• facebook
  • whatsapp
  • telegram

టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

ఏలాంటి దరఖాస్తు ఫీజు లేదు

‣ దరఖాస్తు గడువు మే 9


బీఈ/బీటెక్‌ విద్యార్హతతో ఆర్మీలో కొలువుదీరే అవకాశం వచ్చింది. ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారు, చివరి ఏడాది చదువుతున్నవారిని టెక్నికల్‌ గ్రాడ్యు  యేట్‌ కోర్సు(టీజీసీ)ల్లోకి ఇండియన్‌ ఆర్మీ ఆహ్వానిస్తోంది. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూతో నియామకాలుంటాయి. ఎంపికైనవారికి శిక్షణ సమయంలో స్టైపెండ్‌ చెల్లిస్తారు. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. 


టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ) ప్రకటనను దాదాపు ఏటా ఆర్మీ విడుదలచేస్తోంది. వీటికి అవివాహిత పురుషులు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తు రుసుం లేదు. వచ్చిన దరఖాస్తులను బీటెక్‌ మార్కుల మెరిట్‌ ప్రకారం వడపోస్తారు. ఇందులో నిలిచినవారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ), బెంగళూరు కార్యాలయంలో ఐదు రోజులపాటు రెండు దశల్లో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీటిని సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూయింగ్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో చేపడతారు. తొలిరోజు స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ (ఇంటలిజెన్స్‌) పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారినే స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. వీరికి నాలుగు రోజులపాటు పలు విభాగాల్లో పరీక్షించి, అందులో రాణించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు తీసుకుంటారు. ఇంటర్వ్యూకు హాజరైనవారికి ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. 


శిక్షణ: కోర్సుకు ఎంపికైనవారికి ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, దేహ్రాదూన్‌లో జనవరి, 2025 నుంచి సుమారు ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెల రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్‌ హోదాతో శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన తర్వాత లెవెల్‌-10 రూ.56,100 మూలవేతనంతోపాటు రూ.15,500 మిలటరీ సర్వీస్‌ పే అందుతాయి. వీటికి డీఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. అందువల్ల తొలి నెల నుంచే సుమారు రూ.లక్షకుపైగా జీతం అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయి హోదాలు సొంతం చేసుకోవచ్చు. రెండేళ్ల సర్వీసుతో కెప్టెన్, ఆరేళ్లు కొనసాగితే మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ కావచ్చు. ఇవి పూర్తికాల పోస్టులు. పదవీ విరమణ వయసు వరకు విధుల్లో కొనసాగవచ్చు. అనంతరం జీవితాంతం పింఛను అందుకోవచ్చు.    

ఖాళీలు: 30 విభాగాలవారీ: సివిల్, అనుంబంధ విభాగాల్లో 7, కంప్యూటర్‌ సైన్స్‌ 7, ఎలక్ట్రికల్‌ అనుబంధ విభాగాల్లో 3, ఎలక్ట్రానిక్స్‌ అనుబంధ విభాగాల్లో 4, మెకానికల్‌ 7, ఇతర విభాగాల్లో 2 ఉన్నాయి. 

అర్హత: నిర్దేశిత/ అనుబంధ బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌ పోస్టులకు ఎమ్మెస్సీ సీఎస్‌/ఐటీ విద్యార్హతలతోనూ పోటీ పడవచ్చు. అన్ని ఖాళీలకూ అవివాహిత పురుషులే అర్హులు.

వయసు: జనవరి 1, 2025 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1998 - జనవరి 1, 2005 మధ్య జన్మించినవారు అర్హులు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 9 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు. 

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

Posted Date : 23-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌