• facebook
  • whatsapp
  • telegram

TSPSC PET Recruitment: గురుకుల పీఈటీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన 4 నుంచి

* మొత్తం 1074 అభ్యర్థుల ఎంపిక

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణలో గురుకుల పోస్టుల వ్యాయామ ఉపాధ్యాయులు నియామకాల(నోటిఫికేషన్‌ నంబర్‌ 16/2017)కు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 1:4 నిష్పత్తి ప్రకారం మొత్తం 1074 అభ్యర్థుల ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు 04/07/2024 నుంచి 11/07/2024 వరకు హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జులై 4 నుంచి జులై 12 వరకు వెబ్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీల్లో పీఈటీ ఖాళీలకు గాను 2017 సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది.




  ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన రెండో జాబితా అభ్యర్థులు  

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.