* సమయం కావాలని నివేదించిన న్యాయవాది
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బీ కేటగిరీ (సెల్ఫ్ఫైనాన్స్ సీట్లు 35 శాతం), సీ కేటగిరీ (ఎన్ఆర్ఐ సీట్లు 15 శాతం) కింద 50 శాతం సీట్లను భర్తీ చేసుకునేందుకు వీలుగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన 107, 108 జీఓలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం (జులై 2) విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, కొంత సమయం కావాలని నివేదించారు. అందుకు అంగీకరించిన హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.