1. 'విద్యా కార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం మూల్యాంకనం' అన్నది ఎవరు?
జ: నార్మిన్ గ్రీన్లాండ్
2. మూల్యాంకనం లక్షణం ఏది?
1) నిరంతరం 2) శాస్త్రీయం 3) లక్ష్యాలను మాపనం చేయడం 4) పైవన్నీ
జ: పైవన్నీ
3. భావావేశ రంగాన్ని మాపనం చేయడానికి తోడ్పడే పద్ధతి ఏది?
జ: ఇంటర్వ్యూ
4. సాంఘిక ప్రవర్తనలతో ముడిపడిన లక్ష్యం ఏది?
జ: వైఖరి
5. అనేక వ్యత్యాసాలున్న విద్యార్థుల అభ్యసన ప్రగతిని అంచనా వేయడానికి తోడ్పడే పరీక్షలు ఏవి?
జ: సామర్థ్య పరీక్షలు
6. తరగతిలో నిరంతర మూల్యాంకనానికి దోహదపడే పరీక్షలు ఏవి?
జ: మౌఖిక పరీక్షలు
7. ఒక విద్యార్థి సాధించిన ప్రగతిని తోటి విద్యార్థులు మదింపు చేయడాన్ని ఏమంటారు?
జ: సమవయస్కుల మదింపు
8. విద్యార్థులకు వారి సామర్థ్యాల సాధనా స్థితిగతులను వివరణాత్మకంగా చెప్పి, వారికి సరైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి తోడ్పడే పద్ధతి ఏది?
జ: రూపన పద్ధతి
9. విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి, వాటిని ప్రదర్శించి, వాటి పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిచే పద్ధతిని ఏమంటారు?
జ: పోర్ట్ఫోలియో
10. రాతపూర్వకంగా కాకుండా 'అడిగే' రూపంలో ప్రశ్నించే విధానాన్ని ఏ రకం పరీక్షగా చెప్పవచ్చు?
జ: మౌఖిక పరీక్ష
11. గుణాత్మక విద్యను సాధించిందీ, లేనిదీ తెలుసుకోవడానికి ఏ మూల్యాంకనం అవసరం?
జ: సమగ్ర నిరంతర మూల్యాంకనం
12. భావావేశ రంగానికి చెందిన ఏ లక్ష్యాన్ని కచ్చితంగా అంచనా వేయలేం?
1) ఆసక్తులు 2) వైఖరులు 3) ప్రశంసలు 4) పైవన్నీ
జ: పైవన్నీ
13. విద్యార్థి సాధించిన ఫలితాలకు విలువ కట్టడమే...?
జ: మూల్యాంకనం
14. మూడో తరగతి విద్యార్థి 'పరిసరాలు' అనే పాఠ్యాంశాన్ని గురించి అధ్యయనం చేసిన తర్వాత నీటిని పొదుపు చేయడం తన బాధ్యత అని గుర్తించాడు. దీని వల్ల విద్యార్థిలో సాధించిన లక్ష్యం ఏది?
జ: వైఖరి
15. 'భారతదేశ ప్రామాణిక కాలాన్ని నిర్ణయించే రేఖాంశం ఏది?' అనే ప్రశ్న విద్యార్థిలో ఏ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించింది?
జ: జ్ఞాన లక్ష్యం