మాదిరి ప్రశ్నలు
1. పుణ్యాత్ముడిని చంద్రుడితో పోల్చి చెప్పిన శతకకవి ఎవరు?
జ: మారద వెంకయ్య
2. కొడుకు లేకున్నా మోక్షం వస్తుందనడానికి ధూర్జటి ఎవరిని ఉదహరించాడు?
జ: శుకమహర్షి
3. 'మతిహీనుడు' పాఠంలోని పాత్ర
జ: గర్గుడు
4. గోపబాలురితో కూడి చల్ది ఆరగించింది -
జ: శ్రీకృష్ణుడు
5. ముగ్ధభక్తితో పరమేశ్వరుడిని సేవించింది
జ: బెజ్జమహాదేవి
6. ద్రౌపది తన అభిజాత్యాన్ని ఎవరికి తెలిపింది?
జ: కృష్ణుడికి
7. దృష్టద్యుమ్నుడు ఎవరు?
జ: ద్రౌపది సోదరుడు
8. పువ్వును ప్రతీకగా తీసుకుని దేశభక్తిని బోధించిన కవి ఎవరు?
జ: వేదుల సత్యనారాయణశాస్త్రి
9. పట్నమేలే రాజు దుర్మార్గం నుంచి తప్పించుకున్నది ఎవరు?
జ: కన్యక
10. మనిషి వ్యక్తిత్వానికి మెరుగుపెట్టే బోధనలు చేసిన పాఠ్యభాగం
జ: ప్రపంచ పదులు, దమ్మ పదం, సుభాషితాలు
11. 'దళిత బంధువు' అంబేద్కర్ను కీర్తించిన కవి
జ: బోయ జంగయ్య
12. 'కవల పిల్లలు' అనే పాఠంలోని పాత్రలు?
జ: రాజు, రాణి, ముసలి అవ్వ
13. సుశీల, మాధురి, జాలమ్మ పాత్రలున్న పాఠమేది?
జ: మూడుతరాలు
14. 'సురవరం ప్రతాపరెడ్డి' పాఠంలో ఎవరి గురించి ప్రస్తావించారు?
జ: దేవులపల్లి రామానుజరావు, గడియారం రామకృష్ణశర్మ, ముట్నూరి కృష్ణారావు
15. 'అడవి జంతువుల ఆవేదన' పాఠంలోని ముఖ్యాంశం
జ: పర్యావరణ పరిరక్షణ
16. హరిశ్చంద్ర, బిల్వమంగళ, కుచేల లాంటి పాత్రలు ధరించింది?
జ: వై.భద్రాచార్యులు
17. అగస్త్యుని ప్రస్తావన ఉన్న పాఠ్యభాగమేది?
జ: కాశీపట్టణ విశిష్టత
18. పారిజాతాపహరణంలో ప్రస్తావించిన పాత్ర?
జ: శచీదేవి
19. బ్రహ్మ, లక్ష్మీదేవి, గంగలను ప్రస్తావించిన శతకం -
జ: ఆంధ్రనాయక శతకం
20. పురాణపండ మల్లయ్యశాస్త్రి అవధానంలో నిర్వహించింది
జ: నిషిద్ధాక్షరి
21. కొమర్రాజు లక్ష్మణరావుపై పాఠం రాసింది?
జ: విద్వాన్ విశ్వం
22. ఒక చెట్టు స్వగతం ద్వారా మనిషి బుద్ధిని విమర్శించిన పాఠ్యభాగ రచయిత?
జ: గోపీచంద్
23. 'ప్రవరుని స్వగతం'లో ఎవరి ప్రస్తావన ఉంటుంది?
జ: బ్రహ్మ, తండ్రి, భార్య
24. ఓరుగల్లు పాఠంలో ప్రస్తావించిన విద్యానాథుడు ఎవరు?
జ: ఒక కవి
25. చీకట్లు అందమైనవీ, మరులు గొలిపేవి అంటూ తెలిపిన పాఠం
జ: తామసి
26. 'వంకాయలమ్మే మనిషి' ఎందులో ఉంటుంది?
జ: బొండుమల్లెలు
27. 'అంపకాలు'లో పాత్రలు
జ:బాబాయి, చిట్టాం, తల్లి
28. సంగం లక్ష్మీబాయి అసలు పేరు ఏమిటి?
జ: సత్యవతి
29. తాపీ ధర్మారావు ఏ కవి ప్రయోగాన్ని విమర్శించారు?
జ: తిక్కన, పింగళి సూరన, రామరాజభూషణుడు
30. భగవాన్ బుద్ధ, భక్త కబీరు ఎవరికి ఆరాధ్య దేవతలు?
జ: అంబేద్కర్కి