1. గ్రామీణ ప్రజల ప్రధాన వృత్తి -
జ: వ్యవసాయం
2. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘసంస్కర్త -
జ: రాజారామ్మోహన్రాయ్
3. మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్న సమాజం ఏది?
జ: గిరిజన
4. కిందివాటిలో ఏది సాంఘిక దురాచారం కాదు?
ఎ) వరకట్నం బి) అస్పృశ్యత సి) వివాహం డి) వెట్టి చాకిరి
జ: సి (వివాహం)
5. వరకట్న నిషేధ చట్టం చేసిన సంవత్సరం-
జ: 1961
6. 'చతుర్వర్ణ వ్యవస్థ'లో భూమిని సాగుచేసి వర్తక వ్యాపారాలు చేసేవారు-
జ: వైశ్యులు
7. గృహహింస నిరోధ చట్టం చేసిన సంవత్సరం -
జ: 2005
8. ప్రజల సముదాయాలతో కూడిన సమాహారాన్ని ఏమంటారు?
జ: సమాజం
9. అంటరానికులాల వారిని 'హరిజనులు' అని పిలిచింది ఎవరు?
జ: గాంధీజీ
10. అస్పృశ్యతను ఒక శాపంగా విమర్శించిన వారు
జ: గాంధీజీ
11. 'అస్పృశ్యత హిందూ మతంలోని జీవశక్తిని తినే ఒక విషక్రిమి' అని వర్ణించిన వారు -
జ: గాంధీజీ
12. అక్షరాస్యత తక్కువగా ఉండే సమాజం -
జ: గిరిజన
13. ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండే సమాజం -
జ: పట్టణ
14. వేట ప్రధాన వృత్తిగా ఉన్న సమాజం -
జ: గిరిజన
15. ఎంత శాతం జనాభా పట్టణాల్లో ఉన్నారు?
జ: 20%