దాని ప్రభావాలను దీటుగా ఎదుర్కోవాలి.
* అధికంగా చేపలు పట్టడానికి కారణమైన మత్స్యరంగ సబ్సిడీలను పూర్తిగా నిషేధించాలి.


15. అడవులు, ఇతర ఆవరణ వ్యవస్థలను పరిరక్షించడం, భూక్షీణతను, జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడం
అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం అడవులు, పర్వతాలు, చిత్తడి నేలలను సంరక్షించాలి.
* అన్నిరకాల అడవుల్లో సుస్థిర యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. అడవులు నరకడాన్ని అరికట్టాలి. క్షీణతకు గురైన అడవులను పునరుద్ధరించాలి. అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలి.
* కరవులు, వరదల వల్ల క్షీణతకు గురయ్యే మృత్తికను పునరుద్ధరించాలి.
* పర్వత ఆవరణ వ్యవస్థను సంరక్షిస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడాలి. వీటి ఉత్పత్తులు సుస్థిరాభివృద్ధికి దోహదపడతాయి. రక్షిత జీవజాతుల అక్రమరవాణా, వేటను అడ్డుకోవాలి.


16. అందరికీ శాంతి, న్యాయాన్ని అందించాలి, దీనికోసం బలమైన వ్యవస్థలను ఏర్పాటుచేయాలి
అన్నిరకాల హింసలను, వాటివల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించాలి.
* జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరికీ సమాన న్యాయాన్ని అందించాలి.
* అవినీతి, లంచగొండితనాన్ని అరికట్టాలి.
* గ్లోబల్‌ గవర్నెన్స్‌కు సంబంధించిన సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలి.
* 2030 నాటికి అందరికీ చట్టబద్ధమైన గుర్తింపు లభించాలి. 
* తీవ్రవాదం, నేరాలు, హింసలు మొదలైనవాటిని అడ్డుకునే జాతీయస్థాయి సంస్థలను బలోపేతం చేయాలి.


17. సార్వత్రిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం: దేశీయ వనరుల సేకరణను బలోపేతం చేయాలి. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు పర్యావరణ అనుకూల సాంకేతికతను తక్కువ ధరలకే అందించాలి.

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణ చట్టం - భారతదేశం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది? (ఏఈ, 2015)
జ: 1972

 

2. భారతదేశంలోని పర్యావరణ పరిరక్షణ చట్టాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. (ఏఎస్‌వో, 2018)
a) జాతీయ వన్యప్రాణి చట్టం             b) జీవ వైవిధ్య చట్టం 
c) వాయుకాలుష్య నియంత్రణ చట్టం  d) నీటి కాలుష్య నియంత్రణ చట్టం
జ: a, d, c, b

 

3. కిందివాటిలో జీవవైవిధ్య సంరక్షణ కేంద్రాలతో భౌగోళిక సరిహద్దు లేనివి? (గ్రూప్‌ 4, 2018)
         1) జాతీయ పార్కులు                  2) జీవగోళ సంరక్షణ ప్రాంతాలు
         3) అభయారణ్యాలు                     4) జల సంరక్షణ ప్రాంతాలు
జ: 3 (అభయారణ్యాలు)

 

4. భారతదేశంలో 2016 వాతావరణ మార్పు జాతీయ కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఎన్ని జాతీయ మిషన్లు ప్రారంభించారు? (గ్రూప్‌ 1, 2017)
జ: 8

5. కిందివాటిని జతపరచండి. (ఎస్సై, 2016)
             చట్టాలు                        ఆమోదించిన సంవత్సరం 
i) నీటి కాలుష్య నియంత్రణ చట్టం          a) 1974
ii) వాయుకాలుష్య నియంత్రణ చట్టం     b) 1981
iii) పర్యావరణ పరిరక్షణ చట్టం            c) 1986
iv) జీవవైవిధ్య చట్టం                        d) 2002 
                                                  e) 1985
     i     ii    iii     iv  
జ: a    b     c     d

 

6. భారతదేశ జీవవైవిధ్య సంరక్షణ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (ఏఈఈ, 2016)
జ: చెన్నై

 

7. జాతీయ పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు? (గ్రూప్స్, 2017)
జ: 1986

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ క్షీణత విలువ లెక్కించడం 

పర్యావరణ క్షీణత


  వ్యర్థాలను, కాలుష్యాలను ఇముడ్చుకునే క్రమంలో పర్యావరణం తన సహజ లక్షణాలను కోల్పోవడం, మానవాళికి అందిస్తున్న పర్యావరణ లేదా సహజ వనరుల పరిమాణం, వాటి నాణ్యత తగ్గడాన్ని 'పర్యావరణ క్షీణత' (Environmental Degradation) గా భావించవచ్చు. 


  ప్రకృతి ప్రసాదించిన పర్యావరణ వనరులతోనే మానవ జీవనం సుఖంగా సాగుతోంది. పర్యావరణ వనరులను ఉపయోగించి మానవుడు తనకు కావాల్సిన వివిధ వస్తువులను ఉత్పత్తి చేసుకుంటున్నాడు. అయితే మానవుడు ఈ వనరులను తన అవసరాలకు మించి విచక్షణారహితంగా ఉపయోగిస్తున్నాడు. పర్యావరణంలోని వనరులను ఉపయోగించి చేస్తున్న 'ఉత్పత్తి-వినియోగం' అనే ప్రక్రియలో ఎన్నో వ్యర్థాలు, కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. వాటన్నింటినీ మళ్లీ పర్యావరణంలోనే పడేస్తుండటంతో పర్యావరణం తొట్టి(Bin)లా తనలో ఇముడ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఐక్యరాజ్య సమితి 'విపత్తు తగ్గుదలకు అంతర్జాతీయ వ్యూహం' (UN International Strategy for Disaster Reduction) ప్రకారం సామాజిక, సహజవనరుల తగ్గుదలను భరించగల భూమి పరిమితి (limit of the earth) తగ్గడాన్ని పర్యావరణ క్షీణతగా పేర్కొనవచ్చు.


* వాతావరణం, జలావరణం, ఆశ్మావరణంలోని నాణ్యత, వనరుల పరిమాణం తగ్గడం, జీవావరణంలో విభిన్న మార్పులు రావడం, జీవరాశుల పరిమాణంలో హెచ్చుతగ్గులు, జీవరాశుల జీవనశైలిలో మార్పులు, కొన్ని జీవరాశులు అంతరించి జీవవైవిధ్యంలో తేడాలు రావడం మొదలైనవన్నీ పర్యావరణ క్షీణతను సూచించేవే.


* మానవుని స్వార్థపూరిత ఆర్థిక జీవనం వల్లే పర్యావరణ క్షీణత అనే సమస్య తలెత్తుతోంది. పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలంటే పర్యావరణం ఏమేరకు క్షీణించిందో అంచనా వేయాల్సి వస్తోంది.


పర్యావరణ క్షీణత విలువ లెక్కింపు


ముందు చూపులేకుండా మానవుడు పర్యావరణ వనరులను విచ్చలవిడిగా వినియోగిస్తున్నాడు. దీనివల్ల ఏర్పడే పర్యావరణ క్షీణత విలువను లెక్కించడం ద్వారా కింది అంశాలను నెరవేర్చవచ్చు.


* నాణ్యత కోల్పోయిన వివిధ పర్యావరణ వనరుల గుర్తింపు.


* కాలుష్య ప్రభావానికి గురైన వనరుల మధ్య భౌతిక సంబంధం లెక్కింపు.


* పర్యావరణ క్షీణత వల్ల వ్యక్తులు, సంస్థలకు వాటిల్లే నష్టంలో కొంతభాగాన్నైనా తగ్గించడానికి మార్గాల సూచన.


* పర్యావరణ వనరులకు జరిగిన భౌతిక నష్టానికి ద్రవ్య విలువ/ ఆర్థిక విలువ అంచనా.


పర్యావరణ వనరుల ఆర్థిక విలువ: పర్యావరణ వనరుల ఆర్థిక విలువను అంచనా వేయడం ద్వారా క్షీణత స్థాయిని తెలుసుకోవచ్చు. ఆయా సందర్భాలను బట్టి వనరుల విలువను నిల్వ (Stock) లేదా ప్రవాహ (Flow) భావనలుగా చెప్పవచ్చు. ఉదాహరణకు భూగర్భంలో ఉన్న బొగ్గు 'నిల్వ' భావన కాగా, గనుల నుంచి తవ్వి తీసిన బొగ్గును వివిధ అవసరాలకు తరలించడం 'ప్రవాహ భావన'.


విలువ-రకాలు: ఆర్థికవేత్తలు పర్యావరణ వనరుల వల్ల ఏర్పడే ఆర్థిక విలువను 3 రకాలుగా వర్గీకరించారు.
     1. వినియోగ విలువ (Value in use)
     2. ఐచ్ఛిక విలువ (Option value)
     3. వినియోగం లేని విలువ ((non-use value)


* వినియోగ విలువ వనరుల ప్రత్యక్ష వినియోగం నుంచి తెలుస్తుంది. ఉదా: జలాశయాల నుంచి చేపలు, అడవుల నుంచి కలప, నదుల్లోని నీటి పరిమాణం మొదలైనవి. పర్యావరణ కాలుష్యానికి ముందు, తర్వాత వాటి లభ్యతలో, వినియోగంలో తగ్గుదల ద్వారా వాస్తవ వినియోగ విలువ లేదా ఆర్థిక విలువ తగ్గడాన్ని అంచనా వేయొచ్చు. ఐచ్ఛిక విలువను పర్యావరణ వనరులను ప్రస్తుతం వాడకుండా, వాటి నిల్వ, నాణ్యతలను తగ్గకుండా చూస్తూ భవిష్యత్ ఉపయోగానికి వదిలివేయడంగా చెప్పవచ్చు.


* వినియోగం లేని విలువ అంటే వనరులను లభ్యమైన స్థితిలో ఉంచడానికి, వాటిని అసలే వినియోగించకపోవడం. ఈ మూడు విలువలను కూడితే వనరుల వినియోగానికి చెల్లించడానికి ఇష్టపడుతున్న మొత్తం విలువ (Total willingness to pay) తెలుస్తుంది. మొత్తం ఆర్థిక విలువను పటం A(పేజీ నెం.6లో) ద్వారా వివరించవచ్చు.


పర్యావరణ వనరుల ఆర్థిక విలువను లెక్కించే పద్ధతులు: పర్యావరణ వనరుల ఆర్థిక విలువను లెక్కించడానికి ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులు ఉన్నాయి.


ప్రత్యక్ష పద్ధతులు (Direct methods of valuation) 


పర్యావరణ వనరుల విలువను కింది పద్ధతుల ద్వారా ప్రత్యక్షంగా లెక్కిస్తారు.


ఎ. ప్రత్యక్ష విలువలు పరిశీలించడం (Observing direct values): పర్యావరణ వనరుల విలువలు పరిశీలించి వాటి విలువలను వీలైన పద్ధతిలో లెక్కిస్తారు. ఉదా: నీటి కాలుష్యం వల్ల తగ్గిన చేపల ఉత్పత్తి పరిమాణాన్ని తద్వారా దాని ఆర్థిక విలువను అంచనా వేయడం.


బి. అనిశ్చిత విలువలు లెక్కించే పద్ధతి (Contingent valuation method Hypothetical case): ప్రత్యక్షంగా క్షీణిస్తున్న వనరుల విలువలను పరిశీలన ద్వారా అంచనా వేయడం వీలు కానప్పుడు అనిశ్చిత విలువలు గణించే పద్ధతిని ఉపయోగిస్తారు. ఉదాహరణకు అంతరిస్తున్న జీవులను, వాటి సహజ ఆవాసాలను కాపాడాలా? వద్దా? అని పరిసర ప్రజలనే అడగటం ద్వారా వారిచ్చే సమాధానాన్నిబట్టి, వాటి పరిరక్షణకు అవసరమైన వ్యయాన్ని భరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా అనే అంశాన్ని బట్టి వనరుల విలువను అంచనా వేయొచ్చు. అయితే ఈ పద్ధతి పూర్తిగా కచ్చితమైన సమాచారాన్నిచ్చేదిగా చెప్పలేం. ప్రజల ఆలోచనలు, వైఖరులను బట్టి వచ్చే సమాధానాల వల్ల వనరుల విలువ లెక్కించడం కష్టం.


పరోక్ష పద్ధతులు (Indirect methods of valuation) 


పర్యావరణ వనరుల నాణ్యతలో వచ్చే మార్పులను పరిశీలించడం ద్వారా వాటి విలువను పరోక్షంగా అంచనా వేయొచ్చు.


ఎ. పర్యాటక వ్యయాల పద్ధతి (Travel cost method): వివిధ పర్యాటక కేంద్రాలు, ఉద్యానవనాలు, వన్యమృగ సంరక్షణా కేంద్రాలను సందర్శించే పర్యాటకులు ఆయా ప్రాంతాలకిచ్చే ప్రాధాన్యతను, వారు చెల్లించదలచుకున్న ధర (పర్యాటన వ్యయం) ఆధారంగా గుర్తించవచ్చు. పర్యటకుల ప్రాధాన్యాలను గుర్తించడానికి ఫ్రీమాన్ (1993) రెండు ఆధారిత కారకాలను వివరించాడు.
1. పర్యాటకుల సందర్శనల సంఖ్య, సందర్శన కోసం ఎంత మొత్తం వ్యయం చేశారనే అంశాల ఆధారంగా 'పర్యటక ప్రాంత డిమాండ్ రేఖ' ఏర్పడుతుంది.
2. పర్యాటకులు సందర్శనకు ఎంచుకున్న ప్రాంతం, ఆ ప్రాంతంలో లభించే సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాల ద్వారా విలువలను అంచనా వేయొచ్చు.


బి. వ్యయం - ప్రయోజన పద్ధతి (Cost Benefit Analysis): ఈ పద్ధతిని 1993 లో హిక్స్, కాల్డార్ (Hicks - Kaldor) అనే ఆర్థికవేత్తలు ప్రతిపాదించారు. వీరి అభిప్రాయం ప్రకారం పర్యావరణ నాణ్యత గరిష్ఠంగా ఉండేలా అభిలషణీయ కాలుష్య పరిమాణాన్ని నిర్ణయించవచ్చు.


* పర్యావరణ నాణ్యత అభిలషణీయస్థాయిలో కొనసాగాలంటే వనరుల వినియోగం ద్వారా వచ్చే మొత్తం ప్రయోజనం (Total benefit), వనరుల వినియోగం కోసం అయ్యే మొత్తం వ్యయం (Total cost) కంటే ఎక్కువగా ఉండాలి (TB > TC). అంతేకాకుండా వనరుల ఉపాంత ప్రయోజనం (Marginal benefit), ఉపాంత వ్యయం (Marginal cost) కు సమానంగా ఉండాలి (MB = MC). అప్పుడే వనరుల సమర్థ వినియోగం గరిష్ఠంగా సాధ్యపడుతుంది.


* పర్యావరణ కాలుష్యం శూన్యంగా ఉండాలంటే ఉత్పత్తి, జనాభా వృద్ధిరేటు శూన్యంగా ఉండాలి. ఈ రెండూ సాధ్యం కానివే. ఏ రకమైన సాంకేతిక పద్ధతిని ఉపయోగించినా కాలుష్యం తప్పదు. జనాభా వృద్ధిరేటు శూన్యమైతే ఆర్థిక వ్యవస్థకు (వృద్ధుల జనాభా పెరిగి, పనిచేసే వయసువారి సంఖ్య తగ్గి) నష్టదాయకం అవుతుంది. అందువల్ల ఏ ఆర్థిక వ్యవస్థ అయినా అభిలషణీయ ఆర్థిక వృద్ధిరేటు, పర్యావరణ వనరుల పరిరక్షణలను సంతులనం చేస్తూ తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రజాచైతన్యం పెంపొందించడం, కాలుష్య పన్ను, జరిమానాలు, ప్రత్యక్ష నియంత్రణలతో పాటు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్న వారికి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం లాంటి చర్యలు చేపట్టవచ్చు.

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అంతర్జాతీయ పర్యావరణ రక్షణ చట్టాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం దేనికి సంబంధించింది? (ఏఈ, 2015)
జ: వాతావరణ మార్పు

 

2. క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? (ఏఈఈ, 2016)
జ: 2005, ఫిబ్రవరి 16

 

3. 2022 నాటికి భారతదేశం ఎన్ని గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది? (గ్రూప్-1, 2017)
జ: 100

 

4. అంతరించిపోతున్న జీవులను లెక్కించడానికి ఉపయోగించే పుస్తకం (ఎస్‌ఐ, 2016)
జ: రెడ్‌లిస్ట్‌

 

5. అంతర్జాతీయ మొదటి పృథ్వి సదస్సును ఎప్పుడు నిర్వహించారు? (ఎస్‌ఏ, 2018)
జ: 1992

6. కిందివాటిని జతపరచండి.
జాబితా - I                                జాబితా -II
i) పర్యావరణ దినోత్సవం          A) సెప్టెంబర్‌ 16

ii) జీవవైవిధ్య దినోత్సవం         B) ఏప్రిల్‌ 22

iii) ధరిత్రి దినోత్సవం              C) మే 22

iv) ఓజోన్‌ దినోత్సవం            D) జూన్‌ 5

      i     ii     iii   iv
జ: D   C     B     A

7. కిందివాటిని జతపరచండి.

   సదస్సులు                                     సంవత్సరం

i) క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం                A) 1987

ii) మాంట్రియల్‌ ప్రోటోకాల్‌                   B) 1997

iii) అంతర్జాతీయ సౌర కూటమి సదస్సు  C) 2016

iv)  ఓజోన్‌ తరుగుదల సదస్సు             D) 2018
      i        ii       iii       iv
జ: B      A       D        C

8. కార్బన్‌పై ట్యాక్స్‌ విధించిన మొదటి దేశం
జ: న్యూజిలాండ్‌

 

9. UNEP ని విస్తరించండి.
జ: United Nations Environment Programme

 

10. మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సును ఎక్కడ నిర్వహించారు?
జ: స్టాక్‌హోం

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ క్షీణత విలువ లెక్కించడం 

మాదిరి ప్ర‌శ్న‌లు

1. పర్యావరణాన్ని ఏవిధంగా నిర్వచించవచ్చు?
ఎ) ఒక నిర్ణీత ప్రదేశంలో, ఒక నిర్ణీత కాలంలో మానవుల చుట్టూ ఉన్న పరిస్థితుల మొత్తం.
బి) ఒకరి చుట్టూ ఉన్న పరిస్థితులు, వస్తువులు, నియమాలను కలిపి పర్యావరణం అంటారు.
సి) మనుషులతో పాటు అన్ని రకాలైన ప్రాణుల అభివృద్ధిని ప్రభావితం చేస్తూ, మార్పులకు గురిచేసే అన్నిరకాల నియమాలు, ప్రభావాలను కలిపి పర్యావరణం అంటారు.
డి) పైవన్నీ సరైనవే.
జ: డి (పైవన్నీ సరైనవే)

 

2. కిందివాటిని జతపరచండి.
1. భౌతిక అనుఘటకాలు      ఎ) జనాభా, ఆచారాలు, మానవ సంబంధాలు, పట్టణీకరణ

2. జీవ అనుఘటకాలు         బి) సూర్యశక్తి, వాయుశక్తి, భూ ఉష్ణశక్తి, విద్యుదయస్కాంత శక్తి

3. సాంఘిక అనుఘటకాలు   సి) మొక్కలు, వృక్షాలు, జంతువులు

4. శక్తి అనుఘటకాలు          డి) భూమి, నీరు, గాలి, పర్వతాలు, అడవులు

జ: 1-డి, 2-సి, 3-ఎ, 4-బి.

3. మార్కెట్ వ్యవస్థకు బహిర్గత కారకమైన పర్యావరణ క్షీణత ఆర్థిక విలువ లెక్కించడం వల్ల ...
1. నాణ్యత కోల్పోయిన విభిన్న పర్యావరణ వనరులను గుర్తించవచ్చు.
2. కాలుష్యాల రుణాత్మక ప్రభావానికి గురైన వనరుల మధ్య భౌతిక సంబంధాన్ని లెక్కించవచ్చు.
3. పర్యావరణ క్షీణత వల్ల వ్యక్తులు, సంస్థలకు ఏర్పడిన నష్టంలో కొంతభాగం తగ్గించడానికి సూచనలు ఇవ్వొచ్చు.
4. పర్యావరణ వనరులకు జరిగిన భౌతిక నష్టానికి ద్రవ్య విలువ లెక్కించవచ్చు.
జ: 1, 2, 3, 4

 

4. పునరావృతంకాని వనరుల విషయంలో మన ఎంపిక ఏవిధంగా ఉండాలి?
     ఎ) పునఃచక్రీకరణ చేయడం        బి) ఎక్కువగా వృథా చేయకుండా ఉండటం
     సి) పొదుపుగా వాడుకోవడం      డి) అన్నీ
జ: డి (అన్నీ)

 

5. పర్యావరణ వనరుల క్షీణత అంచనాకు వ్యయ-ప్రయోజన పద్ధతిని సూచించింది ఎవరు?
జ: హిక్స్ - కాల్డార్

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ వనరుల పరిరక్షణ

మాదిరి ప్ర‌శ్న‌లు

1. పర్యావరణంలో వచ్చే విభాగాలు ఏవి?
1. వాతావరణం 2. జలావరణం 3. ఆశ్మావరణం 4. జీవావరణం
జ: 1, 2, 3, 4

 

2. కిందివాటిలో జల ఆవరణ వ్యవస్థ (Acquatic Ecosystem) కు సంబంధించిన అంశాలేవి?
1. సరస్సు ఆవరణ వ్యవస్థ
2. తడినేల ఆవరణ వ్యవస్థ
3. డెల్టా భూమి ఆవరణ వ్యవస్థ
4. సముద్రనీటి ఆవరణ వ్వవస్థ
జ: 1, 2, 3, 4

 

3. కిందివాటిలో భౌమ ఆవరణ వ్యవస్థ (Terrestial Ecosystem) కానిది ఏది?
ఎ) ద్వీపాల ఆవరణ వ్యవస్థ
బి) పర్వత ఆవరణ వ్యవస్థ
సి) ఎడారి ఆవరణ వ్యవస్థ
డి) డెల్టా భూమి ఆవరణ వ్యవస్థ
జ:  డి (డెల్టా భూమి ఆవరణ వ్యవస్థ)

4. సహజవనరులకు ఉండాల్సిన లక్షణం?
ఎ) వనరుల నిల్వలు స్థిరంగా ఉండటం
బి) ప్రకృతి వనరుల నిల్వలను నిర్థారించడం
సి) సహజ, శారీరక లేదా జీవ రసాయన రేటుకు లోబడి వనరుల నిల్వలు మార్పుకి లోనవడం
డి) పైమూడింటిలో ఏ ఒక్క లక్షణమైనా
జ:  డి (పైమూడింటిలో ఏ ఒక్క లక్షణమైనా)

 

5. కింది వెన్ చిత్రంలో ఏ భాగాన్ని 'సుస్థిరమైన అభివృద్ధి' భావనగా పేర్కొంటారు?

జ: b

6. కిందివాటిలో పునరుద్ధరించగల వనరులు (Renewable Resource) ఏవి?
1. సూర్యకాంతి    2. ఆహార ఉత్పత్తి      3. భూగర్భ నీటి నిల్వలు     4. అటవీ సంపద
జ:  1, 2, 3, 4

 

7. ఉత్పాదక వస్తువులు, ఉత్పత్తి వస్తువులకు సంబంధించి 'భౌతిక సమతూక నమూనా'ను ప్రతిపాదించింది?
జ: అలెన్ నీస్ - ఆర్.వి. ఆయిర్స్

 

8. గ్రీకుల నమ్మకం ప్రకారం భూవనరులను దుర్వినియోగం చేసేవారిని శిక్షించే న్యాయదేవత?
జ: తిమిస్

 

9. 'Rent under the Assumption of Exhaustibility' పరిశోధన గ్రంథకర్త ఎవరు?
జ: ఎల్.సి. గ్రే (1914)

 జ: మొదటి నిలకడగల వృద్ధి నియమం

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అంతర్జాతీయ పర్యావరణ రక్షణ చట్టాలు

   మానవ మనుగడకు మూలాధారం ప్రకృతి. మనిషి భౌతిక అవసరాలను తీరుస్తూ మానసిక వికాసానికి దోహదం చేస్తోంది. అమెరికా పర్యావరణవేత్త ఎడ్వర్డ్‌ గోల్డ్‌ స్మిత్‌ 'అనేక అవసరాలకు ఆధారమైన ప్రకృతిని ఆధునిక మానవుడు వేగంగా నాశనం చేస్తున్నాడు' అని తెలిపాడు. పర్యావరణ పరిరక్షణకు అమెరికా పార్లమెంటు అనేక చట్టాలు చేయడంతో ‘అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ’ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
          వాతావరణ మార్పుల కారణంగా భూగోళం వేడెక్కుతుందని 1827లో మొదటిసారి ఫోరీర్‌ అనే శాస్త్రవేత్త గుర్తించాడు. బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల నుంచి వచ్చిన CO2, ఇతర వాయువుల వల్ల భూగోళంపై ఉష్ణోగ్రత పెరిగి భూతాపానికి దారితీస్తుందని 1886లో స్వాంటీ ఆర్హీనియన్‌ పేర్కొన్నాడు.


స్టాక్‌హోం సదస్సు - 1972


  ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1972 జూన్‌ 5 - 16 మధ్య స్టాక్‌హోం (స్వీడన్‌)లో మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో 26 సూత్రాలతో పర్యావరణం అభివృద్ధిపై డిక్లరేషన్‌ చేస్తూ కార్యాచరణ ప్రణాళిక కింద 109 సిఫారసులను తీర్మానం చేశారు. పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి 1972 జూన్‌ 5న ఐరాస ఏజెన్సీగా ‘ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ)’ ను ఏర్పాటు చేశారు.

దీని ప్రధాన కార్యాలయం కెన్యా రాజధాని నైరోబిలో ఉంది. దీని మొదటి ఛైర్మన్‌ మారిస్‌ స్ట్రాంగ్‌. ప్రస్తుత ఛైర్మన్‌ జోయిసే మసూయ. ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ఆధ్వర్యంలో 1988లో ‘వాతావరణ మార్పులపై అంతరప్రభుత్వ ప్యానల్‌ (Intergovernmental Panel on Climate Change - IPCC)’  ను ఏర్పాటుచేశారు.1972 నుంచి ఏటా జూన్‌ 5న అంతర్జాతీయ పర్యావరణ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.


ధరిత్రి లేదా పృథ్వి సదస్సు - 1992


1992 జూన్‌ 3 - 14 మధ్య బ్రెజిల్‌ రాజధాని రియోడిజెనీరోలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ, అభివృద్ధి సదస్సు లేదా పృథ్వి సదస్సును నిర్వహించారు.


ఈ సమావేశంలో చర్చించిన అంశాలు: 


ఎ) రియో పర్యావరణ, అభివృద్ధి డిక్లరేషన్‌
బి) వాతావరణ మార్పు (UNFCCC)
సి) అజెండా - 21 (సుస్థిరాభివృద్ది)
డి) అటవీ సంరక్షణ సూత్రాలు
ఇ) జీవవైవిధ్యం
ఎఫ్‌) ఎడారీకరణ

 1992, మే 9న కుదిరిన అంతర్జాతీయ పర్యావరణ సంధి ఫలితంగా అదే ఏడాది జూన్‌లో నిర్వహించిన ధరిత్రి సదస్సు వాతావవరణ మార్పులపై ప్రధానంగా చర్చించింది. ఫలితంగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల చట్టం (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) రూపొందింది. ఇది 1994, మార్చి 21న అమల్లోకి వచ్చింది. ఈ సంధి ప్రకారం వాతావరణ మార్పులపై ఏటా సమీక్ష జరపాలని నిర్ణయించారు. 1995 నుంచి వీటిని క్రమం తప్పకుండా నిర్వహించాలని తీర్మానించారు. వీటినే యూఎన్‌ఎఫ్‌సీసీసీ లేదా COP సదస్సులు అంటారు. 1995 నుంచి 2018 వరకు మొత్తం 24 COP సదస్సులను నిర్వహించారు.


ఇటీవల జరిగిన సదస్సులు


COP - 21: 2015 నవంబరు 30 - డిసెంబరు 12, పారిస్‌ 
COP - 22: 2016 నవంబరు 7 - 18, మర్రకేష్‌
COP - 23: 2017 నవంబరు 6 - 17, బాన్‌
COP - 24: 2018 డిసెంబరు 3 - 14, కాటోవిస్‌ (పోలెండ్‌)
COP - 25: 2019 నవంబరు 11 - 22, చిలీలో జరగనుంది. (వాస్తవానికి ఈ సదస్సు బ్రెజిల్‌లో జరగాలి. కానీ ఆ దేశ అధ్యక్ష ఎన్నికల దృష్ట్యా వేదికను మార్చారు)

* రియోడిజెనీరో ధరిత్రి సదస్సులో మరో అంశంగా జీవవైవిధ్య చట్టాన్ని (Convention on  Biological Diversity) ఆమోదించారు. 1993, డిసెంబరు 29 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. వివిధ జాతులకు చెందిన జీవులు ఒకే సమూహంలో కలిసి జీవించడాన్ని జీవవైవిధ్యం అంటారు. అలాగే వివిధ రకాల జీవులను సంరక్షించడానికి 2000 జనవరిలో కార్టజీనా ప్రోటోకాల్‌ ఆన్‌ బయోసేఫ్టీ ఒప్పందం జరిగింది. ఇది 2003, సెప్టెంబరు 11 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద జీవవైవిధ్య దేశం బ్రెజిల్‌. ఏటా మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని, ఏప్రిల్‌ 22న అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
*  స్విట్జర్లాండ్‌లోని వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ప్రపంచంలో అంతరించిపోతున్న జీవులను ‘రెడ్‌ డాటా బుక్‌’ (రెడ్‌లిస్ట్‌)లో ప్రచురిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో బట్టమేకల పక్షి, కలివికోడి, ఏనుగులు, చిరుతలు అంతరించిపోతున్నట్లు పేర్కొంది.


ధరిత్రి సదస్సులు


మొదటి సదస్సు - 1999, రియోడిజెనీరో (బ్రెజిల్‌)
రెండో సదస్సు - 2002,  జొహెన్నస్‌బర్గ్‌ (దక్షిణాఫ్రికా) (రియో + 10)
మూడో సదస్సు - 2012,  రియోడిజెనీరో (బ్రెజిల్‌) (రియో + 20)


క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం - 1997


జపాన్‌ రాజధాని క్యోటో వేదికగా 1997, డిసెంబరు 11న జ‌రిగిన స‌ద‌స్సులో ఈ ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించాలని సమావేశ సభ్య దేశాలు తీర్మానించాయి. కార్బన్‌ ట్రేడింగ్, పరిశుభ్రత అభివృద్ధి విధానాలు, ఉమ్మడి అమలు కార్యక్రమాలను అన్ని దేశాలు పాటించాలని పేర్కొన్నారు. దీన్నే క్యోటో ప్రోటోకాల్‌ ఒప్పందం అంటారు. ఈ తీర్మానం 2005, ఫిబ్రవరి 16 నుంచి అమల్లోకి వచ్చింది.


మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం - 1987


భూ ఉపరితలం నుంచి 30 - 34 కి.మీ. ఎత్తులో స్ట్రాటో ఆవరణంలో ఓజోన్‌ పొర ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకుంటుంది. అయితే భూమిపై క్లోరో ఫ్లోరో కార్బన్ల సంఖ్య పెరగడం వల్ల ఓజోన్‌ పొర ఛిద్రమైంది. దీన్ని మొదట 1975లో అంటార్కిటిక్‌ ఖండంపై గుర్తించారు. ఓజోన్‌ క్షీణతను తగ్గించడానికి 1987, సెప్టెంబరు 16న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మాంట్రియల్‌లో ఓజోన్‌ తరుగుదల సదస్సును నిర్వహించారు. దీన్నే మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం 1989, ఆగస్టు 26 నుంచి అమల్లోకి వచ్చింది. అందువల్ల ఏటా సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్‌ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.             

         ఇటీవల 28వ మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం, COP - 21 పారిస్‌ వాతావరణ మార్పుల సదస్సులకు అనుగుణంగా 2016, అక్టోబరు 15న ఆఫ్రికా దేశమైన రువాండా రాజధాని కిగాలిలో ఓజోన్‌ తరుగుదల సమీక్ష సదస్సు జరిగింది. ఈ సమావేశంలో 2045 నాటికి 80 - 85% వరకు హైడ్రోఫ్లోరో కార్బన్లను తగ్గించాలని, 2100 సంవత్సరానికి 0.5 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించాలని తీర్మానం చేశారు.


అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్‌ఏ) - 2018


  భూమిపై శిలాజ ఇంధన వనరులను తగ్గిస్తూ, శిలాజేతర వనరులను పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక కూటమి ఏర్పాటైంది. భారత ప్రధాని మోదీ కృషితో COP -  21 పారిస్‌ సదస్సులో దీనికి బీజం పడింది. కర్కాటక, మకర రేఖల మధ్య ఉష్ణోగ్రత ఎక్కువగా పొందుతున్న 121 దేశాలతో సౌరకూటమిని ఏర్పాటు చేశారు. వీటినే సూర్యపుత్ర దేశాలు అంటారు. ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం ఖనిజ చమురుకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తి వనరును వినియోగించడం. దీన్నే ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ సోలార్‌ పాలసీ అండ్‌ అప్లికేషన్‌ (IASPA) అని పిలుస్తారు. దీని ప్రధాన కార్యాలయం గ్యాల్‌పహరి, గురుగ్రామ్‌ (హరియాణా)లో ఉంది. మొదటి సదస్సు 2018, మార్చి 11న న్యూదిల్లీలో జరిగింది. ఈ సమావేశం 2002 నాటికి 175 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని తీర్మానించింది. ఈ కమిటీ ప్రపంచబ్యాంక్‌ భాగస్వామ్యంగా ఉంటుంది. ఈ సదస్సుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్సిస్‌ హొలాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భూమి - ఆవరణాలు

సమస్త జీవులకూ సానుకూలం!


వర్షాలు పడి నదులు, కాలువలుగా ప్రవహిస్తే జీవులకు, మొక్కలకు కావాల్సిన నీళ్లు అందుతుంటాయి. ఇది సర్వ సాధారణ విషయంగా కనిపించినా, శాస్త్రీయంగా పరిశీలిస్తే ఇందులో జలావరణం నుంచి జీవావరణం వరకు పలు వ్యవస్థల ప్రభావాలు ఇమిడి ఉంటాయి. ఇవన్నీ సమస్త జీవులకు అవసరమైన అనుకూలతలను అందిస్తూ వాటి మనుగడ సవ్యంగా సాగడానికి సహకరిస్తుంటాయి. పరిసరాలకు, ప్రాణులకు మధ్య ఉన్నఈ విశిష్ట బంధం గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

జీవులు తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా జీవించడానికి,  ప్రత్యుత్పత్తికి ఆవరణ వ్యవస్థే ఆధారం. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలోని జీవ వైవిధ్యం, జీవుల ఆవాసాలు, అందుబాటులో ఉన్న శక్తి వనరులన్నింటినీ కలిపి ఆవరణ వ్యవస్థ నిర్మాణం అంటారు. ఆవరణ వ్యవస్థ సమతౌల్యతను కాపాడటం పర్యావరణ వ్యవస్థ ముఖ్యలక్షణం. జీవ, నిర్జీవ అంశాల మధ్య జరిగే అంతఃచర్యలు, జీవుల మధ్య ఉండే  విధిపూర్వక సంబంధాలపై పర్యావరణ   మనుగడ ఆధారపడి ఉంటుంది. మొత్తం భూమి చుట్టూ నాలుగు ఆవరణలు ఆవరించి ఉన్నాయి.


1) శిలావరణం (Lithosphere): భూమి   ఉపరితలం నుంచి కొంత లోతు వరకు  విస్తరించి, ఘనస్థితిలో ఉన్న భూమి బాహ్య పొరను శిలావరణం అంటారు. ఈ ఉపరితలం వివిధ భౌమకాలాల్లో అంతర్జనిత, బహిర్జనిత బలాలకు గురవుతూ వచ్చింది. ఈ ప్రక్రియలో ఉపరితలంపై పర్వతాలు, పీఠభూములు, మైదానాలు లాంటి భూస్వరూపాలు ఏర్పడ్డాయి. అలా వివిధ జీవజాతుల మనుగడకు కావాల్సిన భౌతిక పర్యావరణం ఏర్పడింది. శిలావరణం జీవజాతులకు కావాల్సిన ఆహార వనరులు, శక్తి వనరులు, ఆవాసాలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.


2) జలావరణం (Hydrosphere): భూమి చుట్టూ ఆవరించిన జలాలను జలావరణం అంటారు. భూ మొత్తం వైశాల్యం సుమారు 510 మిలియన్‌ చదరపు కి.మీ.లలో 71% జలావరణం ఆవరించింది. భూమిపై జీవనానికి అనుకూల వాతావరణం ఏర్పడేందుకు జలావరణం సహకరిస్తుంది. జలచక్రంలో భాగంగా నీరు ఆవిరై, తిరిగి భూమి మీద వర్షంగా కురిసి జీవులకు ఆధారమైన నీటిని సమకూరుస్తుంది. జలభాగం ప్రధాన కార్బన్‌ శోషకం (carbon sink) గా వ్యవహరిస్తుంది. భూమిపై రెండు కార్బన్‌ శోషకాలను గుర్తించవచ్చు. మహాసముద్రాలు, సముద్రాలు అతిపెద్ద బ్లూ కార్బన్‌ సింక్‌ గా ఉన్నాయి. భూమి మీద ఉన్న అటవీ వనరులను గ్రీన్‌ కార్బన్‌ సింక్‌గా పిలుస్తారు. దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ అడవులు అతిపెద్ద గ్రీన్‌ కార్బన్‌ సింక్‌కు ఉదాహరణ.


3) వాతావరణం (Atmosphere): భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరే వాతావరణం. ఇది భూమి ఉపరితలం నుంచి దాదాపుగా 1600 కి.మీ. ఎత్తువరకూ విస్తరించింది. వాయువులో ఉండే ఘన, ద్రవ  కణాలను ఏరోసోల్స్‌ (Aerosols) అంటారు. వాతావరణంలో చేరే దుమ్ము, ధూళి రేణువులు, కలుషిత గాలి వాతావరణంలోని  ఘనపదార్థాలు. ఇవి పరిమితికి మించి గాలిలో చేరితే గాలి పారదర్శకత దెబ్బతిని, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది.


వాతావరణంలోని వివిధ  పొరలు

ట్రోపో ఆవరణం: ఇది భూమిని ఆవరించి ఉన్న మొదటి వాతావరణ పొర. భూమధ్య రేఖా ప్రాంతంలో 18 కి.మీ. ఎత్తు, ధ్రువాలపై 8 కి.మీ. ఎత్తు వరకు ఉంటుంది. ఈ ఆవరణంలో ధూళి కణాలు, మేఘాలు, పవనాలు, వర్షం, ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణ అంశాలన్నీ ఏర్పడతాయి. అందుకే ఈ ఆవరణాన్ని కల్లోల/మిశ్రమ/ పరివర్తన ఆవరణం అంటారు. జీవుల మనుగడకు అనుకూలమైన ఆవరణం ఇది. ఈ ఆవరణం పైభాగం కంటే కింది భాగంలో  ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి  సంవహన క్రియకు దోహదం చేస్తున్నాయి. ఇందులో పైకి వెళ్లేకొద్దీ ప్రతి 1000 మీటర్లకు 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల చొప్పున లేదా ప్రతి 165 మీటర్లకు ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌ చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతూఉంటుంది. దీన్నే ఉష్ణోగ్రత క్షీణతా క్రమం అంటారు. ట్రోపో ఆవరణ పైభాగంలో అత్యంత వేగంగా వంకరలు తిరుగుతూ కదిలే జియోస్ట్రోపిక్‌ పవనాలనే జెట్‌స్ట్రీమ్స్‌ అంటారు. ఇలాంటి పశ్చిమ జెట్‌ స్ట్రీమ్‌ ఒకటి భారతదేశంపై నుంచి హిమాలయాల అంత ఎత్తులో వీస్తుండటం వల్ల ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో వర్షాలు కురుస్తుంటాయి.


స్ట్రాటో ఆవరణం: ఇది ట్రోపో ఆవరణంపైన భూమి ఉపరితలం నుంచి దాదాపు 50 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఆవరణానికి, ట్రోపో ఆవరణానికి మధ్యలో ట్రోపోపాస్‌ అనే సంధి పొర ఉంటుంది. స్ట్రాటో ఆవరణం చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. ఇందులోనే జెట్‌ విమానాలు ప్రయాణిస్తాయి. ఈ ఆవరణంలో పైకి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. భూమికి రక్షణ కవచంగా పిలిచే ఓజోన్‌ ఆవరణం స్ట్రాటో ఆవరణంలోనే భూమి చుట్టూ విస్తరించి ఉంది. ఓజోన్‌ పొర సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలను వడపోసి వేడిని మాత్రమే పంపిస్తుంది. స్ట్రాటో ఆవరణం పై అంచులో, దానిపైన ఉన్న మీసో ఆవరణానికి మధ్య స్ట్రాటో సంధి పొర (స్ట్రాటో పాస్‌) ఉంటుంది.


మీసో ఆవరణం: ఇది స్ట్రాటో పాస్‌పైన భూమి ఉపరితలం నుంచి 80 కి.మీ. ఎత్తు వరకూ ఆవరించి ఉంది. ఈ ఆవరణంలో పైకి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అందువల్ల దీన్ని బాహ్యట్రోపో ఆవరణం అంటారు. ఈ ఆవరణం పైఅంచును మీసో పాస్‌ అంటారు. ఇక్కడ100 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకే ఇక్కడ రాకెట్లు ప్రయాణించేలా వాటికి క్రయోజెనిక్‌ ఇంజిన్లు వాడతారు.


ఐనో ఆవరణం: ఇది మీసోపాస్‌ను ఆనుకుని సుమారుగా 400 కి.మీ. ఎత్తు వరకు భూమి చుట్టూ ఆవరించి ఉంది. ఇందులో ఆక్సిజన్, నైట్రోజన్‌ అణువులు కలిసి అయనీకరణ చెందుతాయి. హైడ్రోజన్, హీలియం అణువులు కలిసి అకస్మాత్తుగా ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందువల్ల ఐనో ఆవరణాన్ని థర్మో ఆవరణం అని కూడా అంటారు. భూమి నుంచి పంపిన విద్యుదయస్కాంత తరంగాలు ఐనో ఆవరణంలో పరావర్తనం చెంది తిరిగి భూమిని రేడియో తరంగాలుగా చేరతాయి.


ఎక్సో ఆవరణం: ఇది ఐనో ఆవరణం పైన విస్తరించి ఉన్న ఆవరణం. ఇది పదార్థం నాలుగో రూపమైన ప్లాస్మా స్థితిలో ఉంటుంది. హైడ్రోజన్, హీలియం వల్ల ఇది కూడా అధిక ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఈ పొరను మాగ్నిటోఆవరణంఅని కూడా అంటారు.


4) జీవావరణం (Biosphere): శిలావరణం, జలావరణం, వాతావరణం కలుసుకునే సంధి ప్రాంతంలో ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్, నీరు లాంటి పదార్థాలు జీవ - భూ - రసాయన వలయాల ద్వారా పరస్పరం మార్పిడి చెందుతుంటాయి.  ఇది నిరంతరం జీవజాతుల ఆవిర్భావానికి, వాటి మనుగడకు కావాల్సిన అనుకూల భౌతిక పరిస్థితులను ఏర్పరుస్తాయి. ఈ భౌతిక పరిసరాల్లో నివసించే మొత్తం జీవజాతినే జీవావరణం అని పిలుస్తారు.

కాంతి పుంజాలు

సూర్యుడి నుంచి వెలువడే అధిక శక్తిమంతమైన వికిరణాలు ఐనోస్ఫియర్‌లోకి ప్రవేశించినప్పుడు అందులోని ఆక్సిజన్, నైట్రోజన్‌ వాయువులతో విభేదిస్తాయి. ఫలితంగా రసాయన చర్య జరిగి మిరుమిట్లు గొలిపే కాంతి వెలువడుతుంది. వీటినే అరోరాలు అంటారు. ఈ కాంతి కిరణాలు అయస్కాంత ధ్రువాల వైపు ఆకర్షితమవుతాయి. ఇవి ధ్రువాల పై ఆరు నెలలు చీకటిగా ఉన్న రోజుల్లో కనిపిస్తుంటాయి. వీటినే ఉత్తర ధ్రువంలో అరోరా బోరియాలిస్‌ అని, దక్షిణ ధ్రువంలో అరోరా ఆస్ట్రాలిస్‌ అని అంటారు. 


మాదిరి ప్రశ్నలు


1. ఎకోసైడ్‌ అంటే ఏమిటి?

1. మానవుడి అభివృద్ధి వల్ల పర్యావరణ క్షీణత     2. మానవుడి అభివృద్ధి వల్ల పర్యావరణ అభివృద్ధి

3. భూకంపాల వల్ల పర్యావరణం దెబ్బతినడం      4. పైవన్నీ


2. భూమి మీది మొత్తం జలావరణంలో సముద్రాలు ఎంత నీటిని ఆవరించి ఉన్నాయి?

1. 73%           2. 97.3%         3. 25.5%           4. 50%


3. రేడియో తరంగాలు ఏ ఆవరణం నుంచి భూమి పైకి పరావర్తనం చెందుతాయి?

  1. మీసో ఆవరణం      2. స్ట్రాటో ఆవరణం       3. ఐనో ఆవరణం       4. ఎక్సో ఆవరణం


4. వాతావరణంలో అత్యధికంగా ఉన్న వాయువు ఏది?

  1. నైట్రోజన్‌        2. ఆక్సిజన్‌       3. ఆర్గాన్‌         4. కార్బన్‌ డయాక్సైడ్‌


5. ఏరోసోల్స్‌ అంటే ఏమిటి?

 1. గాలిలోని ఘన ద్రవకణాలు      2. గాలిలోని వాయు కణాలు

  3. గాలిలోని దుమ్ము కణాలు       4. గాలిలోని కర్బన కణాలు


6. ఉత్తర ధ్రువం వైపు కనిపించే కాంతి పుంజాలను ఏమంటారు?

  1. అరోరా ఆస్ట్రాలిస్‌        2. అరోరా బోరియాలిస్‌

  3. విద్యుత్‌ కాంతులు         4. పైవన్నీ


7. అతిశీతల వాతావరణంలో రాకెట్లకు వాడే ఇంజిన్‌ ఏమిటి?

  1. రేడియో విండోస్‌     2. జెట్‌ విండోస్‌      3. క్రయోజెనిక్‌ ఇంజిన్‌     4. క్రిటికల్‌ ఇంజిన్‌


సమాధానాలు:  1-1,   2-2,   3-3,   4-1,   5-1,   6-2,   7-3.

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 26-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆవరణ శాస్త్రం - పోషక వలయాలు

జీవనాధార వలయాలు

  భూమి మీద సమస్త జీవరాశులకు, జీవ పక్రియలకు సౌరశక్తి ప్రధాన ఆధారం. సౌరశక్తి వల్ల నీరు ఆవిరై మేఘాలుగా ఏర్పడుతుంది. తిరిగి వర్షించి చక్రీయ వలయంలో నీరుగానే మారుతుంది. ఆవరణ వ్యవస్థలోని కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్‌ లాంటి పోషకాలు నిరంతరం జీవులకు, వాటి పరిసరాలకు మధ్య చక్రీయంగా బదిలీ అవుతూ జీవుల పోషణకు ఉపయోగపడతాయి. అసలు ఈ వలయాలు జీవులకు ఎలా ఉపయోగపడుతున్నాయో పోటీపరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి.

  ప్రతి జీవికి శ్వాసించడానికి, శారీరక ప్రక్రియలకు, ప్రత్యుత్పత్తి నిర్వహించడానికి నిరంతరం పోషక విలువలు కావాలి. కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, హైడ్రోజన్‌ మొదలైన ఖనిజ పోషకాలు నేలలో, నీటిలోనూ స్థిరంగా ఉంటాయి. వీటినే పోషకాల నిలకడ స్థితి అంటారు. అయితే ఇవి జీవులకు, వాటి పరిసరాలైన శిలావరణం, జలావరణం, వాతావరణాల మధ్య చక్రీయంగా బదిలీ అవుతూ జీవుల పోషణకు ఉపయోగపడుతుంటాయి. దీన్నే జీవ-భూ-రసాయన వలయం అంటారు. ఈ వలయం సక్రమంగా కొనసాగడంలో విచ్ఛిన్నకారులు కీలకపాత్ర పోషిస్తాయి.

  చనిపోయిన వృక్ష, జంతు కళేబరాల నుంచి ఏర్పడిన సేంద్రియ పదార్థాల్లో ప్రొటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు ఉంటాయి. బ్యాక్టీరియా చర్యల వల్ల సేంద్రియ పదార్థాలు చివరికి సరళమైన పోషక పదార్థాలుగా మారతాయి. ఆకుపచ్చని మొక్కలు ఈ ఖనిజ పదార్థాలను గ్రహించి వాటిని మళ్లీ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, లిపిడ్లు లాంటి సంక్లిష్ట ఆహార పదార్థాలుగా మార్చుకుంటాయి. అవి తిరిగి ఆహార గొలుసు ద్వారా ఆవరణ వ్యవస్థలోని జీవజాతులకు అందుతాయి. ఈ వలయం నిరంతరం కొనసాగుతుండటంతో ఆవరణ వ్యవస్థ సమతౌల్యంగా ఉంటుంది. 

పోషక వలయాలను కింది విధంగా విభజించారు.

ఆక్సిజన్‌ వలయం: పరిసరాల్లోని జీవులకు, నిర్జీవ పదార్థాలకు మధ్య జరిగే ఆక్సిజన్‌ వినిమయాన్ని ఆక్సిజన్‌ వలయం అంటారు. చెట్లు గాలిలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ని పీల్చుకుని, నీరు, సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్యసంయోగ క్రియ జరిపి తిరిగి ఆకుల ద్వారా ఆక్సిజన్‌ను గాలిలోకి విడుదల చేస్తుంటాయి. వాతావరణంలో 21% వరకు ఉండే ఆక్సిజన్‌ నీటిలోనూ కొంత కరిగి ఉంటుంది. అదేవిధంగా ఓజోన్‌ పొరలో కూడా ఆక్సిజన్‌ మోతాదు ఎక్కువగానే ఉంటుంది. ఈ విధంగా ఆక్సిజన్‌ పుష్కలంగా లభించి సమస్త ప్రాణుల శ్వాసక్రియకు సరిపోతుంది.

కర్బన వలయం: వృక్ష, జంతు కణజాలాల నిర్మాణానికి కార్బన్‌ వెన్నెముక లాంటిది. భూమి మొదటి వాతావరణ పొర ట్రోపో ఆవరణంలో వాయు స్థితిలో లభించే కార్బన్‌ డై ఆక్సైడ్‌ని సూర్యకాంతి సమక్షంలో మొక్కలు శోషించుకుని కార్బోహైడ్రేట్స్‌ రూపంలో సంశ్లేషణ చెందిస్తాయి. ఈ పోషకం ఉత్పత్తిదారులు, వినియోగదారులకు బదిలీ అవుతూ చివరగా బ్యాక్టీరియాలు, శిలీంద్రాలు లాంటి విచ్చిన్నకారుల వల్ల సరళ అకర్బన పదార్థాలుగా విడిపోతుంది. అంతిమంగా దీనిలోని కార్బన్‌ వాయుస్థితిలో వాతావరణంలోకి, కార్బోనేట్, బైకార్బోనేట్‌ల రూపంలో జలావరణం, శిలావరణంలోకి బదిలీ అవుతుంది. ఈవిధంగా కార్బన్‌ ఘన, ద్రవ, వాయు స్థితిలో చక్రీయంగా బదిలీ అవుతూ తిరిగి మొక్కలు జరిపే కిరణజన్య సంయోగక్రియలో కార్బోనేట్స్‌ రూపంలో సంశ్లేషణ చెందుతుంది.

నత్రజని వలయం: వాతావరణంలో నైట్రోజన్‌ వాయువు 78% వరకు ఉంటుంది. ఇది జడవాయువు. రసాయన చర్యల్లో పాల్గొనదు. జీవులకు, చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య జరిగే నత్రజని పదార్థాల వినిమయాన్ని నత్రజని వలయం అంటారు. ప్రొటీన్లు, కేంద్రకామ్లాలు, అమైనో ఆమ్లాల నిర్మాణానికి నత్రజని మూలాధారం. అయినప్పటికీ జీవజాతులు నైట్రోజన్‌ని పరోక్షంగానే గ్రహిస్తాయి. రైజోబియం లాంటి బ్యాక్టీరియాల వల్ల వాతావరణంలోని నైట్రోజన్‌ వాయువు నేలలో నైట్రేట్లుగా స్థిరీకరణకు గురవుతుంది. దీన్నే నత్రజని స్థాపన అంటారు. ఈ నైట్రేట్లను వృక్షాలు నేల నుంచి గ్రహిస్తాయి. నత్రజని స్థాపన వల్ల వాతావరణంలోని అకర్బన నత్రజని, కర్బన నత్రజనిగా మారి మొక్కల్లోకి ప్రవేశిస్తుంది. మొక్కల దేహాల్లో కర్బన నత్రజని ప్రొటీన్లుగా మారుతుంది. మొక్కల కళేబరాల్లోని ఈ కర్బన నత్రజని సూడోమోనాస్‌ లాంటి నత్రీకరణ బ్యాక్టీరియా వల్ల వినత్రీకరణ (డీనైట్రిఫికేషన్‌) జరిగి కొంత నైట్రేట్లుగా నేలలోకి పోగా, మరికొంత స్వేచ్ఛా నత్రజని వాయువుగా మారి వాతావరణంలో కలుస్తుంది. ఈ విధంగా జీవులకూ, చుట్టూ ఉన్న పరిసరాలకు మధ్య జరిగే నత్రజని పదార్థాల వినిమయాన్ని నత్రజని వలయం అంటారు.

ఫాస్ఫరస్‌ వలయం: శక్తి వాహకంగా వ్యవహరించే ఫాస్ఫరస్‌ అవక్షేప వలయాల్లో చాలా ముఖ్యమైంది. ఫాస్ఫరస్‌ మూలకం అడినోసిన్‌ ట్రైఫాస్ఫేట్‌ (ATP) గా కణజాల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది భౌమావరణ వ్యవస్థలోనూ, జలావరణ వ్యవస్థలోనూ కొద్దిమొత్తంలో లభిస్తుంది. ఫాస్ఫాటిక్‌ శిలల శైథిల్యం ద్వారా లభించిన ఆర్ధోఫాస్ఫేట్‌ అయాన్ల రూపంలో ఉన్న అకర్బన ఫాస్ఫేట్లు.. వృక్షాల జీవన ప్రక్రియలో పాల్గొంటాయి. ఇవి ఆహారపు గొలుసుల ద్వారా క్రమంగా వినియోగదారులకు, విచ్ఛిన్నకారులకు ప్రవహించి చివరకు నేలలో కలుస్తాయి. నేలలో విడుదలైన ఫాస్ఫేట్లు తిరిగి వృక్షాలకు వినియోగమవుతాయి. ఆధునిక వ్యవసాయ రంగంలో ఫాస్ఫేట్‌ ఎరువుల వాడకం ఎక్కువవడంతో నీటిలో ఆక్సిజన్‌ తగ్గిపోయి యూట్రిఫికేషన్‌కు దారితీసి జలకాలుష్యం ఏర్పడుతోంది. 

జల వలయం: జీవులకు, వాటి చుట్టూ ఉన్న వాతావరణం, శిలావరణం, జలావరణం లాంటి భౌతిక పరిసరాలకు మధ్య నీరు ఘన, ద్రవ, వాయు స్థితుల్లో చక్రీయంగా బదిలీ కావడాన్ని జలచక్రంగా పిలుస్తారు. సూర్యుడి నుంచి భూమికి చేరే సౌర వికిరణం ద్వారా జలాశయాలు, మంచు ప్రాంతాల నుంచి బాష్పీభవనం (నీరు ఆవిరవడం), ఉత్పతనం (ఘన పదార్థాలు నీరుగా ఆవిరవడం), బాష్పోత్సేకం (చెట్ల నుంచి విడుదలయ్యే నీటిఆవిరి) లాంటి ప్రక్రియల ద్వారా నీరు గాలిలోకి చేరి మేఘాలుగా మారుతుంది. తిరిగి మేఘాలు ద్రవీభవనం చెంది వర్షంగా, ఘనీభవనం చెంది మంచుగా భూమికి చేరతాయి. ఈవిధంగా భూమిపై ఉన్న సమస్త జీవజాలానికి కావాల్సిన నీటి అవసరాలు తీరుతున్నాయి.

మాదిరి ప్రశ్నలు

1. జీవ సందీప్తి అంటే ఏమిటి?  

1) కొన్ని జీవులు కాంతి ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉండటం

2) కొన్ని జీవులు కాంతిని గ్రహించడం

3) కొన్ని జీవులు కాంతిని తీసుకోకపోవడం

4) గాలి, సూర్యరశ్మి సంయోగం చెందడం

2. సూర్యుడి నుంచి భూమికి చేరే సూర్యకాంతిని ఏమంటారు? 

1) సౌరవికిరణం 2) సూర్యపుటం 3) భూవికిరణం 4) పైవేవీకాదు

3. బాష్పోత్సేకం అంటే ఏమిటి?

1) చెట్లు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం           

2) చెట్లు ఆకుల ద్వారా నీటిని విడిచిపెట్టడం

3) చెట్లు ఆకు రాల్చడం                   

4) చెట్లు కార్బన్‌ డై ఆక్సైడ్‌ని పీల్చుకోవడం

4. ఘనపదార్థాలు నేరుగా ఆవిరవడాన్ని ఏమంటారు? 

1) బాష్పోత్సేకం 2) బాష్పీభవనం 3) ఉత్పతనం 4) హైడ్రేషన్‌

5. సౌర వికిరణం అంటే ఏమిటి?

1) సూర్యుడు బయటకు విడుదల చేసే శక్తి 

2) సూర్యుడి నుంచి భూమి గ్రహించే శక్తి

3) సూర్యుడి కేంద్రంలో ఉద్భవించే శక్తి 

4) సౌరశక్తి వల్ల నీరు ఆవిరవడం

6. వృక్ష, జంతు కణజాల నిర్మాణానికి వెన్నెముక లాంటిది? 

1) ఆక్సిజన్‌ 2) నైట్రోజన్‌ 3) కార్బన్‌ 4) హైడ్రోజన్‌

7. ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలో నిర్దిష్ట సమయంలో ఉన్నటువంటి అకర్బన పోషకాల మొత్తం పరిమాణాన్ని ఏమని పిలుస్తారు?

1) నిలకడ స్థితి 2) బయోమ్‌ 3) జీవ ద్రవ్యరాశి 4) బయోట్‌

8. ఆవరణ వ్యవస్థలో జీవులకు, పరిసరాలకు మధ్య పోషకాల చక్రీయ బదిలీ విధానాన్ని ఏమంటారు?  

1) భూ - జీవ వలయం 2) భూ- రసాయన వలయం 

3) భూ విజ్ఞాన వలయం 4) జీవ- భూ- రసాయన వలయం

స‌మాధానాలు

1-1, 2-2, 3-2, 4-3, 5-1, 6-3, 7-1, 8-4.

జల వలయం:

Condensation = ద్రవీభవనం

Precipitation = అవపాతం

Evaporation = బాష్పీభవనం

Rain=  వర్షం

Snow = మంచు

Surface Runoff = ఉపరితల నీరు

Ground Water  = భూగర్భ జలం

ర‌చ‌యిత‌:  జల్లు సద్గుణరావు

Posted Date : 03-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సహజ వనరులు - పరిరక్షణ

వాడుకుంటూ.. కాపాడుకుంటూ!


ఎంత ఉపయోగించుకున్నా తరగదు గాలి. తవ్విన కొద్దీ తగ్గిపోతుంది బొగ్గు. అవి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు. జీవుల మనుగడకు మూలాధారాలు. వాటిని సక్రమంగా వాడుకొని ఆదిమానవుడు ఆరోగ్యంగా జీవిస్తే, విచక్షణారహితంగా వినియోగించుకుంటూ ఆధునిక జీవుడు పర్యావరణానికి ప్రమాదకరంగా మారాడు. స్థిరమైన అభివృద్ధికి పర్యావరణ పరిరక్షణ తప్పనిసరని ప్రపంచం గుర్తించింది. అందుకే వనరులను సరైన రీతిలో వాడుకుంటూ, కాపాడుకుంటూ ఉండాలని ప్రకటించింది. పర్యావరణాంశాల అధ్యయనంలో భాగంగా సహజ వనరులు, రకాలు, క్షీణత తదితర అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.  
 


మానవుడికి అవసరమైన వస్తుసేవల ఉత్పత్తికి ఉపయోగపడే పదార్థాలు, శక్తి లాంటి వాటిని సహజవనరుల రూపంలో ప్రకృతి ప్రసాదిస్తోంది. ఆవరణ వ్యవస్థలు, జీవ రాశులు తమ విధులను నిర్వహించడానికి, మానవ సమాజాల సాంఘిక, ఆర్థిక నాగరికతల మనుగడకు కావాల్సిన శక్తిని అందించే వనరులనే సహజ వనరులు అంటారు. వివిధ ప్రామాణికతల ఆధారంగా వాటిని విభజించవచ్చు.


లభ్యతను అనుసరించి!

లభ్యతను అనుసరించి వనరులను వర్గీకరించారు. 

జీవ వనరులు: జీవావరణంలో ప్రాణం ఉండే అడవులు, జంతువులు, అనేక జీవజాతులే జీవ వనరులు. వృక్షాలు, జంతువులు మిలియన్ల సంవత్సరాల క్రితం నశించి, రూపాంతరం చెందడం వల్ల ఏర్పడిన బొగ్గు, చమురు, సహజ వాయువు లాంటి శిలాజ ఇంధనాలు జీవ వనరుల తెగకు చెందినవి.

నిర్జీవ వనరులు: జీవం లేని అనుఘటకాలు, సేంద్రియ పదార్థాల నుంచి లభించే వనరులే నిర్జీవ వనరులు. భౌతికపరమైన గాలి, నీరు, నేల లాంటివి ఈ వనరుల కోవకే చెందుతాయి. కాంతి, ఉష్ణం, వర్షపాతం తదితర శీతోష్ణస్థితి సంబంధితాలూ నిర్జీవ వనరులే. సేంద్రీయపరమైన కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, లిపిడ్స్‌ను కూడా జీవరహిత వనరులుగానే పరిగణిస్తారు నిరేంద్రియపరమైన సోడియం, కాల్షియం, ఫాస్ఫరస్‌ లాంటి రసాయనాలు నిర్జీవ వనరుల కిందకే వస్తాయి. 


 పునరుత్పత్తి సామర్థ్యాన్ని బట్టి!

మళ్లీ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఆధారంగా వనరులను వర్గీకరించారు. 

పునరుద్ధరించగలిగే సహజ వనరులు: వినియోగిస్తున్నప్పటికీ తిరిగి ఉత్పత్తి చెందే సామర్థ్యం ఉన్నవి, మానవ ప్రయత్నాల ద్వారా కొత్తగా ఉత్పత్తి చేయగలుగుతున్న వనరులను పునరుత్పత్తి చెందే సహజ వనరులుగా భావించవచ్చు. ఇవి సాధారణంగా కాలుష్యరహితమైనవి. అందువల్ల వీటిని హరిత ఇంధనాలు అని పిలుస్తారు.

ఉదా: అటవీ వనరులు, పంట పొలాలు, జీవజాతుల ఉత్పత్తి, జలవనరులు, సౌరశక్తి, పవనశక్తి, ఓషన్‌ ఎనర్జీ, జియో థర్మల్‌ ఎనర్జీ, జలవిద్యుత్తు లాంటివి.

పునరుద్ధరించలేని సహజ వనరులు: ఈ వనరులు వినియోగించే కొద్దీ తరిగిపోతుంటాయి. వీటికి పునరుత్పత్తి సామర్థ్యం ఉండదు. మానవ ప్రయత్నం ద్వారా పునరుద్ధరించడం వీలు కాదు. ఇవి కాలుష్య కారకాలు. ప్రస్తుతం ఎక్కువ వినియోగంలో ఉన్నాయి.

ఉదా: శిలాజ ఇంధనాలు (బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, సహజ వాయువు రూపాంతరాలైన షెల్‌ గ్యాస్, గ్యాస్‌ హైడ్రేట్స్, కోల్‌బెడ్‌ మీథేన్‌), అణు ఇంధన   వనరులు (యురేనియం, థోరియం, ప్లుటోనియం) ప్రస్తుతం మానవుని జీవన గమనాన్ని యంత్ర శక్తి, సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యమే నిర్దేశిస్తున్నాయి. కానీ వాటిని నడిపించడానికి ఇంధనశక్తి తప్పనిసరి. ఆ ఇంధన వనరుల్లో నూతన పోకడలు, విధానాల్లో అనేక మార్పులు కాలానుగుణంగా సంభవిస్తూనే ఉన్నాయి. వినియోగించే కాలం ఆధారంగా వాటిని వివిధ రకాలుగా విభజించవచ్చు.

1) సంప్రదాయ ఇంధన వనరులు: అనాదిగా మానవుడు వినియోగిస్తున్న ఇంధన వనరులివి. ఉదా: బొగ్గు, డీజిల్, సహజ వాయువు ఆధారంగా ఉత్పత్తి చేసే థర్మల్‌ విద్యుత్తు, జల విద్యుత్తు, అణుశక్తి; చోదక శక్తి కోసం వాడే ముడిచమురు, సహజ వాయువు లాంటివి. వీటిలో జల విద్యుత్తు మాత్రమే  పునరుత్పాదక ఇంధన వనరు.

2) సంప్రదాయేతర ఇంధన వనరులు: ఇవి ఇటీవల కాలంలో అభివృద్ధి చేసిన, అధిక ప్రాచుర్యం పొందిన ఇంధన వనరులు. వీటిని మళ్లీ రెండు రకాలుగా పేర్కొంటున్నారు.

ఎ) పునరుత్పాదక ఇంధన వనరులు: సౌర శక్తి, పవన శక్తి, బయో గ్యాస్, బయో డీజిల్, బయోమాస్‌ పవర్, బయో ఇథనాల్, చిన్న  తరహా జలవిద్యుత్తు, బగస్సీ - కోజనరేషన్‌ లాంటి తిరిగి ఉత్పత్తి చేయగలిగే శక్తి వనరులు.

బి) నవీన శక్తి వనరులు: ఇటీవలి కాలంలో సాంకేతిక సామర్థ్యంతో తయారై, వినియోగంలోకి వస్తున్న శక్తివనరులు.

ఉదా: హైడ్రోజన్‌ శక్తి, జియో థర్మల్‌ శక్తి, టైడల్‌ ఎనర్జీ, సీవేవ్‌ ఎనర్జీ, ఓషన్‌ థర్మల్‌ గ్రేడియంట్‌ ఎనర్జీ, షెల్‌ గ్యాస్, కోల్‌బెడ్‌ మీథేన్, గ్యాస్‌ హైడ్రేట్స్, బ్యాటరీలతో నడిచే వాహనాలు వంటివి.


అధిక వినియోగంతో క్షీణత

ఆదిమానవుడు అందుబాటులో ఉన్న సహజ వనరులను సహజ జీవనానికి మాత్రమే వినియోగించుకుని మంచి వాతావరణంలో ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడిపేవాడు. కానీ ఆధునిక మానవుడు అమూల్యమైన సహజ వనరులను విచక్షణారహితంగా వినియోగిస్తూ, ప్రమాదకరమైన వాతావరణంలో దుర్భర జీవితాన్ని సాగిస్తున్నాడు. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతి క్షీణించకుండా పరిరక్షించాల్సిన  ఆవశ్యకతను ఐక్యరాజ్యసమితి ‘వరల్డ్‌ ఛార్టర్‌ ఆఫ్‌ నేచర్‌ 1982’లో గుర్తించింది. వ్యక్తి స్థాయి నుంచి, అంతర్జాతీయ స్థాయి వరకూ అన్ని స్థాయుల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పింది. స్థిరమైన వృద్ధిని సాధించడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి చట్టాల్లో పర్యావరణ పరిరక్షణను పొందుపరచాలని ఈ చార్టర్‌ వివరించింది.

సహజ వనరుల పరిరక్షణ విధానాలు: పునరుద్ధరించగలిగిన, పునరుద్ధరించలేని వనరుల వృద్ధి రేటు కంటే వినియోగ రేటు ఎక్కువగా ఉంటే దాన్ని సహజవనరుల క్షీణతగా పరిగణించవచ్చు. అది వ్యవసాయం, చేపల వేట, గనుల తవ్వకం, నీరు, శిలాజ ఖనిజాల వినియోగం లాంటి వాటిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల వనరుల నిర్వహణలో మూడు ప్రక్రియలు పాటించాలి. 

1) తగ్గించడం (Reduce): వీలైనంత వరకూ సహజ వనరుల వాడకాన్ని తగ్గించాలి. అనవసరంగా వాడకూడదు.

ఉదా: విద్యుత్తు వాడకం, నీటి వాడకం లాంటివి.

2) పునఃచక్రీయం (Recycle): సహజ వనరులపై ఒత్తిడి తగ్గించడానికి అప్పటికే వినియోగించడం ద్వారా లభించిన వేస్ట్‌ పేపర్, ప్లాస్టిక్, గ్లాస్‌ లాంటి పదార్థాలను పునరుత్పత్తి చేసి వినియోగించవచ్చు.

3) తిరిగి ఉపయోగించడం (Reuse): పచ్చళ్లకు, జామ్‌లకు వాడిన గాజు, ప్లాస్టిక్‌ బాటిళ్లను బయట పారేయకుండా తిరిగి వినియోగించవచ్చు. వార్తాపత్రికలను చదివిన తర్వాత ప్యాకింగ్‌ చేయడానికి వాడవచ్చు. ఈ విధంగా వాడిన వస్తువులనే మళ్లీ, మళ్లీ వినియోగించడం వల్ల సహజ వనరుల వృద్ధి, పరిరక్షణ సాధ్యమవుతుంది.


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో సంప్రదాయ ఇంధన వనరు కానిది ఏది?

1) బొగ్గు       2) అణువిద్యుత్‌      3) జలవిద్యుత్‌        4) కోల్‌బెడ్‌ మీథేన్‌

జ: 4


2. సహజ వనరుల పరిరక్షణ విధానాల్లో వరుస క్రమం ఏది?

  1) రెడ్యూస్‌ - రీసైకిల్‌ - రీయూజ్‌        2) రీసైకిల్‌ - రెడ్యూస్‌ - రీయూజ్‌ 

  3) రెడ్యూస్‌ - రీయూజ్‌ - రీసైకిల్‌        4) రీసైకిల్‌ - రీయూజ్‌- రెడ్యూస్‌ 

జ: 1

3. కిందివాటిలో కన్వెన్షనల్‌ శక్తి వనరు ఏది?

  1) జీవ ఇంధనాలు    2) సౌర శక్తి        3) జలవిద్యుత్‌       4) పవన శక్తి 

జ: 3

4. కిందివాటిలో సంప్రదాయేతర శక్తి వనరు ఏది?

  1) బయోగ్యాస్‌      2) సౌరశక్తి         3) టైడల్‌ శక్తి      4) పైవన్నీ

జ: 4 

5. కిందివాటిలో పునరుత్పాదక శక్తి వనరు కానిది?

  1) సౌర విద్యుత్‌       2) పవన విద్యుత్‌      3) ఓషన్‌ థర్మల్‌ ఎనర్జీ  4) ఏదీకాదు

జ: 4

6. సహజ వనరుల క్షీణత అంటే?

1) సహజ వనరుల పునరుద్ధరణ కంటే వాటి  వినియోగం ఎక్కువగా ఉండటం

2) సహజ వనరుల పునరుద్ధరణ కంటే వాటి వినియోగం తక్కువగా ఉండటం

3) సహజ వనరుల వినియోగం కంటే వాటి పునరుద్ధరణ ఎక్కువగా ఉండటం

4) ఏదీకాదు

జ: 1

7. కిందివాటిలో నవీన శక్తి వనరు ఏది?

  1) హైడ్రోజన్‌ ఎనర్జీ    2) టైడల్‌ ఎనర్జీ     3) సీవేవ్‌ ఎనర్జీ       4) పైవన్నీ

జ: 4

8. కిందివాటిలో సరికానిది?

1) ముడి చమురు సంప్రదాయ, పునరుత్పత్తి చెందని వనరు. 

2) పవన శక్తి సంప్రదాయేతర, పునరుత్పత్తి చెందే వనరు.

3) జియోథర్మల్‌ శక్తి నవీన, పునరుత్పత్తి చెందే వనరు.

4) సహజ వాయువు సంప్రదాయ, పునరుత్పత్తి చెందే వనరు.

జ: 4

9. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

   1) 1890       2) 1986      3) 1980        4) 1952

జ: 2

రచయిత: జల్లు సద్గుణరావు 

Posted Date : 27-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

అటవీ వనరులు - సంరక్షణ

తరగని సంపదకు.. తరాల సంక్షేమానికి!

భూగోళమనే శరీరానికి అడవులే ఊపిరితిత్తులు. అవి వాయు కాలుష్యాన్ని నివారించి జీవరాశికి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారాన్ని అందిస్తాయి. అత్యంత విలువైన, ఎన్నటికీ తరిగిపోని ఆ సహజ సంపదను అందరూ కాపాడుకోవాలి. వనాలు క్షీణించే కొద్దీ కాలుష్యం, భూతాపం పెరిగిపోతాయి. వర్షాలు గతి తప్పుతాయి. దాంతో ఆహార సంక్షోభం సంభవిస్తుంది. అలాంటి సమస్యల నిరోధానికి, భవిష్యత్తు తరాల సంక్షేమానికి అడవులను రక్షించుకోవడం చాలా అవసరం. అందుకే మన దేశంలో అడవుల స్థితిగతులు, వాటిలో రకాలు, సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలను కాబోయే ప్రభుత్వ ఉద్యోగులు తెలుసుకోవాలి.

ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపదలో అడవులు, ఉద్భిజ్జ సంపద అత్యంత ప్రధానమైనవి. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగే వృక్షాలను అడవులుగా భావిస్తే, వాటితో పాటు ఉండే గడ్డి మైదానాలు, పొదలు, మొక్కలు, లతలు అన్నింటినీ కలిపి ఉద్భిజ్జ సంపదగా పరిగణిస్తారు. ఫారెస్ట్‌ అనే పదం ఫోరెస్‌ (Fores) అనే లాటిన్‌ పదం నుంచి పుట్టింది. అడవులు పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా, మానవుడి ఆర్థిక, సామాజిక అవసరాలను తీరుస్తున్నాయి. మన దేశంలో 1987 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి అడవుల లెక్కలను ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సేకరిస్తోంది. 2021లో సేకరించిన 17వ ఇండియన్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ ప్రకారం (ISFR) దేశంలో 7,13,789 చ.కి.మీ. (71.37 మిలియన్ల హెక్టార్లు) మేర అడవులున్నాయి. దేశ వైశాల్యంలో 21.71% విస్తరించాయి. 2019 నాటి ఐఎస్‌ఎఫ్‌ఆర్‌ లెక్కలతో పోలిస్తే 1,540 చ.కి.మీ. మేర అడవులు పెరిగాయి. ఈ పెరుగుదల అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తర్వాత తెలంగాణ, ఒడిశాలలో ఉంది.

విస్తరణ స్థితిగతులు

మన దేశ అడవులు ప్రపంచ అడవుల్లో 2% మాత్రమే ఉన్నప్పటికీ 10వ స్థానంలో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ వారి గ్లోబల్‌ ఫారెస్ట్‌ రిసోర్సెస్‌ అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధిక అడవులు ఉన్న దేశాలు వరుసగా 1) రష్యా 2) బ్రెజిల్‌ 3) కెనడా.

దేశంలో అడవులు అత్యధికంగా విస్తరించిన రాష్ట్రం మధ్యప్రదేశ్‌ అయితే, అడవుల శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం మిజోరం.


అడవుల విస్తీర్ణం రాష్ట్రాల్లో..

అత్యధికం                       

1. మధ్యప్రదేశ్‌               

2. అరుణాచల్‌ప్రదేశ్‌       

3. ఛత్తీస్‌గఢ్‌                 

అత్యల్పం

1. హరియాణా

2. పంజాబ్‌

3. గోవా

             

కేంద్రపాలిత ప్రాంతాల్లో..

అత్యధికం                                

1. జమ్ము-కశ్మీర్‌                     

2. అండమాన్‌ నికోబార్‌ దీవులు    

3. లద్దాఖ్‌                               

అత్యల్పం

1. చండీగఢ్‌

2. లక్షదీవులు

3. పుదుచ్చేరి

అడవుల శాతం రాష్ట్రాల్లో..

అత్యధికం                               

1. మిజోరం (85%)               

2. అరుణాచల్‌ ప్రదేశ్‌ (79%)   

3. మేఘాలయ (76%)         

అత్యల్పం

1. హరియాణా (3.63%)

2. పంజాబ్‌ (3.67%)

3. రాజస్థాన్‌ (4.87%)

కేంద్రపాలిత ప్రాంతాల్లో...

అత్యధికం                             

1. లక్షదీవులు (90.33%)     

2. అండమాన్‌ నికోబార్‌ దీవులు (82%)    

3. జమ్ము-కశ్మీర్‌ (39%)    

అత్యల్పం

1. లద్దాఖ్‌ (1.35%)   

2. పుదుచ్చేరి (11%)

3. దిల్లీ (13%)

                      

దేశంలో అడవుల ప్రాంతీయ వర్గీకరణను గమనిస్తే అత్యధిక శాతం అడవులు ద్వీపకల్ప పీఠభూమిపై (57%) ఉన్నాయి. హిమాలయాలపైన 18%; పశ్చిమ కనుమలు, పశ్చిమ తీరంలో 10%; తూర్పు కనుమలు, తూర్పు తీరంలో 10%; మిగిలిన 5 శాతం ఉత్తర మైదానాల మీద విస్తరించి ఉన్నాయి.


అడవుల్లో రకాలు 

సాధారణంగా అడవులు వర్షపాతం, గాలిలో తేమ, ఉష్ణోగ్రత, సముద్ర మట్టం నుంచి ఎత్తు వంటి వాటిపై ఆధారపడి పెరుగుతాయి. భారతదేశంలో అనేక నిమ్నోన్నతాలు, శీతోష్ణ స్థితిగతుల్లో ప్రాంతాల మధ్య వ్యత్యాసాల వల్ల వివిధ రకాల అడవులు విస్తరించి ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు భారతదేశ అడవులను ఎన్నో విధాలుగా విభజించినప్పటికీ సాధారణ అవగాహన కోసం దేశంలో అడవులను కింది విధంగా వర్గీకరించవచ్చు.

ఉష్ణ మండల సతతహరిత అరణ్యాలు: ఈ రకం దేశంలో 21 శాతం విస్తరించి ఉన్నాయి. ఇవి పెరగడానికి 200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం, సముద్ర మట్టం నుంచి 500 - 1500 మీ. కంటే ఎత్తయిన ప్రాంతం కావాలి. అందువల్ల ఇవి పశ్చిమ కనుమల పశ్చిమ భాగాల్లోనూ, అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ, అండమాన్‌ - నికోబార్‌ దీవుల్లో విస్తరించి ఉంటాయి. ఈ అడవుల్లో మహాగని, ఎబోని, రోజ్‌వుడ్, సింకోనా, సేముల్, ఇరులా లాంటి పొడవైన కాండాలు, వెడల్పయిన ఆకులు, గట్టి కలపనిచ్చే చెట్లు పెరుగుతాయి.

ఉష్ణమండల ఆకురాల్చు అడవులు: మన దేశ అడవుల్లో ఈ రకం అత్యధికంగా 65 శాతం ఉన్నాయి. 100 - 200 సెం.మీ. వర్షపాతం, సముద్ర మట్టం నుంచి 500 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. కొండవాలులు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు వీటికి అనుకూలం. ద్వీపకల్పం మీద, అన్ని పీఠభూముల్లో, తూర్పు కనుమల వెంబడి శివాలిక్‌ హిమాలయాల్లోనూ, లక్షదీవులు, అండమాన్‌ నికోబార్‌ తూర్పు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లోనూ గట్టి కలప, వెడల్పు ఆకులుండే టేకు, మద్ది, సాల్, గంధపు చెట్లు, వెదురులాంటి వృక్ష సంపద ఉంటుంది.

ఉష్ణమండల పొదలు లేదా ఎడారి పొదలు: ఇవి ఎక్కువగా వాయవ్య భారత దేశంలోనూ, ద్వీపకల్పంలో కొండల తూర్పు భాగాల్లోని వర్షచ్ఛాయా ప్రాంతాల్లో 2% మేర విస్తరించి ఉన్నాయి. వీటికి 100 సెం.మీ. కంటే తక్కువ వర్షం సరిపోతుంది. ఇందులో తాటి, ఈత, కర్జూరం చెట్లు, బ్రహ్మజెముడు, నాగజెముడు వంటి పొదలు, చిన్న ఆకులు, దళసరి ఆకులుండే వృక్ష సంపద పెరుగుతుంది. ఇవి బాష్పోత్సేకాన్ని నిరోధిస్తాయి. కాబట్టి వీటిని ‘జీరోఫైట్స్‌’ వృక్షసంపద అంటారు.

హిమాలయ పర్వత అడవులు: ఎత్తయిన హిమాలయాల్లో పెరిగే వృక్షసంపద. ఇవి మిగతా ప్రాంతాలతో పోలిస్తే మంచులో పెరిగే ఆల్ఫైన్‌ అడవులు, సమశీతల శృంగాకార అడవుల వృక్ష సంపద ఉంటాయి. ఉదా: విల్లో, ఆల్టర్, దేవదారు, ఓక్‌ సిల్వర్‌ పర్‌.

మడ అడవులు: ఇవి ఉప్పు నీరు కలిసిన డెల్టాలు, ఈస్చ్యురీల్లో (నదీముఖాలు) పెరుగుతాయి. వీటినే టైడల్‌ ఫారెస్ట్‌ లేదా క్షారజల అరణ్యాలు అంటారు. ఇవి మన దేశంలో 2% మాత్రమే ఉన్నాయి. సముద్రతీరం ఉన్న 9 రాష్ట్రాలు, అండమాన్‌-నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, దాద్రానగర్‌ హవేలి ప్రాంతాల్లో అక్కడక్కడా విస్తరించి ఉన్నాయి. ఇవి సునామీలకు సహజ అడ్డుగోడలుగా ఉపయోగపడతాయి. వీటికి శ్వాసవేళ్లు, కాండాలలో గాలి గదులు ఉంటాయి. వీటితో చేపల వేటకు వాడే సంప్రదాయ పడవలను ఎక్కువగా తయారు చేస్తుంటారు.


అటవీ సంరక్షణకు ప్రభుత్వ చర్యలు

* అటవీ చట్టం - 1927

* వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972

* పులిని జాతీయ జంతువుగా ప్రకటించిన సంవత్సరం - 1972

* మొదటిసారిగా పులుల సంరక్షణ ప్రాంతాలను ఏర్పాటు చేసిన సంవత్సరం - 1973

* అటవీ పరిరక్షణ చట్టం - 1980

* పర్యావరణ చట్టం - 1986

* జీవ వైవిధ్య చట్టం - 2002

* వన మహోత్సవ కార్యక్రమం - ప్రతి సంవత్సరం జులైలో

* 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అడవులను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఆదేశిక సూత్రాల్లో కూడా పొందుపరిచారు.

* సామాజిక అడవుల కార్యక్రమం - 1980-82


మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో మడ అడవులు లేని రాష్ట్రం ఏది?

1) పశ్చిమ బెంగాల్‌     2) తమిళనాడు     3) ఆంధ్రప్రదేశ్‌       4) అస్సాం

జ: అస్సాం

2. అడవుల విస్తీర్ణం అత్యధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) లద్దాఖ్‌      2) జమ్ము-కశ్మీర్‌      3) అండమాన్‌ - నికోబార్‌ దీవులు     4) లక్షదీవులు

జ: జమ్ము-కశ్మీర్‌

3. కింది ఏ అడవుల్లో జీవవైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది?

1) దట్టంగా పెరిగే సతతహరిత అరణ్యాలు 

2) గడ్డి భూములు ఎక్కువగా ఉండే ఆకురాల్చు అడవులు

3) ముళ్ల పొదలు ఎక్కువగా ఉండే ఎడారి పొదలు

4) హిమాలయాల్లోని అడవులు

జ: గడ్డి భూములు ఎక్కువగా ఉండే ఆకురాల్చు అడవులు

4. కోరింగ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఒడిశా      2) తమిళనాడు     3) కేరళ     4) ఆంధ్రప్రదేశ్‌

జ: ఆంధ్రప్రదేశ్‌​​​​​​​

5. జాతీయ అటవీ విధాన తీర్మానం ప్రకారం దేశంలో ఎంత శాతం అడవులు ఉండాలి?

1) 33.3%     2) 23.3%    3) 43.3%     4) 53.3%

జ: 33.3%

6. ఫారెస్ట్‌ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది?

1) గ్రీకు      2) అరబ్బీ     3) లాటిన్‌      4) స్పానిష్‌

జ: లాటిన్‌​​​​​​​

7. మన దేశంలో 90% కి మంచి అడవులు ఉన్న ప్రాంతం ఏది?

1) మిజోరం      2) లక్షదీవులు      3) అండమాన్‌ - నికోబార్‌      4) మధ్యప్రదేశ్‌

జ: లక్షదీవులు​​​​​​​

8. కింది ఏ దేశం మొదటిసారిగా అడవుల నరికివేతను నిషేధించింది?

1) డెన్మార్క్‌       2) నార్వే       3) అమెరికా      4) రష్యా

జ: నార్వే​​​​​​​

9. అడవి గాడిదల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?

1) కచ్, గుజరాత్‌     2) రాంచి, ఝార్ఖండ్‌     3) జోర్హాట్, అస్సాం    4) ఎర్నాకులం, కేరళ

జ: కచ్, గుజరాత్‌​​​​​​​

10. దేశంలో అత్యల్పంగా అడవులున్న రాష్ట్రం?

1) పంజాబ్‌       2) హరియాణా      3) రాజస్థాన్‌        4) సిక్కిం

జ: హరియాణా​​​​​​​


రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 25-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవ వైవిధ్యం

భిన్నత్వంతోనే జీవజాతికి స్థిరత్వం!

జీవసంపద పుష్కలంగా, వైవిధ్యంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. భిన్న వాతావరణ పరిస్థితులు, పర్యావరణ అనుకూలతలు కలిగి రకరకాల వృక్ష, జంతు జాతులతో గొప్ప జీవవైవిధ్య కేంద్రంగా నిలిచింది. భూమిపై జీవవైవిధ్యం అసమానంగా, కొన్ని ప్రాంతాలకే పరిమితం కాగా మన దేశం మాత్రం అనాదిగా జైవిక సంపదతో అలరారుతోంది. పిచ్చుక నుంచి ఏనుగు వరకు, గడ్డిపోచల నుంచి మహావృక్షాల వరకూ లక్షలాది రకాల జీవజాలం ఇక్కడ ఉన్నాయి. ఈ తరహా విశేషాల గురించి పోటీ పరీక్షలు రాసేవారికి శాస్త్రీయ అవగాహన ఉండాలి. దేశంలోని జీవ భౌగోళిక మండలాల ప్రత్యేకతలు, పెరిగే జీవజాతుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

భూమిపై ఉన్న జీవసంపద సంక్లిష్టం, వైవిధ్యభరితం. ఆ జీవ జాతుల మధ్య ప్రత్యేకతలను తెలియజేసేదే జీవ వైవిధ్యం. భౌమ, జలావరణ వ్యవస్థల్లోని సమస్త జీవజాతుల మధ్య జన్యు పరమైన, జాతి సంబంధిత, ఆవరణ వ్యవస్థల తీరుల్లో ఉన్న తేడాలను జీవ వైవిధ్యం అంటారు. 1992లో బ్రెజిల్‌లోని రియోలో జరిగిన జీవవైవిధ్య ఒప్పంద సదస్సులో ఈ మేరకు నిర్వచనం ఇచ్చారు. రేమండ్‌ ఎఫ్‌.డోస్‌మన్‌ అనే శాస్త్రవేత్త మొదట 1967లో జీవసంబంధ వైవిధ్యం (బయోలాజికల్‌ డైవర్సిటీ) అనే పదాన్ని ఉపయోగించాడు. దీన్నే 1985లో డబ్ల్యూ.జి.రోజెన్‌ అనే శాస్త్రవేత్త జీవవైవిధ్యం (బయో డైవర్సిటీ)గా ప్రయోగించాడు. జీవవైవిధ్యాన్ని మూడు విధాలుగా పేర్కొంటారు.

1) జన్యు వైవిధ్యం: ఒక జాతి జీవుల్లోని జన్యువుల లక్షణాల్లో ఉన్న భేదాలతోపాటు విభిన్న జాతుల జీవుల మధ్య ఉన్న జన్యువుల సంఖ్యలోని తేడాలనూ జన్యు వైవిధ్యం అంటారు. అలాంటి వైవిధ్యాలు తర్వాతి తరాలకు సంక్రమిస్తాయి. ఆ వైవిధ్యం అధికంగా ఉన్న జాతుల్లో పరిసరాలకు అనుగుణంగా శరీర అవయవాల్లో మార్పులు ఏర్పడి, ఎక్కువకాలం మనుగడ సాగిస్తాయి.

ఉదా: మనిషిలో 35 వేల నుంచి 45 వేల జన్యువులు, వరిలో 30 వేల నుంచి 50 వేల జన్యువులు ఉంటాయి.

2) జాతుల వైవిధ్యం: ఒక ప్రమాణ వైశాల్యం ఉన్న ప్రాంతంలో నివసించే జాతుల మధ్య శారీరకమైన తేడాల్లో ఉండే వైవిధ్యాన్ని జాతుల వైవిధ్యం అంటారు. ఒక ప్రాంతంలో ఎన్ని రకాల జీవులు నివసిస్తే అక్కడ అంత జాతి వైవిధ్యం ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఒక భౌగోళిక ప్రాంతంలో జాతుల ఆధిపత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా అక్కడి జాతుల ఆధిపత్యం, సంపన్నత్వం, సమానత్వం గురించి తెలుసుకోవచ్చు. భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ జాతుల వైవిధ్యం సాధారణంగా తగ్గుతుంది. ఇందుకు కారణం శీతోష్ణ పరిస్థితుల్లో మార్పు ఉండటమే. సముద్ర ఆవరణ వ్యవస్థలో కూడా ఖండతీరపు అంచులో జాతుల సంపన్నత్వం ఎక్కువగా ఉంటుంది. జాతుల వైవిధ్యంపై ఆధారపడి ఒక జాతి ఆహారం పొందడమనేది అక్కడ లభించే ఇతర జాతులను బట్టి ఉంటుంది. ఆ విధంగా జాతుల వైవిధ్యం ఆవరణ వ్యవస్థ స్థిరత్వాన్ని సూచిస్తుంది.

3) ఆవరణ వ్యవస్థల వైవిధ్యం: జీవావరణంలోని విభిన్న ఆవరణ వ్యవస్థల మధ్య తేడాలు, వైవిధ్యాలనే ఆవరణ వ్యవస్థల వైవిధ్యం అంటారు. శీతోష్ణస్థితి, నైసర్గిక స్వరూపాల్లోని వైవిధ్యం వల్ల ఒక ఆవరణ వ్యవస్థలో అనేక రకాల జాతులు, వివిధ పరిమాణాల్లో నివసిస్తుంటాయి.

ఉదా: ఉష్ణమండల వర్షాధార ఆవరణ వ్యవస్థ, గడ్డి భూముల ఆవరణ వ్యవస్థ, మాంగ్రూవ్‌ అడవుల ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ తదితరాలు.

జీవ వైవిధ్య గణన: 1972లో విట్టేకర్‌ అనే శాస్త్రవేత్త జీవ వైవిధ్య గణనకు మూడు కొలమానాలు సూచించాడు.

1) ఆల్ఫా వైవిధ్యం: ఇది ఒక ప్రాంతంలో లేదా ఒక ఆవరణ వ్యవస్థలో జాతుల వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా ఒక ఆవరణ వ్యవస్థలోని జాతుల సంఖ్య లేదా జాతుల సంపన్నత్వాన్ని సూచిస్తుంది. 

2) బీటా వైవిధ్యం: విభిన్న ఆవరణ వ్యవస్థల మధ్య భిన్నత్వాన్ని తెలియజేస్తుంది. ఇది సాధారణంగా ఆవరణ వ్యవస్థల మధ్య జాతుల సంఖ్యలో మార్పులను అంచనా వేసే విధానం.

3) గామా వైవిధ్యం: ఒక ప్రాంతంలోని విభిన్న ఆవరణ వ్యవస్థల మధ్య వైవిధ్యాన్ని, ఆవరణ వ్యవస్థలోని జీవ సముదాయాలు, కలిగే మార్పులను, జాతుల సంపన్నత్వాన్ని సూచిస్తుంది.

భారతదేశ జీవవైవిధ్య సంపద - ప్రాంతీయ విభాగాలు:

* ప్రపంచ వైశాల్యంలో భారత్‌ భూభాగం 2.4% మాత్రమే ఉన్నప్పటికీ జీవజాతుల్లో 7% కలిగి ఉంది. మానవ జనాభాలో 18% ఇక్కడే ఉంది.

* ప్రపంచంలోని మెగా జీవవైవిధ్య ప్రాంతాల్లో భారతదేశం ఒకటి. క్షీరదాల్లో 7వ స్థానం, సరీసృపాల్లో 5వ స్థానం, పక్షుల్లో 9వ స్థానం కలిగి ఉంది.

* దేశంలోని వృక్షజాతుల్లో 33%, జంతు జాతుల్లో 50% స్థానికమైనవి ఉన్నాయి.

రెండు.. అయిదు.. పది!


మన దేశంలోని జీవ సంపదను రెండు జీవరాజ్యాలు, అయిదు సహజ మండలాలు, పది జీవభౌగోళిక ప్రాంతాలుగా విభజించవచ్చు.


జీవరాజ్యాలు:  ఒకే రకమైన లక్షణాలున్న చెట్లు, జంతువులతో కూడిన ఖండం లేదా ఉపఖండమంత విస్తీర్ణం ఉన్న ప్రాంతాలను జీవరాజ్యం అంటారు. అక్కడి ఆవరణ వ్యవస్థలన్నీ విశాలంగా ఒకే లక్షణాలు కలిగి ఉంటాయి. ప్రపంచంలో 8 ప్రాదేశిక జీవ భౌగోళిక రాజ్యాలు ఉన్నాయి. వాటిలో రెండింటిని మన దేశం కలిగి ఉంది. అవి 1) హిమాలయాల ప్రాంతంలో పాలియార్కిటిక్‌ జీవరాజ్యం 2) దేశంలో మిగిలిన ఉపఖండమంతా ఉన్న మలయన్‌ జీవరాజ్యం.


సహజ జీవ మండలాలు: నిర్దిష్టమైన శీతోష్ణ పరిస్థితుల్లో వృక్ష, జంతు సముదాయాలు ఉండే ప్రదేశాలను సహజ జీవ మండలాలు అంటారు. అవి అక్కడి మృత్తికలకు, పరిస్థితులకు అలవాటు పడి మనుగడ సాగిస్తాయి. మన దేశంలో సహజ జీవమండలాలను అయిదు రకాలుగా విభజించారు. 1) ఉష్ణమండల తేమ అడవుల మండలం 2) ఉష్ణమండల పొడి లేదా ఆకురాల్చే అడవుల మండలం (ఇందులో రుతుపవన అడవులు కలిసి ఉంటాయి) 3) వెచ్చని ఎడారి, అర్ధ ఎడారి మండలం 4) శృంగాకార అడవుల మండలం 5) హిమాలయ అంచుల్లోని ఆల్ఫైన్‌ గడ్డి మండలాలు


జీవ భౌగోళిక ప్రాంతాలు: భౌగోళికంగా వృక్షాలు, జంతువుల విస్తరణను తెలియజేసేదే జీవ భౌగోళిక శాస్త్రం. దీని ప్రకారం వృక్ష, జంతు జాతులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి.


హిమాలయాల పైభాగం (ట్రాన్స్‌హిమాలయాలు): టిబెట్‌ పీఠభూమి, జమ్ము-కశ్మీర్‌లోని లద్దాఖ్, హిమాచల్‌ ప్రదేశ్‌లోని లాహౌల్‌ - స్పితిలతో కూడిన ప్రాంతం. ఇది దేశ వైశాల్యంలో 5.7% ఆక్రమించి ఉంది. ఇక్కడ పర్వత సంబంధ మొక్కలే పెరుగుతాయి. అడవి మేకలు, గొర్రెలు లాంటి జంతువులు ఉంటాయి. కొన్ని వలస పక్షులు కూడా నివసిస్తాయి. ఈ ప్రాంతంలో ఉండే క్రూర మృగం మంచు చిరుత.


హిమాలయ భాగం: ఇది జమ్ము-కశ్మీర్‌లో వాయవ్యం నుంచి ఈశాన్యంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు విస్తరించి ఉంది. దేశ భూభాగంలో 6.9% ఆక్రమించిన ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. సాల్, సీసం, జమూన్‌ లాంటి వృక్షాలు; 3000 మీటర్ల ఎత్తులో సిల్వర్‌ ఫర్, రెడో డెండ్రాన్లు లాంటి ఆల్ఫైన్‌ వృక్ష సంపద ఉంటుంది. గొర్రెలు, మేకలు, జింకలు వంటి జంతు సంపద, వివిధ రకాల పక్షులు కనిపిస్తాయి.


ఎడారి ప్రాంతం: ఈ ప్రాంతం ఆరావళి పర్వతాలకు పశ్చిమ భాగాన రాజస్థాన్‌లో, గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దేశ వైశాల్యంలో 6.9% ఆక్రమించింది. ఇక్కడ వార్షిక వర్షపాతం 25 సెం.మీ. కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల బాష్పోత్సేకాన్ని నిరోధించే తుమ్మ, బలుసు, రేగు, బ్రహ్మజెముడు, నాగజెముడు లాంటి జిరోఫైట్స్‌ వర్గానికి చెందిన పొదలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ భౌమ మండలంలో సింహాలు, పులులు, జింకలు, తోడేళ్లు, గాడిదలు, బట్ట మేకల పక్షి లాంటివి నివసిస్తాయి.


అర్ధ శుష్క మండలం: మధ్యప్రదేశ్‌లో కొంత ప్రాంతం, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో కొంత ప్రాంతం ఈ జీవ భౌగోళిక మండలంలో ఉంది. ఇది ఎడారికి, దక్కన్‌ పీఠభూమికి మధ్య ప్రాంతం. దేశ వైశాల్యంలో 15.6% ఆక్రమించిన ఈ ప్రాంతం పాక్షిక ఎడారి లక్షణాలతో ఉంటుంది. ఆకురాల్చే అడవులు ఎక్కువ. టేకు, మోదుగ, తంగేడు లాంటి చెట్లు ఉంటాయి. పులులు, జింకలు, నక్కలు, దుప్పులు లాంటి జంతు సంపద ఉంటుంది.


పశ్చిమ కనుమల ప్రాంతం: ఇది మహారాష్ట్ర నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన కొండల ప్రాంతం. నైరుతి రుతువులో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. మహాగని, ఎబోని, రోజ్‌వుడ్‌ లాంటి బలమైన చెట్లు పెరుగుతాయి. ఎప్పుడూ ఆకుపచ్చగా ఉండే సతత హరితారణ్యాలు విస్తరించి ఉంటాయి. ఏనుగులు, పులులు, బ్లాక్‌ మంకీస్‌ లాంటి రకరకాల కోతులు, నీలగిరి తహర్‌ దుప్పులు, జింకలు వంటి గొప్ప జీవవైవిధ్యం ఉంది.


దక్కన్‌ ద్వీపకల్ప ప్రాంతం: చోటా నాగ్‌పుర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు వరకు విస్తరించి ఉంది. ఈ మండలంలో వార్షిక వర్షపాతం 100 సెం.మీ. ఉన్న పీఠభూములు ఉంటాయి. చాలావరకు తేమ ఆకురాల్చే పర్వత వెనుక భాగాల్లో శుష్క ఆకురాల్చే అడవులు విస్తరించి ఉంటాయి. టేకు, మద్ది, గంధపుచెట్టు, ఎర్రచందనం, వెదురు, మోదుగ లాంటి వృక్షాలకు ప్రసిద్ధి. పులులు, జింకలు, దుప్పులు, అడవి దున్నలు, తోడేళ్లు లాంటి జంతువులు నివసిస్తాయి.


ఈశాన్య భారత ప్రాంతం: అత్యంత జీవవైవిధ్యమున్న ప్రాంతం. అత్యధిక వర్షపాతం ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ నుంచి అన్ని ఈశాన్య రాష్ట్రాలు ఇందులో ఉంటాయి. సాల్, చెంప, ఎత్తయిన వెదురు లాంటి వృక్ష సంపద, గిబ్బస్‌ కోతులు, రెడ్‌ పాండా, ఖడ్గమృగాలు, బెంగాల్‌ రాయల్‌ టైగర్స్‌ లాంటి జంతుసంపదకు ప్రసిద్ధి. నెపెంథిస్‌ లాంటి కీటకాహార మొక్కలకు ఈ ప్రాంతం ప్రత్యేకం. అనేక రకాల పక్షులు కనిపిస్తాయి.


గంగా మైదాన ప్రాంతం: ఇది గంగా, దాని ఉపనదుల ప్రాంతమైన ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. దేశ వైశాల్యంలో 11% ఆక్రమించింది. సారవంతమైన నేలలు జంతు, వృక్షసంపద కంటే వివిధ రకాల పాడిపంటలకు అనుకూలం. వేప, చింత, మామిడి లాంటి కొన్నిరకాల వృక్షాలు; దుప్పులు, జింకలు వంటి జంతువులకు అనుకూలం.


దీవులు: బంగాళాఖాతంలోని అండమాన్‌ నికోబార్‌ దీవులు, అరేబియా సముద్రంలోని లక్షదీవులు జీవభౌగోళిక, సముద్ర ప్రభావిత ప్రాంతాలు. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వర్షాలు ఎక్కువ. అందువల్ల దట్టమైన అడవులు, చెట్లపై నివసించే పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. మధ్యస్థ వర్షపాతం ఉండే లక్షదీవుల్లో ఆకురాల్చే పలుచని అడవులు విస్తరించి ఉంటాయి. ప్రవాళ బిత్తికలతో ఆవరించిన ఈ దీవులు ప్రత్యేక జీవ వైవిధ్య సంపదగా నిలిచాయి.


తీర ప్రాంతాలు: భారతదేశానికి 7,516 కి.మీ. పొడవైన తీరం ఉంది. తీరం అంచుల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. లక్షదీవులు తప్ప తీరం ఉన్న అన్ని ప్రాంతాల్లో విస్తరించిన మడ అడవులు గొప్ప జీవ వైవిధ్యానికి ప్రతీకలు.

రచయిత: జల్లు సద్గుణరావు
 

Posted Date : 19-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవవైవిధ్య సంరక్షణ

జీవజాతులను కాపాడుకుందాం!


   సృష్టిలోని ప్రతి జీవి సహజ ఆవరణ వ్యవస్థలో భాగమే. పరస్పర ఆధారితమే. మనిషి చేసే అభివృద్ధి కార్యకలాపాలు, మితిమీరిన వనరుల వినియోగం వల్ల ఎన్నో జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పటికే కొన్ని వేల రకాల జంతు, వృక్ష జాతులు కనుమరుగయ్యాయి. చాలా జాతుల ఉనికి ప్రమాదపుటంచుల్లో కొనసాగుతోంది. ఈ పరిస్థితిపై అవగాహన పెంచి జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు ప్రపంచవ్యాప్త కృషి జరుగుతోంది. అందులోనూ భూభాగం కంటే జీవ వైవిధ్య వాటా నాలుగు రెట్లున్న భారతదేశంలో గట్టి ప్రయత్నమే సాగుతోంది. పర్యావరణ పరిరక్షణను పౌరుల ప్రాథమిక విధిగా, వన్యప్రాణుల సంరక్షణను ప్రభుత్వాల బాధ్యతగా రాజ్యాంగం నిర్దేశించింది. ప్రమాద పరిస్థితుల్లో ఉన్న జాతుల వర్గీకరణ, వాటి సంరక్షణకు చేపడుతున్న చర్యలను పోటీపరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి.

 
  అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ -IUCN) అనేది ప్రకృతి, వనరుల పరిరక్షణ కోసం పాటుపడుతుంది. ఈ సంస్థ అధ్యయనం, విశ్లేషణల ద్వారా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో మోర్గెస్‌లోని గ్లాండ్‌ ప్రాంతంలో ఉంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవ చర్యల వల్ల ప్రమాద స్థితిలో ఉన్న వృక్ష, జంతు జాతులను గుర్తించి, వాటి సంరక్షణ, నిర్వహణ చర్యలను సూచిస్తూ మొదటిసారిగా రెడ్‌ డేటా బుక్‌ను 1966లో ప్రచురించింది. ఈ బుక్‌లోని గులాబీ రంగున్న పేజీల్లో తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జీవజాతులను నమోదు చేస్తారు. ఆకుపచ్చ పేజీల్లో గతంలో అంతరించే స్థాయిలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ స్థితిలో లేని జాతులను పేర్కొంటున్నారు. ఈ ఆకుపచ్చ పేజీలు పెరుగుతూ ఉంటే జీవసంరక్షణ చర్యలు అధికమవుతున్నట్లు భావించవచ్చు. IUCN సంస్థ వివిధ జాతుల వివరాల ఆధారంగా వాటిని రకరకాలుగా విభజించింది.


1) అంతరించిపోయిన జాతులు: వీటినే విలుప్తం చెందిన జీవులు అని కూడా అంటారు. ఒక జాతికి చెందిన జీవి ప్రాంతీయంగా/దేశాల్లో/ఖండాల్లో/ప్రపంచంలో ఎక్కడా జీవించే ఆనవాళ్లు లేని లేదా చివరి జీవి కూడా అంతరించినట్లయితే దాన్ని గతించిన జాతిగా గుర్తిస్తారు. ఉదా: డైనోసార్లు, దొడా పక్షి, ఆసియా చిరుతలు, ఊదారంగు తల ఉండే బాతు.


2) తీవ్ర అంతర్థాన స్థితిలో ఉన్న జాతులు: వీటినే విలుప్త స్థితికి దగ్గరగా ఉన్న జీవులు అంటారు. దాదాపు అంతరించే స్థితికి చేరిన జీవులను ఈ జాబితాలో చేరుస్తారు. అంటే మనిషి ప్రత్యక్షంగా వాటిని సంరక్షిస్తే తప్ప వాటి మనుగడ సాధ్యం కాని స్థితిలో ఉన్న జీవజాతులు అని అర్థం. ఈ జాతి జీవులుగా పేర్కొనాలంటే వాటికి కొన్ని లక్షణాలు ఉండాలి.


ఎ) గత పదేళ్లలో వాటి సంఖ్య 90% కంటే తగ్గిపోయి ఉండాలి. 


బి) వాటి జనాభా సంఖ్య 50 కంటే తక్కువగా ఉండాలి.


సి) అటవీ జీవులు అయితే పదేళ్లలో వాటి సంఖ్య 50% తగ్గిపోయి ఉండాలి.


ఉదా: ఇండియన్‌ వైల్డ్‌యాస్, ఇండియన్‌ రైనో, లయన్‌ టైల్డ్‌ మకాక్, మలబార్‌ కెవిట్, అతిచిన్న అడవి పంది, ఎగిరే ఉడుత (అరుణాచల్‌ప్రదేశ్‌లో నమ్‌దపా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కనిపిస్తుంది), శేషాచలం అడవుల్లో కనిపించే పునుగు పిల్లి, బంగారు బల్లి, ఉడుము, హిమాలయాల్లో కనిపించే కస్తూరి మృగం, బట్టమేకల పక్షి, అండమాన్‌ స్రౌ, గుడ్లగూబలు.


3) అంతర్థాన స్థితిలో ఉన్న జీవులు: ఆవాసాల ఆక్రమణలు, వేటాడటం లాంటి చర్యల వల్ల కొన్ని జాతుల్లో అక్కడక్కడా మిగిలి ఉన్నజీవులు ఇవి. వీటిని కాపాడకపోతే భవిష్యత్తులో విలుప్త స్థితికి దగ్గరవుతాయి. ఈ విభాగానికి కొన్ని లక్షణాలు ఉండాలి.


ఎ) గత పదేళ్లలో వీటిసంఖ్య 70% కంటే తక్కువకు పడిపోవాలి.


బి) ప్రస్తుతం వీటి సంఖ్య 250 వరకు ఉండాలి.


సి) అవి క్రూర జీవులైతే గత 20 ఏళ్లలో 20% వరకు అంతరించి ఉండాలి.

ఉదా: బెంగాల్‌ టైగర్, రెడ్‌ పాండా, బ్లూవేల్, ఇండియన్‌ ఎలిఫెంట్, సాంగై దుప్పి, గంగానది డాల్ఫిన్, ఏషియాటిక్‌ లయన్, గ్రీన్‌ టర్టిల్, ఈజిప్ట్‌ రాబందు లాంటివి.


4) దుర్బల స్థితిలోని జీవులు: ఎలాంటి పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ప్రమాదస్థితికి చేరే జీవులు. ఈ జాబితాలో చేర్చడానికి నిర్దేశిత లక్షణాలు ఉండాలి.


ఎ) గత పదేళ్లలో ఆ జీవులు 50 శాతానికి తగ్గిపోయి ఉండాలి.


బి) ఆ జాతి సంఖ్య 10,000 కంటే తక్కువ ఉండాలి.


సి) క్రూర జీవులైతే గత వందేళ్లలో 10% తగ్గిపోయి ఉండాలి.


ఉదా: నాలుగు కొమ్ముల దుప్పి, బరసింగా దుప్పి, బ్రౌన్‌ బేర్, స్లాత్‌ బేర్, అడవిదున్న, యాక్, మంచు పులి, సారస్‌క్రేన్, ఆలివ్‌రిడ్లే తాబేళ్లు.


5) ప్రమాదపుటంచులో ఉన్న జీవులు: తీవ్ర అంతర్థాన స్థితి, అంతర్థాన స్థితి, దుర్భల స్థితుల్లో ఉన్న జీవులన్నీ ప్రమాదపుటంచులో ఉన్న జీవులే.


6) సమీప భవిష్యత్తులో ప్రమాదంలో పడే జీవులు: తీవ్ర అంతర్థాన స్థితి, అంతర్థాన స్థితి, దుర్భల స్థితుల జాబితాల్లో చేరనివి. కానీ, భవిష్యత్తులో ఆ జాబితాల్లో చేరే అవకాశం ఉన్న జాతులు. వీటిని కాపాడుకోవాలి.


భారత్‌లో జీవసంరక్షణ చర్యలు


భారతదేశంలో చాలా కాలం నుంచీ జీవవైవిధ్య సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.


వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు: వన్యప్రాణుల సంరక్షణ కోసం మొదటగా 1895లో తమిళనాడులోని వేదాంతగళ్‌ ప్రాంతంలో పక్షుల సంరక్షణ కేంద్రం ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో 567 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కొనసాగుతున్నాయి.


జాతీయ పార్కులు: ఆవరణ వ్యవస్థను కాపాడటానికి, ప్రాంతీయ వృక్ష, జంతు జాతులకు రక్షణ కల్పించే ప్రాంతాలు. మొదట 1935లో ఉత్తరాఖండ్‌లో జిమ్‌కార్బెట్‌ నేషనల్‌ పార్కును ప్రారంభించారు. ఇప్పుడు దేశంలో 106 జాతీయ పార్కులు కొనసాగుతున్నాయి.


టైగర్‌ ప్రాజెక్టులు: పులుల సంరక్షణ కోసం 1973 నుంచి పులుల సంరక్షణ ప్రాజెక్టులు ప్రారంభించారు. దేహ్రాదూన్‌లోని ‘వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రకారం 2023, జనవరి నాటికి దేశంలో 53 టైగర్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పులుల జనాభా లెక్కించడానికి M-STIPES (మానిటరింగ్‌ సిస్టమ్‌ ఫర్‌ టైగర్స్‌ ఇంటెన్సివ్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఎకలాజికల్‌ స్టేటస్‌) అనే సాఫ్ట్‌వేర్‌ వాడుతున్నారు.


ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌: ఏనుగుల రక్షణ కోసం 1992లో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో 33 ఎలిఫెంట్‌ ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. ఏనుగులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారత పర్యావరణశాఖ ‘హాథీ మేరా సాథీ’ (ఎలిఫెంట్‌ ఈజ్‌ మై ఫ్రెండ్‌) కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.


ప్రాజెక్ట్‌ గిర్‌ లయన్‌: గుజరాత్‌లోని కథియావార్‌ ప్రాంతంలోని ఆకురాల్చే గిర్‌ అటవీ ప్రాంతాన్ని సింహాల పరిరక్షణ ప్రాంతంగా కొనసాగిస్తున్నారు. దేశంలో ఇక్కడ మాత్రమే ఈ జాతి సింహాలు కనిపిస్తాయి. ఇవి ప్రస్తుతం 674 ఉన్నాయి.


ప్రాజెక్ట్‌ రైనోస్‌ విజన్‌: దీన్ని 2005లో ప్రకటించారు. దేశంలో రైనోల సంఖ్యను 3 వేల వరకు పెంచాలని నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్‌లోని జలదాపరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ‘ఎ హోమ్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ వరల్డ్‌ రైనోస్‌’ అంటారు.


ప్రాజెక్ట్‌ క్రొకడైల్స్‌: దీన్ని 1975లో ప్రకటించారు. అత్యంత వేగంగా అంతరించిపోతున్న జాతిగా ఘరియల్‌ మొసళ్లని నిర్ణయించారు. ఇవి మధ్యప్రదేశ్‌లోని చంబల్‌ ప్రాంతంలో ప్రసిద్ధి. ఒడిశాలోని బిత్తరకనిక ప్రాంతం రాకాసి ఉప్పునీటి మొసళ్లకు ప్రసిద్ధి.


ప్రాజెక్ట్‌ సీ టర్టిల్‌: ఒడిశాలోని తీర ప్రాంతానికి ఏటా శీతాకాలంలో గాలపోగస్‌ దీవుల నుంచి ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు వలస వస్తుంటాయి. మనదేశంలో గ్రీన్‌ తాబేళ్లు, నక్షత్ర తాబేళ్ల లాంటి జాతులు కూడా నివసిస్తున్నాయి. వీటి రక్షణ కోసం 1999లో యూఎన్‌ఓతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టారు.


ప్రాజెక్ట్‌ స్నో లెపర్డ్స్‌: మన దేశంలో జమ్ము-కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో మాత్రమే మంచు చిరుతలు ఉన్నాయి. వీటి రక్షణ కోసం 2009లో ఈ ప్రాజెక్టుని ప్రారంభిస్తారు.


ప్రాజెక్ట్‌ చీతా: చీతాల ‘రీ ఇంట్రడక్షన్‌’ పేరుతో మన దేశంలో అంతరించిపోయిన చిరుత పులులను తిరిగి ప్రజననం చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం ఆఫ్రికాలోని నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి రెండు విడతలుగా చీతాలు తీసుకొచ్చారు. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో ప్రవేశపెట్టారు. చివరి చీతాను 1948లో వేటాడి చంపిన తర్వాత 1952లో భారత ప్రభుత్వం ఈ జాతి దేశంలో అంతరించిపోయినట్లు ప్రకటించింది.


రచయిత: జల్లు సద్గుణరావు


 

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణ చట్టం - భారతదేశం

పర్యావరణ సంతులనాన్ని పరిరక్షించి జీవరాశిని కాపాడటానికి పర్యావరణ యాజమాన్యానికి పటిష్ఠమైన శాసనాలు, చట్టాలు అవసరం. మనదేశంలో కాలుష్య సంబంధిత సమస్యలు పెనుసవాళ్లుగా మారాయి. వీటి నియంత్రణ, పర్యావరణాన్ని రక్షించడానికి ప్రభుత్వం కొన్ని చట్టాలను రూపొందించింది. అదేవిధంగా పర్యావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతి సహజసిద్ధ లక్షణాలను కాపాడటం; అడవులు, వన్యప్రాణుల శ్రేయస్సు దృష్ట్యా పర్యావరణ పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా గుర్తించింది.


పర్యావరణ పరిరక్షణ - లక్ష్యాలు


ఎ) పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటం.
బి) కాలుష్య కారకాల వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి జీవరాశులన్నింటినీ కాపాడటం.
సి) సహజ వనరులను పరిరక్షించడం.
డి) హక్కులు, స్వేచ్ఛ, సమానత్వానికి భంగం వాటిల్లకుండా ప్రజలందరూ సగౌరవంగా, హుందాగా జీవించే అవకాశాన్ని కల్పించడం.


పర్యావరణ రక్షణ - రాజ్యాంగ ప్రస్తావన


  పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో ప్రభుత్వం, ప్రజలు బాధ్యత వహించాలని రాజ్యాంగం నిర్దేశించింది. మొదట రాజ్యాంగంలో ఈ ప్రస్తావన లేదు. కానీ 1972 జూన్‌లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో స్టాక్‌హోం (స్వీడన్‌)లో నిర్వహించిన పర్యావరణ సదస్సులో దీన్ని సవరించారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 48(A), 51(A) (g)  నిబంధనల కింద పర్యావరణ పరిరక్షణను పొందుపరిచారు. ఇలా జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వానికి సర్వ హక్కులను ఇచ్చిన మొదటి దేశం భారత్‌.


ఉదా:


* రాజ్యాంగంలోని 21వ నిబంధన ప్రకారం జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కును సుప్రీంకోర్టు ఒక సాధనంగా పేర్కొంది.
* రాజ్యాంగంలో 47వ నిబంధన కింద ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం; పౌష్టికాహార స్థాయిని పెంచడం లాంటి అంశాలను చేర్చింది.
* రాజ్యాంగంలో 48(A) నిబంధనలో అడవులు, వన్యప్రాణులు, సహజ పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది.
* రాజ్యాంగంలో 51(A) నిబంధన కింద ప్రాథమిక విధుల్లో భాగంగా చెరువులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులు, వన సంరక్షణ, జీవవైవిధ్యాన్ని కాపాడటం పౌరుల విధిగా పేర్కొంది.


పర్యావరణ రక్షణకు ప్రభుత్వం అమలు చేసిన చట్టాలు


* 1857 పారిశ్రామిక వ్యర్థాల చట్టం


* 1879 ఏనుగు సంరక్షణ చట్టం


* 1897 మత్స్యసంపద పరిరక్షణ చట్టం


* 1905 బెంగాల్‌ పొగ ఇబ్బందుల నివారణ చట్టం


* 1927 భారతీయ అడవుల చట్టం


* 1938 మోటారు వాహనాల చట్టం


* 1946 బిహార్‌ నిరుపయోగ భూముల చట్టం


స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వం అమలు చేసిన చట్టాలు


1) కర్మాగారాల చట్టం - 1948:
1887 చట్టాన్ని సవరించి కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం కోసం 1948లో కర్మాగారాల చట్టాన్ని రూపొందించింది. పరిశ్రమల చుట్టుపక్కల నివసించే ప్రజల ఆరోగ్యం, భద్రత, పర్యావరణం గురించి ఈ చట్టంలో నిబంధనలు రూపొందించారు.


2) క్రిమిసంహారక మందుల చట్టం - 1968:
మందుల తయారీ, దిగుమతి, విక్రయం, రవాణా, పంపిణీ, వినియోగం లాంటి కార్యకలాపాలను క్రిమిసంహారక మందుల చట్టం - 1968 ద్వారా నియంత్రించవచ్చు.


3) వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972:
1972లో స్టాక్‌హోం (స్వీడన్‌)లో నిర్వహించిన పర్యావరణ సదస్సు తర్వాత దేశంలో మొదటి వన్యప్రాణులు, పక్షులు అంతరించిపోకుండా రక్షించే లక్ష్యంతో జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972ను రూపొందించారు. వన్య మృగాలను వేటాడటాన్ని ఈ చట్టం పూర్తిగా నిషేధిస్తుంది. దీన్ని 2002లో సవరించారు. ఈ చట్టం కింద ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక జాతీయ మండలిని ఏర్పాటు చేయవచ్చు. తర్వాత ఈ చట్టాన్ని 2006లో మరోసారి పార్లమెంటు ద్వారా సవరించి పులుల రిజర్వు హాట్‌స్పాట్‌లలో ‘టైగర్‌ టాస్క్‌ ఫోర్స్‌’లను ఏర్పాటుచేశారు. దీని ప్రకారం జంతువులు ప్రధానంగా పులుల చర్మం, గోర్లు లాంటి వాటితో వ్యాపారం చేయడం చట్ట వ్యతిరేకం.


4) నీటి కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం - 1974:
నీటిలో నివసించే, నీటిని వినియోగించే జీవరాశులకు హాని కలగకుండా; పరిశ్రమల ద్వారా నదులు, చెరువుల్లోకి పంపే విషపూరిత రసాయన వ్యర్థాల వల్ల నీటి కాలుష్యం పెరగడాన్ని నిషేధిస్తూ 1974లో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఇది కాలుష్య నివారణ మొదటి జాతీయ చట్టం. దీని ప్రకారం నీటి నాణ్యతను కాపాడుతూ నదులు, సరస్సులు, చెరువులు, కాలువల్లోని నీటి కాలుష్యాన్ని నియంత్రించాలి. ఈ చట్టం ప్రకారం కేంద్ర - రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లను ఏర్పాటు చేశారు.

* జాతీయ కాలుష్య నియంత్రణ మండలి న్యూదిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. దీని కింద 7 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.


5) వాయు కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం - 1981:
పారిశ్రామిక విసర్జితాలు లేదా వాహనాల నుంచి వెలువడే వివిధ ఉద్గారాలను నియంత్రించడానికి 1981లో కేంద్ర ప్రభుత్వం వాయు కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది. ఈ నిబంధనలను అతిక్రమించిన వ్యక్తులు, సంస్థలు శిక్షార్హులు. ఏడాదిన్నర నుంచి గరిష్ఠంగా 6 సంవత్సరాలు జైలు శిక్ష, పదివేల జరిమానా విధిస్తారు.


6) పర్యావరణ సంరక్షణ చట్టం - 1986:
1974 నీటి కాలుష్య నియంత్రణ చట్టం, 1981 వాయు కాలుష్య నియంత్రణ చట్టం రెండూ సమర్థంగా పర్యావరణ కాలుష్య నివారణకు ఉపయోగపడలేదని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. అన్ని రకాల కాలుష్యాల నియంత్రణ, పర్యావరణ నాణ్యత కాపాడటం కోసం కేంద్రం పార్లమెంటు ద్వారా 1986లో ఒక సమగ్ర, సార్వత్రిక చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని పర్యావరణ పరిరక్షణ చట్టం అంటారు.


7) జీవ వైవిధ్య చట్టం - 2002:
వివిధ జాతులకు చెందిన జీవులు ఉండే సమూహ ప్రాంతాలు లేదా భౌమ, సముద్ర, ఇతర జలావరణ వ్యవస్థల్లోని విభిన్న జీవరాశులు, వాటి మధ్య ఉండే వైవిధ్యాల స్వరూపాన్నే జీవవైవిధ్యం అంటారు. మన దేశంలో దీన్ని మొదటిసారిగా 2002 పార్లమెంటు చట్టం ద్వారా ఆమోదించగా 2003, అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని జీవవైవిధ్య దేశాల్లో 17వ పెద్ద దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది.


8) అటవీ హక్కుల గుర్తింపు చట్టం - 2006:
1988లో కేంద్ర ప్రభుత్వం అటవీ అభివృద్ధిలో గిరిజనులకు భాగస్వామ్యం కల్పించాలని తీసుకున్న నిర్ణయానికి పొడిగింపుగా 2006, డిసెంబరు 18న పార్లమెంట్‌ ద్వారా అటవీ హక్కుల అమలు చట్టం ఆమోదం పొందింది. ఇది 2007, డిసెంబరు 31 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం అనాధిగా నివాసముంటున్న వివిధ జాతుల సంప్రదాయ హక్కులను గుర్తించి 2005, డిసెంబరు 13కు ముందు, ఆ తర్వాత కూడా అటవీ భూములు సేద్యం చేస్తున్నవారికి వాటి మీద హక్కు లభిస్తుంది.


9) జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చట్టం - 2010:
రాజ్యాంగంలోని 21వ నిబంధనకు స్ఫూర్తిగా పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు భారత పార్లమెంటు 2010, మే 5న దీన్ని ఆమోదించింది. ఈ చట్టం న్యూదిల్లీ కేంద్రంగా 2010, అక్టోబరు 28న అమల్లోకి వచ్చింది. 2011, జులై 4 నుంచి విధులను నిర్వర్తిస్తుంది. ఈ ట్రైబ్యునల్‌ జీవ వైవిధ్యం, వన్యప్రాణులు; అటవీ, పర్యావరణ సమస్యలను బెంచ్‌ ద్వారా పరిష్కరిస్తుంది. దీని కింద నాలుగు ట్రైబ్యునల్‌ బెంచ్‌లు ఉన్నాయి. అవి:
1) సెంట్రల్‌ బెంచ్‌ - భోపాల్‌
2) పశ్చిమ బెంచ్‌ - పుణె
3) తూర్పు బెంచ్‌ - కోల్‌కతా
4) దక్షిణ బెంచ్‌ - చెన్నై


10) జాతీయ కార్యచరణ ప్రణాళిక - 2016:
వాతావరణ మార్పులపై 2015 డిసెంబరులో COP-21 సదస్సును నిర్వహించారు. దీనికి అనుగుణంగా భారత ప్రభుత్వం 2016 డిసెంబరులో జాతీయ కార్యచరణ ప్రణాళికను రూపొందించింది. దీనిలో భాగంగా 8 జాతీయ మిషన్‌లను ప్రారంభించారు.
1) సోలార్‌ మిషన్‌

2) శక్తి సామర్థ్య మిషన్‌
3) సుస్థిరాభివృద్ధి ఆవాస మిషన్‌
4) వాటర్‌ మిషన్‌
5) హిమాలయ ఆవరణ మిషన్‌
6) గ్రీన్‌ ఇండియా మిషన్‌
7) సుస్థిరాభివృద్ధి వ్యవసాయ మిషన్‌
8) వాతావరణ మార్పు వ్యూహాత్మక మిషన్‌

 

మరికొన్ని చట్టాలు....
1) హానికర వ్యర్థాల నియంత్రణ చట్టం - 1989
2) బయో మెడికల్‌ వ్యర్థాల నివారణ నిబంధనల చట్టం - 1998
3) ధ్వని కాలుష్య నియంత్రణ చట్టం - 2000
4) ప్లాస్టిక్‌ రీసైకిల్‌ ఉత్పత్తి వాడక చట్టం - 2003

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సుస్థిరాభివృద్ధి - పర్యావరణం

  ఏ దేశమైనా ఆర్థికంగా ఎదగాలంటే పర్యావరణంలో లభించే సహజవనరులే కీలకం. ప్రస్తుత మానవులు వాటిని ఉపయోగించుకుంటూ, తర్వాతి తరాలకు అందించడాన్ని సుస్థిరాభివృద్ధి అంటారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అందుకే పర్యావరణాన్ని కాపాడుకుంటూనే సుస్థిరాభివృద్ధి కోసం కృషిచేయాలి. 


పర్యావరణం


  పర్యావరణం అనే భావనలో జీవ, నిర్జీవ అంశాలు ఉంటాయి. జీవ అంశాల్లో మొక్కలు, పక్షులు, జంతువులు మొదలైనవి ఉంటే; నిర్జీవ అంశాల్లో గాలి, నీరు, భూమి తదితరాలు  ఉంటాయి. వీటి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేయడమే పర్యావరణశాస్త్ర ముఖ్య ఉద్దేశం.


విధులు: పర్యావరణం ప్రధానంగా 4 ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది.
* ఇది పునరుత్పాదకం అయ్యే, కాని వనరులను సరఫరా చేస్తుంది. పునరుత్పాదక వనరులకు అడవుల్లోని చెట్లు, మహాసముద్రాల్లోని చేపలు మొదలైనవి ఉదాహరణలు. పునరుత్పాదకంకాని వనరులకు ఉదాహరణ శిలాజ ఇంధనాలు. 
* ఇది వ్యర్థాలను తనలో కలుపుకుంటుంది.
* జెనెటిక్, జీవ వైవిధ్యాన్ని అందించడం ద్వారా జీవ మనుగడను కొనసాగిస్తుంది.


విపత్తు: ఎలాంటి ఆటంకాలు లేనప్పుడు పర్యావరణం తన విధులను సమర్థంగా నిర్వహిస్తుంది. అయితే మానవ తప్పిదాలతో విపత్తులు సంభవించి జీవమనుగడే ప్రశ్నార్థకమవుతోంది. 


కారణాలు: 


* సహజ వనరుల పునరుత్పాదక రేటు కంటే వాటి వెలికితీత రేటు అధికంగా ఉండటం.


* ప్రకృతి తనలో కలుపుకోగల సామర్థ్యానికి మించి వ్యర్థాల ఉత్పత్తి జరుగుతుండటం. పునరుత్పాదకం అయ్యే, కాని శక్తి వనరులను పెద్ద ఎత్తున వెలికి తీయడం వల్ల వాటిలో కొన్ని పూర్తిగా అంతరించి పోయాయి. వాటికి ప్రత్యామ్నాయం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీనికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటితో పాటు పర్యావరణ క్షీణత కారణంగా గాలి, నీటి వనరుల్లో నాణ్యత తగ్గి ప్రజలు అనారోగ్యంబారిన పడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యం మీద చేసే వ్యయం పెరిగిపోతోంది. గ్లోబల్‌ వార్మింగ్, ఓజోన్‌ పోర క్షీణత లాంటి పర్యావరణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. పర్యావరణం ప్రతికూల ప్రభావాలతో ఖర్చులు అధికమయ్యాయి. 


మూలం: పారిశ్రామిక విప్లవానికి ముందు వనరుల సరఫరా కంటే డిమాండ్‌ తక్కువగా ఉండేది. ఫలితంగా పునఃసృష్టి ద్వారా వనరుల సమతౌల్యానికి వీలుండేది. ఆవరణ వ్యవస్థలో వ్యర్థాలు తక్కువగా ఉండేవి. పారిశ్రామిక విప్లవం, జనాభా పెరుగుదల వల్ల వనరులకు డిమాండ్‌ పెరిగింది. పర్యావరణంలో వ్యర్థాలు పెరిగి అనేక సమస్యలు ఆవిర్భవించాయి.


గ్లోబల్‌ వార్మింగ్‌ 


  భూవాతావరణంలో గ్రీన్‌ హౌస్‌ వాయువులు పెరిగిపోయి, భూమి సగటు ఉష్ణోగ్రతలు అధికం కావడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ అంటారు. శిలాజ ఇంధనాల వాడకం, అడవులు నరకడం మొదలైన మానవ చర్యల వల్ల గాలిలో  CO2, మీథేన్‌ లాంటి గ్రీన్‌హౌస్‌  వాయువులు ఎక్కువయ్యాయి. వీటికి ఉష్ణాన్ని గ్రహించే సామర్థ్యం ఉంటుంది. దీంతో భూఉపరితలం వేడెక్కుతోంది. గత వందేళ్లలో భూఉపరితల ఉష్ణోగ్రతలు 1.1°F (0.6°C) పెరిగాయి. దీంతో ధ్రువప్రాంతాల్లో మంచు కరిగిపోయి, సముద్ర మట్టం పెరిగింది. 


ఓజోన్‌ పొర క్షీణత: స్ట్రాటో ఆవరణంలో ఉండే క్లోరిన్, బ్రోమిన్‌ సంబంధ పదార్థాల వల్ల ఓజోన్‌ పొర క్షీణిస్తోంది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్ల నుంచి వెలువడే క్లోరోఫ్లోరోకార్బన్లు (CFC), బ్రోమోఫ్లోరోకార్బన్లు  (Halons) వాతావరణంలో చేరి క్లోరిన్, బ్రోమిన్‌ పదార్థాలుగా మారుతున్నాయి. 
* అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్‌ పొర అధికంగా దెబ్బతిన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని క్షీణత వల్ల సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిపై పడి, మానవుల్లో అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి. జలాశయాల్లో ఫొటోప్లాంక్టన్‌ (నాచు)ల ఉత్పత్తి తగ్గి, జలచరాలను ప్రభావితం చేస్తోంది. 
* ఓజోన్‌ పొరను కాపాడేందుకు మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ను తీసుకొచ్చారు. దీని ప్రకారం  CFC, కార్బన్‌ టెట్రాక్లోరైడ్, ట్రైక్లోరోఈథేన్‌ (మిథైల్‌ క్లోరోఫాం) లాంటి రసాయనాల వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. CFCకి ప్రత్యామ్నాయంగా వాడుతున్న HFC (హైడ్రోఫ్లోరోకార్బన్‌)లు కూడా ఓజోన్‌ పొరకు హాని కలిగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 
* ఓజోన్‌ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏటా సెప్టెంబరు 16న నిర్వహిస్తున్నారు.


భారతదేశ పర్యావరణ పరిస్థితి 


  భారతదేశంలో పర్యావరణం రెండు కారణాల వల్ల క్షీణిస్తోంది. అవి: 
1. పేదరికం    2. పారిశ్రామికాభివృద్ధి


పేదరికం: దేశంలో అనేకమంది ప్రజలు తమకు లభించిన సహజ వనరులను (ఉదా: వంట చెరకు) అధికంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల పర్యావరణం కలుషితం అవుతోంది. పేద వర్గాల ప్రజలు తమ మనుగడ కోసం పర్యావరణంపైనే అధికంగా అధారపడుతున్నారు. దీంతో వారికి తగినంత ఆహారం, ఆరోగ్యదాయక జీవన ప్రమాణాలు లభించడంలేదు. ఈ విధంగా పర్యావరణం, పేదరికం ఒకదానికొకటి అంతర సంబంధాన్ని కలిగిఉన్నాయి. పేదరికం పర్యావరణంపై అధికంగా ఒత్తిడి కలగజేస్తుంటే, పర్యావరణ సమస్యలు పేదలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి.   


పారిశ్రామికాభివృద్ధి: దీనివల్ల పర్యావరణ కాలుష్యం నానాటికీ ఎక్కువవుతోంది. ప్రస్తుతం మన దేశంలో ప్రధానంగా వాయు, నీటి కాలుష్యాలు; మృత్తికా క్రమక్షయం; అటవీ నిర్మూలన; జీవవైవిధ్యం దెబ్బతినడం లాంటి అనేక అంశాలు పర్యావరణ సమస్యలుగా ఉన్నాయి.


మృత్తికా క్షీణతకు కారణాలు


* అటవీ నిర్మూలన.


* వంటచెరకు, పశుగ్రాసం సేకరణ 


* పోడువ్యవసాయం  నీ అడవుల్లో కార్చిచ్చు


* మృత్తికా సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం 


* ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం 


* సాగునీటి వ్యవస్థల నిర్వహణలో సరైన  ప్రణాళిక లోపించడం


* భూగర్భ జలాలను అధికంగా తోడెయ్యడం 


* వ్యవసాయం, ఇళ్లు, పరిశ్రమల కోసం పరిమితంగా ఉన్న భూమిపై ఒత్తిడి కలిగించడం వల్ల మృత్తికా క్షీణత ఏర్పడుతుంది.
  మన దేశంలో తలసరి అటవీ భూమి 0.08 హెక్టార్లుగా ఉంది. మనిషి కనీస అవసరాలు తీర్చాలంటే అది 0.47 హెక్టార్లుగా ఉండాలి. మన దేశంలో ఏడాదికి 5.3 బిలియన్‌ టన్నుల మృత్తికా క్రమక్షయం జరుగుతోందని శాస్త్రవేత్తల అంచనా. దీనివల్ల భూమిలోని NPK పోషకాలను అధిక మొత్తంలో కోల్పోతున్నాం.


వాయు కాలుష్యం 


  మన దేశంలో వాయు కాలుష్యం పట్టణ ప్రాంతాల్లో; పరిశ్రమలు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఉన్నచోట అధికంగా ఉంటోంది. నగరాల్లో నివసించే 80% మందికి వ్యక్తిగత వాహనాలు ఉన్నాయి. వీటి సంచారం ఎక్కువగా ఉండటంతో అక్కడ గాలి కలుషితం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి 10 పారిశ్రామిక దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. దీంతోపాటు పర్యావరణ కాలుష్యం, ప్రణాళిక లేని పట్టణీకరణ, ప్రమాదాలకు అవకాశం లాంటి అంశల్లోనూ మనం ముందున్నాం.


నీటి కాలుష్యం

   భారత్‌లో నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు 1974లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటుచేశారు. మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాల విడుదలకు ఇవి ప్రమాణాలను నిర్దేశిస్తాయి. ఈ సంస్థలు కాలుష్య నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాంకేతిక సలహాలు అందిస్తాయి.


సుస్థిరాభివృద్ధి 


  పర్యావరణ సంరక్షణ, దాని అభివృద్ధి కోసం 1992లో ‘పర్యావరణం - అభివృద్ధి’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి సమావేశం (UNCED - United Nations Conference on Environment and Development) జరిగింది. ఇందులో ‘‘భవిష్యత్తు తరాలవారు తమ అవసరాలను తీర్చుకోగలిగే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా, ప్రస్తుత తరాల వారి అవసరాలను తీర్చే అభివృద్ధినే సుస్థిరాభివృద్ధి’’గా  నిర్వచించారు. 


* ‘‘భవిష్యత్తు తరాలవారికి భూగ్రహాన్ని మంచిగా అందించాల్సిన నైతిక బాధ్యత ప్రస్తుత తరాల వారిపై ఉంది’’ అని నార్వే మాజీ ప్రధాని హార్లెం బ్రంట్‌లాండ్‌ పేర్కొన్నారు. 


* సుస్థిరాభివృద్ధి సాధించాలంటే కింది చర్యలు చేపట్టాలని పర్యావరణ ఆర్థికవేత్త హెర్నన్‌ డేలీ పేర్కొన్నారు.


* సముద్రంలో ప్రయాణించే నౌకలో అది మోయగలిగే సామర్థ్యం మేరకే ప్రజలను ఎక్కిస్తారు. అలాగే, పర్యావరణం భరించగల పరిమితులలోపు మాత్రమే మానవ జనాభా ఉండాలి.


* ఉత్పాదకాలను సమర్థవంతంగా వాడే సాంకేతిక ప్రగతి కావాలి.


* పునరుత్పాదక శక్తి వనరులను సుస్థిరంగా ఉపయోగించాలి. అంటే వీటి వెలికితీత వాటి పునఃసృష్టి కంటే తక్కువగా ఉండాలి.


* పునరుత్పాదకం కాని శక్తి వనరుల తగ్గుదల రేటు ప్రత్యామ్నాయ శక్తి వనరుల ఉత్పత్తి రేటు కంటే ఎక్కువగా ఉండకూడదు.


* కాలుష్యం వల్ల పర్యావరణానికి కలిగిన నష్టాలను సరిచేయాలి.


సుస్థిరాభివృద్ధి కోసం వ్యూహాలు 


సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం: భారతదేశం థర్మల్, జలవిద్యుత్‌పై అధికంగా ఆధారపడుతోంది. ఈ రెండూ పర్యావరణంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు గ్రీన్‌హౌస్‌ వాయువు CO2తో పాటు బూడిద (fly ash)ను పర్యావరణంలోకి విడుదల చేస్తున్నాయి. బూడిదను సరిగ్గా వినియోగించకపోతే భూమి, నీటి కాలుష్యానికి దారితీస్తుంది. జల విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి పెద్దఎత్తున అడవులను నిర్మూలిస్తున్నారు. ఈ పరిమితుల నేపథ్యంలో పవన, సౌర శక్తి లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులను అధికంగా వినియోగించాలి.


గ్రామీణ ప్రాంతాల్లో గోబర్‌ గ్యాస్, ఎల్‌పీజీని ఉపయోగించడం: గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరకునే ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల గాలి కలుషితమవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో సబ్సిడీతో కూడిన ఎల్‌పీజీని అందించాలి. ప్రజలు గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌లు ఏర్పాటుచేసుకునేందకు రాయితీలు, రుణాలు అందించాలి.


పట్టణ ప్రాంతాల్లో సీఎన్‌జీ వాడకం: కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ)లో అధిక పీడనం వద్ద మీథేన్‌ను నిల్వ చేస్తారు. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఇది తక్కువ కాలుష్యకారకాలను విడుదల చేస్తుంది. దిల్లీ ప్రజా రవాణా వ్యవస్థలో సీఎన్‌జీ వాహనాల వాడకం వల్ల అక్కడ వాయు కాలుష్యం చాలా వరకు తగ్గింది. 


చిన్నతరహా జల విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు: పర్వత ప్రాంతాల్లో నిరంతరం ప్రవహించే ప్రవాహాల శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చేందుకు చిన్నతరహా జల విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటుచేయాలి. ఇవి స్థానిక అవసరాలకు తగ్గట్టు శక్తిని సరఫరా చేస్తాయి.


సంప్రదాయ విజ్ఞానం, పద్ధతులు:  పూర్వం భారతీయులు పర్యావరణంలో భాగంగా జీవించేవారు. వివిధ రకాల వృక్షజాతుల నుంచి మూలికలు తయారుచేసి వాటిని వైద్యంలో వాడేవారు. భారత్‌లో పాశ్చాత్య వైద్య విధానం వచ్చాక మన సంప్రదాయ పద్ధతులైన ఆయుర్వేదం, యునాని మొదలైనవి అడుగున పడిపోయాయి. మళ్లీ వీటిని ఆచరించాల్సిన అవసరం ఏర్పడింది.


బయో కంపోస్టింగ్‌: వ్యవసాయ ఉత్పత్తులను పెంచే ఉద్దేశంతో గత 5 దశాబ్దాలుగా కంపోస్ట్‌ వాడకం తగ్గించి రసాయనిక ఎరువుల వినియోగాన్ని పెంచారు. దీంతో గాలి, నీరు, నేల కాలుష్యానికి గురయ్యాయి. వానపాములు సులభంగా సేంద్రీయ పదార్థాన్ని కంపోస్ట్‌గా మార్చగలవు. కాబట్టి రైతులు  బయో కంపోస్టింగ్‌ పద్ధతులు అనుసరించేలా చర్యలు చేపట్టాలి.


బయోపెస్ట్‌ కంట్రోలింగ్‌: రసాయన పురుగు మందుల వినియోగం పెరగడం వల్ల భూమి, జల వనరులు పూర్తిగా కలుషితమయ్యాయి. వాటి అవశేషాలు ఆహార ఉత్పత్తుల్లో చేరడం వల్ల మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా వేప లాంటి వృక్ష ఉత్పత్తులను పెస్టిసైడ్లుగా ఉపయోగించాలి. మిశ్రమ వ్యవసాయం, పంటల మార్పిడి పద్ధతులను అవలంబించాలి.

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవుల ఆహారపు అలవాట్లు

జీవావరణంలో గొలుసులు.. పిరమిడ్‌లు!

  ఆహారం ప్రతి జీవికి ప్రాథమిక అవసరం. ఒక్కో జీవికి ఒక్కో రకమైన ఆహారపు అలవాటు ఉంటుంది.  కానీ ఏదో ఒక దశలో ఒక ప్రతి జీవి ఇంకో జీవికి ఆహారంగా ఉపయోపడటం ఈ ఆవరణ వ్యవస్థలోని ప్రత్యేక లక్షణం. ఆ విధంగా ప్రకృతిలోని ఆహారపు గొలుసులో ఏ జీవులు ఏయే స్థాయుల్లో ఉన్నాయో అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటిపై పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. 


ఆవరణ వ్యవస్థలోని జీవ సముదాయాల్లో వివిధ జీవజాతుల ఆహారపు అలవాట్లు విభిన్న రకాలుగా ఉంటాయి. శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకాలు ఇలా భిన్న అలవాట్లతో జీవులుంటాయి. వాటి ఆహార అలవాట్లను పలు రకాలుగా విభజించవచ్చు.


ఉత్పత్తిదారులు: కావాల్సిన ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుని స్థానబద్ధంగా జీవించే జీవులను ఉత్పత్తిదారులు అంటారు. ఇవి ఇతర జీవులకూ ఆహారాన్ని అందిస్తాయి. వీటినే స్వయం పోషకాలు అంటారు.  ఆహార గొలుసులో ప్రథమ పోషక స్థాయిని ఆక్రమిస్తాయి. సౌరశక్తి నుంచి లేదా వివిధ రసాయన పదార్థాల నుంచి సంక్లిష్ట కర్బన పదార్థాలను తయారు చేసుకుని జీవిస్తాయి.

ఉదా: మొక్కలు, నీలి ఆకుపచ్చ శైవలాలు, వృక్ష ప్లవకాలు, బ్యాక్టీరియా


వినియోగదారులు: ఇవి ఆహార పదార్థాల కోసం ఉత్పత్తిదారులపై లేదా ఇతర వినియోగదారులపై ఆధారపడి జీవించే జీవజాతులు. వీటినే పరపోషకాలు అంటారు. ఆహార అలవాట్లను బట్టి ఈ జీవులను కింది రకాలుగా విభజించారు.


ఎ) ప్రథమ వినియోగదారులు: ఇవి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను ప్రథమ పోషక స్థాయిలోని ఉత్పత్తిదారుల నుంచి పొందుతాయి. వీటిని శాకాహారులుగా పిలుస్తారు. ఇవి ఆహార గొలుసులో ద్వితీయ పోషక స్థాయిని కలిగి ఉంటాయి.

ఉదా: మిడతలు, గొల్లభామలు, కుందేళ్లు, జింకలు


బి) ద్వితీయ వినియోగదారులు: ఇవి తమకు కావాల్సిన ఆహారాన్ని ఉత్పత్తిదారులు, ప్రథమ వినియోగదారుల నుంచి పొందుతాయి. ఇవి శాకాహారులుగా, మాంసాహారులుగా జీవిస్తాయి. వీటినే ప్రాథమిక మాంసాహారులు లేదా సర్వభక్షకులు అని పిలుస్తారు. ఇవి ఆహార గొలుసులో తృతీయ పోషక స్థాయిని ఆక్రమిస్తాయి.

ఉదా: మానవులు, కుక్కలు, పిల్లులు, కోళ్లు


సి) తృతీయ వినియోగదారులు: ఇవి ప్రథమ, ద్వితీయ వినియోగదారులపై ఆధారపడి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను పొందగలుగుతాయి. వీటిని ద్వితీయ మాంసాహారులుగా పరిగణిస్తారు. ఇవి ఆహార గొలుసులో చతుర్ద పోషక స్థాయిని ఆక్రమించి ఉంటాయి.

ఉదా: పెద్ద చేపలు, కొంగలు, గద్దలు, పాములు, నక్కలు, తోడేళ్లు


డి) అంతిమ వినియోగదారులు: ఆహార పదార్థాల కోసం ఇతర వినియోగదారులపై ఆధారపడతాయి. ఇవి ఆహార గొలుసులో పంచమ పోషక స్థాయిలో ఉంటాయి. ఉదా: పులులు, సింహాలు.

పరాన్నజీవులు: ఇతర జీవులపై నివసిస్తూ, వాటి శరీరాల నుంచి ఆహారాన్ని పొందుతూ ఆశ్రయం ఇచ్చిన జీవికి హాని కలిగించేవి. వీటినే పరాన్నజీవులు (పారాసైట్స్‌) అంటారు.

ఉదా: జలగ, నల్లి, నులిపురుగులు


విచ్ఛిన్నకారులు: ఇవి ఉత్పత్తిదారులు, వినియోగదారులు చనిపోయిన తరువాత వాటి మృత కళేబరాల్లోని సంక్లిష్ట కర్బన పదార్థాలను, సరళ అకర్బన పదార్థాలుగా విచ్ఛిన్నం చేసి మృత కళేబర కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కాపాడతాయి. వీటిని ప్రకృతి పారిశుద్ధ్యులు (నేచురల్‌ స్కావెంజర్స్‌) అంటారు.

ఉదా: బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, రాబందులు


శక్తి పరిమాణాల ప్రకారం..


  ఆహార గొలుసులోని వివిధ స్థాయుల్లో అందుబాటులోని శక్తి పరిమాణాలను అందించే వివిధ జీవజాతులకు చెందిన జనాభా, జీవ పదార్థాలను, రేఖీయంగా చూపించడాన్ని జీవావరణ పిరమిడ్‌లు అంటారు. వీటిని మొదట ఛార్లెస్‌ ఎల్టన్‌ అనే ఆవరణ శాస్త్రవేత్త ప్రతిపాదించడం వల్ల వీటిని ఎల్టోనియం పిరమిడ్‌లు అంటారు. వీటిని మూడు రకాలుగా విభజించారు.


సంఖ్యా పిరమిడ్‌లు: ఇవి వివిధ జనాభాల సంఖ్యాపరమైన సంబంధాన్ని ఆహార గొలుసులో వివిధ పోషక స్థాయుల్లో సూచిస్తాయి. సాధారణంగా పిరమిడ్లలో ఆధార స్థాయిలో ఉత్పత్తిదారుల సంఖ్య ఎక్కువగా ఉండి క్రమంగా అగ్రభాగానికి చేరేకొద్ది వివిధ పోషక స్థాయుల్లోని జీవుల సంఖ్య తగ్గుతుంది. కానీ కొన్నింటిలో ఇది తలకిందులుగా కూడా ఉంటుంది.

ఉదా: అటవీ ఆవరణ వ్యవస్థలో చేతితో అల్లిన నూలు కండె ఆకారంలో, పరాన్నజీవుల ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా, మిగిలిన ఆవరణ వ్యవస్థల్లో నిట్టనిలువుగా సంఖ్యా పిరమిడ్‌లుంటాయి.


జీవరాశి పిరమిడ్‌లు: వివిధ పోషక స్థాయుల్లోని జీవ అనుఘటకాల భారం లేదా ద్రవ్యరాశి గురించి తెలిపే పిరమిడ్‌ పటాన్ని జీవరాశి పిరమిడ్‌ అంటారు. ఇందులో ఆధార భాగంలోని పోషకస్థాయి నుంచి శిఖర పోషకస్థాయి వరకు క్రమంగా జీవరాశి పరిమాణం తగ్గడాన్ని గమనించవచ్చు. ఇందులో గడ్డి మైదానాలు, అటవీ ఆవరణ వ్యవస్థలో పిరమిడ్‌లు నిట్టనిలువుగా ఉండగా, కొలను ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది.


శక్తి పిరమిడ్‌లు: ఒక చదరపు మీటరు వైశాల్యం ఉన్న స్థలంలో సంవత్సరం పాటు వివిధ పోషక స్థాయుల్లోని జీవరాశులు వినియోగించిన శక్తి మొత్తాన్ని తెలిపే రేఖాపటం శక్తి పిరమిడ్‌. ఇందులో ఉత్పత్తిదారుల నుంచి అంతిమ వినియోగదారుల స్థాయి వరకు శక్తి క్రమంగా తగ్గుతుంది. వివిధ ఆవరణ వ్యవస్థల్లోని శక్తి పిరమిడ్‌లు నిట్టనిలువుగా ఉంటాయి.


మాదిరి ప్రశ్నలు

1. సంఖ్యా పిరమిడ్‌ కిందివాటిలో వేటిని సూచిస్తుంది?

1) ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జాతుల సంఖ్య    2) ఒక జీవ సముదాయంలోని ఉపజాతులు

3) ఒక సముదాయంలోని జనాభా           4) పోషక స్థాయిలోని జీవి ద్రవ్యరాశి

2. కిందివాటిలో ఆహార గొలుసుకు మూలాధారం?

1) ఉత్పత్తిదారులు 2) వినియోగదారులు 3) విచ్ఛిన్నకారులు  4) పూతికాహారులు

3. కిందివాటిలో సర్వభక్ష జీవికి ఉదాహరణ

1) కుందేలు   2) పులి   3) ఏనుగు  4) కాకి

4. ఆవరణ వ్యవస్థలో మిడత, గొల్లభామ, కుందేలు ఏ వినియోగదారులు?

1) ప్రథమ  2) ద్వితీయ   3) అంతిమ  4) ఉత్పత్తిదారులు  

5. నిట్టనిలువు పిరమిడ్‌లో కోడి, పిల్లి, కుక్కలను ఏ పోషక స్థాయిలో చూపిస్తారు?

1) ప్రథమ  2) ద్వితీయ   3) తృతీయ   4) చతుర్థ 

6. ఆవరణ వ్యవస్థలో శక్తి పిరమిడ్‌లు ఏ విధంగా ఉంటాయి?

1) సమాంతరం    2) నిట్టనిలువు    3) తలకిందులు    4) అన్నీ

7. కొలను ఆవరణ వ్యవస్థలో పిరమిడ్‌ ఏ విధంగా ఉంటుంది?

1) తలకిందులుగా    2) నిట్టనిలువుగా    3) జిగ్‌జాగ్‌  4) నూలుకండె ఆకారం  

8. అటవీ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్‌లు ఏ విధంగా ఉంటాయి?

1) తలకిందులుగా   2) అడ్డంగా   3) నూలుకండె ఆకారం  4) సిలిండర్‌ ఆకారం

9. సాధారణంగా పిరమిడ్‌లలో ఆధారస్థాయిలోని  అణుఘటకాలు?

1) ఉత్పత్తిదారులు  2) వినియోగదారులు   3) ద్వితీయ వినియోగదారులు    4) అన్నీ  

10. ఆకుపచ్చ శైవలాలు దేనికి ఉదాహరణ?

1) పరాన్నజీవులు   2) పూతికాహారులు   3) ప్రొడ్యూసర్స్‌   4) ట్రాన్స్‌ఫార్మర్స్‌

జవాబులు: 1-1, 2-1, 3-3, 4-1, 5-3, 6-2, 7-1, 8-3, 9-1, 10-3.

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 10-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జీవావరణ మండలాలు

సకల జీవ సమూహాలకు సంరక్షణ!

 జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి.  సుస్థిరాభివృద్ధిని సాధించాలి. అందుకు తగిన సహజ, భౌగోళిక పరిస్థితులు ఉండాలి. అవసరమైన శాస్త్రీయ పరిశోధనలు జరగాలి. అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ఈ లక్ష్యంతోనే ప్రపంచ వ్యాప్తంగా నిర్ణీత ప్రాంతాలను జీవావరణ మండలాలుగా గుర్తించారు. అంతరించి పోతున్న జాతులను అక్కడ రక్షిస్తారు. సహజ పర్యావరణ ప్రక్రియలను ప్రోత్సహిస్తారు. దాని కోసం భూమిని, వనరులను సమీకరిస్తారు. నిర్వహణ విధానాలను రూపొందిస్తారు. జీవావరణాన్ని సంరక్షిస్తారు. పర్యావరణ అంశాల అధ్యయనంలో భాగంగా ఆ విశిష్ట మండలాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


    విశాల ప్రపంచంలోని జీవులన్నింటినీ జీవావరణం అంటారు. ప్రతి జీవికి తన చుట్టూ ఉన్న సహజ, భౌగోళిక అంశాలతో అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే మనిషితోపాటుగా అన్ని జీవజాతులకు అంతర్జాతీయ ప్రాధాన్యం ఇచ్చేందుకు యునెస్కో కృషి చేస్తోంది. యునెస్కోలోని ఇంటర్నేషనల్‌ కోఆర్డినేషన్‌ కౌన్సిల్‌ నియమించిన టాస్క్‌ఫోర్స్‌ నిర్ణయం మేరకు జీవావరణ మండలాల గుర్తింపు కోసం ‘మ్యాన్‌ అండ్‌ బయోస్ఫియర్‌ ప్రోగ్రామ్‌’ MAB ని 1974లో ఆమోదించింది. 1976 నుంచి అమలు ప్రారంభించింది. దేశాలు నిర్ణయించిన జీవావరణ మండలాల్లో ఆయా దేశాలు చేపట్టిన సుస్థిరాభివృద్ధి కార్యకలాపాల ఆధారంగా కొన్నింటిని యునెస్కో ఎంపికచేసి MAB లో చేర్చింది.


* అన్ని జీవజాతులతో పాటు, పర్యావరణంలో మనిషి మనుగడను కూడా పరిశీలనలోకి తీసుకుంటూ నిర్ణయించిన భూ, సముద్ర ప్రాంతాలు జీవావరణ మండలాల్లో భాగమవుతాయి. అంతర్జాతీయ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాటి పరిరక్షణకు దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు.


* జీవావరణ మండలాలు సహజ జీవ మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అనేక జీవవైవిధ్య సమూహాల ఏకత్వాన్ని ఒక ప్రాంతంగా సంరక్షణ అవసరాన్ని తెలియజేస్తాయి.


* జీవావరణ మండలాల్లో మొత్తం పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా పరిశోధన, విద్య, శిక్షణ లాంటి కార్యక్రమాలను చేపడతారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కుల్లో ఇందుకు అవకాశం ఉండదు.


* ఈ ప్రాంతాల్లో సహజత్వాన్ని, ఆవరణ వ్యవస్థను, జాతులు, జెనిటిక్‌ వైవిధ్యాన్ని సంరక్షిస్తారు.


* ప్రపంచం మొత్తంలో మ్యాన్‌ అండ్‌ బయోస్ఫియర్‌ నెట్‌వర్క్‌లో 134 దేశాల నుంచి 738 ప్రాంతాలను యునెస్కో గుర్తించింది. వీటిలో భారత్‌ నుంచి 12 ప్రాంతాలున్నాయి.

భారతదేశంలో జీవావరణ మండలాలు: భారత ప్రభుత్వం జాతీయ జీవావరణ రిజర్వు ప్రోగ్రామ్‌ని 1986లో ప్రారంభించింది. మొదటి జీవావరణ మండలంగా నీలగిరి ప్రాంతాన్ని 1986లో ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం 18 జీవావరణ మండలాలున్నాయి.



జీవావరణ మండలాల ఎంపిక - లక్షణాలు:

* ఈ ప్రాంతాలు మృత్తికలు, సూక్ష్మ శీతోష్ణ పరిస్థితుల వైవిధ్యంతో ఉండి అనేక రకాల స్థానీయ జీవజాతులకు ఆలవాలమై ఉండాలి.


* కొద్దికాలంలో అంతరించిపోయేందుకు దగ్గరలో ఉన్న, అరుదైన, ప్రమాదపు అంచులో ఉన్న జీవులు నివసిస్తూ ఉండాలి.


* పర్యావరణంతో సామరస్యపూర్వక జీవనం సాగించే సంప్రదాయక గిరిజన జాతులు ఆ ప్రాంతాల్లో అధికంగా నివసిస్తూ ఉండాలి.


* ఒక ఆవరణ వ్యవస్థలోని వృక్షజాతులు, జంతు జాతుల మధ్య వైవిధ్యాన్ని, సమగ్రతను కాపాడటం ఈ ప్రాంతాల ప్రధాన లక్షణం.


* జాతుల జెనిటిక్‌ వైవిధ్యానికి రక్షణ కవచంగా ఉంటూ వాటి ప్రజన ప్రక్రియను కొనసాగించడానికి ఆటంకం లేకుండా చర్యలు చేపడతారు.


* ఈ ప్రాంతాల్లో జీవజాతుల సంరక్షణకు, పర్యావరణ పరిరక్షణకు కావాల్సిన బహుముఖ పరిశోధన, విద్య, శిక్షణ కార్యకలాపాలు చేపడతారు.


* సుస్థిరాభివృద్ధితో కూడిన సరైన సాంకేతికత వినియోగం ద్వారా సహజ వనరులను స్థానిక ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే విధంగా పర్యవేక్షిస్తారు.

జీవావరణం - విభాగాలు: జీవులు, జన్యు ఆధారాలు, గిరిజనుల జీవన శైలి, సహజసిద్ధ పరిసరాల పరిరక్షణ మొదలైన బహుళ ప్రయోజనకర పరిరక్షణ ప్రాంతాలైన బయోస్ఫియర్‌ రిజర్వులను మూడు మండలాలుగా విభజిస్తారు.

1) కోర్‌ జోన్‌: ఈ ప్రాంతం పూర్తిగా మానవ కార్యకలాపాల నిషిద్ధ ప్రాంతం. ప్రశాంతతను దెబ్బతీసే కార్యకలాపాలు చేపట్టడానికి వీల్లేదు. ఈ ప్రాంతాల శిఖర స్థాయిలో వేట ద్వారా ఆహారాన్ని సేకరించే జీవులతో పాటు అనేక రకాల జంతు, వృక్ష జాతులు వాటి స్థలాలకు పరిమితమై జీవిస్తుంటాయి. సహజత్వానికి, అటవీ జీవన విధానానికి ఆటంకం కలగకుండా పరిశోధన, నిర్వహణ లాంటి అంశాలకు అవకాశం కల్పిస్తారు.


2) తటస్థ మండలం (Buffer Zone): ఈ ప్రాంతం కోర్‌ జోన్‌ చుట్టూ విస్తరించి ఉంటుంది. ఇందులో కోర్‌ జోన్‌ పరిరక్షణే ధ్యేయంగా కార్యకలాపాలు చేపడతారు. ఈ ప్రాంతంలో పరిశోధన, విద్యా కార్యకలాపాలకు అవకాశం ఉంటుంది. ఆవరణ వైవిధ్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా సహజ మానవ కార్యకలాపాలకు అవకాశం ఇస్తారు. సహజవనరుల విలువను పెంచే విధంగా పునరుద్ధరణ, ప్రదర్శన, విహారం, వినోదం, చేపల పెంపకం, పశుగ్రాసం పెంపకం లాంటి కార్యకలాపాలు కోర్‌ జోన్‌ ప్రశాంతతను కాపాడుతూ చేపట్టే అవకాశం ఉంటుంది.


3) పరివర్తన మండలం (Transition Zone): ఇది జీవావరణ మండలంలో పూర్తిగా బయట విస్తరించి ఉన్న ప్రాంతం. నివాసాలు, వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. వినోద, ఆర్థిక కార్యకలాపాలు చేపట్టవచ్చు. పరివర్తన మండలానికి సరిహద్దులు నిర్ణయించి ఉండవు. సంరక్షణ, నిర్వహణ సామరస్యపూర్వకంగా, సహకార స్ఫూర్తితో ఉంటుంది. జీవావరణ మండలాల ఆశయానికి అనుకూలంగా కార్యకలాపాలు నిర్వహిస్తారు.


ప్రత్యేకతలు:

* జాతులు, జెనిటిక్స్, జీవులు, మానవసహిత సహజత్వాన్ని మొత్తంగా పర్యావరణాన్ని కాపాడే ప్రాంతాలివి.

* విశాలమైన జీవావరణ మండలాల్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నేషనల్‌ పార్కులు అంతర్భాగంగా ఉంటాయి.

* స్నేహపూర్వక, పర్యావరణహిత అభివృద్ధితో కూడిన సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యం ఉంటుంది.


* ఈ ప్రాంతాల అభివృద్ధికి, సంరక్షణకు మధ్య సమస్యలు తలెత్తకుండా తీవ్రతను తగ్గించే చర్యలు తీసుకుంటారు.

* ఈ ప్రాంతాల సంరక్షణ కోసం బహుళ భాగస్వామ్య వ్యవస్థలు కలిసి పనిచేయడమే కాకుండా విశాల దృక్పథంతో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తారు.

* వీటిలో కొన్నింటిని సహజత్వమే ప్రపంచం అనే దృక్పథంతో యునెస్కో మ్యాన్‌ అండ్‌ బయోస్ఫియర్స్‌ నెట్‌వర్క్‌లో చేర్చడం ప్రపంచీకరణకు అద్దం పడుతోంది.

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 18-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ కాలుష్యం

కలుషిత పరిసరాల్లో జీవావరణ వధ!

వాతావరణంలో ఆకస్మిక మార్పులతో వ్యవసాయంలో వ్యతిరేక ఫలితాలు. ఆస్తమా, ఎలర్జీ అందరికీ వచ్చే ఆరోగ్య సమస్యలు. ఒత్తిడి, నిద్ర పట్టకపోవడం తదితరాలు తరచూ ఎదురయ్యే ఇబ్బందులు. ఇవన్నీ పర్యావరణ కాలుష్యం వల్ల కలిగే పరిణామాలు. ప్రకృతి సహజ స్వభావానికి అంతరాయం ఏర్పడి, జీవులకు ప్రతికూలంగా పరిసరాలు ప్రభావం చూపడమే పర్యావరణ కాలుష్యం. మనిషి సాధించిన పారిశ్రామిక ప్రగతి, కనుగొనే కొత్త ఉపకరణాల వల్ల పలువిధాలుగా పరిసరాలు కలుషితమవుతున్నాయి. శాస్త్ర, సాంకేతికత అభివృద్ధి చెందేకొద్దీ కాలుష్యం అధికమై జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద విపత్తుగా మారిన ఈ పర్యావరణ కాలుష్యం రకాలు, జరిగే నష్టాలు, నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఉద్యోగార్థులు తెలుసుకోవాలి.


ఉత్పత్తి, వినియోగ కార్యకలాపాలతో వచ్చే వ్యర్థాలను అనేక విధాలుగా పర్యావరణంలోకి వదిలివేస్తున్నారు. ఈ వ్యర్థాలను జీర్ణించుకునే శక్తి పర్యావరణానికి ఒక స్థాయి వరకే ఉంటుంది. ఆ స్థాయి దాటి వ్యర్థాలు పెరిగితే దాని నాణ్యత తగ్గుతుంది. ఆ విధంగా ఏర్పడే పర్యావరణ క్షీణతను పర్యావరణ కాలుష్యం అంటారు. భారత పర్యావరణ పరిరక్షణ చట్టం - 1986 ప్రకారం ‘‘ఘన, ద్రవ, వాయు స్థితిలో ఉన్న ఏవైనా అవాంఛనీయ పదార్థాలు పరిమితికి మించి గాలి, నీరు, నేల అనుఘటకాల్లోకి చేరి, వాటి సహజ సంఘటనంలో మార్పు తీసుకొచ్చి మానవుడికి, ఇతర జీవుల మనుగడకు అంతరాయం కలిగించే స్థితే పర్యావరణ కాలుష్యం’’. కాలుష్యాన్ని ఆంగ్లంలో పొల్యూషన్‌ అంటారు. ఇది పొల్యుటోనియం అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. దీనర్థం ‘అపరిశుభ్రత’.


పారిశ్రామిక, హరిత విప్లవాల వల్ల ముందు తరం కంటే తర్వాత తరం జీవన నాణ్యత పెరుగుతూ వచ్చింది. అయితే దాని వెనుక తలెత్తిన పర్యావరణ సంక్షోభాలు మానవ జీవనానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్నాయి. పీల్చే గాలి, తాగే నీరు, నివసించే నేల కలుషితమై జీవరాశుల మనుగడకే అంతరాయం కలుగుతోంది. ఈ విధంగా మనిషి జీవనసరళి వల్ల తటస్థపడే పరిసరాల క్షీణత క్షయాన్ని ‘జీవావరణ వధ’గా 1972లో స్టాక్‌హోమ్‌లో జరిగిన ‘మానవుడు-పర్యావరణం’ అనే అంతర్జాతీయ సదస్సులో అభివర్ణించారు. కాలుష్యానికి కారణమైన పదార్థాలను కాలుష్యకాలు అంటారు. ఉదా: సీసం, పాదరసం, కార్బన్‌ మోనాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్‌ లాంటివి.

ఉనికి: ఉనికి ఆధారంగా కాలుష్యాలు రెండు రకాలుగా ఉన్నాయి.

1) పరిమాణాత్మక కాలుష్యకాలు: సహజసిద్ధంగా పర్యావరణంలో ఉండి పరిమితికి మించి పర్యావరణం అనుఘటకాల్లోకి ప్రవేశించి వాటి నిష్పత్తిలో మార్పు తీసుకొచ్చి నష్టపరిచేవి. ఉదా: కార్బన్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్‌ లాంటివి.

2) గుణాత్మక కాలుష్యకాలు: ఇవి సహజసిద్ధంగా పర్యావరణంలో ఉండవు. మానవ చర్యల వల్ల పర్యావరణంలోకి విడుదలై కాలుష్య కారకాలవుతాయి.

ఉదా: రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, పరిశ్రమల నుంచి వెలువడే వాయువులు, వ్యర్థాలు.

స్వభావం: క్షయ స్వభావం ఆధారంగా కాలుష్యకాలను రెండు రకాలుగా పేర్కొన్నారు. 

1) జీవక్షయం చెందే కాలుష్యకాలు: కొన్ని వ్యర్థాలు సూక్ష్మజీవుల చర్యల వల్ల పర్యావరణ విభాగాల్లో కలిసిపోతాయి. ఆ విధంగా పర్యావరణానికి అనుకూలంగా మారిపోయే కాలుష్యాలను జీవక్షయం చెందే కాలుష్యకాలుగా భావిస్తారు. ఉదా: చెత్త, వృక్ష, జంతు సంబంధ అవశేషాలు, వ్యవసాయ సంబంధ వ్యర్థాలు.

2) జీవక్షయం చెందని కాలుష్యకాలు: సూక్ష్మజీవుల చర్యల వల్ల క్షయం కాకుండా కొన్ని వందల ఏళ్ల వరకు వాతావరణ విభాగాల్లో అదే స్థితిలో ఉండి పర్యావరణానికి హాని కలిగించేవి. ఉదా: ప్లాస్టిక్‌ సంబంధ వస్తువులు, గాజు, పాలిథీన్‌ సంచులు, క్లోరినేటెడ్‌ హైడ్రోకార్బన్స్‌

మార్పు: పర్యావరణంలో మార్పు చెందే కాలుష్యకాలు రెండు రకాలు.

1) ప్రాథమిక కాలుష్యకాలు: పర్యావరణంలోకి విడుదలకాక ముందు ఏ స్థితిలో ఉన్నాయో, విడుదలయ్యాక కూడా అదే స్థితిలో ఉండి పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యేవి. ఉదా: డీడీటీ, పాదరసం లాంటివి.

2) ద్వితీయ కాలుష్యకాలు: ప్రాథమిక కాలుష్యకాలు పర్యావరణంలోకి విడుదలైన తర్వాత రసాయనిక మార్పుల కారణంగా కొత్త కాలుష్యకాలుగా మారడం.

ఉదా: వాతావరణంలోని నైట్రోజన్‌ ఆక్సైడ్, హైడ్రోకార్బన్లు కాంతి సమక్షంలో చర్య జరిపి పైరోగ్జిఎసిటైల్‌ నైట్రేట్‌గా మారుతుంది.

కాలుష్యంలోని విభాగాలు: పర్యావరణంలో ఏ భాగమైతే కాలుష్యానికి గురవుతుందో వాటి ఆధారంగా కాలుష్యాన్ని వివిధ రకాలుగా విభజించవచ్చు. 1) వాయు కాలుష్యం 2) నీటికాలుష్యం 3) భూమి కాలుష్యం 4) ఘన వ్యర్థ కాలుష్యం 5) సముద్ర కాలుష్యం 6) ధ్వని కాలుష్యం 7) ఉష్ణ కాలుష్యం 8) కిరణధార్మిక కాలుష్యం.


ప్రపంచంలో పెద్ద పర్యావరణ ప్రమాదాలు:

భోపాల్‌ గ్యాస్‌ దుర్ఝటన: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ అనే క్రిమిసంహారక మందులు తయారుచేసే పరిశ్రమ నుంచి 1984, డిసెంబరు 2 - 3 తేదీల్లో అర్ధరాత్రి సమయంలో మిథైల్‌ ఐసోసైనేట్‌ (ఎమ్‌ఐసీ) అనే విషవాయువు విడుదలైంది. పరిశ్రమ చుట్టూ 40 చ.కి.మీ. ప్రాంతంలో ప్రభావం చూపించడంతో, సుమారు 3,700 మంది చనిపోయారు, వెయ్యి మంది అంధులయ్యారు. 5,58,000 మంది విషవాయువు బారిన పడ్డారు.

చెర్నోబిల్‌ అణుప్రమాదం: ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్తు కేంద్రంలో 1986, ఏప్రిల్‌ 26న అణు రియాక్టర్‌ పేలిపోయింది. రేడియో అయోడిన్‌-131, సీజియం-137 లాంటి రేడియోధార్మిక పదార్థాలు విడుదలైన వెంటనే 31 మంది మరణించగా, ఆస్పత్రిలో 239 మంది చనిపోయారు. అణు రేడియేషన్‌ చుట్టుపక్కల ఉన్న పోలండ్, డెన్మార్క్, నార్వే దేశాలకూ విస్తరించింది. పాలల్లో కూడా రేడియేషన్‌ విస్తరించి పాలు తాగే చాలామంది చిన్నారులు చనిపోయారు.

సామూహిక విధ్వంస ఆయుధాలు: రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అమెరికా అణ్వాయుధాల దాడి పర్యావరణాన్ని అతలాకుతలం చేసింది. 1945, ఆగస్టు 6న మొదటిసారిగా లిటిల్‌ బాయ్‌ అనే అణుబాంబును బాంబర్‌ ఎనోలాగే అనే యుద్ధ విమానం నుంచి హిరోషిమా నగరంపై జారవిడిచారు. ఈ ఘటనలో 66 వేల మంది చనిపోగా 90% పట్టణం నాశనమైంది. 10 చ.కి.మీ. ప్రాంతం ప్రభావితమైంది. రెండోసారి ఆగస్టు 9న ప్యాట్‌ మాన్‌ అనే బాంబును అదే యుద్ధవిమానంతో నాగసాకి నగరంపై వేశారు. ఈసారి 1/3వ వంతు నగరం నాశనం కాగా 39 వేల మంది చనిపోయారు.


రచయిత: జల్లు సద్గుణరావు

 

Posted Date : 28-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 వాయు కాలుష్యం


శాస్త్రీయ విధానాలతో స్వచ్ఛమైన శ్వాస!

ప్రపంచదేశాలన్నీ భూతాపం, వాతావరణ మార్పులతో సతమతమవుతున్నాయి. ప్రజలకు మంచి ఆహారం, గాలి దొరకడం కష్టమవుతోంది. సగటు మనిషి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ అనర్థాలన్నింటికీ కారణం వాయుకాలుష్యం. భూమిపై జంతుజాలాన్ని, మొక్కలను, నీటిలోని జలచరాలను, చివరకు కట్టడాలను కూడా ఇది ప్రభావితం చేస్తోంది. వృక్షాల్లో కిరణజన్య సంయోగక్రియను సరిగా సాగనీయడం లేదు. ఇళ్లు, వాహనాల రంగులను మార్చేస్తోంది. సహజసిద్ధ ప్రకృతి రమణీయ ప్రాంతాల నాణ్యతను క్షీణింపజేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన శ్వాసను అందించాలంటే శాస్త్రీయ విధానాలను అవలంబించాలి. ఆ వివరాలతోపాటు వాయు కాలుష్య రకాలు, వాటి నివారణ చర్యలను పోటీపరీక్షల అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.
 

భూమి చుట్టూ ఆవరించిన వాయు పొరలను వాతావరణం అంటారు. ఇందులో నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్‌ డయాక్సైడ్, హీలియం, నియాన్‌ లాంటి అనేక వాయువులు సహజంగా పర్యావరణానికి సరిపడా రీతిలో ఉంటాయి. అయితే ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉన్న కొన్ని అవాంఛనీయ పదార్థాలు వాతావరణంలో పరిమితికి మించి చేరి వాతావరణ సంఘటనంలో మార్పులు తీసుకొస్తాయి. ఫలితంగా వీటి ద్వారా జీవజాతులు, వాటి పరిసరాలకు హాని కలిగే స్థితి ఏర్పడుతుంది. దీన్నే ‘వాయుకాలుష్యం’గా పేర్కొంటారు. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు విడుదలైన వాయువులు, అడవులు తగలబడిపోవడం వల్ల మార్స్‌ గ్యాస్, మీథేన్‌ లాంటి ప్రకృతిపరమైన కాలుష్యకాలు ఒక వైపు; వాహనాలు, పరిశ్రమలు, ఇంధనాలు మండించడం వంటి వాటితో విడుదలవుతున్న కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్, పొగ లాంటి మానవ కారక కాలుష్యాలు మరోవైపు స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తున్నాయి. వాయు కాలుష్యాలను కణరూప, వాయు రూప కాలుష్యకాలుగా విభజించవచ్చు.


1) కణరూప కాలుష్యకాలు: గాలిలో తేలియాడుతూ, 10 మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసార్ధం ఉండే ఘన, ద్రవ రూప రేణువులను కణరూప కాలుష్యకాలు అంటారు. రేణువులు, ద్రవ బిందువులు వాయువులతో కలిసి ఏర్పడే మిశ్రమాన్ని ‘ఏరోసాల్స్‌’ అంటారు. ఇవి రెండు రకాలు.


ఎ) సూక్ష్మ కణరూప కాలుష్యకాలు: 2.5 మైక్రాన్ల లోపు పరిమాణంలో ఉండే కణరూప కాలుష్యకాలివి. వాహనాలు, పరిశ్రమల నుంచి; జీవపదార్థాలు మండించినప్పుడు, వ్యవసాయ సంబంధ] వ్యర్థాల నుంచి విడుదలవుతాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) సూచనల ప్రకారం గాలిలో PM 2.5 స్థాయికి మించితే జీవులకు చాలా హానికరం. ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే ఉబ్బసం, దీర్ఘకాలిక శ్వాసనాళాల వాపు (బ్రాంకైటీస్‌), గుండె స్పందనలో వ్యత్యాసాలు లాంటి అనారోగ్యాలకు కారణమవుతాయి.


బి) స్థూల కణరూప కాలుష్యకాలు:   PM 10 గా పిలిచే 2.5 - 10 మైక్రాన్ల పరిమాణం ఉన్న కాలుష్యకాలు. ఇవి లోహ ఆక్సైడ్‌లు, సల్ఫర్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ లాంటి కాలుష్యాలు.


కణరూప కాలుష్యకాల దుష్ప్రభావాలు: వీటితో శ్వాసకోశ, గొంతు, కళ్ల సంబంధిత వ్యాధులు వస్తాయి.
 

1. సిలికోసిస్‌ వ్యాధి: స్టోన్‌క్రషింగ్‌ పరిశ్రమల నుంచి విడుదలైన సిలికా సంబంధ ఏరోసాల్స్‌ ఊపిరితిత్తుల్లో చేరి సిలికోసిస్‌ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి మొక్కలకు సోకితే పత్రాలు వడలిపోతాయి. పంట పెరుగుదల దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది.

2. బయాప్సినోసిస్‌ వ్యాధి (వైట్‌ లంగ్స్‌): నూలు వస్త్ర పరిశ్రమ నుంచి విడుదలయ్యే కాటన్, ధూళి వల్ల కార్మికులకు బయాప్సినోసిస్‌ అనే దగ్గు, శ్వాసకోశ సంబంధ వ్యాధి వస్తుంది.

3. ఆస్‌బెస్టాసిస్‌ వ్యాధి: ఆస్‌బెస్టాస్‌ తవ్వకాలు, ఆస్‌బెస్టాస్‌ సిమెంట్‌ రేకుల పరిశ్రమల నుంచి విడుదలైన ధూళి ఊపిరితిత్తుల వ్యాధికి కారణమవుతోంది. అందుకే ఈ ఖనిజం తవ్వకాలను ప్రపంచవ్యాప్తంగా అరికట్టారు.

4. బెరీలియోసిస్‌ వ్యాధి: బాక్సైట్‌ గనుల్లో పనిచేసే వారికి ఈ రకం ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది.

5. న్యూమోనియోసిస్‌ (బ్లాక్‌ లంగ్స్‌): బొగ్గు గనుల్లో పనిచేసే వారికి వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి.

2) వాయు రూప కాలుష్యకాలు:


1. కార్బన్‌ డయాక్సైడ్‌: గ్లోబల్‌ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన వాయువు కార్బన్‌ డయాక్సైడ్‌. శిలాజ ఇంధనాలు పూర్తిగా దహనం కాకపోవడం వల్ల; విద్యుత్తు కేంద్రాలు, పరిశ్రమల నుంచి ఈ వాయువు విడుదలవుతుంది. కేవలం శిలాజ ఇంధనాల వినియోగం వల్లే ఏటా సుమారు 2.5 × 10*13 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ వాతావరణంలో కలుస్తోంది.


2. కార్బన్‌ మోనాక్సైడ్‌: ఇది చాలా ప్రమాదకర విషవాయువు. శిలాజ ఇంధనాలు అసంపూర్తిగా దహనమవడం, వంట చెరకును మండించినప్పుడు, బొగ్గును కాల్చినప్పుడు ఎక్కువగా విడుదలవుతుంది. దీన్ని పీల్చడం వల్ల రక్తంలోని ‘హీమోగ్లోబిన్‌’ ఆక్సిజన్‌కు బదులు, ఈ వాయువుతో ఆక్సీకరణం చెంది ‘కార్బాక్సీ హీమోగ్లోబిన్‌’గా మారుతుంది. దీంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. దీన్నే ‘హైపోక్సియా’ అంటారు. ఇంకా మెదడు దెబ్బతినడం, కంటిచూపు మందగించడం, మతి భ్రమించడం లాంటి మస్తిష్క వ్యాధులకు దారితీస్తుంది.


3. సల్ఫర్‌డయాక్సైడ్‌: ప్రధానంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గును మండించినప్పుడు, మోటారు వాహనాల నుంచి విడుదలవుతుంది. దీనిస్థాయి వాతావరణంలో 1 PPM దాటినప్పుడు చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. దీనివల్ల ఆమ్లవర్షాలు కురుస్తాయి. ఫలితంగా చర్మక్యాన్సర్లు రావచ్చు. ఈ వ్యాధికారక గాలి మొక్కల పెరుగుదలను నిరోధిస్తుంది. చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయి.

ఉదా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర ఆయిల్‌ రిఫైనరీ నుంచి విడుదలైన సల్ఫర్‌డయాక్సైడ్‌ వల్ల తెల్లని తాజ్‌మహల్‌ క్రమేపీ పసుపు రంగులోకి మారుతోంది. మరిన్ని చారిత్రక కట్టడాల గోడలు పగుళ్లు బారుతున్నాయి. దీన్నే రాతి కుష్ఠువ్యాధి అంటారు.


4. నైట్రోజన్‌ ఆక్సైడ్‌: పెట్రోల్, డీజిల్‌తో నడిచే మోటారు వాహనాలు; విద్యుత్తు జనరేటర్లు, పంట పొలాల్లో వాడిన నత్రజని ఎరువుల వాడకం ద్వారా సాధారణంగా నైట్రోజన్‌ ఆక్సైడ్‌ గాలిలో కలుస్తుంది. దీనివల్ల గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదలై భూతాపానికి (గ్లోబల్‌ వార్మింగ్‌) కారణమవుతున్నాయి. కాలేయం, మూత్రపిండాలకు నష్టం కలగడం, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.


5. క్లోరోఫ్లోరో కార్బన్లు: మస్కిటో కాయిల్స్, ఫ్రిజ్‌లు, అత్తరు నుంచి ఇవి విడుదలై భూతాపాన్ని పెంచుతున్నాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినడం; అధిక రక్తపోటు, ఆస్తమా లాంటి వ్యాధులకు కారణమవుతాయి. వీటితో పాటు భార లోహలైన మెర్క్యూరీ, లెడ్, కాడ్మియం లాంటివి వాతావరణంలోకి విడుదలై కేంద్ర నాడీవ్యవస్థ, మెదడు దెబ్బతింటాయి. కాడ్మియం నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. మెర్క్యూరీ ప్రభావంతో జింజివాటా, మినిమాటా లాంటి వ్యాధులు వస్తాయి.


వాయు కాలుష్య నివారణ పద్ధతులు:

* వాహనాల్లో సీసం లేని పెట్రోల్‌ను వాడాలి.

* సంప్రదాయ ఇంధన వనరులకు బదులుగా బయోడీజిల్, బయోగ్యాస్, బయోమాస్‌ లాంటివి వినియోగించాలి.

* థర్మల్‌ విద్యుత్తు పరిశ్రమల నుంచి వెలువడే రేణు రూప పదార్థాలను తొలగించడానికి ఎలక్ట్రోస్టాటిక్‌ ప్రెసిపిటేటర్స్‌ అనే ఫిల్టర్‌లను తప్పనిసరిగా వాడాలి.

* పరిశ్రమల నుంచి వెలువడే కొన్ని సూక్ష్మ రేణువుల్లాంటి వాయుకాలుష్య కారకాలను తీసివేయడానికి స్క్రబ్బర్‌ వాడాలి. అంటే సున్నపురాయి తెట్టు లేదా సిమెంట్‌ బూడిద స్లర్రీ వినియోగించాలి.

* వాహనాల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి, వాయు నాణ్యత ప్రమాణాలను ప్రజలకు తెలియజేయడానికి భారత్‌/యూరో ఇంధన ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలి. ఇప్పటివరకు యూరో - 6 ప్రమాణాలు అమల్లో ఉన్నాయి.

* ఇళ్లలో వంటచెరకుగా పిడకలు, కర్రలకు బదులుగా ఎల్‌పీజీ గ్యాస్‌ వాడకం పెంచాలి. శీతలీకరణ యంత్రాల్లో సి.ఎఫ్‌.సి. లకు బదులుగా ద్రవ నత్రజని వినియోగించాలి.

* దేశవ్యాప్తంగా రైల్వేట్రాకులను విద్యుదీకరించాలి.

* రవాణా రంగంలో చమురు ఆధారిత పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ కంప్రెసర్, నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) హైడ్రోజన్‌ ఇంధనం, బ్యాటరీ ఆపరేటెడ్‌ వెహికల్స్‌ వినియోగాన్ని పెంచాలి.

* వాయు ఉద్గారాల్లో 20 శాతం మేరకు ఉద్గారాలను భారీ స్థాయిలో చెట్ల పెంపకం ద్వారా కార్బన్‌ సింక్‌ చేయవచ్చని యూఎన్‌ఓ చెబుతోంది. దీనికోసం UNO - REDD (Reducing Emissions from deforestation and Degradation) అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. భారీ స్థాయి అటవీకరణ ద్వారా కార్బన్‌ డయాక్సైడ్‌ను తొలగించే ప్రక్రియను కార్బన్‌ సీక్వెస్ట్రేషన్‌ అంటారు.

* కాలుష్య బాధితులకు నష్టపరిహారం ఇవ్వడం అనే ‘పొల్యూటర్‌ పే’ సూత్రాన్ని పర్యావరణ చట్టం (1986)లో చేర్చాలని సుప్రీంకోర్టు 1996లో సూచించింది. ఈ సూచనను అన్ని మంత్రిత్వ శాఖల్లో అమలుచేయాలి.

* వాహనాల పొగ గొట్టాల్లో కెటాలిటిక్‌ కన్వర్టర్లను అమర్చాలి. వీటితోపాటు ఇంకా అనేక శాస్త్రీయ విధానాలు అమలు చేసి, ప్రజలను అప్రమత్తం చేస్తేనే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన శ్వాస అందుతుంది.

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 14-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

వాతావరణ మార్పు    

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ


వాతావరణ మార్పు   (Glasgow)

కాప్‌ 26


ఈ సదస్సును 2021లో స్కాట్లాండ్‌లోని      (Glasgow)    నగరంలో నిర్వహించారు. 


వాతావరణ మార్పుల కారణంగా నష్టపోయిన భూగ్రహాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో దీన్ని నిర్వహించారు. దీనికోసం చేపట్టాల్సిన చర్యలను మరింత ఉద్ధృతం చేయాలని ఈ సదస్సులో తీర్మానించారు. 


2030 నాటికి నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం  అనుసరించాల్సిన కార్యాచరణను కాప్‌ 26లో మరోసారి చర్చించారు.


పారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా నెట్‌ జీరో ఎమిషన్స్‌ను తీసుకురావాలని, ప్రస్తుత ఉష్ణోగ్రతలను పారిశ్రామిక పూర్వ యుగానికి స్థిరీకరించాలని (ఉష్ణోగ్రతను 1.5ది తగ్గించాలని) సదస్సులో సూచించారు.


ప్రపంచ దేశాలన్నీ సున్నా ఉద్గారాలను అత్యంత వేగంగా చేరుకోవడానికి అవసరమైన చర్యలను ఇందులో పేర్కొన్నారు. 


2050 నాటికి ప్రపంచంలోని అత్యధిక దేశాలు నెట్‌ జీరో ఎమిషన్స్‌ను చేరుకోవాలని 


తీర్మానించారు. దీనికోసం బొగ్గు వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, దాని స్థానంలో రెన్యువబుల్‌ శక్తి వనరులను వినియోగించాలని ప్రతిపాదించారు.


 ప్రపంచ దేశాలన్నీ రవాణా కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాలని, వీటిపై ప్రజల్లో  అవగాహన పెంచాలని సూచించారు. 


ప్రపంచవ్యాప్తంగా మీథేన్‌ వాయువుల నియంత్రణ కోసం మీథేన్‌ ఉద్గారాల స్థాయులను నియంత్రించాలని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో మీథేన్‌ ప్రతిజ్ఞ చేయించారు.


సహజ ఆవాసాలను వాతావరణ మార్పుల ప్రభావం నుంచి అత్యంత భద్రంగా కాపాడుకోవాలని సూచించారు. 


ప్రపంచ దేశాలన్నీ 2030 నాటికి అటవీ నిర్మూలనను పూర్తిగా నిషేధించాలని పేర్కొంటూ, అటవీ పరిరక్షణ కోసం కార్యాచరణను రూపొందించారు.  


వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందిన దేశాలన్నీ సంవత్సరానికి వంద బిలియన్‌ డాలర్ల చొప్పున చెల్లించాలని సదన్సులో పేర్కొన్నారు. 


ఈ సదస్సులో నెట్‌ జీరో ఎమిషన్స్‌ను 2050 నాటికి చేరుకుంటామని అమెరికా, చైనా ప్రతిపాదించగా, భారత ప్రభుత్వం 2070 నాటికి సాధిస్తామని పేర్కొంది. 


పరస్పర భాగస్వామ్యంతో శుద్ధ సాంకేతికత (క్లీన్‌ టెక్నాలజీస్‌)ను వినియోగించి రహదారి వ్యవస్థను, వివిధ కర్మాగారాలను ఆధునికీకరించి కాలుష్యాన్ని తగ్గించాలని సూచించారు. 


వాతావరణ మార్పులను ముందుగా అంచనా వేసే క్లైమేట్‌ యాక్షన్‌ ట్రాకర్‌  (CAT)  అనే స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేసి, గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.8ది వరకు నియంత్రించాలని సూచించారు.


ప్రపంచ జనాభాలో 30% మంది అత్యంత అభివృద్ధి చెందిన దేశాలైన చైనా, అమెరికా, యూరప్‌లో నివసిస్తున్నారు. వీటి నుంచే ఏటా 78% కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నట్లు సదస్సులో చర్చించారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టం అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందని దేశాలపై ఏ విధంగా ఉందనే దాన్ని పరిగణనలోకి తీసుకుని క్లైమేట్‌ ఫైనాన్స్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.


కాప్‌ 27


కాప్‌ సదస్సును యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (గీవినీదిదిది)  ఏటా నిర్వహిస్తుంది. 2022 ఏడాదికి ఈ సదస్సును ఈజిప్ట్‌లోని షర్మ్‌ ఎల్‌-షేక్‌ నగరంలో జరిపారు. 


సదస్సులో చర్చించిన ముఖ్యాంశాలు: 


* పారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉష్ణోగ్రతలను 1.5°C  నుంచి 2°C వరకు తగ్గించడానికి కావాల్సిన అనుకూల వాతావరణాన్ని కల్పించకపోవడంపై సదస్సులో చర్చించారు.


* ఈ ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి అవసరమైన చర్యలను పరిశీలించేందుకు గ్లోబల్‌ గోల్‌ ఆన్‌ అడాప్టేషన్‌(GGA)అనే సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.


* కాప్‌-26 సదస్సు సమయంలో ఏర్పాటుచేసిన 100 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల నిధిని 2023లో విడుదల చేస్తారు.


* అభివృద్ధి చెందిన దేశాలు విడుదల చేసే ఉద్గారాల వల్ల ప్రభావానికి గురయ్యే చిన్న దేశాలను ఆదుకోవడానికి ‘లాస్‌ అండ్‌ డామేజ్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేశారు. 


* అంతర్జాతీయ భాగస్వామ్యంతో యాక్షన్‌ ఆన్‌ వాటర్‌ అడాప్టేషన్‌ అండ్‌ రెసిలియన్స్‌ (ఏడబ్ల్యూఏఆర్‌ఈ), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రెసిలియన్స్‌ ఎక్సలరేటర్‌ ఫండ్‌ (ఐఆర్‌ఏఎఫ్‌) అనే సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి సంబంధ సమస్యలు, వాతావరణ మార్పుల వల్ల సంభవించిన విపత్తులను ఎదుర్కొనే ప్రణాళికలు రచించడం వీటి ముఖ్య ఉద్దేశం.


* వాతావరణ మార్పుల ప్రభావాన్ని తరచూ ఎదుర్కొనే దేశాలను పరిరక్షించడానికి గ్లోబల్‌ షీల్డ్‌ ప్లాన్‌ను తయారు చేశారు. 2022 నాటికి ఎక్కువ వాతావరణ మార్పుల ప్రభావానికి గురైన పాకిస్థాన్‌కు ఈ నిధి నుంచి మొదటి మొత్తాన్ని కేటాయించారు.


* మడ అడవుల పరిరక్షణ కోసం మాంగ్రూవ్‌ ఎలైన్స్‌ ఫర్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఎంఏసీ) పథకాన్ని ప్రారంభించాలని సూచించారు.


భారత్‌ ప్రతిపాదనలు: 2070 నాటికి నెట్‌ జీరో ఉద్గారాలను సాధిస్తామని భారత్‌ పేర్కొంది.


సంప్రదాయేతర వనరుల నుంచి శక్తిని వినియోగించుకునేందుకు క్లీన్‌ హైడ్రోజన్‌ మిషన్, 20 శాతం ఇథనాల్‌ బ్లెండింగ్‌ చేస్తామని ప్రతిపాదించింది.


లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ (లైఫ్‌)


దీన్ని కాప్‌ 26 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. మన జీవనశైలి మార్పులతో సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చని, ప్రతి ఒక్కరూ దీన్ని ఉద్యమంలా చేయాలని మోదీ పిలుపునిచ్చారు.


 ఈ సదస్సులోనే మోదీ పంచామృత్‌ అనే 5 పర్యావరణహిత లక్ష్యాలను కూడా ప్రతిపాదించారు. ప్రపంచ దేశాలు ‘యూజ్‌ అండ్‌ డిస్పోజ్‌’ ఆర్థిక వ్యవస్థ నుంచి ‘సర్క్యులర్‌ ఎకానమీ’ ఆర్థిక వ్యవస్థకు మారాలని సూచించారు.


వాతావరణ మార్పులు - భారత ప్రభుత్వ చర్యలు


నీ భారత ప్రభుత్వం అత్యంత మెరుగైన విధివిధానాలతో వాతావరణ మార్పులను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటోందని భారత పర్యావరణ అటవీ, వాతావరణ మారు శాఖ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే రాజ్యసభలో ప్రకటించారు. ప్రపంచంలో భారత్‌ 17 శాతం జనాభా కలిగి ఉండగా, 1850  2019 మధ్యకాలంలో కేవలం నాలుగు శాతం మాత్రమే గ్రీన్‌ హౌస్‌ వాయువులు విడుదల చేసినట్లు చౌబే పేర్కొన్నారు. 


దేశంలో అమలవుతున్న వివిధ యాక్షన్‌ ప్లాన్స్‌


నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఎన్‌ఏపీసీసీ): గ్రీన్‌ హౌస్‌ వాయువుల ప్రభావాన్ని తగ్గించడం దీని ఉద్దేశం. ఇందుకోసం 8 నేషనల్‌ మిషన్స్‌ను రూపొందించారు. దేశంలోని వాతావరణ మార్పు ప్రభావాన్ని తగ్గించి సుస్థిరాభివృద్ధి, ఆరోగ్యవంతమైన జీవావరణ వ్యవస్థ, జీవ వైవిధ్య వ్యవస్థల పరిరక్షణ దీని లక్ష్యాలు. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్‌ఏపీసీసీ మార్గదర్శకాలతో స్టేట్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాయి.


నేషనల్‌ క్లీన్‌ ఎనర్జీ ఫండ్‌ (ఎన్‌సీఈఎఫ్‌): దీన్ని భారత ప్రభుత్వం 2010లో ప్రారంభించింది. శుద్ధ శక్తి వనరులను ప్రోత్సహించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు.


పారిస్‌ ఒప్పందం: భారత ప్రభుత్వం పారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా తన మద్దతు తెలిపింది. దీనికోసం 2005 నాటికి దేశ జీడీపీలో గ్రీన్‌ హౌస్‌ వాయువులను 33  35 శాతానికి తగ్గించాలి. శిలాజేతర ఇంధన వనరుల వినియోగాన్ని 40 శాతానికి పెంచాలి. 2030 నాటికి 2.5 నుంచి 3 బిలియన్‌ టన్నుల అదనపు కార్బన్‌ సింక్‌లను  ఏర్పాటు చేయాలి. పారిస్‌ ఒప్పందంలో భారత్‌ 2030 నాటికి సాధించాల్సిన కొన్ని లక్ష్యాలను సూచించగా, వాటిని 2021 నాటికే చేరుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయన్స్‌: ఇది అంతర్జాతీయ సంస్థ. దీని ముఖ్య కేంద్రం హరియాణాలోని గురుగ్రామ్‌లో ఉంది. భారత్‌ లాంటి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే దేశాల్లో శాస్త్ర సాంకేతిక పద్ధతులను అనుసరించి సౌరశక్తిని తయారు చేయడం దీని లక్ష్యం. దీన్ని భారత్, ఫ్రాన్స్‌ దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. 


భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌) నిబంధనలు: వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాలను నియంత్రించడం దీని ఉద్దేశం. ప్రస్తుతం మన దేశంలో బీఎస్‌ - 6 నిబంధనలు అమలవుతున్నాయి.


2000లో బీఎస్‌ - 1, 2005లో బీఎస్‌-2, 2010 లో బీఎస్‌-3, 2016లో బీఎస్‌ - 4 వాహన నిబంధనలు అమలయ్యాయి. వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. 


నేషనల్‌ అడాప్షన్‌ ఫండ్‌ ఫర్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఎన్‌ఏఎఫ్‌సీసీ): భారతదేశంలో వాతావరణ మార్పులకు గురవుతున్న వివిధ ప్రాంతాలకు ఈ నిధిని కేటాయిస్తారు. దీనిద్వారా ఆయా ప్రాంతాల్లో క్లైమేట్‌ ఛేంజ్‌ ప్రభావాన్ని తగ్గిస్తున్నారు. ఈ చర్యల ద్వారా 2005  16 మధ్య కాలంలో భారతదేశ ఉద్గార ప్రభావాన్ని దేశ జీడీపీలో 24 శాతం మేర  తగ్గించినట్లు ప్రభుత్వం పేర్కొంది.


కొయలేషన్‌ ఫర్‌ డిజాస్టర్‌ రెసిలియంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (సీడీఆర్‌ఐ): వాతావరణ మార్పులను తట్టుకుని దానివల్ల కలిగే విపత్తుల నుంచి రక్షించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం. 


వన్‌ సన్‌ వన్‌ వరల్డ్‌ వన్‌ గ్రిడ్‌ (ఓఎస్‌ఓడబ్ల్యూఓజీ): శిలాజేతర ఇంధనాల నుంచి శక్తి వనరుల వినియోగం, సౌర శక్తిని అత్యంత మెరుగ్గా వినియోగించుకోవడం మొదలైనవి దీని లక్ష్యాలు. దీని విజన్‌ ‘ది సన్‌ నెవర్‌ సెట్స్‌’ 


ఇంటిగ్రేటెడ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ (ఐసీజడ్‌ఎంపీ): తీర ప్రాంతాలను వాతావరణ మార్పుల నుంచి రక్షించడం దీని ముఖ్య ఉద్దేశం. పెరుగుతున్న కాలుష్య కారకాలు, తద్వారా సముద్ర నీటిమట్టం పెరుగుదల మొదలైన వాటిని ముందుగానే అంచనా వేసి సరైన విధివిధానాలతో గ్రీన్‌ హౌస్‌ వాయువుల ప్రభావాన్ని నియంత్రిస్తారు.

Posted Date : 17-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

జలకాలుష్యం

 హానికర జలాలు.. అనర్థాలకు మూలాలు!

 



 

జలుబు చేయడం, జ్వరం రావడం, శ్వాసకు ఇబ్బంది కలగడం, నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం, అతిసారం, జలాశయాల్లో వ్యర్థాల తెట్టు ఏర్పడటం, సముద్రపు అలలు ఎర్రగా మారడం, మొక్కలు పెరగకపోవడం, పంటల దిగుబడులు తగ్గిపోవడం తదితరాలన్నింటికీ కారణం కలుషిత జలాలు. మనిషి ఆరోగ్య సమస్యలకు, మరెన్నో జీవరాశుల ప్రాణాలకు నీరు ప్రమాదకరంగా పరిణమించడానికి మూలం కాలుష్యం.  ఈ నేపథ్యంలో జలకాలుష్యం రకాలు, దాని వల్ల కలిగే వ్యాధులు, నివారణకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలపై పోటీ పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి. 

భూమిని ఆవరించి ఉన్న జలావరణంలోని సముద్రాలు, మహాసముద్రాల్లో 97.25% ఉప్పునీరు, మిగిలిన 2.75% మంచినీరు ఉంది. ఆ మంచినీటిలోనూ 2% హిమం, హిమానీ నదాల్లోనే ఉంది. వాస్తవానికి జలావరణంలో సుమారు 1% మాత్రమే మనిషి అవసరాలకు భూగర్భం, భూఉపరితలం నుంచి మôచినీరుగా లభిస్తోంది. ఇదే సమస్త జీవరాశుల మనుగడకు ఆధారం. కానీ మనిషి అదుపు లేని అభివృద్ధి కార్యకలాపాల వల్ల అందుబాటులో ఉన్న ఆ కాస్త నీరు కూడా కలుషితమైపోతోంది.  

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ‘ఏవైనా అవాంఛనీయ పదార్థాలు నీటిలో కలిసి భౌతిక, రసాయనిక, జీవసంబంధ మార్పులకు కారణమై, ఆ నీటిని తాగడానికి, మొక్కలు ఆహ్లాదకరంగా పెరగడానికి వీలు లేకుండా చేయడాన్ని జలకాలుష్యం అంటారు’. భారతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌ఐ) ప్రకారం నాణ్యమైన తాగునీటికి రంగు, రుచి, వాసన అనే లక్షణాలు ఉండవు. నీటి గాఢత 6.0  9.0 pH మధ్యలో ఉంటుంది. నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ 3 ppm (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉండాలి.

 పరిశ్రమల నుంచి వెలువడే అనేక కర్బన, అకర్బన పదార్థాలు; విషతుల్య రసాయనాలు జలాలను కలుషితం చేస్తున్నాయి. గృహ సంబంధ వ్యర్థాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం వల్ల వచ్చిన వ్యవసాయ సంబంధ వ్యర్థాలు, అణు రియాక్టర్ల నుంచి వెలువడే రేడియోధార్మిక పదార్థాలు, సముద్రాలపై పేరుకుపోయిన చమురు తెట్టులాంటి అనేక వ్యర్థాలు నిత్యం స్వచ్ఛ జలాలు కాలుష్యం బారిన పడేందుకు కారణమవుతున్నాయి.

వివిధ అంచనాలు: జలకాలుష్యాన్ని రకరకాలుగా అంచనా వేస్తారు.

1) విలీన ఆక్సిజన్‌ (DO - డిజాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌): నీటిలో కరిగిన ఆక్సిజన్‌ను విలీన ఆక్సిజన్‌ అంటారు. ఇది నీటి నాణ్యతను నిర్ధారించేందుకు మంచి కొలమానం. జలాల్లో ఆక్సిజన్‌ పరిమాణం 5ppm కంటే ఎక్కువగా ఉన్నప్పుడే ఆ నీరు తాగడానికి, వ్యవసాయానికి, జలచరాల నివాసానికి ఉపయోగపడుతుంది. విలీన ఆక్సిజన్‌ 5ppm కంటే తగ్గితే ఆ జలాలు కాలుష్యం బారిన పడినట్లు పేర్కొంటారు.

2) జీవ ఆక్సిజన్‌ గిరాకీ (BOD - బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌): నిర్ణీత ఘనపరిమాణం ఉన్న నీటిలో కర్బన వ్యర్థ పదార్థాలను సూక్ష్మజీవులు జీవ, రసాయన ఆక్సీకరణ చర్య జరపడంలో వినియోగించుకునే ఆక్సిజన్‌ పరిమాణాన్ని జీవ ఆక్సిజన్‌ గిరాకీ అంటారు. నీటిలో ఆక్సిజన్‌ పరిమాణం సూక్ష్మజీవులు 5 లేదా 7 రోజులకు వినియోగించుకోగలిగిన అవధి ఆధారంగా జీవ ఆక్సిజన్‌ గిరాకీని కొలుస్తారు. 

3) రసాయన ఆక్సిజన్‌ గిరాకీ (COD- కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌): నిర్ణీత ఘనపరిమాణం ఉన్న నీటిలో కర్బన పదార్థాలను ఆక్సీకరించడానికి, బలమైన రసాయన కారకాలకు అవసరమైన ఆక్సిజన్‌కు సమానంగా పొటాషియం డై క్రోమేట్‌ ద్రావణం నుంచి పొందగలిగే ఆక్సిజన్‌ను రసాయన ఆక్సిజన్‌ గిరాకీ అంటారు. గంటల వ్యవధిలో ఎంత ఆక్సిజన్‌ అవసరం ఉంటుందనే అంశం ఆధారంగా రసాయన ఆక్సిజన్‌ డిమాండ్‌ను లెక్కిస్తారు.

4) యూట్రోఫికేషన్‌: జలాశయాల్లో పోషకాల పరిమాణం పెరిగినప్పుడు ఆకుపచ్చని శైవలాలు, అకశేరుకాలు గుంపుగా నీటిపై చేరి తెట్టు మాదిరిగా తేలియాడుతుంటాయి. దాంతో నీరు చిక్కగా, ఆకుపచ్చగా మారి చెడు వాసనను వెదజల్లుతుంది. ఈ స్థితిని యూట్రోఫికేషన్‌ అంటారు. దీన్నే శైవల మంజరులుగా వ్యవహరిస్తారు. ఈ చర్య వల్ల నీటిలోని ఆక్సిజన్‌ తగ్గి చేపలు, జలచరాలు చనిపోతాయి. పంట పొలాలు, రొయ్యలు, చేపల చెరువుల నుంచి వెలువడే ఫాస్ఫేట్స్, నైట్రేట్స్‌ లాంటి పోషకాల వల్ల; నివాస, పారిశ్రామిక ప్రాంతాల నుంచి విడుదలయ్యే మురుగు నీటి వల్ల యూట్రోఫికేషన్‌ కాలుష్యం ఏర్పడుతుంది. ఫలితంగా నీటి ద్వారా సంక్రమించే పోలియో, అతిసారం, టైఫాయిడ్, కామెర్ల లాంటి వ్యాధులు వస్తాయి. టెర్రర్‌ ఆఫ్‌ బెంగాల్‌గా పిలిచే నీటి ‘హైయాసింత్‌’ ప్రపంచంలోనే అత్యంత సమస్యాత్మకమైన నీటి కలుపు మొక్క. పోషకాలు ఎక్కువగా ఉన్న యూట్రోఫిక్‌ నీటి ఆవాసాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. తద్వారా నీటి కుంటల జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. 

5) ఓలిగోట్రోఫికేషన్‌: ఇది యూట్రోఫికేషన్‌కు వ్యతిరేకమైన స్థితి. కొత్తగా తవ్విన బావులు, చెరువులు, సరస్సుల్లో సాధారణంగా నీరు నిలకడగా ఉంటుంది. సరైన పోషక పదార్థాలు ఉండక యూట్రోఫికేషన్‌ కాలుష్యం జరగదు. నీరు స్వచ్ఛంగా ఉంటుంది. జలాశయాలకు ఉండే ఈ స్థితినే ఓలిగోట్రోఫికేషన్‌ అంటారు.

6) రెడ్‌ టైడ్స్‌: సముద్రాల్లోకి మానవ జనిత ఉద్గారాలు చేరినప్పుడు ఆ వ్యర్థాలను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో అక్కడి డైనోఫ్లాజెల్లేట్స్‌ అనే సూక్ష్మజీవులు కొన్ని రసాయనాలను నీటిలోకి విడుదల చేస్తాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో సముద్రపు నీరు ఎర్రగా మారుతుంది. దీని ప్రభావం వల్ల తీరం వద్ద అలలు ఎర్రగా కనిపిస్తాయి. వీటిని రెడ్‌ టైడ్స్‌ అంటారు. 

7) భారలోహ కాలుష్యం: పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు నీటిలో కలవడంతో జింక్, కాపర్, కాడ్మియం, మెర్క్యురీ, ఆర్సెనిక్, క్రోమియం, కోబాల్ట్‌ లాంటి భార లోహాల వల్ల మానవులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. 

8) చమురు కాలుష్యం: సముద్ర నీటిపై ఓడల నుంచి ఆయిల్‌ స్పిల్‌ జరిగి సముద్ర జలాలు చమురుతో కలుషితమవుతున్నాయి. వీటి నుంచి విడుదలయ్యే పారాఫిన్, మీథేన్, ఈథేన్‌ లాంటి వాయువులను పీల్చినప్పుడు శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. ఆక్సిజన్‌ నీటిలో కరగకుండా చమురు తెట్టు అడ్డుకుంటుంది. దాంతో ఆక్సిజన్‌ డిమాండ్‌ పెరిగి సముద్ర జలచరాలకు ప్రాణహాని కలుగుతుంది. సముద్ర జలాల్లో పేరుకుపోయిన చమురును సూడోమోనాస్‌ బ్యాక్టీరియా ద్వారా విక్షాళనం చెందించవచ్చు. భారత సంతతికి చెందిన ఆనంద చక్రవర్తి అనే అమెరికన్‌ శాస్త్రవేత్త సముద్ర జలాల్లోని చమురు కాలుష్యాన్ని తొలగించే ‘ఆయిల్‌ ఈటింగ్‌ బ్యాక్టీరియా’ అనే సూపర్‌ బగ్‌ను రూపొందించారు.


వ్యాధులు: కొన్ని రకాల భార లోహాలు కరిగిన నీటిని తాగడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. 

పాదరసం: సాధారణంగా నీటిలో 0.001 మి.గ్రా./లీటర్‌ పాదరసం కరిగి ఉండటం వల్ల ఎలాంటి హాని ఉండదు. కానీ ఆ మోతాదుకు మించి పాదరసం నీటిలో కలిస్తే పెదవులు, చేతులు స్పర్శజ్ఞానాన్ని కోల్పోవడం, వినికిడి సామర్థ్యం, కంటి చూపు తగ్గిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. జపాన్‌లోని మినమాటా గ్రామంలో ఇలాంటి వ్యాధి లక్షణాలు గమనించడం వల్లే దీన్ని మినమాటా వ్యాధి అంటారు. కాగితం, రంగుల పరిశ్రమల నుంచి వచ్చే మెర్క్యురీ జలాల్లో కలిసి డై మిథైల్‌ మెర్క్యురీగా నీటిలో కరుగుతుంది. ఈ నీటిలోని చేపలను ఆహారంగా తీసుకునే మనిషిలోకి ఇది ప్రవేశిస్తుంది.

కాడ్మియం: ఇది సాధారణంగా జలాల్లో 0.01 మి.గ్రా./లీటర్‌ కరిగి ఉంటే ప్రమాదం లేదు. అంతకుమించి ఉంటే మూత్రపిండాలు, కేంద్రీయ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎముకలు విరూపణ చెందడం, రక్తహీనత, స్త్రీలలో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. జింక్‌ తయారు చేసే పరిశ్రమల నుంచి కాడ్మియం విడుదలవడం వల్ల జపాన్‌లోని ఇటాయ్‌ ప్రాంతంలో దీని ప్రభావాన్ని మొదట కనుక్కున్నారు. అందుకే ఆ వ్యాధిని ఇటాయ్‌ ఇటాయ్‌ అంటారు.

నైట్రేట్స్‌: తాగునీటిలో సాధారణంగా 4.5 మి.గ్రా/లీటర్‌ పరిమాణంలో నైట్రేట్స్‌ ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉంటే అవి రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలిసి మెటా హిమోగ్లోబినియాగా మారి శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోతుంది. దాంతో దుష్ప్రభావాలు కలుగుతాయి. శిశువులు నీలి రంగులో జన్మించడం, క్యాన్సర్‌ వ్యాధులు ప్రబలడం లాంటి పరిణామాలు జరుగుతాయి. తాగునీటిలో నైట్రేట్‌ మలినాలు ఎక్కువగా చేరడానికి కారణం పరిమితికి మించి ఎరువులను వినియోగించడం, భూగర్భజలంలో నైట్రేట్స్‌ గాఢత పెరిగిపోవడమే.

కాపర్‌: తాగేనీటిలో కాపర్‌ అధికంగా ఉంటే అధిక రక్తపోటు, అప్పుడప్పుడు జ్వరం రావచ్చు.

క్రోమియం: తాగునీటిలో ఎక్కువ పరిమాణంలో క్రోమియం ఉంటే క్యాన్సర్, కేంద్రనాడీ మండలానికి సంబంధించిన రుగ్మతలు, మూత్రపిండాల వాపు లాంటివి సంభవిస్తాయి.

కోబాల్ట్‌: పరిమితికి మించి కోబాల్ట్‌ నీటిలో కరిగి ఉంటే ఆ నీటిని స్వీకరించడం వల్ల పక్షవాతం, అతిసారం, రక్తపోటు తగ్గడం,  ఎముకల బలహీనత లాంటివి వస్తాయి.


జల కాలుష్య నివారణ చర్యలు:

ట్రిక్లింగ్‌ ఫిల్టర్‌: ఇదో రకమైన మురుగు నీటి శుద్ధి వ్యవస్థ. చిన్న గులకరాళ్లతో తయారుచేసిన బెడ్‌ లాంటి నిర్మాణం. దీనిపైకి మురుగు నీటిని ప్రవేశపెట్టినప్పుడు నీరు వడపోతకు గురై పరిశుభ్రమైన నీరుగా మారుతుంది.

రొటేటింగ్‌ బయలాజికల్‌ కాంటాక్టర్‌: వలయాకార ప్లాస్టిక్‌ ఫలకలు ఒకదాని పక్కన మరొకటి అమరి ఉంటాయి. వీటిపై మురుగు నీరు ప్రవేశించినప్పుడు సూక్ష్మజీవులు సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తాయి.

తిరోగమన ద్రవాభిసరణ: ఇది నీటిలో కరిగి ఉన్న అవాంఛనీయ లవణాలను తొలగించే ప్రక్రియ. ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకు అయాన్లు, అణువులను రవాణా చేసి నీటిని శుద్ధి చేసే కార్యక్రమం.

అడ్వాన్స్‌డ్‌ సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌: ఇది యంత్రాల ద్వారా జరిగే నీటి శుద్ధి కార్యక్రమం. ఇదొక ఆధునిక మురుగు శుద్ధి ప్రక్రియ.


నీటి కాలుష్య నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు: 

* జల కాలుష్య నియంత్రణ చట్టం - 1974 

* గంగా కార్యాచరణ ప్రణాళిక - 1985 

* జాతీయ నదీ సంరక్షణ కార్యక్రమం - 1995 

* జాతీయ గంగానది పరీవాహక అథారిటీ - 2009 

* నమామి గంగే - 2015 - 22

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 23-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఉష్ణ కాలుష్యం

వేడి మోతాదు మించితే ముప్పు!


 

అప్పుడప్పుడు పరిశ్రమల సమీపంలోని జలాశయాల్లో జలచరాలు చనిపోయి నీటిపై తేలియాడటం కనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో నేల గాఢతలో మార్పులు వచ్చి, సారం తగ్గిపోయి, ఉత్పత్తి దెబ్బతింటుంది. వీటికి కారణం పరిశ్రమలు విచక్షణరహితంగా వేడి నీటిని జలాశయాల్లో వదలడం, నదులు, చెరువుల ఒడ్డున ఉన్న చెట్లను మనుషులు విచ్చలవిడిగా నరికి వేయడం. ఫలితంగా వాటిల్లోని నీళ్లు వేడెక్కి, ఉష్ణ కాలుష్యం ఏర్పడి, రకరకాల అనర్థాలకు కారణమవుతున్నాయి. జనం వ్యాధులకు గురవుతున్నారు. ఇతర జీవులు నశించిపోయి పర్యావరణానికి హాని కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఉష్ణకాలుష్యం కారకాలు, ప్రభావాలు, నివారణ చర్యల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

మనిషి కార్యకలాపాల వల్ల జలచరాలు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగే విధంగా నీటి ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు సంభవిస్తున్నాయి. ఈ రకమైన కాలుష్యాన్ని థర్మల్‌/ఉష్ణ కాలుష్యంగా భావిస్తారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా థర్మల్‌ కాలుష్యం పెరుగుతోందని, ఫలితంగా జలచరాలకు తీరని నష్టం జరుగుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. థర్మల్, అణు విద్యుత్తు కేంద్రాలు, పరిశ్రమల నుంచి వెలువడే ఉష్ణం చాలా తక్కువగా యంత్రాలు పనిచేయడానికి ఉపయోగపడితే, ఎక్కువ భాగం వ్యర్థ ఉష్ణంగా బయటకు వెలువడుతోంది. ఇది  పరిసరాలను వేడెక్కిస్తోంది. ఈ వ్యర్థాలను చల్లబరచడానికి సమీపంలోని నదులు/జలాశయాల నీటిని ఉపయోగిస్తారు. ఆ విధంగా విడుదలైన ఉష్ణ జలాలను తిరిగి నదులు/జలాశయాల్లో వదులుతారు. అప్పుడు జలాశయాల నీటి ఉష్ణోగ్రత సుమారు 6 నుంచి 10 డిగ్రీల వరకు పెరుగుతోంది. ఫలితంగా నీటిలోని ఆక్సిజన్‌ పరిమాణం తగ్గి జలచరాల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. మరొకవైపు నదులు, జలాశయాల వెంట విస్తరించి ఉన్న చెట్లను విచక్షణారహితంగా నరికివేస్తున్నారు. దీంతో సాధారణ జలాల్లో ఉష్ణోగ్రత పెరిగి మోతాదుకు మించి వేడెక్కుతున్నాయి. చివరకు జలచరాల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. కొన్ని పరిశ్రమల నుంచి అతి చల్లని నీరు కూడా విడుదలై నీళ్లలోని ప్రాణులకు హానికరంగా మారుతోంది. ఈ విధంగా ఇతర కాలుష్యాలకు తీసిపోని విధంగా థర్మల్‌ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా జలచరాల జీవన స్థితిగతులను, తద్వారా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తోంది. 


ఉష్ణ కాలుష్య కారకాలు:  
 

1) పరిశ్రమలు 


2) థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు 


3) జలవిద్యుత్తు కేంద్రాలు 


4) అణువిద్యుత్తు కేంద్రాలు 


5) గృహ సంబంధిత వ్యర్థాలు 


ఉష్ణకాలుష్య ప్రభావాలు:


1) నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ తగ్గుదలs (Reduction of Dissolved Oxygenz): ఉష్ణ కాలుష్యం వల్ల నీటిలో ఆక్సిజన్‌ పరిమాణం తగ్గిపోయి జలచరాలు చనిపోతాయి. 32°F వద్ద కరిగి ఉన్న ఆక్సిజన్‌ గాఢత 14.6 ppm ఉంటే, 64°F వద్ద నీటిలో ఆక్సిజన్‌ గాఢత 6 ppmమాత్రమే ఉంటుంది. చల్లని నీటిలో చేపలు జీవించడానికి కనీసం 6 ppm ఆక్సిజన్‌ అవసరం. 


2) జీవక్రియలకు అంతరాయం: ఉష్ణ కాలుష్యం వల్ల జీవుల శరీర ధర్మాలు, జీవక్రియలు, జీవరసాయన ప్రక్రియలు ప్రభావితమవుతాయి. తద్వారా జీవరాశుల శ్వాస, జీర్ణ, విసర్జక వ్యవస్థలు ప్రభావితమై జీవుల మనుగడ కష్టమవుతుంది. 


3) నీటి ధర్మాల్లో మార్పు: సాధారణ స్థాయికి మించి నీటిలో ఉష్ణోగ్రతలు పెరిగితే నీటి భౌతిక, రసాయన ధర్మాల్లో మార్పులు వస్తాయి. ఉష్ణకాలుష్యం వల్ల నీటి బాష్పీభవన ప్రక్రియ పెరగడమే కాకుండా, నీటి సాంద్రత తగ్గి, స్నిగ్ధతలో మార్పులు వస్తాయి. దాంతో నీటి కణాలు వేగంగా స్పందన ప్రక్రియకు గురవుతాయి. దానివల్ల జలచరాల ఆహారంపై ప్రభావం పడుతుంది.


4) జలచరాల ప్రత్యుత్పత్తికి అంతరాయం: అనుకూల ఉష్ణోగ్రతల వద్ద చేపలు తదితర జలచరాలు గుడ్లు పెట్టడం, పొదగడం వంటి ప్రత్యుత్పత్తి ప్రక్రియలు నిర్వహిస్తాయి. అలాగే వలసలు కూడా నీటి ఉష్ణోగ్రత మీద ఆధారపడతాయి. ఉష్ణ కాలుష్యం చేపలు గుడ్లు పెట్టడంపై ప్రభావం చూపుతుంది. పొదగాల్సిన గుడ్లు నాశనమవుతాయి. 


ఉదా: ట్రౌట్‌ జాతి చేపలు గుడ్లు పెట్టడానికి 8.9°C అనుకూలమైన అత్యధిక ఉష్ణోగ్రత కావాలి.


5) జలచరాల జీవితకాలం తగ్గుదల: ఉష్ణ కాలుష్యం వల్ల నీటి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు జలచరాల క్రియాశీలత పెరిగి క్రమంగా జీవక్రియల సామర్థ్యం, జీవితకాలం తగ్గిపోతాయి. ఉదా: క్రస్టేషియన్‌ జాతికి చెందిన డాఫ్నియా జీవి 8°C వద్ద 108 రోజులు జీవిస్తుంది..అదే జీవి 21°C వద్ద 29 రోజులు మాత్రమే బతుకుతుంది.  


6) శైవలాల వృద్ధి వల్ల ఆహారపు గొలుసులో మార్పులు: వేడి నీటిని జలాశయాల్లోకి వదిలే సమయంలో, వ్యవసాయ భూముల నుంచి వచ్చే వ్యర్థాల్లోని పోషకాలు ఆ నీటిలో కలుస్తాయి. పోషకాల వల్ల జలాశయాల్లో శైవలాలు విపరీతంగా పెరిగి యూట్రోఫికేషన్‌ జరుగుతుంది. దీంతో నీటిలో ఆక్సిజన్‌ పరిమాణం తగ్గి జలచరాలు త్వరగా నశించిపోతాయి. ఫలితంగా జల ఆహారపు గొలుసుకు విఘాతం ఏర్పడుతుంది. 


7) చల్లటి నీటిలోని జీవులకు ప్రాణ సంకటం: ఒక పెద్ద విద్యుత్తు కేంద్రం రోజుకు సుమారుగా 500 మిలియన్‌ గ్యాలన్ల నీటిని కండెన్సర్ల ద్వారా నదులు/జలాశయాల నుంచి తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో చల్లటి నీటిలోని చిన్న చేపలు, ప్లవకాలు (చిన్న నీటి మొక్కలు), కీటకాల లార్వాలు వంటి వాటిని కండెన్సర్‌ పీల్చుకోవడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారిపోతుంది. దాంతో నీటి సాంద్రత, పీడనంలో తేడాలు వచ్చి జల జీవరాశులు మరణిస్తున్నాయి.


మనిషిపై ఉష్ణకాలుష్య ప్రభావం:
 

* పరిశ్రమల నుంచి వచ్చే మలినాలు నీటిలో కలిసి ఆక్సిజన్‌ పరిమాణాన్ని తగ్గిస్తాయి. వేడి నీటిలోని పాదరసం, కాపర్, కాడ్మియం, ఆర్సెనిక్, క్లోరిన్‌ లాంటి విష మలినాలు మనుషుల్లో వ్యాధులను కలుగజేస్తాయి.


* ఉష్ణ కాలుష్యం వల్ల నీలి ఆకుపచ్చ శైవలాలు వేగంగా పెరుగుతాయి. దాంతో విష పదార్థాలు (టాక్సిన్లు) ఉత్పత్తి అయ్యి నీటి నాణ్యత తగ్గి మనుషులకు ప్రాణాంతకంగా మారుతుంది. 


* పరిశ్రమలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి కండెన్సర్ల ద్వారా విడుదలైన వేడినీటిని తట్టుకునే కొన్ని థర్మోఫైల్స్‌ సూక్ష్మజీవులు సురక్షితంగా బయటపడి వ్యాధికారకాలు అవుతాయి. 


* వేడినీరు పంట పొలాలపై ప్రవహించినప్పుడు లవణాలను కరిగించడమే కాకుండా నేల గాఢతలో మార్పు తీసుకొస్తుంది. తద్వారా వ్యవసాయ ఉత్పాదకత తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు చిన్నాభిన్నమవుతాయి.


 

ఉష్ణకాలుష్య నివారణ చర్యలు:
 

* యంత్రాలు ఎక్కువగా వేడెక్కకుండా చర్యలు తీసుకొని, వాటి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఉష్ణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు.  


* జలాశయాల్లోని నీటిని యంత్రాల్లోకి పంపి యంత్రభాగాలను చల్లబరచి, తిరిగి వేడి నీటిని జలాశయంలోకి పంపించేందుకు శీతలీకరణ ప్రక్రియను చేపట్టాలి.  


* కృత్రిమ సరస్సులు, చెరువులను ఏర్పాటు చేసి వ్యర్థ నీటిని గొట్టాల ద్వారా ఒకటి లేదా రెండు మీటర్ల లోతులోకి వదలాలి. అదే సరస్సులు, చెరువుల నుంచి తిరిగి 15 మీటర్ల లోతులో అమర్చిన గొట్టాల ద్వారా మళ్లీ యంత్రాల్లోకి ప్రవేశపెట్టాలి. దాంతో పైనున్న నీటిపొర బాష్పీభవనం వల్ల క్రమంగా చల్లబడుతుంది.


* వేడినీరు భూమిలో ఇంకే విధంగా చూడాలి. 


* సరైన కూలింగ్‌ టవర్స్, పాండ్స్‌ని ఏర్పాటు చేయాలి. 


* పరిశ్రమల నుంచి వెలువడిన వేడినీటిని చల్లార్చి, తిరిగి అదే పరిశ్రమలో వినియోగించాలి. 


* వ్యర్థజలాల్లోని విష రసాయనాలను వడబోసి శుద్ధజలాలను మాత్రమే జలాశయాల్లోకి పంపించాలి. 


* పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే సమయంలో ప్రభుత్వాలు యంత్రాల దక్షత, నాణ్యతను పరిశీలించాలి. 


* పారిశ్రామిక ఉష్ణజలాలను ఎక్కువ దూరం ప్రవహింపజేస్తే కొంత నీరు ఆవిరై, కొన్ని రసాయనాలు వడపోతకు గురవుతాయి. దాంతో కొంత నష్టాన్ని తగ్గించవచ్చు. 


   మాదిరి ప్రశ్నలు


1. కాలుష్య కారకాలు పర్యావరణంలోనికి ప్రవేశించిన తర్వాత రసాయన చర్యల ద్వారా ఏర్పడే కాలుష్యాన్ని ఏ విధంగా పిలుస్తారు?

1) ప్రాథమిక కాలుష్యాలు    2) గుణాత్మక కాలుష్యాలు 

3) ద్వితీయ కాలుష్యాలు    4) ఏదీకాదు



2. కిందివాటిలో జీవ విచ్ఛిన్న కాలుష్య జనితాలు ఏవి?

1) గృహ విసర్జితాలు        2) ఉష్ణ కాలుష్యం

3) 1, 2                 4) ఏదీకాదు



3. మైనింగ్‌ పరిశ్రమ నుంచి విడుదలయ్యే కాలుష్యకాలు ఏవి?

1) హైడ్రోజన్‌ సల్ఫైడ్‌   2) ఫెర్రస్‌ సల్ఫేట్‌

3) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం   4) పైవన్నీ



4. కిందివాటిలో రుణాత్మక మృత్తికా కాలుష్య కారకాలు ఏవి?

1) మైనింగ్‌ కాలుష్యాలు   2) బ్లాస్టింగ్‌ కాలుష్యాలు 

3) అడవుల నరికివేత     4) పైవన్నీ



 

5. న్యూక్లియర్‌ రియాక్టర్ల నుంచి విడుదలయ్యే రేడియోధార్మికత వ్యర్థ పదార్థాలు ఏవి?

1) స్ట్రాన్షియం - 90      2) అయోడిన్‌ - 129      3) సీజియం - 137      4) అన్నీ



 

6. నీటిలోని ఏ వ్యాధి కారకాలు మురుగు నుంచి ఉత్పత్తవుతాయి?

1) బ్యాక్టీరియా     2) ప్రోటోజోవా      3) 1, 2      4) 1 మాత్రమే




7. తాజ్‌మహల్‌ సౌందర్యానికి దేని నుంచి ప్రమాదం ఉంది?

1) యమునా నది     2) మురుగు నీరు    3) మధురై రిఫైనరీ    4) మార్బుల్స్‌పై ఉష్ణోగ్రత, వర్షం ప్రభావం



8. డిటర్జెంట్‌ పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యాలు?

1) క్షారాలు    2) అమ్మోనియా సమ్మేళనాలు

3) 1, 2      4) ఏదీకాదు



9. ఉష్ణ కాలుష్యం వల్ల ఏ నష్టాలు జరుగుతాయి?

ఎ) నీటిలోని ఆక్సిజన్‌ తగ్గుతుంది.

బి) జీవుల జీవక్రియకు అంతరాయం.

సి) నీటి ధర్మాల్లో మార్పులు. 

డి) శైవలాలు వృద్ధి చెందుతాయి.

1) ఎ, బి      2) బి, సి     3) ఎ, బి, సి     4) పైవన్నీ



10. ఉష్ణ కాలుష్యం వల్ల నీటిలో ఏ పదార్థం తగ్గితే జలరాశులకు హాని కలుగుతుంది?

1) ద్రావిత ఆక్సిజన్‌     2) ద్రావిత నైట్రోజన్‌      3) కాల్షియం      4) క్లోరిన్‌


సమాధానాలు: 1-3;     2-3;    3-4;   4-4;    5-4;    6-3;   7-3;    8-3;    9-4;   10-1.


 రచయిత: జల్లు సద్గుణరావు


 

Posted Date : 08-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆ నగరం అత్యంత కలుషితం!


పర్యావరణ కాలుష్యం

ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి. రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం మనిషి జీవనానికి మహా విపత్తుగా మారుతోంది. అనేక రకాల సవాళ్లను విసురుతోంది. ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కాలుష్యం రకాలు, కారకాలు, దాని వల్ల కలిగే రుగ్మతలు, నివారణ చర్యలపై పోటీ పరీక్షార్థులకు పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. దేశంలో కాలుష్యాన్ని కొలిచేందుకు ఉన్న ప్రమాణాలు, నియంత్రణకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా అవగాహన పెంచుకోవాలి. 

 ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


1.    దేశంలో జాతీయ వాయు కాలుష్య సూచిక ఎప్పటినుంచి ప్రారంభమైంది?

    1) 2014  2) 2016  3) 2017  4) 2018


2.     2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరం ఏది?

1) న్యూదిల్లీ 2) కాన్పుర్‌ 3) హసన్‌ 4) అసోపుర్‌


3.     నీటి కాలుష్యాన్ని కొలవడానికి తొలిసారిగా ఏ దేశంలో బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ)ను ఉపయోగించారు?

1) బ్రిటన్‌  2) అమెరికా  3) ఫ్రాన్స్‌  4) భారత్‌


4.     ఏ భారీ లోహ కాలుష్యం ద్వారా మనిషిలో ఇటాయి-ఇటాయి వ్యాధి సంభవిస్తుంది?

1) ఆర్సెనిక్‌     2) పాదరసం 

3) కాడ్మియం     4) మాంగనీస్‌


5.     ప్రపంచంలో అత్యధిక మోతాదులో ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశం- 

1) చైనా  2) అమెరికా   3) జపాన్‌  4) జర్మనీ


6.     సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) ముంబయి 2) న్యూదిల్లీ 3) చెన్నై 4) హైదరాబాద్‌


7.     హిమోగ్లోబిన్‌ తయారీని అడ్డుకునే భార లోహం-

1) పాదరసం 2) సీసం 3) మాంగనీస్‌ 4) బేరియం


8.     పారిస్‌ ఒప్పందంలో భాగంగా భారత్‌ తనవంతు చర్యలను తెలిపే Nationally Determined Contributions (NDCs) ను తొలుత ఎప్పుడు ప్రకటించింది?

1) అక్టోబరు 2, 2015    2) అక్టోబరు 2, 2014

3) అక్టోబరు 2, 2016     4) అక్టోబరు 2, 2017


9.     ఘన వ్యర్థాల సమస్యను తగ్గించడానికి కిందివాటిలో ఏ పద్ధతి మెరుగైంది?

1) చెత్త కుప్పలను కాల్చేయడం     2) పునర్వినియోగం (పునఃచక్రీయం)

3) సముద్రంలో పారవేయడం    4) ఒత్తిడి ద్వారా కుదించడం


10. దిల్లీలోని వాయు కాలుష్యానికి కిందివాటిలో ఏది ఎక్కువ కారణం?

1) రాజస్థాన్‌లో పంట కోసిన తర్వాత గడ్డి మోళ్లను తగలబెట్టడం

2) పంజాబ్‌లో పంట కోసిన తర్వాత మోళ్లను తగలబెట్టడం

3) పంజాబ్‌లో వంటచెరకు వాడకం

4) రాజస్థాన్‌లో వంటచెరకు వాడకం


11.    భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనకు కారణమైన విషవాయువు?

1) మిథైల్‌ ఐసో సయనైడ్‌    2) మీథేన్‌ ఐసో సయనైడ్‌

3) మిథైల్‌ ఐసో సయనేట్‌    4) మీథేన్‌ ఐసో సయనేట్‌


12. ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’ (నదుల కోసం యాత్ర) అంటే ఏమిటి?

1) నదులను రక్షించేందుకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ చేపట్టిన జాతీయ ఉద్యమం.

2) నదులను రక్షించేందుకు ఈశా ఫౌండేషన్‌ చేపట్టిన జాతీయ ఉద్యమం.

3) కేరళలోని వార్షిక బోటు ర్యాలీ

4) ‘నమామి గంగే’ కార్యక్రమం ద్వారా నదుల ప్రక్షాళనకు ప్రభుత్వం చేపట్టిన పథకం.


13. పారిస్‌ వాతావరణ మార్పు ఒప్పందం ప్రకారం భారతదేశం కర్బన ఉద్గారాల విషయంలో తన కోసం నిర్దేశించుకున్న దేశీయ నిర్ధారిత వాటా (INDC) ఎంత? 

1) 2030 నాటికి 2005 స్థాయి కంటే 33-35% తక్కువ 

2) 2020 నాటికి 1990 స్థాయి కంటే 20-25% తక్కువ

3) 2020 నాటికి 2000 స్థాయి కంటే 23-25% తక్కువ

4) 2030 నాటికి 1990 స్థాయి కంటే 15-20% తక్కువ 


14. భూమిపై ఓజోన్‌ పొరకు అతిపెద్ద రంధ్రం ఏ ప్రాంతంలో ఏర్పడింది?

1) ఆర్కిటిక్‌ ప్రాంతం     2) అంటార్కిటిక్‌ ప్రాంతం

3) భూమధ్యరేఖా ప్రాంతం    4) ఉత్తర అమెరికా


15. వ్యర్థాల పునర్‌ నిర్వహణలో ళిళిళిలు ఏవి?

1) తగ్గించడం, పునర్వినియోగం, పునఃచక్రీయం (Reduce, Reuse, Recycle)

2) సరిగ్గా, పునఃచక్రీయం, పునరుద్ధరణ (Right, Recycle, Revive)

3) సరిగ్గా, తొలగించడం, పునఃచక్రీయం (Right, Removes, Recycle)

4) తగ్గించడం, పునఃప్రేరేపం, పునఃచక్రీయం (Reduce, Reactive, Recyle)


16. కాలుష్య నివారణకు అతి సమర్థ సాధనం?

1) కాలుష్య పన్ను                  2) కాలుష్య ప్రోత్సాహం (సబ్సిడీ) 

3) నైతికంగా నచ్చజెప్పడం       4) సామాన్య న్యాయం


17. ‘కేటలిటిక్‌ కన్వర్టర్‌’ ఉపకరణాన్ని దేనిలో ఉపయోగిస్తారు? 

1) పాలిమర్‌ తయారీ కేంద్రం                2) న్యూక్లియర్‌ రియాక్టర్‌

3) ఆటోమొబైల్‌ ఎగ్జాస్ట్‌ యూనిట్‌-1        4) నీటిశుద్ధి ప్లాంటు 


18. బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ దేన్ని కొలుస్తుంది?

1) పారిశ్రామిక కాలుష్యం    2) వాయు కాలుష్యం

3) అకర్బన కాలుష్యం

4) సేంద్రియ వ్యర్థాలను డీకంపోజ్‌ చేసే సూక్ష్మజీవులకు కావాల్సిన కరిగి ఉన్న O2 


19. బొగ్గును పర్యావరణానికి అత్యంత హానికర కారకంగా పరిగణిస్తారు. ఎందుకంటే దాన్ని దహనం చేయడం వల్ల ఎక్కువ మోతాదులో వెలువడేది?

ఎ) బొగ్గుపులుసు వాయువు    బి) సల్ఫర్‌ డయాక్సైడ్‌

సి) నైట్రోజన్‌ ఆక్సైడ్‌             డి) మీథేన్‌

1) ఎ, డి         2) ఎ, బి, సి, డి    3) ఎ, బి, సి         4) ఎ, సి, డి 


20. కిందివాటిలో ఏ దేశానికి సొంతంగా గ్రీన్‌హౌస్‌ వాయువులను పర్యవేక్షించే ఉపగ్రహం లేదు?

1) యూఎస్‌ఏ       2) జపాన్‌        3) భారత్‌         4) చైనా


21. ‘కార్బన్‌ మోనాక్సైడ్‌’కి సంబంధించి కింద పేర్కొన్న వాటిలో సరైంది?

ఎ) మానవ శరీరంలో ఉత్పత్తి అవుతుంది.

బి) సికిల్‌సెల్‌ ఎనీమియా చికిత్సకు సహాయపడుతుంది.

సి) న్యూరో ట్రాన్స్‌మీటర్‌లా పనిచేస్తుంది.

1) ఎ, బి, సి     2) ఎ మాత్రమే 

3) ఎ, సి     4) సి మాత్రమే


22. కిందివాటిని జతపరచండి.

ఎ) గంగా కార్యాచరణ ప్రణాళిక 1) 1986
బి) వాయు (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం  2) 1974
సి) పర్యావరణ (సంరక్షణ) చట్టం 3) 1985
డి) జల (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 4) 1980
  5) 1981

1) ఎ-2, బి-1, సి-5, డి-3              2) ఎ-2, బి-3, సి-5, డి-1

3) ఎ-3, బి-5, సి-1, డి-2              4) ఎ-3, బి-4, సి-1, డి-5


23. పెట్రోల్‌ యంత్రాల నుంచి విడుదలయ్యే ప్రధాన కాలుష్యాలు-

ఎ) కాల్చని హైడ్రోకార్బన్లు    బి) సల్ఫర్‌ డై ఆక్సైడ్‌

సి) కార్బన్‌ మోనాక్సైడ్‌   డి) సీసం (లెడ్‌)

సరైన జవాబును ఎంపిక చేయండి.

1) ఎ, బి, డి        2) ఎ, బి, సి            3) ఎ, సి, డి         4) ఎ, బి, సి, డి


24. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పులకు కారణమయ్యే గ్రీన్‌హౌస్‌ వాయువులు-

ఎ) కార్బన్‌ డైఆక్సైడ్‌       బి) మీథేన్‌

సి) క్లోరోఫ్లోరో కార్బన్‌లు     డి) ఆర్గాన్‌  ఇ) నీటిఆవిరి

సరైన జవాబులను ఎంపిక చేయండి.

1) బి, సి, డి        2) ఎ, బి, సి

3) ఎ, సి, ఇ       4) ఎ, బి, సి, ఇ


25. భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరగడానికి తోడ్పడే ‘గ్రీన్‌హౌస్‌ వాయువు’ ప్రధాన పాత్ర?

1) సూర్యకాంతి రావడానికి, ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ పోవడానికి పారదర్శకంగా ఉండటం.

2) సూర్యకాంతి రావడాన్ని, ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ పోవడాన్ని రెండింటినీ ఆపగలగడం.

3) ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ పోవడానికి తోడ్పడి, సూర్యకాంతి రావడాన్ని ఆపడం.

4) సూర్యకాంతి రావడానికి తోడ్పడి, ఇన్‌ఫ్రారెడ్‌ రేడియేషన్‌ పోవడాన్ని ఆపడం.


26. కిందివాటిని జతపరచండి.

ఎ) చెర్నోబిల్‌ విపత్తు  1) పెరాక్సీ ఎసిటైల్‌ నైట్రేట్‌

బి) భోపాల్‌ విషాదం   2) క్లోరోఫ్లోరో కార్బన్‌లు

సి) ఓజోన్‌ రంధ్రం   3) రేడియోధార్మిక పదార్థాలు

డి) కాంతి రసాయన స్మాగ్‌  4) మిథైల్‌ ఐసోసైనేట్‌

1) ఎ-4, బి-3, సి-1, డి-2         2) ఎ-3, బి-4, సి-2, డి-1

3) ఎ-2, బి-1, సి-4, డి-3         4) ఎ-2, బి-4, సి-1, డి-3


27. కిందివాటిలో జీవక్షయం చెందని కాలుష్యకాలు ఏవి?

ఎ) క్లోరినేటెడ్‌ హైడ్రోకార్బన్‌ కీటక నాశకాలు

బి) పాలీ ఎథిలీన్‌ సంచులు

సి) మార్కెట్‌లో ఏర్పడే చెత్త, కుళ్లిన పండ్లు, కూరగాయలు

డి) మున్సిపల్‌ సీవేజ్‌ (మురుగు)

 పైవాటిలో సరైనవి గుర్తించండి.

1) ఎ, బి           2) ఎ, సి          3) బి, సి        4) సి, డి 


28. కిందివాటిలో కణయుత పదార్థాలు (Particulate matter)  అని వేటిని పిలుస్తారు?

ఎ) మసి                      బి) పొగ     

సి) దుమ్ము, ధూళి     డి) ఆస్బెస్టాస్‌ నారపోగులు

పైవాటిలో సరైనవి గుర్తించండి.

1) ఎ, బి         2) ఎ, బి, సి           3) బి, సి          4) ఎ, బి, సి, డి


29. కిందివాటిలో ‘మినమాటా’ వ్యాధికి కారణమైన కాలుష్యకం ఏది?

1) మెర్క్యురీ       2) కాడ్మియం        3) లెడ్‌        4) జింక్‌


30. కిందివాటిలో ఆమ్ల వర్షానికి కారణమైన వాయు కాలుష్యకాలు ఏవి?

1) కార్బన్‌ డయాక్సైడ్‌    2) కార్బన్‌ మోనాక్సైడ్‌

3) ప్రొపేన్‌                     4) నైట్రోజన్, సల్ఫర్‌ ఆక్సైడ్‌లు


31. తాగునీటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే వాయువు ఏది?    

1) హీలియం            2) క్లోరిన్‌      

3) ఫ్లోరిన్‌                  4) కార్బన్‌ డయాక్సైడ్‌


32. కిందివాటిని జతపరచండి.

 కాలుష్యకం  వ్యాధి
1) ఆర్సెనిక్‌ ఎ) ఫ్లోరోసిస్‌
2) ఫ్లోరైడ్‌ బి). మెలనోసిస్‌
3) సిలికా ధూళి సి) ప్రెస్‌బైక్యూసిస్‌
4) శబ్దాలు డి) సిలికోసిస్‌

1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి  2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి

3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి     4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి


సమాధానాలు

11; 23; 31; 43; 51; 62; 72; 82; 92; 102; 113; 122; 131; 142; 151; 161; 173; 184; 193; 203; 211; 223; 233; 244; 254; 262; 271; 284; 291; 304; 312; 323.

రచయిత: ఇ.వేణుగోపాల్‌ 

 

 ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


 

Posted Date : 08-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఘన వ్యర్థ కాలుష్యం - నిర్వహణ

పోగుపడే వ్యర్థాలతో పొంచి ఉన్న ప్రమాదాలు!

 పర్యావరణ వ్యవస్థకు, మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన వాటిలో ఘన వ్యర్థ కాలుష్యం ఒకటి. అభివృద్ధి పోకడలు, వస్తు వినియోగం, ఆహార వృథాతో వ్యర్థాలూ పెరిగిపోతున్నాయి. గాలి, నీరు, నేలలను కలుషితం చేస్తున్నాయి. పరిసరాలు దెబ్బతినడానికి, అంటువ్యాధులు ప్రబలడానికి ఈ పరిణామమే ప్రధాన కారణం. ప్లాస్టిక్, విద్యుత్తు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వంటివి మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు సవాలు విసురుతున్నాయి. సమస్త జీవజాలానికి సమస్యలు సృష్టిస్తున్న ఈ ఘన వ్యర్థాలు, వాటి మూలాలు, రకాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటి నిర్వహణ, దుష్ప్రభావాలను తగ్గించగలిగే శాస్త్రీయ విధానాల గురించి అవగాహన పెంచుకోవాలి.

ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, ఆధునిక జీవనశైలి అలవరుచుకుంటున్నారు. దాంతో వస్తు వినియోగం అధికమైంది. ‘ఉపయోగించు-పారవేయు’ పద్ధతిలోనే వస్తువులను తయారు చేస్తుండటంతో వాటి ఉత్పత్తి పెరుగుతోంది. ఫలితంగా ఘన వ్యర్థాల సమస్య అంతకంతకూ ఎక్కువవుతోంది. పట్టణ, నగర జనావాసాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ‘జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు’ నివేదిక ప్రకారం మన దేశంలో రోజుకు సుమారు 1.60 లక్షల టన్నుల వ్యర్థాలు పోగు పడుతున్నాయి. ఇందులో 95.4% సేకరిస్తున్నారు. అత్యధిక వ్యర్థాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నగరాలపరంగా దిల్లీ, ముంబయి, చెన్నై ముందంజలో ఉన్నాయి.


దుష్ప్రభావాలు: ఘనవ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోతే అనేక రకాల పర్యావరణ, ఆరోగ్య, ఆర్థికపరమైన దుష్ప్రభావాలు తలెత్తుతాయి.


* ఘనవ్యర్థాలు పోగుపడటం వల్ల భూ, జల వనరులు కలుషితమవుతాయి. ఫ్లోరిన్, పాదరసం, సీసం లాంటి భారలోహ కాలుష్యాలు మానవ ఆహార శృంఖలాల్లో జీవ ఆవర్తనం చెంది ప్రజలు ఫ్లోరోసిస్, డయేరియా, మతిభ్రమించడం లాంటి వ్యాధులకు గురవుతారు.


* ఘనవ్యర్థాలు కుళ్లి గాలి విషవాయువులతో దుర్గంధమై వ్యాధులు సంక్రమిస్తాయి.


* ఘనవ్యర్థాలు పేరుకుపోయి పరిసరాలు సహజ సౌందర్యాన్ని కోల్పోతాయి.


* ఎలుకలు, పందికొక్కులు లాంటి పరాన్నబుక్కులు ఎక్కువై సూక్ష్మజీవుల ప్రవాహకాలుగా మారి ప్లేగు తదితర వ్యాధులు విజృంభించడానికి కారణమవుతాయి.


* గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం స్థానిక సంస్థలకు ఆర్థిక భారంగా మారుతోంది.


ఘన వ్యర్థ మూలాలు

1) గృహసంబంధ వ్యర్థాలు: మున్సిపాలిటీలు, మెట్రో నగరాల్లో గృహ సంబంధ వ్యర్థాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వంటింట్లో మిగిలిన, పాడైన ఆహార పదార్థాలు, చిరిగిన దుస్తులు, కాగితం, లెదర్‌ లాంటి జీవక్షయం చెందే వస్తువులు/పదార్థాలు ఇందులో ఉంటాయి. ప్లాస్టిక్, పాలిథిన్, గ్లాసు, లోహ సంబంధమైన జీవక్షయం చెందని వస్తువులూ ఉంటాయి.


2) పారిశ్రామిక వ్యర్థాలు: ఇనుము, ఉక్కు, అల్యూమినియం కర్మాగారాలు; రబ్బరు, ప్లాస్టిక్, గాజు తయారుచేసే పరిశ్రమల్లో మిగిలిపోయిన వ్యర్థాలు; సిమెంట్‌ కర్మాగారాల నుంచి వెలువడే ఫ్లైయాష్‌ లాంటి పారిశ్రామిక ఘనవ్యర్థాలు భూమి, జలాలను కలుషితం చేస్తాయి.


3) రేడియోధార్మిక వ్యర్థాలు: యురేనియం, థోరియం మూలకాలను భూమి నుంచి వెలికి తీసినప్పుడు లేదా వాటిని శుద్ధి చేసినప్పుడు వెలువడే వ్యర్థాలను నీటిలో/భూమిలో కలపకూడదు. భూమి లోపల ప్రత్యేక జాలీల్లో భద్రపరచాలి.


4) మైనింగ్‌ వ్యర్థాలు: గనుల తవ్వకాల్లో, ఖనిజాల్లోని మలినాలు తొలగించినప్పుడు ఏర్పడిన స్లాగ్‌ కూడా భారీగా పోగుపడిన ఘన వ్యర్థమే. బొగ్గు, ఇనుప గనుల నుంచి వెలువడే ధూళి తీవ్రస్థాయి శ్వాసకోస వ్యాధులను కలగజేస్తుంది.


5) వ్యవసాయ సంబంధ వ్యర్థాలు: వ్యవసాయ రంగంలో ఉత్పత్తులను పెంచుకోవడానికి విచక్షణారహితంగా ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు నేల, నీటిపై పేరుకుపోతాయి. వీటివల్ల నేలలు నిస్సారంగా మారుతున్నాయి. జీవజాతులకు పలు అనారోగ్యాలకు గురవుతున్నాయి.


6) బయో మెడికల్‌ వ్యర్థాలు: ఆస్పత్రుల్లో వాడేసిన సిరంజీలు, సెలైన్‌ బాటిళ్లు, బ్యాండేజీలు, బ్లేడ్‌లు, రక్తవ్యర్థాలు లాంటి వాటిని బయోమెడికల్‌ వ్యర్థాలు అంటారు. ఘన వ్యర్థాలన్నింటిలో ఇవి చాలా హానికరమైనవి. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించాలి.


7) ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌: కాలం చెల్లిన, పాడైపోయిన కంప్యూటర్లు, టెలివిజన్లు, ప్రింటర్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగించే విషపూరిత రసాయనాలు; లోహ సంబంధ భాగాల ద్వారా చేరిన వ్యర్థాలను ఈ-వేస్ట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ వేస్ట్‌ అంటారు. వీటి నుంచి ఆర్సెనిక్, బేరియం, కాడ్మియం, కోబాల్ట్, సీసం, పాదరసం, జింక్‌ లాంటి హానికర మూలకాలు విడుదలై తిరిగి మానవ జీవనంపై దుష్ప్రభావం చూపుతాయి.


8) కెమికల్‌ వేస్ట్‌: వినియోగించని ఔషధాలు, నెయిల్‌ పాలిష్‌ టిన్నులు, పెర్‌ఫ్యూమ్‌ బాటిళ్లు, టాయిలెట్‌ కెమికల్స్, కాస్మోటిక్‌ వ్యర్థాలు లాంటి వాటిని కెమికల్‌ వేస్ట్‌ అంటారు. ఈ రసాయన మూలకాల వ్యర్థాల వల్ల హాని కలుగుతుంది. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ప్రభావానికి గురవుతారు.


ఘన వ్యర్థాల నిర్వహణ: ఇది మున్సిపాలిటీలకు భారంగా మారుతోంది. వ్యర్థాలను సేకరించడం, తరలించడం, నిల్వ చేయడం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతోంది. అయితే కొన్ని నిర్వహణ విధానాల ద్వారా వాటి దుష్ప్రభావాన్ని తగ్గించవచ్చు.


వ్యర్థాలను వేరుచేసే ప్రక్రియ: వ్యర్థ పదార్థాలను సేకరించినప్పుడే తడి, పొడి చెత్తను వేరు చేయాలి. ఆ తర్వాత అందులోని జీవక్షయం చెందే తడి చెత్తను గుంతలు తీసి పూడ్చివేయాలి. ఇది క్రమంగా కుళ్లిపోయి ఎరువుగా మారుతుంది. ఈ విధానం వల్ల చెత్త పరిమాణం తగ్గించుకోవచ్చు.


5 R విధానం: ఘన వ్యర్థాల నిర్వహణకు ఇది అత్యంత శాస్త్రీయమైన పద్ధతి. ఈ విధానంపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలి.


1) Refuse -  చెత్త వేయకూడదు.


2) Reduce - చెత్త ఉత్పత్తిని తగ్గించుకోవాలి


3) Re-use - నీళ్ల సీసాలు, ప్యాకింగ్‌ మెటీరియల్స్‌ లాంటివి తిరిగి ఉపయోగించుకోవాలి.


4) Re-purpose - ఇతర ప్రయోజనాలకు ఉపయోగించాలి.


ఉదా: మెటల్‌ క్యాన్లు, బకెట్‌లను మొక్కలు పెంచుకోవడానికి వాడాలి.


5) Recycle - వ్యర్థాలను పునఃచక్రీయం చేయాలి.


ఉదా: కాగితం, ప్లాస్టిక్, లోహాలు, గాజు లాంటి వ్యర్థాలతో పరిశ్రమల ద్వారా తిరిగి కొత్త వస్తువులు తయారుచేయాలి.

పల్వరైజేషన్‌: సేకరించిన వ్యర్థాలను గ్రైండింగ్‌ మిషన్స్‌ ద్వారా ముక్కలు చేసి వాటి భౌతిక స్వరూపాన్ని, పరిమాణాన్ని మార్చే విధానం. ముక్కలైన వ్యర్థాలు రుచి, లక్షణాలు మారి కీటకాలను ఆకర్షించలేని విధంగా తయారవుతాయి. ఈ పదార్థాలను గుంతల్లో పూడ్చవచ్చు. అయితే ఈ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది.


లోతట్టు ప్రాంతాల్లో పూడ్చవచ్చు: జీవక్షయం కాని, పునర్వినియోగానికి, పునఃచక్రీకరణకు పనికిరాని వ్యర్థాలను లోతట్టు ప్రాంతాల్లో మట్టితో కప్పివేయాలి. దీన్ని ల్యాండ్‌ ఫిల్లింగ్‌ అంటారు.


సముద్రాలకు దూరంగా పారబోయడం: ప్రపంచంలో సముద్రాల్లోకి అత్యధికంగా వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశాల్లో చైనా, భారత్‌ ముందంజలో ఉన్నాయి. ఇది జలచరాలకు అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. తీర ప్రాంత పట్టణాల్లోని చెత్తను తీరానికి 20 కి.మీ. దూరంలో, 30 మీటర్ల లోతైన ప్రాంతాల్లోకి తరలించాలి.


ఉపాధి సృష్టి: జీవక్షయం చెందే వ్యర్థాలను కంపోస్ట్‌ చేయడం ద్వారా ఎరువు, మీథేన్‌ వాయువును ఉత్పత్తి చేయవచ్చు. వ్యర్థాన్ని వానపాముల చర్య ద్వారా వర్మికంపోస్ట్‌గా మార్చొచ్చు. ఆస్పత్రి సంబంధ వ్యర్థాలను 800 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద వేడి చేసి ‘ఇన్సినరేషన్‌’ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు.


బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ

ఎ) తెలుపు రంగు డబ్బాలు: సూదులు, బ్లేడ్లు వేయాలి.


బి) నీలి రంగు డబ్బాలు: గాజు సీసాల వ్యర్థాలు వేయాలి.


సి) పసుపు రంగు డబ్బాలు: జంతు, మానవ, ప్రయోగశాలల వ్యర్థాలు; శరీర ద్రవాలు వేయాలి.


డి) ఎరుపు రంగు డబ్బాలు: సిరంజీలు, సెలైన్‌ బాటిళ్లు, ట్యూబ్‌లు, క్యాథటర్స్‌ లాంటివి వేయాలి.


ఈ-వేస్ట్‌ నిర్వహణ: కాలం చెల్లిన, ఉపయోగంలో లేని ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్‌ సంబంధ వ్యర్థాలను ఈ-వేస్ట్‌ అంటారు. అసోచామ్‌ గ్రూప్‌ నివేదిక ప్రకారం మన దేశం ఏటా 20 లక్షల టన్నుల ఈ-వేస్ట్‌ ఉత్పత్తితో ప్రపంచంలో అయిదో స్థానంలో ఉంది. దేశంలో ఈ-వేస్ట్‌ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, నగరం ముంబయి.


ఈ-వేస్ట్‌లు మూడు రకాలు 

1) White Goods: పాడైపోయిన వాషింగ్‌ మిషిన్లు, గ్రైండర్లు, రిఫ్రిజిరేటర్లు.

2) Brown Goods: వాణిజ్య సముదాయాలు, గృహాల నుంచి ఉత్పత్తయ్యే పాడైపోయిన టెలివిజన్లు, కెమెరాలు.

3) Grey Goods: ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల్లోని పాడైపోయిన కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, మొబైల్‌ ఫోన్లు.

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 21-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ ఉద్యమాలు

రక్షించు.. పెంచు.. ఉపయోగించు!

ఆధునిక ప్రగతి పేరుతో పర్యావరణానికి కలిగిస్తున్న హానికి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో ప్రజలు ఉద్యమించారు. భావితరాల భద్రతకు, సుస్థిరాభివృద్ధికి పోరాటాలు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను హత్తుకొని కాపాడుకున్నారు. పాలకులను ఎదిరించి ఎందరో ప్రాణాలను పోగొట్టుకున్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరిగిన అలాంటి ఉద్యమాలు, వాటి సారథులు, ప్రజా భాగస్వామ్యం, నైతిక మద్దతు, సాధించిన ఫలితాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

ప్రకృతి వనరులను అవసరం మేరకు వినియోగించుకుంటూ, కొంత భావితరాలకు మిగిల్చే సుస్థిర అభివృద్ధి విధానాలకు వ్యతిరేకంగా అపరిమిత ప్రగతి ధ్యేయంతో భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు. అభివృద్ధితో పాటు పెరుగుతున్న కాలుష్య కారకాలు, నేల క్రమక్షయం, ఆమ్ల వర్షాలు, గ్లోబల్‌ వార్మింగ్, ఓజోన్‌ క్షీణత లాంటి సమస్యలకు కారణమవుతున్నాయి. ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టినప్పటికీ తగిన ఫలితాలు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో భూగోళ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అనేక ఉద్యమాలు జరిగాయి. 1962లో అమెరికాలోని సిల్వర్‌స్ప్రింగ్‌ ప్రాంతంలో పంట తెగుళ్ల నివారణకు డి.డి.టి. పురుగుమందులు ఎక్కువగా వినియోగించారు. అందులోని అవశేషాలు పంట మొక్కల్లో జీవ సాంద్రీకృతమై పర్యావరణాన్ని ఏ విధంగా దెబ్బతీశాయో ‘రేచల్‌ కార్సన్‌’ అనే ప్రపంచ పర్యావరణవేత్త ‘సైలెంట్‌ స్ప్రింగ్‌’ అనే పుస్తకంలో వివరించారు. ఇదే ఒరవడిలో భారతదేశంలో పలు పర్యావరణ ఉద్యమాలు పుట్టుకొచ్చాయి.


బిష్ణోయి ఉద్యమం: ఇది భారతదేశంలో తొలి పర్యావరణ ఉద్యమంగా చరిత్రకెక్కింది. 1730లో రాజస్థాన్‌లోని జోథ్‌పుర్‌ జిల్లాలో ఖెజార్లీ/ఖెజాడ్లి గ్రామానికి చెందిన ఉద్యమం. బిష్ణోయి జాతి (కమ్యూనిటీ) ప్రజలకు ఖేజ్రీ వృక్షాలు చాలా పవిత్రమైనవి. అయితే అప్పటి మార్వాడీ పాలకుడు మహారాజా అభయ్‌ సింగ్‌ ఆదేశంతో సైనికులు ఖేజ్రీ వృక్షాలను నరికేయడానికి సిద్ధమయ్యారు. అమృతాదేవి నాయకత్వంలో బిష్ణోయి ప్రజలు చెట్లను కౌగిలించుకుని సైనికులు వాటిని  నరకకుండా అడ్డుకున్నారు. దాంతో సైనికులు అమృతాదేవితో పాటు 363 మందిని నరికివేశారు. నిశ్చేష్టుడైన రాజు వెంటనే బిష్ణోయి గ్రామాల్లో చెట్లు నరకకుండా నిషేధం విధించాడు.


చిప్కో ఉద్యమం: చిప్కో అంటే చెట్లను హత్తుకోవడం అని అర్థం. చిప్కో ఉద్యమకారులు చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ, వాటిని హత్తుకుంటూ ఉద్యమం చేశారు. సుందర్‌లాల్‌ బహుగుణ, గౌరీదేవి, చండీప్రసాద్‌ బట్‌ మొదలైనవారు నాయకత్వం వహించారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా 1964లో ఏర్పాటుచేసిన ‘దశోలి గ్రామ స్వరాజ్య మండల్‌’ ఈ ఉద్యమానికి నాంది పలికింది. 1927లో ఆంగ్లేయులు చేసిన అటవీ చట్టంలోని ఆంక్షలను వ్యతిరేకిస్తూ 1930లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని తిలారి ప్రాంతంలో భారీ ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా 17 మంది సామాన్య ప్రజలను రాజ సైనికులు చంపేశారు. క్రమక్రమంగా ఈ ఉద్యమం బలపడి 1970 నాటికి చిప్కో ఉద్యమంగా మారింది. 1974 నుంచి గిరిజన మహిళలు గౌరీదేవి నాయకత్వంలో చెట్లను నరకకుండా రేయింబవళ్లు కాపలా కాశారు. 1980 నాటికి హిమాలయ అడవుల్లో చెట్లు నరకడాన్ని నిషేధించడంతో చిప్కో ఉద్యమం విజయం సాధించింది.


సైలెంట్‌ వ్యాలీ రక్షణ ఉద్యమం: సైలెంట్‌ వ్యాలీ అనేది కేరళలో పలక్కాడు జిల్లాలోని ఒక ఉష్ణమండల సతతహరిత అటవీ ప్రాంతం. 1973లో కేరళ ప్రభుత్వం ఈ ప్రాంతం మీదుగా ప్రహిస్తున్న కుంతిపూజ నదిపై జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టింది. దీనివల్ల ఆ ప్రాంతం పర్యావరణం దెబ్బతింటుందని, అనేక రకాల మొక్కలు, జంతువులు ముఖ్యంగా అరుదైన సింహం తోక ఉండే కోతులు అంతరించిపోతాయని శాస్త్ర సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభమైంది. చివరికి 1985లో ఆ ప్రాంతాన్ని ‘సైలెంట్‌  వ్యాలీ నేషనల్‌ పార్కు’గా ప్రకటించారు.


అప్పికో ఉద్యమం: అడవుల సంరక్షణ కోసం చిప్కో ఉద్యమం తరహాలోనే కర్ణాటకలోని ఉత్తర కన్నడ ప్రాంతంలోని సాల్కానిలో 1983లో ఈ ఉద్యమం మొదలైంది. కన్నడంలో ‘అప్పికో’ అంటే కౌగిలించుకోవడం అని అర్థం. పాండురంగ హెగ్డే దీనికి నాయకత్వం వహించారు. ఈ ప్రాంతంలో 81% అడవులు విస్తరించి ఉన్నాయి. అయితే ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కొన్ని కాగితం, కలప తయారీ పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామ పిల్లలు, పెద్దలు చెట్లను హత్తుకుని కాంట్రాక్టర్ల బారి నుంచి వాటిని రక్షించారు. ఈ ఉద్యమం నినాదం ‘రక్షించు, పెంచు, హేతుబద్ధంగా ఉపయోగించు’.


జంగిల్‌ బచావో ఆందోళన: బిహార్‌ ప్రభుత్వం 1980లో అడవుల్లో ఉండే సాల్‌ వృక్షాల స్థానంలో టేకు వృక్షాలు పెంచాలని ప్రయత్నిచడంతో సింగ్‌బమ్‌ జిల్లాకు చెందిన గిరిజనులు సాల్‌ వృక్షాలను నరకకుండా వాటిని హత్తుకుని నిరసన తెలియజేశారు. ఈ ఉద్యమం క్రమంగా ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు విస్తరించింది.


ఝార్ఖండ్‌ జంగిల్‌ బచావో ఉద్యమం: జీవనోపాధి అందించే అటవీ వనరులను సంరక్షించుకోవడానికి, వారి పోడు వ్యవసాయ విధానాలను కొనసాగించడానికి ఝార్ఖండ్‌లోని ఆదివాసీ తెగలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగించిన ఉద్యమం. దీని తీవ్రతను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో అటవీ భూములపై గిరిజనుల హక్కులను గుర్తిస్తూ ‘అటవీ హక్కుల చట్టం’ రూపొందించింది.


బీస్‌-నౌ ఉద్యమం:  శ్రీ జంబేశ్వర్‌ అనే మత గురువు పర్యావరణ పరిరక్షణకు 29 సూత్రాలను ప్రతిపాదించారు. అందువల్ల దీనికి బీస్‌-నౌ ఉద్యమం అని పేరొచ్చింది. ఈ ఉద్యమం ఉద్దేశం పంజాబ్, సింధు ప్రాంతాల్లో విస్తరించిన థార్‌ ఎడారి ప్రాంత వృక్ష, జంతుజాలాల రక్షణ, పర్యావరణ పరిరక్షణ. ఈ సూత్రాల ఆరోగ్య పరిరక్షణ, సామాజిక పరివర్తన, దేశభక్తిని ప్రబోధించడం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, పశుసంవర్థక పెంపుదలకు సంబంధించినవి. అవి తర్వాత కాలంలో అమృతాదేవి నాయకత్వంలో జోథ్‌పుర్‌లో బిష్ణోయి ఉద్యమానికి ప్రేరణగా నిలిచాయి.


గంగా పరిరక్షణ ఉద్యమం: గంగానది స్వచ్ఛత కోసం సాధువులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు ప్రారంభించిన గాంధియన్‌ అహింసా ఉద్యమం. స్వామి నిగమానంద సనంద్‌ లాంటి సాధువులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగాలు చేశారు. ఈ ఉద్యమానికి గంగాసేవా అభియాన్‌ లాంటి సంస్థలు మద్దతుగా నిలిచాయి. భారత ప్రభుత్వం గంగా నదిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేరకుండా ‘అవిరళ్‌’ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. అవిరళ్‌ అంటే హిందీలో కొనసాగని అని అర్థం. అంటే గంగానదిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు చేరకుండా నదీ ప్రవాహం కొనసాగాలని చేపట్టిన ప్రాజెక్టు.


నర్మదా బచావో ఆందోళన: నర్మదా నది మధ్యప్రదేశ్‌లో పుట్టి మహారాష్ట్ర, గుజరాత్‌ మీదుగా ప్రయాణిస్తూ చివరగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది పగులు లోయ ద్వారా ప్రయాణిస్తుంది. దీనిపై గుజరాత్‌ ‘సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌’తో పాటు అనేక బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించాలని తలపెట్టినప్పుడు ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లో పర్యావరణానికి హాని కలుగుతుందని 1985 నుంచి మేధా పాట్కర్‌ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోంది. ఈమెతో పాటు బాబా ఆమ్టే, అరుంధతిరాయ్‌ లాంటి ప్రముఖులు కూడా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. మేధా పాట్కర్‌ ఏర్పాటు చేసిన సంస్థ నర్మదా థరన్‌గ్రస్త్‌ సమితి. ఈ ఉద్యమం కోసం చేసిన కృషికి ఫలితంగా మేధాపాట్కర్‌కు 1991లో స్వీడన్‌కు చెందిన రైట్‌ లైవ్లీ హుడ్‌ అవార్డు లభించడం విశేషం.


నవధాన్య ఉద్యమం: జీవ వైవిధ్య సంరక్షణకు, సేంద్రియ వ్యవసాయానికి రక్షణ కల్పిస్తూ, జన్యు సాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకంగా 1982 నుంచి ఈ ఉద్యమం ప్రారంభమైంది. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆహార భద్రతలో ప్రముఖ పాత్ర వహించే నవధాన్యాల పేరుతో ఉద్యమం రూపొందింది. ఇదొక ఎన్జీవో సంస్థ. దీని స్థాపకురాలు వందనా శివ. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశంలో దాదాపు 50కి పైగా విత్తన నిల్వల బ్యాంకులను స్థాపించారు. వేలమంది రైతులకు శిక్షణ ఇచ్చి సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించారు.


కోయల్‌కరో ఉద్యమం: ఇది కోయల్‌ కరో జలవిద్యుత్తు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఝార్ఖండ్‌లోని కోయల్‌ - కరో బేసిన్‌లో ముండా, బరావన్‌ తెగలు జరిపిన ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగంగా ‘కామ్‌ రోకో అభియాన్‌’ను ప్రారంభించారు. ఇది భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన ఉద్యమంగా నిలిచింది.


నందిగ్రామ్‌ రసాయన ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళన: ఆర్థిక మండళ్ల ఏర్పాటులో భాగంగా కోల్‌కతా సమీపంలో నందిగ్రామ్‌ ప్రాంతంలో ఇండొనేసియీ కంపెనీ రసాయన ఫ్యాక్టరీ ఏర్పాటుకు 10 వేల ఎకరాల భూసేకరణ సందర్భంలో 2007లో జరిగిన ఆందోళన.


అవతార్‌ ఉద్యమం: ఒడిశాలో గనుల తవ్వకానికి వేదాంత కంపెనీకి అనుమతి ఇచ్చిన సందర్భంలో అక్కడి కొండ తెగలవారు వారి కులదైవమైన అవతార్‌ పేరున పర్యావరణాన్ని, వారి జీవన వనరులను పరిరక్షించుకోవడానికి చేసిన ఉద్యమం


సింగూర్‌-టాటా నానో ఫ్యాక్టరీ వివాదం: పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో టాటా నానో ఫ్యాక్టరీ స్థాపనకు భూముల సేకరణ వివాదాస్పదమైంది. తృణమూల్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ వ్యవసాయ భూమి పరిరక్షణ అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేశారు. అరుంధతీ రాయ్, అనురాధ తల్లావో, మేధాపాట్కర్‌ మద్దతు ప్రకటించారు. చివరికి ఆ కంపెనీ గుజరాత్‌లోని ఆనంద్‌ ప్రాంతానికి తరలివెళ్లింది.


కూడంకుళం అణు విద్యుత్తు ప్రాజెక్టు వివాదం: తమిళనాడులోని కూడంకుళం వద్ద నిర్మించ తలపెట్టిన అణువిద్యుత్తు ప్రాజెక్టు వల్ల అక్కడి మత్స్యకారులు జీవనోపాధి కోల్పోవడమే కాకుండా రేడియో ధార్మిక విషవాయువులు ఆరోగ్యానికి హానికరమనే ఆందోళనలతో ఈ ఉద్యమం జరిగింది.


సోంపేట ఉద్యమం: శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలంలో బీల భూముల్లో థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మించడానికి నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే అక్కడి రైతులు, గ్రామస్థులు తమ జీవనోపాధి పోతుందని, అక్కడ విశాలంగా విస్తరించి ఉన్న కొబ్బరి తోటలు నాశనమవుతాయని, పర్యావరణపరంగా నష్టం జరుగుతుందని తిరుగుబాటు చేశారు. 2009, డిసెంబరు 5న రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. పోలీస్‌ కాల్పులు కూడా జరిగాయి. చివరికి ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని విరమించింది.


కాజెన్‌ట్రిక్స్‌ వ్యతిరేక ఉద్యమం: కర్ణాటకలో మంగుళూరు ప్రాంతంలోని నందకూరులో నిర్మించబోయే థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్‌కు వ్యతిరేకంగా గ్రామస్థులు ఉద్యమించారు. 


ఈ విధంగా దేశంలో అనేక సందర్భాల్లో పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, పర్యావరణాన్ని, తమ జీవనోపాధిని కాపాడుకోవడానికి చేసిన ఉద్యమాలు ఎనలేని ప్రజామోదాన్ని పొందాయి.


రచయిత: జల్లు సద్గుణరావు
 

Posted Date : 14-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలు

భావితరాల క్షేమం కోరే ప్రగతి సుస్థిరం!

ప్రకృతి సిద్ధంగా లభించిన వనరులను అభివృద్ధి పేరుతో ఎన్నో దేశాలు విచ్చలవిడిగా వినియోగించుకుంటున్నాయి. స్వార్థం, తాత్కాలిక ప్రయోజనాల కోసం భవిష్యత్తు తరాల ఉనికిని ప్రమాదంలో పడేస్తున్నాయి. దీని పర్యవసానంగా పర్యావరణ క్షీణత, భూతాపం పెరిగిపోయి సమస్త మానవాళి దుష్పరిణామాలను ఎదుర్కొంటోంది. ప్రకృతి బాగుంటేనే మనిషి బాగుంటాడని, భవిష్యత్తు తరాల ప్రయోజనాలకు విఘాతం లేకుండా ప్రస్తుత అవసరాలను తీర్చేదే అసలైన అభివృద్ధి అన్న స్పృహ ఇప్పుడిప్పుడే క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలు అమలుచేస్తున్న పర్యావరణ అనుకూల విధానాల గురించి పోటీ పరీక్షల అభ్యర్థులకు అవగాహన ఉండాలి. వనరులను సమర్థంగా వినియోగించుకునే పద్ధతులు, ఆధునిక పునరుత్పాదక వనరులు, వాటి ప్రయోజనాలు, జీవన నాణ్యతను పెంచే పరిణామాలను తెలుసుకోవాలి.

ప్రస్తుత ప్రజల కనీస అవసరాలు తీరుస్తూ భవిష్యత్తు తరాలకు వనరులను మిగిల్చే విధంగా, వాటిని వివేకవంతంగా (జ్యుడీషియస్‌ యుటిలైజేషన్‌) వినియోగిస్తూ సాధించే అభివృద్ధినే ‘సుస్థిరాభివృద్ధి’ అంటారు. అంటే భావితరాల అవసరాలను విస్మరించకుండా ఇప్పటి అభివృద్ధి ఉండాలని అర్థం. అయితే మానవ సంక్షేమాన్ని పెంపొందించుకోవడానికి అభివృద్ధి ఒక్కటే సరిపోదు. పర్యావరణ సంరక్షణతో కూడిన వనరుల వినియోగం, పునఃకల్పనల మధ్య సమతౌల్యతను ఏర్పరిచి అభివృద్ధి కొనసాగిస్తే నిజమైన సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది. పెరుగుతున్న జనాభా అవసరాల కోసం సహజ వనరులను పరిమితికి మించి వినియోగించడం వల్ల భూ, జలవనరులు; వాతావరణం కలుషితమై అనేక పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ సుస్థిరాభివృద్ధి సాధించడం అవసరంగా మారింది. సమగ్ర అభివృద్ధి సాధించడానికి వివిధ నూతన పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలను ఆయా రంగాల్లో అనుసరిస్తున్నారు.

సేంద్రియ వ్యవసాయం: వ్యవసాయ పంటలు, పశుసంపదలో ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచుకోవడానికి పర్యావరణానికి హాని చేసే రసాయనిక పురుగు మందులు, ఎరువులు, జన్యుమార్పిడి జీవులు, వృద్ధి హార్మోన్లను ఇటీవల ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో పర్యావరణానికి అనుకూలమైన జీవ ఎరువులను వినియోగించి చేసే వ్యవసాయ విధానాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. సేంద్రియ వ్యవసాయ పితామహుడిగా ‘సర్‌ ఆల్బర్ట్‌ హూవార్డ్‌’ని పిలుస్తారు. మన దేశంలో సిక్కింను మొదటి సేంద్రియ వ్యవసాయ (ఆర్గానిక్‌ ఫార్మింగ్‌) రాష్ట్రంగా ప్రకటించారు. ఈ తరహా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకే ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ సంస్థ’ను స్థాపించారు.


జీవ ఎరువులు: పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భూసారాన్ని పెంచే సూక్ష్మజీవులు, వాటి మిశ్రమాన్ని జీవ ఎరువులు అంటారు. ఈ సూక్ష్మజీవులు మొక్కలతో సహజీవనం చేస్తూ పంటకు కావాల్సిన అనేక పోషకాలను అందజేస్తాయి. వీటిలో పలు రకాలున్నాయి.


ఉదా: 

* జనుము, సుబాబుల్‌ చెట్ల ఆకులు, కొమ్మలను ఎరువుగా వాడుకునే హరిత ఎరువు.

 * నాస్టాక్, అనబీనా లాంటి నీలి ఆకుపచ్చ శైవలాలు. 

* వేరు బుడిపెల్లో నివసించే రైజోబియం, స్వేచ్ఛాయుత నత్రజని స్థాపన జరిపే అజటోబాక్టర్, క్లాస్ట్రీడియం లాంటి బ్యాక్టీరియాలు.

* ఎత్తయిన మొక్కల వేర్లపై పెరిగి భూమి నుంచి ఫాస్ఫేట్లు, సల్ఫేట్లు, కాపర్, జింక్, ఇనుము లాంటి పోషకాలను మొక్కలకు అందించే శిలీంధ్రాలు జీవ ఎరువులుగా ఉపయోగపడతాయి.

* వరి పంట పొలాల్లో జీవ ఎరువుగా వాడే మొక్క ‘అజొల్లా లేదా టెరిడోఫైట్‌’.


జీవ క్రిమిసంహారాలు: పర్యావరణానికి హానిచేసే రసాయన క్రిమిసంహారాల స్థానంలో పర్యావరణ అనుకూల క్రిమిసంహారాలను వినియోగించడాన్ని జీవ క్రిమిసంహారాలు అంటారు. పంట మొక్కలు, ఉత్పత్తులను నష్టపరిచే తెగుళ్లు, క్రిమికీటకాలు, కీటక డింభకాలను అరికట్టే క్రిమిసంహారిణులను; మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు లాంటి ప్రకృతిపరమైన వాటి నుంచి తీసే ఉత్పత్తులను జీవ క్రిమిసంహారాలు అంటారు.


ఉదా: పత్తి పంటను నష్టపరిచే బోల్‌వార్మ్‌ నివారణకు వాడే బాసిల్లస్‌ తురింజియెన్సిస్‌ లాంటి బ్యాక్టీరియాలు, విరిడే కుటుంబానికి చెందిన వైరస్‌లు, బావేరియా బాసియానా, ట్రైకోడెర్మా లాంటి శిలీంధ్రాలు; కలుపు మొక్కల నివారిణిగా ఉపయోగించే యూకలిప్టస్‌ నూనె, టమాట పంటలో కీటక నాశినిగా ఉపయోగించే లెగ్యూమ్‌ జాతి మొక్కల వేర్ల నుంచి తయారుచేసిన రొటెనాన్‌ లాంటి ఉత్పత్తులను జీవ క్రిమిసంహారాలుగా వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం, బయోమాగ్నిఫికేషన్‌ జరగదు.


పునరుత్పాదక ఇంధన వనరులు: వాడేకొద్దీ తిరిగి పునరుత్పత్తి చెందే సామర్థ్యం ఉన్న కాలుష్య రహితమైన ఇంధన వనరులను పునరుత్పత్తి ఇంధన వనరులు అంటారు. కాలుష్య కారకాలైన బొగ్గు, పెట్రోలియం, షెల్‌ గ్యాస్‌ లాంటి సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో పునరుత్పాదక ఇంధన వనరులైన సౌరశక్తి, పవనశక్తి, సముద్ర అలలశక్తి, సముద్ర పోటు-పాట్ల శక్తి, భూతాప శక్తి, హైడ్రోజన్‌ ఇంధనశక్తి లాంటివి వినియోగించడం పర్యావరణ అభివృద్ధికి దోహదం చేస్తుంది.


జీవ ఇంధనాల వాడకం: ఇంధన వనరుల్లో కాలుష్య రహితమైన, తక్కువ ఖర్చుతో కూడిన, సుస్థిరాభివృద్ధిని పెంపొందించేవి జీవ ఇంధన వనరులు. జీవ వ్యర్థాలను నేరుగా మండించడం లేదా సూక్ష్మజీవుల సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేయడం ద్వారా శక్తిని పొందే వనరులను జీవ ఇంధనాలు అంటారు. ప్రపంచంలో అత్యధికంగా పశుసంపద భారతదేశంలోనే ఉండటం, ప్రధానంగా వ్యవసాయ దేశం కావడంతో జీవ ఇంధనాల ఉత్పత్తికి కావాల్సిన జీవ వ్యర్థాలు బాగా లభిస్తాయి. భారత ప్రభుత్వం 2018లో కొత్త జీవ ఇంధన విధానాన్ని ప్రకటించింది.


ఎ) బయోగ్యాస్‌: పశువుల పేడను ఆక్సిజన్‌ రహితంగా కుళ్లబెట్టడం లేదా పట్టణ, చెట్ల వ్యర్థాలను మిథనోమోనాస్, మిథనోకోకస్‌ లాంటి బ్యాక్టీరియాల సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేయడం ద్వారా బయోగ్యాస్‌ను తయారుచేస్తారు. ఇది 60% మీథేన్, 40% కార్బన్‌ డై ఆక్సైడ్‌లతో ఉంటుంది.


బి) బయో డీజిల్‌: జట్రోపా, కానుగ, సోయాబీన్స్, పామాయిల్, రెడ్‌ సీడ్స్‌ లాంటి మొక్కల విత్తనాల నుంచి తీసిన నూనెలను ఆల్కహాల్‌ లేదా ఆమ్లాలను ఉపయోగించి చర్యనొందించే ట్రాన్స్‌ ఎస్టరిఫికేషన్‌ ప్రక్రియ ద్వారా జీవ ఇంధనాన్ని తయారుచేస్తారు. దీన్ని డీజిల్‌తో కలిపి బయోడీజిల్‌గా వినియోగించడం వల్ల పర్యావరణ మిత్రుడిగా మారుతుంది.


సి) బయో ఇథనాల్‌: చెరకు, స్వీట్‌ కార్న్, స్వీట్‌ క్యారెట్, చిలగడ దుంప, గోధుమలు, మొక్కజొన్న లాంటి వాటి నుంచి గ్రహించిన గ్లూకోజ్‌కు ఈస్ట్‌ కలిపి కిణ్వన ప్రక్రియ (మురగబెట్టడం)కు గురిచేస్తే బయో ఇథనాల్‌ తయారవుతుంది. దీన్ని పెట్రోల్‌తో కలిపి బయోపెట్రోల్‌గా వాడొచ్చు. భారత ప్రభుత్వం 2022 నాటికి పెట్రోల్‌లో 10% ఇథనాల్‌ను కలిపి విజయం సాధించింది. 2030 నాటికి 20% ఇథనాల్‌ కలపాలని నిర్ణయించింది.


డి) బయో బ్యుటనాల్‌: బయో ఇథనాల్‌ మాదిరిగా చెరకు లేదా మొక్కజొన్న మొలాసిన్‌ను క్లాస్ట్రీడియం ఎసిటోబ్యుటలికం అనే బ్యాక్టీరియా సమక్షంలో కిణ్వన ప్రక్రియ జరిపినప్పుడు ఎసిటో బ్యుటనాల్‌ ఏర్పడుతుంది. దీన్ని గృహ సంబంధ అవసరాలు, ఇంటర్నల్‌ ఇంజిన్‌ కంబుషన్‌లో వాడవచ్చు. 


ఇ) బయో హైడ్రోజన్‌ గ్యాస్‌: బయోమాస్‌ను హైడ్రోజోనోమోనాస్‌ బ్యాక్టీరియా సమక్షంలో కిణ్వన ప్రక్రియకు గురిచేసినప్పుడు హైడ్రోజన్‌ వాయువు విడుదలవుతుంది. దీన్ని రాకెట్ల ఇంధనంగా, వాహనాలు నడవడానికి ఉపయోగపడే హైడ్రోజన్‌ బ్యాటరీలోనూ వాడవచ్చు.


హరిత నగరాలు: పునరుద్ధరించదగిన కార్బన్‌ రహిత శక్తి వనరులను వినియోగించడం, ప్రత్యేకమైన, వ్యవస్థీకృత వనరులు వినియోగించగలిగేలా రహదారులు ఉండటం, పరిశ్రమలకు దూరంగా, వృక్ష సహిత నగరాలను నిర్మించడం నవీన పట్టణ అభివృద్ధికి సూచిక. ఎకోసిటీ భావనను 1975లో రిచర్డ్‌ అనే పర్యావరణవేత్త ప్రతిపాదించారు. ప్రపంచంలో మొదటి జీరో కార్బన్‌ పట్టణంగా 2008లో అబుదాబిలోని మస్టర్డ్‌ నగరాన్ని అభివృద్ధి చేశారు.


జాతీయ పర్యావరణ విధానం: భారతదేశం జాతీయ పర్యావరణ విధానాన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో భాగంగా 2006లో ప్రకటించింది. సాంఘిక న్యాయాన్ని సాధించడానికి ఆవరణ పరిమితులు తొలగించి సుస్థిరాభివృద్ధిని సాధించడం జాతీయ పర్యావరణ విధాన ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ విధానాలు, పథకాలు, ప్రాజెక్టుల్లో పర్యావరణ అంశాలను చేర్చి ఆర్థిక, సాంఘిక అభివృద్ధిని సాధించడం; జీవనోపాధికి పర్యావరణంపై ఆధారపడే పేదలకు పర్యావరణ వనరులు అందుబాటులో ఉండేలా సహజ వనరులను సంరక్షించడం; జీవనానికి ఆధారమైన సంక్షేమానికి దోహదపడే ఆవరణ వ్యవస్థను సంరక్షించడం.. లాంటి ముఖ్య ఉద్దేశాలతో జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించారు.


ఎకో ఎఫీషియన్సీ: ‘వరల్డ్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌’ ఎకో ఎఫీషియన్సీని నిర్వచించింది. జీవన నాణ్యతను పెంచుతూ, మానవ అవసరాలను తీరుస్తూ, వస్తుసేవలను అందించే పోటీదారులను సమాజానికి అందించడమే ఎకో ఎఫీషియన్సీ. దీనిలో పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తూ, సహజవనరులు నాశనం కాకుండా చూస్తూ, వ్యర్థాలను భూమి శోషించుకునే శక్తి నిర్వహించేలా ప్రణాళికలు ఉండాలి.


గ్రీన్‌ జీడీపీ: పారిశ్రామిక వృద్ధి స్థూల దేశీయోత్పత్తిని పెంచుతున్నప్పటికీ పర్యావరణానికి నష్టం చేస్తోంది. పర్యావరణ క్షీణత పారిశ్రామిక ప్రక్రియ, సహజ వనరుల సేకరణ, వ్యవసాయోత్పత్తులను పెంచడం, పారిశ్రామిక వస్తువుల వినియోగంలో అనేక విధాలుగా అంతర్లీనంగా తిరిగి మానవాభివృద్ధికి విఘాతం కలిగిస్తోంది. సంప్రదాయ జీడీపీ పర్యావరణ నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే సంప్రదాయ జీడీపీని పర్యావరణ నష్టానికి సర్దుబాటు చేస్తే గ్రీన్‌ జీడీపీ వస్తుంది.


గ్రీన్‌ జీడీపీ (గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) = సంప్రదాయ జీడీపీ - ఎన్విరాన్‌మెంటల్‌ (లేదా) ఎకలాజికల్‌ కాస్ట్‌


పర్యావరణ వనరుల నష్టం, పర్యావరణ నష్టాన్ని నిరోధించడానికి, నష్టపోయిన వనరుల పునరుద్ధరణకు, పర్యావరణాన్ని నిర్వహించడానికి చేసే వ్యయం ఎన్విరాన్‌మెంటల్‌ కాస్ట్‌లో ఇమిడి ఉంటుంది. 2006లో చైనా ప్రభుత్వం గ్రీన్‌ జీడీపీని ప్రకటించింది. గాలి, నీరు, ఘనపదార్థాల వల్ల ఏర్పడిన కాలుష్యం; సహజ వనరుల క్షీణత కారణంగా కలిగిన వ్యయాన్ని తీసుకుని దీన్ని గణించింది.


భారత ప్రణాళికా సంఘం గ్రీన్‌ నేషనల్‌ ఎకౌంట్‌ను తయారుచేయడానికి ప్రొఫెసర్‌ పార్థదాస్‌ గుప్తా ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ జాతీయ వనరులపై రుణాత్మక ప్రభావాన్ని లెక్కలోకి తీసుకుని జాతీయ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సహజ, మానవ, భౌతిక ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రగతిని అంచనా వేసేందుకు రోడ్‌ మ్యాప్‌ తయారుచేసింది. భారతదేశం గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫెసిలిటీ వ్యవస్థాపక సభ్యదేశంగా కొనసాగుతోంది. 1991లో స్థాపితమైన ఈ సంస్థకు 183 దేశాల నుంచి ఆర్థిక సాయం అందుతోంది. ఈ నిధులను ప్రపంచ పర్యావరణ ప్రయోజనాల కోసం వివిధ దేశాలకు అందిస్తున్నారు.

 

 

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 28-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణ పరిరక్షణలో జీవ సాంకేతికత పాత్ర  

  అనువర్తనాలు


పర్యావరణానికి ప్రధాన సమస్యలుగా ఉన్న అటవీ నిర్మూలన, కాలుష్య నివారణలో జీవ సాంకేతికశాస్త్రాన్ని విరివిగా వినియోగిస్తున్నారు. 


 పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో జీవ సాంకేతికశాస్త్రం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. శిలాజ ఇంధనాల స్థానంలో రెన్యువబుల్‌ ఇంధనాల వినియోగాన్ని, క్లీన్‌ ఎనర్జీ వనరులను పెంచి గ్లోబల్‌ వార్మింగ్, క్లైమేట్‌ ఛేంజ్‌ను గణనీయంగా తగ్గించగలిగారు. 


 వాయు కాలుష్య కారకాలైన కణ కాలుష్య ( particle polluction ) పదార్థాలను గుర్తించడానికి జీవ సాంకేతిక విజ్ఞానశాస్త్రం ఎంతగానో తోడ్పడుతుంది. 


 పర్యావరణంలోని హానికర రసాయన కాలుష్య కారకాలను నిర్మూలించడంలో జీవ సాంకేతికశాస్త్రం కీలక పాత్ర పోషిస్తుంది.  ఘన వ్యర్థాల నిర్వహణలో; పర్యావరణకారక ఎరువులు, 


పెస్టిసైడ్లు, బయోసెన్సార్ల రూపకల్పనలో విశేష సేవలు అందిస్తుంది. 


 జీవ సాంకేతికత ద్వారా సృష్టిస్తున్న నూతన ఆవిష్కరణలు వ్యర్థాల నుంచి పునర్వినియోగ వస్తువుల రూపకల్పనలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.


జీవ సాంకేతికత - కాలుష్య నివారణ


ఘన వ్యర్థాల నిర్వహణ: పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాలు అధిక మొత్తంలో ఉత్పన్నమవుతాయి. వీటిలో పరిశ్రమల నుంచి వచ్చే గ్లాస్, ప్లాస్టిక్, ఇతర బయోడీగ్రేడబుల్‌ పదార్థాలు (ఆహార వ్యర్థాలు, పౌల్ట్రీ - పశు పెంపక కేంద్రాల నుంచి వచ్చే వ్యర్థాలు) కూడా ఉంటాయి. 


 గ్రామీణ ప్రాంతాల్లోని ఘన వ్యర్థాలను నిర్వహించేందుకు సహజంగా వాటిని సేద్యానికి పనికిరాని నేలలో పూడుస్తారు. 


బయో రెమిడియేషన్‌: ఈ ప్రక్రియ ద్వారా పర్యావరణంలోని హానికారక రసాయన వ్యర్థాలను శుద్ధి చేస్తారు. 


 ఈ వ్యర్థాలు సహజ విచ్ఛిన్న ప్రక్రియను అనుసరించకుండా, వాతావరణంలో పేరుకుపోయి ఉంటాయి. ఇవి ఆవరణ వ్యవస్థ సమతౌల్యతకు భంగం కలిగిస్తాయి. 


 బయో రెమిడియేషన్‌ ప్రక్రియ ద్వారా ఈ వ్యర్థాలను తొలగించవచ్చు. దీన్నే బయో రీస్టోరేషన్‌ లేదా బయో ట్రీట్‌మెంట్‌ అని కూడా పిలుస్తారు. 


 ఈ ప్రక్రియలో వ్యర్థాల విచ్ఛిన్నానికి జీవావరణ వ్యవస్థల్లో సహజంగా నివసించే సూక్ష్మజీవులు కీలక పాత్ర పోషిస్తాయి. 


 ఆయిల్‌ స్పిల్స్‌ను (నీటిపై ఉండే చమురు తెట్టు) తొలగించడానికి, కలుషితమైన భూగర్భ జలాలను శుద్ధి చేయడానికి బయో రెమిడియేషన్‌ ప్రక్రియను వినియోగిస్తున్నారు. 


 వాతావరణ కాలుష్యం వల్ల ఆవరణ వ్యవస్థకు కలిగే జీవవైవిధ్య నష్టాన్ని నివారించడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తున్నారు.


 ఈ ప్రక్రియలో శుద్ధి చేయడానికి సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. దీన్ని అత్యంత తక్కువ వ్యయం, శ్రమతో చేయొచ్చు.


కంపోస్టింగ్‌ ప్రక్రియ: ఘన వ్యర్థాలను వాయు రహిత లేదా అవాయు ప్రక్రియలో సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేసినప్పుడు హ్యూమస్‌ లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఇది సహజ 


పర్యావరణంలో కలిసి పర్యావరణహితంగా పనిచేస్తుంది. 


 ఈ ప్రక్రియలో ఘన వ్యర్థాలు ఫెర్మెంటేషన్‌ విధానం ద్వారా తక్కువ తేమతో చర్య జరిపి, నేలను గుల్లచేసి సారవంతంగా మారుస్తుంది. ఈ విధానాన్ని సహజ వ్యవసాయ పద్ధతుల్లో వినియోగిస్తున్నారు. 


 దీని ద్వారా నేలలో సహజసిద్ధంగా ఉండాల్సిన పదార్థాలు అభివృద్ధి చెందుతాయి.


జీవ ఉత్ప్రేరకాలు: సహజ వాతావరణంలో లభ్యమయ్యే జీవ ఉత్ప్రేరకాలు (బయో క్యాటలిస్ట్స్‌) హానికర రసాయనాలను డీటాక్సిఫై చేసి, పర్యావరణంలోకి విడుదల చేస్తున్నారు. 


 పరిశ్రమల నుంచి లభ్యమయ్యే మిథిలిన్‌ క్లోరైడ్, ఇతర క్యాన్సర్‌ కారకాలను శుద్ధి చేయడానికి కూడా జీవ ఉత్ప్రేరక ఎంజైమ్‌లను వినియోగిస్తున్నారు. 


 ప్రత్యేక తరగతికి చెందిన బ్యాక్టీరియాను బయో రియాక్టర్లలో వాడినప్పుడు అవి హానికారక కాలుష్య కారకాలను ఉపయోగించుకుని జీవావరణంలోకి కార్బన్‌ డైఆక్సైడ్, నీరు, ఇతర లవణాలను మాత్రమే విడుదల చేస్తాయి.


బయో సెన్సార్లు: పర్యావరణంలో లేదా వివిధ వ్యవస్థల్లో ఉన్న పదార్థాల గాఢతను గుర్తించడానికి ఈ రకమైన సెన్సార్లను ఉపయోగిస్తున్నారు. 


 జీవులను సెన్సార్లుగా ఉపయోగించి ఆయా పదార్థాలు లేదా పర్యావరణం గురించి విశ్లేషించడానికి వీటిని ఉపయోగిస్తారు. 


 ఎంజైమ్‌లు, యాంటీబాడీస్, వైరస్, బ్యాక్టీరియా, ఫంగై మొదలైనవి బయో సెన్సార్లుగా వ్యవహరిస్తాయి. 


 వాతావరణంలోని కాలుష్య కారకాలను గుర్తించడానికి; క్లినికల్‌ రిసెర్చ్, ఇమ్యూనొలాజికల్, జెనెటిక్‌ రిసెర్చ్‌ మొదలైన వాటిని అంచనా వేయడానికి బయో సెన్సార్‌లను ఉపయోగిస్తున్నారు. 


 కొన్ని రకాల సూక్ష్మజీవులు బయో మార్కర్లుగా లేదా బయో ఇండికేటర్లుగా పనిచేస్తాయి. ఆయా ప్రాంతాల్లోని కాలుష్య స్థాయులను, పదార్థాల లభ్యతను ఈ మార్కర్లు తమ ద్వారా ప్రసరింపజేసి తెలియజేస్తాయి.


ఆయిల్‌ ఈటింగ్‌ బగ్స్‌: సముద్రాల్లో ప్రమాదవశాత్తు కలసి పోయిన చమురు నిల్వలు సముద్ర ఆవరణ వ్యవస్థకు విఘాతాన్ని కలిగిస్తాయి. ఇది తెట్టుగా ఏర్పడి సముద్ర జీవులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఇది అక్కడి జీవవైవిధ్యానికి ఎక్కువ నష్టం కలిగిస్తుంది. 


 ఈ సమస్యను నివారించడానికి శాస్త్రవేత్తలు సముద్ర నీటిపై తేలియాడే చమురు లేదా నూనెను తినే సూక్ష్మజీవులను ఆయా ప్రాంతాల్లో పెంచుతున్నారు. 


బయో మైనింగ్‌: మైనింగ్‌ ప్రాంతాల్లో కాలుష్యం అత్యధికంగా ఉంటుంది. దీన్ని నియంత్రించడంలో ఆధునిక జీవ సాంకేతికశాస్త్రం ముఖ్య పాత్ర పోషిస్తుంది. మైనింగ్‌ వల్ల ఉత్పన్నమయ్యే అత్యధిక వేడిని తగ్గించడానికి దీని అనువర్తనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 


 థయోబాసిల్లస్‌ ఫెరాక్సిడెన్స్‌ అనే బ్యాక్టీరియా రాగి గనుల వల్ల కలిగే కాలుష్య ప్రభావాన్ని చాలావరకు తగ్గిస్తోంది. 


బయో స్క్రబ్బింగ్‌: ఈ ప్రక్రియ ద్వారా అత్యధిక హానికారక, ఘాటు వాసనలను కలిగించే కాలుష్య కారకాలను తగ్గిస్తారు. 


 వివిధ పరిశ్రమల నుంచి వెలువడే సల్ఫర్‌ వ్యర్థాలను, ఆయిల్‌ రిఫైనరీల నుంచి వచ్చే సహజవాయువులను శుద్ధి చేయడానికి బయో స్క్రబ్బింగ్‌ ప్రక్రియను వినియోగిస్తారు. దీనికోసం వివిధ రకాల సూక్ష్మజీవులను ఉపయోగిస్తున్నారు. 


పెస్టిసైడ్‌ల ప్రభావం తగ్గించడం: రసాయన కీటక నాశనులు, ఎరువులను పరిమితికి మించి వాడినప్పుడు వివిధ రకాల పర్యావరణ సమస్యలు తలెత్తున్నాయి. వీటిని నివారించేందుకు అధునాతన జీవ సాంకేతికశాస్త్ర పద్ధతులను ఉపయోగిస్తారు.


బయో ఎనర్జీ: బయోగ్యాస్, బయోమాస్, హైడ్రోజన్‌ మొదలైన వాటిని బయో ఎనర్జీగా పరిగణిస్తారు. సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా వీటిని వినియోగిస్తారు. పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 


 ఈ జీవశక్తిని గృహాలు, పరిశ్రమల నుంచి అంతరిక్షం వరకు శక్తి వనరుగా వినియోగిస్తున్నారు. జీవ ద్రవ్యరాశి (బయోమాస్‌ ఎనర్జీ) నుంచి ఉత్పన్నమయ్యే శక్తిని అత్యంత పరిశుభ్రమైన గ్రీన్‌ ఎనర్జీగా పరిగణిస్తారు. 


 ఈ బయో ఎనర్జీని అత్యంత పర్యావరణహితమైందిగా శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ దీనిపై పరిశోధనలను వేగవంతం చేశాయి.


డిజైనర్‌ బగ్స్‌: ప్రపంచంలో లక్షల సంఖ్యలో రసాయన పదార్థాలు ఉన్నాయి. వీటిలో కొన్ని బయోడీగ్రేడబుల్‌గా మరికొన్ని వాటికి వ్యతిరేకంగా ఉన్నాయి. 


 నాన్‌ బయోడీగ్రేడబుల్‌ రసాయన పదార్థాలను (పాలీ క్లోరినేటెడ్‌ బైఫినైల్స్‌) సూక్ష్మజీవుల ద్వారా విచ్ఛిన్నం చేయొచ్చు. దీనికోసం జన్యు మార్పిడి బ్యాక్టీరియాను (సూడోమోనాస్‌ సూడోఆల్కలి, డీసల్ఫిటో బ్యాక్టీరియం) సృష్టించారు.


 ఈ రకమైన బ్యాక్టీరియాను డీక్లోరినేషన్, 1 - 160 పి.పి.ఎం. గాఢతను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తున్నారు.


బయో ప్లాస్టిక్స్‌: ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు బయో ప్లాస్టిక్స్‌ను గుర్తించారు. సాధారణ ప్లాస్టిక్‌ను శిలాజ ఇంధనాలు లేదా పెట్రో పదార్థాల నుంచి తయారు చేస్తారు. ఇవి గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాలు, రసాయనాలను వెలువరిస్తాయి. వీటిని రీసైక్లింగ్‌ చేయడం కష్టం.


 బయో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సులువుగా రీసైకిల్‌ చేయొచ్చు. తద్వారా పర్యావరణంపై కార్బన్‌ ఫుట్‌ ప్రింట్‌ను తగ్గించవచ్చు. 


 బయో ప్లాస్టిక్‌ ఉత్పత్తి కొంచెం ఖర్చుతో కూడుకుంది. అయినప్పటికీ ప్లాస్టిక్‌ల ద్వారా వచ్చే చెడు ప్రభావాలైన ఆహార రుచి మార్పు, క్యాన్సర్‌ కారకాలను బయో ప్లాస్టిక్‌ల ద్వారా నివారించవచ్చు. 


 బయో ప్లాస్టిక్‌ను వివిధ రకాల పదార్థాలతో తయారు చేస్తున్నారు. సెల్యులోజ్‌తో తయారైన బయో ప్లాస్టిక్‌లను ప్యాకేజింగ్‌ ఇండస్ట్రీలో విరివిగా వాడుతున్నారు. పిండి పదార్థాలతో తయారైన థర్మో ప్లాస్టిక్‌ను ఫార్మసీ రంగంలో క్యాప్సూల్స్‌ తయారీలో వినియోగిస్తున్నారు. పంట పొలాల నుంచి లభ్యమయ్యే పిండి పదార్థాలను ఫెర్మెంటేషన్‌ ప్రక్రియ ద్వారా పులియబెట్టి పాలీలాక్టిక్‌యాసిడ్‌ ( PLA )ను తయారు చేస్తారు. దీన్ని మొబైల్‌ ఫోన్ల కేసులు, కప్పులు, బాటిళ్ల తయారీలో వినియోగిస్తున్నారు. పాలీహైడ్రాక్సీబ్యుటిరేట్‌ను (PHB) బ్యాంకు నోట్లు, వివిధ కార్ల భాగాల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఫొటోడీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ పదార్థాలు కాంతి తగలగానే విచ్ఛిన్నం అవుతాయి.


రచయిత

రేమల్లి సౌజన్య

విషయ నిపుణులు 

Posted Date : 21-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణం

పరిసరాలతో జీవుల బంధం!


పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, ఉండే ఇల్లు, పెరిగే మొక్కలు, తిరిగే జంతువులు తదితరాలతో కలిపి చుట్టూ ఉన్న పరిసరాల వ్యవస్థే పర్యావరణం. సమస్త జీవుల మనుగడకు మూలాధారం. ఇందులో సహజ అనుఘటకాలతోపాటు మానవ నిర్మాణాలు ఉంటాయి. ఇవన్నీ నిర్మాణాత్మక జీవక్రియలను సక్రమంగా నిర్వర్తించుకోవడానికి సాయపడతాయి. ఈ జీవనిర్జీవ కారకాల సముదాయ లక్షణాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. దాంతోపాటు పర్యావరణంలోని రకాలు, వాతావరణ పొరల వివరాలపై అవగాహన పెంచుకోవాలి. 

మన చుట్టూ ఉన్న పరిసరాలను పర్యావరణం అంటారు. అందులో సజీవులు, నిర్జీవులు అనుఘటకాలుగా ఉంటాయి. పర్యావరణం అనే పదం ‘ఎన్విరాన్‌’ అనే ఫ్రెంచ్‌ పదం నుంచి పుట్టింది. ఫ్రెంచ్‌ భాషలో ‘ఎన్విరాన్‌’ అంటే ‘చుట్టూ ఆవరించి ఉన్న’ అని అర్థం. జీవుల సమూహం చుట్టూ పరివేష్ఠితమైన పరిస్థితులనే పర్యావరణం అంటారు. ఒక జీవిపై లేదా సమాజంపై ప్రభావాన్ని చూపే సంక్లిష్టమైన సామాజిక లేదా సాంస్కృతిక పరిస్థితులను పర్యావరణంగా పేర్కొనవచ్చు.


జీవరాశులు తమ నిర్మాణాత్మకమైన జీవక్రియలను సక్రమంగా నిర్వర్తించుకోవడానికి ఉపయోగించే మృత్తిక, నీరు, గాలి, కాంతి, ఉష్ణం లాంటి వాటిని స్థూలంగా పర్యావరణం అంటారు. గాలి, నీరు, భూమిలో ఉండే రసాయనాలు; జీవరాశులు, ఇతర నిర్జీవ పదార్థాలకు సంబంధించి వాటి మూలం, చర్య, విస్తరణ, ఉనికి, మానవుడి వల్ల వాటిపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పరిసరాల విజ్ఞానం’ అంటారు.


ముఖ్య లక్షణాలు:

* ఏదైనా భౌగోళిక ప్రాంతంలో నిర్దిష్ట కాల వ్యవధిలో ఉండే జీవ, నిర్జీవ కారకాల మొత్తం పర్యావరణం.

 ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించే జీవవైవిధ్యత, జీవుల ఆవాసాలు, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న శక్తి వనరులన్నీంటిని కలిపి ఆవరణ వ్యవస్థ నిర్మాణంగా పేర్కొనవచ్చు. 

ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని అనుసరించి పర్యావరణం అనేక మార్పులకు లోనవుతుంది. అంటే పర్యావరణం అనేది ఒక గతిశీలమైన వ్యవస్థ. 

జీవ, నిర్జీవ అంశాల మధ్య జరిగే అంతఃచర్యలు; జీవుల మధ్య ఉండే విధి పూర్వక సంబంధాలపై పర్యావరణ మనుగడ ఆధారపడి ఉంటుంది. పర్యావరణ నిర్వహణ విధానం అనేది అందులోని శక్తి ప్రవాహాలపై ఆధారపడి ఉంటుంది. 

 పర్యావరణం తనకు కావాల్సిన సేంద్రియ పదార్థాలను తనే ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే ఈ ఉత్పాదన అనేది ప్రాంతం, శీతోష్ణస్థితిని బట్టి మారుతూ ఉంటుంది.

ఆవరణ వ్యవస్థల సమతౌల్యాన్ని కాపాడటం అనేది పర్యావరణ వ్యవస్థ ముఖ్య లక్షణం.


విధులు: 

 ఆర్థిక వస్తువుల ఉత్పత్తికి అవసరమైన సహజ వనరులను అందిస్తుంది.

 ఆర్థిక కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాలను తనలో విలీనం చేసుకుంటుంది. 

జీవావరణ సమతౌల్యాన్ని కాపాడటానికి అవసరమైన ప్రాణాధార సేవలను అందిస్తుంది.


పర్యావరణ అనుఘటకాలు: పర్యావరణంలో రెండు రకాల అనుఘటకాలు ఉంటాయి.

1) జీవ అనుఘటకాలు: వృక్షాలు (ఉత్పత్తిదారులు), జంతువులు, సూక్ష్మజీవులు లాంటివి.


2) నిర్జీవ అనుఘటకాలు: ఇందులో మళ్లీ మూడు రకాలు ఉన్నాయి.


ఎ) శీతోష్ణస్థితి పరమైనవి: కాంతి, ఉష్ణం, వర్షపాతం లాంటివి.


బి) భౌతిక పరమైనవి: గాలి, నేల, నీరు.


సి) రసాయనిక పరమైనవి: సేంద్రియ పరమైన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, లిపిడ్లు, నిరేంద్రియ పరమైన సోడియం, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్‌. ఈ జీవ, నిర్జీవ వనరుల మధ్య జీవ-భూ-రసాయనాల ద్వారా జరిగే అంతఃచర్యల వల్ల ఆయా జాతి జీవులకు కావాల్సిన ఆహారం, ఆవాసం, నీరు లాంటి ప్రాథమిక అవసరాలు అందుతాయి. పర్యావరణాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.              


1) కృత్రిమ లేదా మానవ నిర్మిత పర్యావరణం:  మానవుడు తన మనుగడ కోసం, తనకు కావాల్సిన అవసరాలను పొందడం కోసం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసుకున్న సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయపరమైన వ్యవస్థలతో కూడిన పరిసరాలే కృత్రిమ పర్యావరణం. దీనిని నాలుగు విధాలుగా వర్గీకరించవచ్చు.


ఎ) సాంఘిక పర్యావరణం: సమాజం, కుటుంబం, వివాహ వ్యవస్థలు.


బి) సాంస్కృతిక పర్యావరణం: మానవ సమాజాల సంప్రదాయాలు; కట్టుబాట్లు, పండగలు, వినోదాత్మక నిర్మాణాలు.


సి) ఆర్థికపర వ్యవస్థలు: వాణిజ్య, పారిశ్రామిక, వ్యాపార సముదాయాలు.


డి) రాజకీయపర వ్యవస్థలు: అసెంబ్లీ, సచివాలయం..,


2) సహజసిద్ధ పర్యావరణం: ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా భూమిపై ఉండే అనుకూల శీతోష్ణస్థితి ప్రభావాల కారణంగా ఏర్పడిందే సహజసిద్ధ పర్యావరణం.దీనిని నాలుగు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. 


1) శిలావరణం: భూఉపరితలం నుంచి సగటున    40 కి.మీ. లోతు వరకు విస్తరించి ఉండే ఘనస్థితిలోని భూమి బాహ్య పొర. 

* భూఉపరితల స్వరూపం వివిధ భౌమ కాలాల్లో బహిర్జనిత, అంతర్జనిత బలాలకు లోనవుతుంది. దాంతో శైథిల్య, క్రమక్షయ, నిక్షేపణ చర్యలకు గురై పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, నదీలోయలు లాంటి భూస్వరూపాలు భౌమ పరిణామ క్రమంలో ఆవిర్భవిస్తాయి. పలు జీవ జాతుల మనుగడకు కావాల్సిన భౌతిక పర్యావరణం ఏర్పడుతుంది.నేలల ఆవిర్భావానికి, వృక్షజాతుల పెరుగుదలకు కావాల్సిన వివిధ రకాల పోషకాలను అందిస్తూ, సమస్త జీవజాతులకు కావాల్సిన ఆహార వనరులను, ఆవాసాలను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మానవ సాంఘిక, ఆర్థికాభివృద్ధికి కావాల్సిన పలు రకాల వనరులను సమకూరుస్తూ జీవజాతి మనుగడకు ఆధారంగా ఉంది.


2) జలావరణం: భూఉపరితలంపై 71 శాతం అంటే 2/3వ వంతు జలం ఆవరించింది. ఇందులో సముద్రాల్లోని ఉప్పు నీటి శాతం 97.3 శాతం, మంచినీటి శాతం 2.7 శాతం.  జీవులకు ఆధారమైన నీటిని సమకూర్చడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. భూగోళ ఉష్ణోగ్రతలను క్రమపరుస్తుంది. అనేక రకాల వనరులకు నిలయంగా ఉంది. ప్రధానంగా ‘కార్బన్‌  శోషకం’గా వ్యవహరిస్తుంది. 


3) వాతావరణం: భూ ఉపరితలం నుంచి దాదాపు  600 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్న భూమి బాహ్యపొరను వాతావరణం అంటారు. భూమిపై జీవజాతి ఆవిర్భావం, మనుగడకు కావాల్సిన, అనువైన శీతోష్ణస్థితిని ఏర్పరచడంలో వాతావరణం ప్రధాన పాత్ర పోషిస్తుంది. శ్వాస-నిశ్వాసాలకు ప్రాణధారమైంది వాతావరణం. ఈ ఆవరణంలోని అనుఘటకాల శాతాల్లో మార్పులు సంభవిస్తే జీవుల మనుగడకు ప్రమాదకరమవుతుంది. సూర్యుడి నుంచి వెలువడే అధిక శక్తిమంతమైన వికిరణ కిరణాలు వాతావరణంలోకి ప్రవేశించి అందులోని ఆక్సిజన్, నైట్రోజన్‌ వాయువులతో విభేదించే స్థాయి ఫలితంగా రసాయన చర్యలు జరిగి మిరుమిట్ల్లుగొలిపే కాంతి వెలువడుతుంది. ఈ కాంతినే ‘ఆరోరా’ అంటారు. వాతావరణం అనేది భూ ఉపరితలంపై దుప్పటి లాంటిది. అందులో వివిధ వాయువులు, తేమ, దుమ్ము, ధూళి, రేణువులు ఉంటాయి.


వాతావరణంలో ఉండే ముఖ్య వాయువులు:

1) నైట్రోజన్‌ 

2) ఆక్సిజన్‌ 

3) కార్బన్‌ డై ఆక్సైడ్‌.

గాలిలో వాయువుల శాతాలు: 

* నైట్రోజన్‌ 78.08 శాతం 

* ఆక్సిజన్‌ 20.94 శాతం

* ఆర్గాన్‌ 0.93 శాతం

* కార్బన్‌ డై ఆక్సైడ్‌ 0.03 శాతం

* నియాన్‌  0.0018 శాతం. భూ ఉపరితలంపై వాతావరణాన్ని నాలుగు పొరలుగా విభజించారు.


ఎ) ట్రోపో ఆవరణం:

 * ఇది భూమి ఉపరితలంపై ఉన్న వాతావరణ పొర. 

* ధ్రువాల వద్ద 8 కి.మీ. వరకు, భూమధ్యరేఖ వద్ద 18 కి.మీ. వరకూ విస్తరించి ఉంటుంది. 

* జీవులకు సంబంధించి ఈ పొర అత్యంత అనుకూలంగా ఉంటుంది. వాతావరణంలోని వాయువులు ఈ పొరలోనే ఉంటాయి.

 * ఈ పొర 3/4వ వంతు వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇది జీవావరణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. 

* మేఘాలు, వర్షపాతం, ఉరుములు, మెరుపులు ఇందులోనే ఏర్పడతాయి. 


* ఈ పొరలో పైకి వెళ్లే కొద్దీ ప్రతి కిలోమీటరుకు 6 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. 


* ఈ పొరలో (-)50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి (-)60 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదవుతుంది.


బి) స్ట్రాటో ఆవరణం: 

* ఇది భూవాతావరణంలో రెండో పొర. ధ్రువాల వద్ద 39 కి.మీ.వరకు, భూమధ్యరేఖ వద్ద 50 కి.మీ.వరకు విస్తరించి ఉంటుంది.

* ఇందులో అతిముఖ్యమైన ఓజోన్‌ పొర ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు భూమి పైకి చేరకుండా అడ్డుకుంటుంది.

 జెట్ విమానాలు, ఎయిర్‌క్రాప్ట్‌లు ఈ పొరలోనే ప్రయాణిస్తాయి.


సి) మీసోస్ఫియర్‌: ఇది భూ ఉపరితలానికి 85 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది.


డి) థర్మో ఆవరణం: 

* ఈ ఆవరణం భూ ఉపరితలానికి 80 కి.మీ. వరకు వ్యాపించి ఉంటుంది. 

* ఇందులో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ పొరలో సరాసరి ఉష్ణోగ్రత దాదాపు 2000 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉంటుంది. 

* ఈ ఆవరణంలో రేడియో తరంగాలు పరావర్తనం చెంది భూమి మీదకు ప్రయాణిస్తాయి. ఈ పొర ఉపగ్రహాలకు అనుకూలంగా ఉంటుంది.


ఎక్సో ఆవరణం:

* ఈ ఆవరణంలో హైడ్రోజన్, హీలియం వాయువులు ఉంటాయి.

ఇది భూఉపరితలానికి 800 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది.


4) జీవావరణం: భౌతిక పరిసరాల్లో నివసించే సమస్త జీవజాతినే జీవావరణం అంటారు. ఇది భూ ఉపరితలం మీద, భూ ఉపరితలం నుంచి దాదాపు 200 మీటర్ల లోతు వరకు, భూ ఉపరితల వాతావరణంలో దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో మానవుడు తన పరిసరాలతో అత్యధిక సంబంధాలను కలిగి, వనరులను ఉపయోగించుకుని, తద్వారా తన అవసరాలను తీర్చుకుంటాడు. జీవావరణానికి మిగిలిన భౌతిక ఆవరణాలైన జల, వాయు, శిల ఆవరణాలకు మధ్య పదార్థాలు భ్రమణం చెందుతూ ఉంటాయి. భౌతిక ఆవరణాల్లో ఉండే అనుఘటకాల శాతం ఉండాల్సిన దాని కంటే ఎక్కువ మానవీయ చర్యల ద్వారా లేదా ప్రకృతి కారణాల వల్ల, ఆ వలయాల్లో చేరితే అవి కాలుష్యాన్ని కలగజేస్తాయి. అందువల్ల ప్రతి భౌతిక ఆవరణాన్ని కాపాడుకుంటే జీవావరణ మనుగడ ఉంటుంది. లేకపోతే అన్ని ఆవరణాలు నాశనమై మనిషి జీవనానికి ముప్పు వాటిల్లుతుంది. 


రచయిత: ఇ.వేణుగోపాల్‌ 

Posted Date : 05-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పర్యావరణంపై మానవ ప్రభావం

విచక్షణరహిత చర్యలతో విధ్వంసాలు!


అనుకోని వర్షాలు, ఆకస్మిక వరదలు, అంతుపట్టని అంటువ్యాధులు, భరించలేని భూతాపాలు, దుర్భర దుర్భిక్షం.. అంచనాలకు అందని ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఆధునిక కాలంలో తలెత్తుతున్నాయి. దాంతో ఎడారీకరణ, తుపానులు, సునామీలు సంభవిస్తున్నాయి. ప్రగతి పేరుతో మనిషి విచక్షణరహితంగా చేసే పనులు విధ్వంసాలను సృష్టిస్తున్నాయి.  క్రమంగా జీవజాతులు అంతరిస్తున్నాయి. జీవులకు, పరిసరాలకు మధ్య సంబంధాల్లో సమస్యల వల్లే వాతావరణంలో ఆ విధమైన విపరిణామాలు ఏర్పడుతున్నాయి.  భవిష్యత్తు తరాల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ పర్యావరణ మార్పుల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. మానవ చర్యలు విపత్తులకు కారణమవుతున్న తీరును, ప్రకృతి అనుకూల జీవన విధానాన్ని అలవరచుకోవాల్సిన అవసరాన్ని అర్థం చేసుకోవాలి.


జీవరాశులన్నింటిలో ఒక్క మానవుడికి మాత్రమే తన పరిసరాల్లోని, పరిసరాలకు దూరంగా ఉన్న సహజ వనరులను వివిధ రూపాల్లో వినియోగించుకునే సామర్థ్యం ఉంది. మనిషికి ఉన్న ఈ శక్తితో ప్రకృతి సృష్టించే ప్రతిబంధకాలను అధిగమించి తాను అభివృద్ధిపరిచిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం సహాయంతో పెద్ద పెద్ద నాగరికతలను రూపొందించాడు. ప్రాచీన మానవుడు తన కనీస అవసరాల కోసమే సహజ వనరులను వినియోగించేవాడు. ఇందులో భాగంగా ఏర్పడే వ్యర్థాలను పర్యావరణం సులభంగా తనలో ఇముడ్చుకునేది. నిప్పును కనిపెట్టడంతో పర్యావరణంపై మానవ ప్రభావం ప్రారంభమైంది. దీంతో క్రూరమృగాలను దెబ్బతీయడం, అడవులు తగలబెట్టి వ్యవసాయ భూములుగా మార్చడం, స్థిర వ్యవసాయాన్ని ప్రారంభించడంతో ఆవరణ వ్యవస్థలపై మానవుడి ప్రభావం వేగవంతమైంది. పారిశ్రామిక విప్లవ ప్రారంభంతో మరింత తీవ్రమైంది. పారిశ్రామిక విప్లవం తర్వాత పర్యావరణంపై మానవ ప్రభావం పెరగడానికి, పర్యావరణ వనరులు క్షీణించడానికి పలు కారణాలున్నాయి. అవి 

1) జనాభా పెరుగుదల 

2) వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామీకరణ, పట్టణీకరణ 

3) ఆధునిక ప్రపంచ ఆర్థిక పోకడలైన సరళీకరణ, ప్రపంచీకరణ, బహుళజాతి కంపెనీల లాంటి మార్కెట్‌ శక్తులు 

4) అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం 5) నూతన వినిమయ సంస్కృతి కారణంగా ఘన వ్యర్థ పరిమాణం పెరగడం.


మూడు రకాలు: పర్యావరణంపై మానవుడి ప్రభావం మూడు రకాలుగా ఉంటుంది. 

1) ఉపాధి, విద్య, వైద్యం, విలాసవంతమైన జీవనాన్ని వెతుక్కుంటూ ప్రపంచం అంతటా గ్రామాల నుంచి నగరాలకు దారితీసే వలసలు నగర ఆవరణ వ్యవస్థలను కలుషితం చేస్తున్నాయి. దీనివల్ల నగరాల్లో మురికివాడల సంఖ్య పెరగడం, తాగునీరు, ఆరోగ్యపరమైన సమస్యలు తీవ్రమవుతున్నాయి. 

2) మానవుడు సాంకేతిక నైపుణ్య వ్యవస్థల ద్వారా చుట్టూ ఉన్న పర్యావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో సహజ ఆవరణ వ్యవస్థల స్వభావాన్ని మార్చడంతో సహజ వనరుల నాణ్యత తగ్గిపోతోంది. జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఉదా: పశ్చిమ రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాలకు సాగు  నీటిని అందిస్తూ ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి నిర్మించిన ఇందిరాగాంధీ కాలువ నిర్మాణం వల్ల జొన్న, సజ్జ లాంటి ఆహార పంటల సాగు తగ్గి చెరకు, పత్తి లాంటి వాణిజ్య పంటల సాగు విస్తరించింది. సాంద్ర వ్యవసాయ విధానాల వల్ల భూ వనరులు క్షారనేలలుగా మారిపోతున్నాయి. అంతేకాకుండా పర్షియా సింధు శాఖ ప్రాంతంలో చమురు నిక్షేపాల వెలికితీతతో పరిశ్రమల సంఖ్య పెరిగి ఆ ప్రాంత భూవనరులపై ఒత్తిడి పెరుగుతోంది. 

3) పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి అధికం చేసే ప్రయత్నంలో హరిత విప్లవ సాంకేతిక పద్ధతులైన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని అధికం చేయడం వల్ల భూ, జలవనరులు కాడ్మియం, ఫ్లోరిన్, లెడ్‌ లాంటి భార లోహాలతో కలుషితమయ్యాయి. ఉదా: ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్న ఫ్లోరోసిస్, ఇటాయి - ఇటాయి, మినిమాటా లాంటి వ్యాధులకు కారణం తాగే నీటిలో ఈ కాలుష్యాల పరిమితి మించడమే.


మొత్తం మీద మానవుడు అభివృద్ధి కార్యకలాపాల పేరుతో వనరులను దుర్వినియోగపరుస్తూ పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాడు. దీని ఫలితమే గ్లోబల్‌ వార్మింగ్, ఆమ్లవర్షాలు, ఓజోన్‌ పొర క్షీణత, జనవనరుల పరిమాణం తగ్గిపోవడం, బంజరు విస్తృతి, ఎడారీకరణ, వరదలు, దుర్భిక్షం, భూకంపం, సునామీల తీవ్రత పెరగడం, జాతుల అంతర్థానం, అంటు వ్యాధులు ప్రబలడం మొదలైనవి. 


శీతోష్ణస్థితి మార్పు


సముద్ర మట్టం పెరగడం: భూమిపై శీతోష్ణస్థితి మార్పు ద్వారా ధ్రువ హిమ శిఖరాలన్నీ కరిగి సముద్ర మట్టం పెరుగుతోంది. ఐపీసీసీ ప్రకారం 2100 నాటికి 80 సెం.మీ. పైగా సముద్రమట్టం పెరిగి, పసిఫిక్, హిందూ మహాసముద్రంలో అనేక దీవులు శాశ్వతంగా మునిగిపోయే ప్రమాదం ఉంది. తువాలు, మార్షల్‌ దీవులు, మాల్దీవులు ఈ జాబితాలో ఉన్నాయి.


వ్యవసాయం: రబీ కాలంలో గత దశాబ్ద   కాలంగా ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం గోధుమ దిగుబడిపై తీవ్రంగా ఉంటోంది. ఐఎన్‌సీసీఏ ప్రకారం దేశ సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు రబీ కాలంలో ఒక డిగ్రీ చొప్పున పెరిగితే గోధుమ దిగుబడి 6 మిలియన్‌ టన్నుల మేరకు తగ్గే ప్రమాదం ఉంది. నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల రాకపైనా ప్రభావం పడుతుంది. వర్షాలు ఆలస్యంగా కురవడం, రెండు రుతుపవనాల మధ్య అంతరం పెరగడం, కుండపోత వర్షాలతో పంటలు నాశనం కావడం లాంటి ప్రభావాలు ఇప్పటికే ఉష్ణమండల దేశాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంపై శీతోష్ణస్థితి మార్పు ప్రభావాల ద్వారా దిగుబడి తగ్గడమే కాకుండా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మహిళలు, ఆడపిల్లల్లో పోషకాహార లోపం పెరుగుతుంది. ఆసియాలో వరి దిగుబడిపై శీతోష్ణస్థితి మార్పు తీవ్ర ప్రభావాన్ని ప్రదర్శించనున్నట్లు ఐపీసీసీ ఇప్పటికే హెచ్చరించింది. ఈ ప్రాంతంలో వరి దిగుబడిలో 30 శాతం తగ్గుదల నమోదు కానుంది. అయితే ఉత్తరార్ధ గోళంలో శీతోష్ణస్థితి మార్పుతో వెచ్చదనం పెరిగి పంటల సాగు, దిగుబడి పెరిగే అవకాశం ఉంది.


అధిక వరదల తీవ్రత: ప్రపంచవ్యాప్తంగా వరదల తీవ్రత పెరగడానికి శీతోష్ణస్థితి మార్పే కారణం. కుండపోత వర్షాలతో నగరాలు ముంపునకు గురవుతున్నాయి. 2021లో జర్మనీ, బెల్జియం, ఇతర యూరప్‌ దేశాలు భారీ స్థాయి వరదలను చవిచూశాయి. వెయ్యేళ్లలో ఎప్పుడూ చూడని వరదలు చైనాను ముంచెత్తాయి.


ఓషన్‌ అసిడిఫికేషన్‌: వాతావరణంలో  కార్బన్‌డైఆక్సైడ్‌ పెరిగేకొద్దీ సముద్ర నీటిలో కరిగే ఆ వాయువు మోతాదు కూడా పెరుగుతుంది. సముద్ర నీటిలో కార్బొనిక్‌ ఆమ్లం అధికమై నీరు ఆమ్లయుతంగా మారుతుంది. సాధారణంగా సముద్ర నీటి pH 8-8.5 గా ఉంటుంది.. సముద్ర నీటిలోకి కార్బన్‌డైఆక్సైడ్‌ అధిక మొత్తంలో కరిగే కొద్దీ సముద్ర pH విలువ కొద్దిగా తగ్గుతుంది.సముద్రనీటి మార్పుతో ఆహారంగా ఉపయోగపడే సముద్రజీవుల సాంద్రత తగ్గి జాలర్ల ఆదాయం కూడా తగ్గుతుంది.


జంతువులపై ప్రభావం: ఆర్కిటిక్‌ ప్రాంతంలో ధ్రువ ఎలుగుబంట్లు, అంటార్కిటిక్‌లో పెంగ్విన్‌లపై శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శీతాకాలంలో ఆర్కిటిక్‌ ప్రాంతంలోని సముద్రంపై నడిచే ధ్రువ ఎలుగుబంట్లు హిమక్షీణత ద్వారా ఆహారం లభించక క్షీణిస్తున్నాయి. ఇదే కొనసాగితే భవిష్యత్తులో ఇవి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. 


తుపాను తీవ్రత: తుపాను తీవ్రత పెరగడానికి శీతోష్ణస్థితి మార్పే ప్రధాన కారణమని ఇప్పటికే గుర్తించారు. ఫైలాన్, హుద్‌హుద్, అంఫన్, నిసర్గ, తౌతే లాంటి తుపానులు మరింత తీవ్రతతో సంభవించే ప్రమాదం ఉంది. సమగ్ర తుపాను నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేసుకోకపోతే ఆర్థిక నష్టాలు తీవ్రస్థాయిలో సంభవిస్తాయి.


జలవలయం: ఉష్ణమండల ప్రాంతాల్లోని జలవలయంపై శీతోష్ణస్థితి మార్పు ప్రభావాన్ని కూడా గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా వర్షం కురిసి వరదలు సంభవిస్తే, ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక క్షామం ఏర్పడుతోంది. ఆసియాలో 50 కోట్లకుపైగా జనాభా తీవ్రస్థాయి నీటి కొరత ఎదుర్కోనున్నట్లు ఐపీసీసీ గుర్తించింది.


హిమానీనదాల అదృశ్యం: హిమానీనదాలపైనా శీతోష్ణస్థితి మార్పు ప్రభావం    పడుతోంది. ఏటా గంగోత్రి హిమానీనదం 1.8 మి.మీ. చొప్పున క్షీణిస్తోంది. ఫలితంగా 2030-50 మధ్యకాలంలో హిమానీనదాలు అదృశ్యమై తూర్పు, ఉత్తర భారతదేశంలో తీవ్ర నీటికొరత ఏర్పడుతుంది.


జీవవైవిధ్య నష్టం: భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు ప్రతి 2 - 3 డిగ్రీలు పెరిగే కొద్దీ   20 - 30 శాతం జీవవైవిధ్యం నష్టపోతున్నట్లు ఐపీసీసీ గుర్తించింది. అత్యధిక జీవజాతులు, అధిక స్థానీయ జీవవైవిధ్యం దీవులు తీర ప్రాంతాల్లోనే కనిపిస్తాయి.  శీతోష్ణస్థితి మార్పు ప్రభావంతో సముద్ర మట్టం పెరిగితే తొలుత ఇలాంటి ప్రాంతాలే మునిగిపోతాయి. అక్కడున్న స్థానీయవైవిధ్యం అదృశ్యమవుతుంది.


వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం: ఏటా వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్నాయి. 2017ను అత్యధిక వేడి సంవత్సరంగా గుర్తించారు. ఉష్ణమండల ప్రాంతాల్లో వడదెబ్బతో చనిపోయేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఆశ్చర్యకరంగా ఉత్తరార్ధ గోళంలోనూ వేసవి తాపం పెరుగుతోంది. కెనడాలోని లిట్టన్‌ ప్రాంతంలో 2021లో 49.5 0C ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. భారత్‌లో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత ఏటా పెరుగుతోంది.


ఈ ధోరణులను పరిశీలిస్తే మానవుడు తన జీవనశైలిని పర్యావరణ సామర్థ్యానికి అనుకూలంగా మార్చుకోవాలి. పర్యావరణానికి, మానవుడికి మధ్య సంబంధాలు సకారాత్మకంగా ఉండాలి లేకపోతే     పర్యావరణ  ఆధిపత్యం శీతోష్ణస్థితిలో మార్పుల రూపంలో మానవుడిపై  అధికమై జీవజాతి మనుగడే ప్రమాదంలో పడుతుంది.


రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌ 

Posted Date : 25-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌