మాదిరి ప్రశ్నలు
1. విప్లవ కవుల్లో మొదట పేర్కొనదగిన కవి -
సమాధానం: శ్రీశ్రీ
2. శివసాగర్ రచన -
1) ఉద్యమం నెలబాలుడు 2) అగ్నిశ్వాస 3) పునాదిరాయి 4) చండాల చాటింపు
సమాధానం: 1 (ఉద్యమం నెలబాలుడు)
3. విరసం కవితా సంపుటి -
1) విప్లవం 2) ఝంఝ 3) రెంజిం 4) దివిటి
సమాధానం: 2 (ఝంఝ)
4. శ్రీశ్రీ షష్ఠిపూర్తి సభలో రచయితలకు సవాల్ కరపత్రం పంచినవారు-
సమాధానం: విశాఖ విద్యార్థులు
5. 'ఎరుపంటే కొందరికి భయం. పసిపిల్లలు వారి కంటే నయం' అన్న విప్లవ కవి -
సమాధానం: సుబ్బారావు పాణిగ్రాహి
6. ఆరుమంది కవులు ప్రారంభించిన కవితా ధోరణి -
సమాధానం: దిగంబర కవిత
7. 'నా చెల్లీ చంద్రమ్మ' పాట రచయిత -
సమాధానం: శివసాగర్
8. పాటకు ప్రాచుర్యాన్ని కలిగించిన కవితా ఉద్యమం-
సమాధానం: విప్లవ కవితా ఉద్యమం
9. విరసం తొలి అధ్యక్షుడు -
సమాధానం: శ్రీశ్రీ
10. 'మరో ప్రస్థానం' ఎవరి రచన?
సమాధానం: శ్రీశ్రీ
11. పంచతంత్ర కథలను ఆంగ్లంలోకి అనువదించినవారు -
సమాధానం: బెన్ఫె
12. జానపదుల ప్రస్తావన కనిపించే గ్రంథం-
సమాధానం: భారతం
13. 'గుమ్మడుపాట' ఏ కోవకు చెందిన గేయం?
సమాధానం: భాగవత గేయం
14. తాండ్ర పాపారాయుడు, విజయరామరాజ గజపతి, బుస్సీ లాంటి పాత్రలుండే చారిత్రక గేయం -
సమాధానం: బొబ్బిలి యుద్ధం
15. 'సర్వాయి పాపడు కథ' - ఎలాంటి రచన?
సమాధానం: అద్భుతరస గేయం
16. 'రోకటి పాటలు' ఏ పద్యాల్లో ఉంటాయని విన్నకోట పెద్దన చెప్పాడు?
సమాధానం: తరువోజ
17. శారదకాండ్రు ఏ ప్రాంతంలో వ్యాపించి ఉన్నారు?
సమాధానం: తెలంగాణ
18. తెలుగు జానపద సాహిత్యాన్ని మానవ శాస్త్ర దృష్టితో పరిశీలించిన తొలి మహిళా పరిశోధకురాలు -
సమాధానం: నాయని కృష్ణకుమారి
19. జానపద గేయాల్లో 'రామాయణపు పాటలు' ఏ శాఖకు చెందినవి?
సమాధానం: పౌరాణిక గేయాలు
20. 'బిరుదురాజు రామరాజు' ఎందుకు ప్రసిద్ధులు?
సమాధానం: జానపద సాహిత్యంపై మొదట పరిశోధన చేసినందుకు
21. కన్నడ సాహిత్యంలోని 'దాసపదావళి' లాంటివి తెలుగులో - వేటికి సామీప్యంగా ఉంటాయి?
సమాధానం: పదకవితలు
22. కిందివారిలో విప్లవ కవులు -
ఎ. శ్రీశ్రీ బి. సముద్రాల సి. వరవరరావు డి. ఆత్రేయ
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) ఎ, డి
సమాధానం: 3 (ఎ, సి)
23. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం కోరే సంస్థ-
సమాధానం: విరసం
24. 'సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మో - సినబోయి కూర్చున్నావెందుకమ్మా' పాట రచయిత -
సమాధానం: గద్దర్
25. ఊగరా ఊగరా ఊరికొయ్య నందుకుని ఊగరా...అన్న కవి -
సమాధానం: శ్రీశ్రీ
26. విప్లవ పోరాటంలో పాల్గొని ఉరిశిక్షకు గురైన భూమయ్య, క్రిష్ణాగౌడ్లపై శ్రీశ్రీ రచించిన స్మృతి గీతం
సమాధానం: భూమ్యాకాశాలు
27. 'లక్ష నక్షత్రాలు రాలందే ఉద్యమ ఉదయం ఉదయించదు' అన్న కవి-
సమాధానం: జ్వాలాముఖి
28. 'మా గుండె మా జెండా - మా మనసే మాకండ' - అన్న కవి ఎవరు?
సమాధానం: కె.వి.రమణారెడ్డి
29. 'తుది పయనం - తొలి విజయం' ఎవరి విప్లవ గీతం?
సమాధానం: శ్రీశ్రీ
30. 'విషం కలిసిన పాయసం మన స్వరాజ్యం - డబ్బున్న భడవా పోషించే ఉంపుడుగత్తె మన ప్రజాస్వామ్యం' అన్న కవులు
సమాధానం: తిరగబడు కవులు
31. 'ఎడంచేత పట్టవోయ్ ఎర్రజెండా పిడికిలి బిగించవోయ్ మరొక చేత' - అన్న ప్రజాకవి
సమాధానం: సుబ్బారావు పాణిగ్రాహి
32. తమ కవితలను 'దిక్'గా వ్యవహరించిన కవులెవరు?
సమాధానం: దిగంబర కవులు
33. కిందివారిలో దిగంబర కవులు ఎవరు?
1) నగ్నముని, చెరబండరాజు 2) జ్వాలాముఖి, భగత్సింగ్
3) కవిరాజు, బోయి భీమన్న 4) నిఖిలేశ్వర్, బి.రామకృష్ణ
సమాధానం: 1 (నగ్నముని, చెరబండరాజు)
34. జ్వాలాముఖి ఏ కవితా శాఖకు చెందిన కవి?
సమాధానం: దిగంబర
35. కిందివారిలో దిగంబర కవి ఎవరు?
1) కె.వి.రమణారెడ్డి 2) కుందుర్తి ఆంజనేయులు 3) వరవరరావు 4) నగ్నముని
సమాధానం: 4 (నగ్నముని)
36. 'ఈ దేశం క్యాలెండర్లపై తారీఖులం' - అని ప్రకటించింది.
సమాధానం: దిగంబర కవులు
37. ఆంగ్ల సాహిత్యంలో 'బీట్నిక్స్ కవులు' తెలుగు సాహిత్యంలో వేటికి సారూప్యం?
సమాధానం: దిగంబర కవులు
38. తుర్లపాటి రాజేశ్వరి ప్రసిద్ధ కవిత -
సమాధానం: తాళికట్టిన మృగం
39. 'స్త్రీకి శరీరముంది - దానికి వ్యాయామాన్ని ఇవ్వాలి. ఆమెకు మెదడుంది - దానికి అనుభవం ఇవ్వాలి' అన్నదెవరు?
సమాధానం: చలం
40. తన రచనలతో స్త్రీ స్వాతంత్య్రానికి పునాదులు వేసిన కథానవలా రచయిత -
సమాధానం: చలం
41. స్త్రీవాద కవితా సంకలనం -
1) వైతాళికులు 2) కావ్యమాల 3) నీలిమేఘాలు 4) కళ్యాణ కల్పవల్లి
సమాధానం: 3 (నీలిమేఘాలు)
42. తన కవితలో 'పైటను తగలెయ్యాలి' అన్న కవయిత్రి -
సమాధానం: జయప్రభ
43. మైనారిటీల అణిచివేతను 'పుట్టుమచ్చ' కవిత ద్వారా వివరించినవారు -
సమాధానం: ఖాదర్ మొహియుద్దీన్
44. 'బందిపోట్లు' అనే స్త్రీవాద కవిత రాసిందెవరు?
సమాధానం: కొండేపూడి నిర్మల
45. 'వామనుడి మూడోపాదం' స్త్రీవాద కవితా సంపుటి వెలువరించిన కవయిత్రి -
సమాధానం: జయప్రభ
46. 'ఆ తతసకల పురాతన భక్తిగీతార్థ సమితియే మాతృకకాగ' పాల్కురికి సోమనాథుడు చేసిన రచన -
సమాధానం: బసవ పురాణం
47. అప్పగింతల పాటలు, అలుక పాటలు - ఏ జానపద శాఖకు చెందిన గేయాలు?
సమాధానం: స్త్రీల పాటలు
48. 'జానపద కథా స్రవంతి' సంకలన కర్త -
సమాధానం: కె.సుమతి
49. దేశింగురాజు కథలోని కథాస్థలం -
సమాధానం: తమిళనాడు
50. గంగమ్మ జాతర సాధారణంగా ఏ వారం మొదలు పెడతారు?
సమాధానం: మంగళవారం
51. తెలుగు జానపద గాథల మీద పరిశోధన చేసినవారు -
సమాధానం: నాయని కృష్ణకుమారి
52. ఖడ్గాలు చదివే సందర్భం ఏది?
సమాధానం: జాతరలలో వీరభద్ర పళ్లెం తీసుకెళ్లే సమయం
53. చల్ మోహన రంగ పాట -
సమాధానం: శృంగార గేయం
54. ఆంధ్రుల జానపద సాహిత్య సేకరణలో తన జీవిత సర్వస్వాన్నీ వెచ్చించింది ఎవరు?
సమాధానం: నేదునూరి గంగాధరం
55. 'సర్వాయి పాపన్న' కథను మొదట సేకరించినవారు
సమాధానం: జె.ఎ.బోయెల్
56. 'పండుపాట' ఏ కథకు సంబంధించింది?
సమాధానం: భారత కథ
57. శ్రీశ్రీ సొంత గొంతుకను లోకానికి చాటిన ప్రథమ గేయం ఏది?
సమాధానం: నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
58. 'తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది - డ్రైనేజీ స్కీములే డేంజరుగా మారుతోంది' - అన్న కవి
సమాధానం: గజ్జెల మల్లారెడ్డి
59. 'అగ్ని జల్లినా అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి' - అనే గేయం ఎందులోనిది?
సమాధానం: అమృతం కురిసిన రాత్రి
60. అమృతం కురిసిన రాత్రి రచయిత -
సమాధానం: తిలక్
61. 'నువ్వు చెప్పేదేదైనా నీ అనుభవం నుంచి పలకాలి' అని చెప్పే ప్రాథమిక సూత్రం ఉన్న కవితా ధోరణి
సమాధానం: అనుభూతివాద కవిత్వం
62. 'కవిత్వం ఒక ఆల్కేమి. దాని రహస్యం కవికి తెలుసు. కాళిదాసుకు తెలుసు. పెద్దనకు తెలుసు. కృష్ణశాస్త్రికి తెలుసు' - అన్న కవి
సమాధానం: తిలక్
63. 'కాకికేమి తెలుసు సైకో ఎనాలసిస్'
5 - 3 - 2 ఆముక్త మాల్యద
ఆటవెలది ద్విపదకత్తగారు - ఇందులోని కవితా ధోరణి
సమాధానం: సర్రియలిజమ్
64. 'విశ్వంభర' ఏ కోవకు చెందిన కావ్యం?
సమాధానం: ప్రతీకాత్మక కావ్యం
65. 'మంటల్లోనే పుట్టాడు. మంటల్లోనే పెరిగాడు. మంటల్లోనే మడిశాడు' అంటూ భగత్సింగ్పై స్మృతిగీతాన్ని రాసిన కవి-
సమాధానం: శ్రీరంగ నారాయణ బాబు
66. దిగంబర కవులు తమ కవితా సంపుటిని రిక్షా కార్మికుడు నాంపల్లి పాండుతో ఆవిష్కరించిన ప్రదేశం
సమాధానం: హైదరాబాదు
67. 'నేను కోరేది మీ దయాధర్మ బిక్షకాదు. నాకు రావాల్సిన బాకీ' అన్నదెవరు?
సమాధానం: కొలకలూరి ఇనాక్
68. సతీష్ చందర్ రచన -
1) గబ్బిలం 2) పంచమ వేదం 3) పుట్టుమచ్చ 4) రచ్చపుండు
సమాధానం: 2 (పంచమ వేదం)
69. 'ఉప్పెన' ఎలాంటి సంకలనం?
సమాధానం: దళిత గీతాల సంకలనం
70. తొలి తెలుగు దళితకవిగా భావించే మహాకవి -
సమాధానం: జాషువా
71. బోయి భీమన్న రచన -
1) ఆకలి రాజ్యం 2) ఎముక ముక్క చేదుపాట 3) గుడిసెలు కాలిపోతున్నై 4) పాకీపిల్ల
సమాధానం: 3 (గుడిసెలు కాలిపోతున్నై)
72. అస్పృశ్యతా నిర్మూలనను కాంక్షించిన గ్రంథం-
సమాధానం: నిరుద్ధ భారతం
73. 'మునివాహనుడు' నాటక రచయిత -
సమాధానం: కొలకలూరి ఇనాక్
74. 'గబ్బిలం'లోని ప్రధానాంశం -
సమాధానం: అశ్రు సందేశం
75. అఖిలభారత దళిత రచయితల మహాసభలు ఎక్కడ జరిగాయి?
సమాధానం: బొంబాయి
76. చిక్కనవుతున్న పాట -
1) స్త్రీవాద కవిత్వ సంకలనం 2) దళిత కవితా సంకలనం
3) అనుభూతివాద కవితా సంకలనం 4) మానవతావాద సంకలనం
సమాధానం: 2 (దళిత కవితా సంకలనం)
77. 'కొత్త గబ్బిలం' ఏ ప్రక్రియకు చెందింది?
సమాధానం: కవిత
78. 'మనుషులు మనుషులుగా పుట్టక మనువులై పుడితేనే ప్రమాదం' - అన్న కవితా విభాగం ఏ వాదానికి సంబంధించింది?
సమాధానం: దళితవాద కవిత్వం
79. తెలుగులో 'వచన కవితకు ఆద్యుడు' -
సమాధానం: శిష్ట్లా ఉమామహేశ్వరరావు
80. 'తాజ్మహల్ పడగొట్టండోయ్' అని అభ్యుదయ ధోరణిలో రాసిన కవి-
సమాధానం: ఆలూరి బైరాగి
81. 'నా గొడవ' రాసిన కవి-
సమాధానం: కాళోజీ నారాయణరావు
82. ''కప్పతల్లి పెళ్లి" అనే భావగీతాన్ని 'సౌదామిని' అనే కలం పేరుతో రాసిన కవయిత్రి ఎవరు?
సమాధానం: బసవరాజు రాజ్యలక్ష్మమ్మ
83. 'బంగారు మామ' పాట రచయిత-
సమాధానం: కొనకళ్ల వెంకటరత్నం
84. 'పిలుపు' పాఠం ఏ కవితా శాఖకు చెందుతుంది?
సమాధానం: అభ్యుదయ కవిత్వం
85. ఆత్మగౌరవాన్ని ప్రబోధించిన గురజాడ గేయం-
సమాధానం: పూర్ణమ్మ
86. నది నిండా నీరున్నది
నావపై పిల్లున్నది
పిల్లాకు వొళ్లున్నది..... అనే భావగీతాన్ని రాసిన భావకవి ఎవరు?
సమాధానం: కవి కొండల వెంకటరావు
87. 'ఆడెనమ్మా శివుడు, పాడెనమ్మా భవుడు' అంటూ రసికుల హృదయాలను ఉర్రూతలూగించిన కవి -
సమాధానం: పుట్టపర్తి నారాయణాచార్యులు
88. 'కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు' అన్న కవి?
సమాధానం: జాషువా
89. 'బసవరాజు రాజ్యలక్ష్మమ్మ' కలం పేరు -
సమాధానం: సౌదామిని
90. రాయప్రోలు సుబ్బారావు రచించిన 'అనుమతి' కావ్యానికి ఆంగ్ల మాతృక
సమాధానం: డోరా
91. 'కొల్లాయి గట్టితేనేమి... మా గాంధీ కోమటై పుట్టితేనేమి' అనే బసవరాజు అప్పారావు కవితా పంక్తులు ఏ కవితా శాఖకు చెందినవి?
సమాధానం: భావ కవిత్వం
92. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఊహాప్రేయసి -
సమాధానం: ఊర్వశి
93. 'ధారుణీపతి పాలన దండమెపుడు నీహలంబృకన్నను పార్థనీయమగునె' అని కర్షకుడిని కీర్తించిన కవి ఎవరు?
సమాధానం: దువ్వూరి రామిరెడ్డి
94. ''మ్రోయింపకోయ్ మురళి మ్రోయింపకోయ్, తీయ తేనియ బ్రతుకు మోయలేదీ బ్రతుకు... " అన్న కవి
సమాధానం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
95. 'పెనుగొండ లక్ష్మి' కావ్యంలో ప్రస్తుతించిన ప్రబంధ కవి -
సమాధానం: భట్టుమూర్తి
96. 'కిన్నెరసాని' అంటే -
సమాధానం: వంకవాగు
97. చూపుతో మాటాడి ఊపిరితో తెనిగించిన కవి-
సమాధానం: నండూరి సుబ్బారావు
98. ''శిథిలాలయమ్ములో శివుడు లేడోయ్ - ప్రాంగణమ్మున గంట పలుకలేదోయ్"... అన్న కవి
సమాధానం: కృష్ణశాస్త్రి
99. ''అయ్యో పాలింకి పోవడానికున్నట్లు - మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బావుండు" అన్న కవితా పంక్తుల కవయిత్రి
సమాధానం: పాటిబండ్ల రజని
100. "పెళ్లంటే పెద్ద శిక్షనీ
మొగుడంటే స్వేచ్ఛాభక్షకుడనీ"... కవిత రాసిన కవయిత్రి
సమాధానం: సావిత్రి