* కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య
* మే 4 నుంచి 10 వరకు అవకాశం
అనంత గ్రామీణం, న్యూస్టుడే: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఆర్డీటీ సెట్ నిర్వహిస్తామని ఆ సంస్థ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జి.మోహన్ మురళి తెలిపారు. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను రాష్ట్రంలోని వివిధ కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో చేర్పించి ఫీజులన్నీ ఆర్డీటీ భరిస్తుందని, మే 4 నుంచి 10లోపు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన వివరించారు. పదో తరగతిలో 500 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆధార్ కార్డు, పదో తరగతి మార్కుల జాబితాతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష మే 19న నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు 08554-271353, 271354 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.