ఈనాడు, అమరావతి: ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్ ప్రవేశాల కౌన్సెలింగ్కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్కు మంగళవారం నుంచి జులై 10 వరకు అవకాశం కల్పించింది. ప్రత్యేక కేటగిరీ వారి ధ్రువపత్రాల పరిశీలనకు 4 నుంచి 6 వరకు సమయం ఇచ్చారు. ధ్రువపత్రాల పరిశీలనకు 5 నుంచి సహాయ కేంద్రాలను ప్రారంభించనున్నారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు జులై 11 నుంచి 15 వరకు అవకాశం కల్పించారు. 19 న సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 20-22 లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఎన్సీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులు ధ్రువపత్రాల పరిశీలనకు ఎస్ఆర్ఆర్ కళాశాల- విజయవాడ, డాక్టర్ వీఎస్ కృష్ణ కళాశాల-విశాఖపట్నం, ఎస్వీ విశ్వవిద్యాలయం-తిరుపతిలో సహాయ కేంద్రాలకు హాజరుకావాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి తెలిపింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ పవర్ గ్రిడ్లో 435 ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగాలు
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు
‣ క్లౌడ్ కంప్యూటింగ్తో అపార అవకాశాలు
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.