* రెండు రోజుల్లో తేదీలపై స్పష్టత
ఈనాడు, హైదరాబాద్: ఎంబీబీఎస్ కౌన్సెలింగ్పై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. రీ ఎగ్జామినేషన్ ఫలితాల వెల్లడి, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి కొత్త ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నీట్-యూజీ కౌన్సెలింగ్ తేదీలు వెలువడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ఎన్ఎంసీ ఒకటి, రెండు రోజుల్లో కౌన్సెలింగ్ తేదీలపై స్పష్టత ఇస్తుందని పేర్కొంటున్నాయి. కొందరికి నీట్-యూజీ పరీక్ష మళ్లీ నిర్వహించడం, ఫలితాలు వెల్లడించడంతోపాటు అందరికీ కొత్త ర్యాంకులను ఇచ్చిన అంశాన్ని ఎన్టీఏ సుప్రీంకోర్టుకు విన్నవించనుంది. సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఉండనుంది. ఆలిండియా కోటా సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో నీట్-యూజీ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు అయితే తప్ప రాష్ట్రాల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కుదరదు. కాళోజీ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర విద్యార్థుల ర్యాంకుల వివరాలు అందాల్సి ఉంది. అవి అందడానికి పది రోజుల సమయం పడుతుందని.. ఆ తర్వాతే కౌన్సెలింగ్ తేదీలు ఖరారవుతాయని కాళోజీ వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ పవర్ గ్రిడ్లో 435 ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగాలు
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు
‣ క్లౌడ్ కంప్యూటింగ్తో అపార అవకాశాలు
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.