1. భారతదేశ అధికార భాష ఏది?
జవాబు: హిందీ
2. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని?
జవాబు: 22
3. ప్రపంచంలోని ముఖ్య భాషల్లో తెలుగు భాష ఎన్నో స్థానంలో ఉంది?
జవాబు: 16వ
4. జనాభాలో ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న దేశం ఏది?
జవాబు: భారతదేశం
5. జనాభాలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది?
జవాబు: చైనా
6. మనదేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని?
జవాబు: 28, 7
7. భారత రాజ్యాంగం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది?
జవాబు: 1950 జనవరి 26
8. భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం ఎవరిది?
జవాబు: ప్రజలది
9. మత వ్యవహారాల నుంచి రాజ్యాన్ని వేరుచేయడాన్ని ఏమని అంటారు?
జవాబు: లౌకికవాదం
10. బంగ్లాదేశ్కు రెట్టింపు వైశాల్యం ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు: ఆంధ్రప్రదేశ్
11. భారతదేశంలో ఎన్ని సంవత్సరాల పైబడిన వారికి ఓటుహక్కు కల్పించారు?
జవాబు: 18
12. లౌకికతత్వ రాజ్యమంటే ఏమిటి?
జవాబు: రాజ్యానికి మత ప్రమేయం లేకపోవడం
13. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజనలో ప్రధానమైన లక్షణం ఏది?
జవాబు: సమాఖ్య ప్రభుత్వం
14. రాజ్యాంగం ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు?
జవాబు: బి.ఆర్. అంబేడ్కర్
15. చట్టం ముందు ప్రతి వ్యక్తిని సమానంగా చూసే పరిపాలనను ఏమంటారు?
జవాబు: సమన్యాయపాలన
16. ఏది లేకపోతే స్వేచ్ఛకు అర్థం ఉండదు?
జవాబు: సమానత్వం
17. I.A.S. ను విస్తరించండి.
జవాబు: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
18. I.P.S. ను విస్తరించండి.
జవాబు: ఇండియన్ పోలీస్ సర్వీస్
19. భారతదేశంలో జాతీయ సమైక్యతా ప్రక్రియను ప్రతిబింబించే నినాదం ఏది?
జవాబు: భిన్నత్వంలో ఏకత్వం
20. మన రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులను రక్షించేహక్కు ఏది?
జవాబు: రాజ్యాంగ పరిహార హక్కు
21. ప్రాచీన భారతదేశంలో ప్రజలంతా సమానులనే భావనను ప్రబోధించిన మతం ఏది?
జవాబు: బౌద్ధమతం
22. మన దేశంలో 22 భాషలను ఎలాంటి బద్ధమైన భాషలుగా గుర్తించారు?
జవాబు: శాసన
23. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన సంవత్సరం ఏది?
జవాబు: 1949
24. భారత దేశ విశిష్ట లక్షణం ఏది?
జవాబు: భిన్నత్వంలో ఏకత్వం
25. భారత రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు ఎవరు?
జవాబు: బాబూ రాజేంద్రప్రసాద్
26. భాషా ప్రాతిపదికపై ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏది?
జవాబు: ఆంధ్రరాష్ట్రం
27. తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య సుమారుగా ఎంత?
జవాబు: 8 కోట్లు
28. సౌభ్రాతృత్వం అంటే ఏమిటి?
జవాబు: సోదరభావం
29. మనదేశాన్ని ముస్లిం విజేతలు ఏమని పిలిచేవారు?
జవాబు: హిందూస్థాన్
30. 1996 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా సుమారు గా ఎంత?
జవాబు: 96 కోట్లు
31. మన దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఏది?
జవాబు: రాజస్థాన్
32. భారతదేశంలో ఇటలీ కంటే ఎక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు: రాజస్థాన్
33. సామాజిక న్యాయ భావన ద్వారా వేటిని తగ్గించవచ్చు లేదా నిర్మూలించవచ్చు?
జవాబు: పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని
34. స్వాతంత్య్రం తర్వాత, భారత ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పెంపొందించడానికి ఏ వ్యవస్థను రద్దు చేసింది?
జవాబు: జమిందారీ వ్యవస్థ
35. ప్రజలంతా ఎలా ఉంటే ఆ జాతి లేదా దేశం మనగలుగుతుంది?
జవాబు: ఏకతాభావన
36. ఎలాంటి భావనను కల్గించడమే జాతీయ సమైక్యత పరమార్థం?
జవాబు: ఈ దేశం నాది
37. ప్రాచీన కాలంలో మన దేశాన్ని ఏమని వ్యవహరించేవారు?
జవాబు: భరతవర్షం
38. జాతీయ సమైక్యతను పెంపొందించడానికి దృఢమైన ప్రాతిపదికలు ఏవి?
జవాబు: ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం.