• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏయూలో..డ్యూయల్‌ డిగ్రీ కోర్సులు

ఆంధ్ర విశ్వవిద్యాలయం 2022-23 విద్యాసంవత్సరానికిగానూ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈ యూనివర్సిటీ... ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష (ఏయూఈఈటీ) ద్వారా అర్హులైన అభ్యర్థులకు బీటెక్‌ + ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ (సెల్ఫ్‌ సపోర్టింగ్‌ మోడ్‌)లను అందివ్వనుంది. 

స్పెషలైజేషన్లు: బీటెక్‌ సీఎస్‌ఈ+ ఎంటెక్‌; బీటెక్‌ + ఎంటెక్‌... ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌. 

అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలను ప్రధాన సబ్జెక్టులుగా చదివుండాలి. కనీసం 40-45శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 

కోర్సు ఫీజు వివరాలు: బీటెక్‌ సీఎస్‌ఈ+ఎంటెక్‌- ఏడాదికి రూ.2 లక్షలు, బీటెక్‌+ఎంటెక్‌- రూ.లక్ష నుంచి రూ.లక్షా యాభై వేల వరకూ ఉంటుంది.  

సీట్లు: బీటెక్‌ సీఎస్‌ఈ+ఎంటెక్‌ - 360; బీటెక్‌+ఎంటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌)- 60; బీటెక్‌+ఎంటెక్‌ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌- ఒక్కో విభాగానికి 30 చొప్పున)

ఎంపిక విధానం: ఏయూఈఈటీ ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా... 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో...

పరీక్ష ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు    రూ.1200/-, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకైతే   రూ.1000/-. 

పరీక్షా విధానం: ప్రశ్నపత్రం మూడు భాగాలుగా ఉంటుంది. అన్నింటిలో మల్టిఫుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలడుగుతారు. మొత్తం పేపర్‌ను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. 

మార్కులు: 100; పార్ట్‌-ఎ (మ్యాథమెటిక్స్‌- 40 మార్కులు), (పార్ట్‌-బి: ఫిజిక్స్‌/ పార్ట్‌-సి: కెమిస్ట్రీ 30 మార్కుల చొప్పున).

పరీక్షా కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కడప.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 22, రూ.750/- ఆలస్య రుసుంతో జూన్‌ 26 వరకు.

హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌ తేదీ: జూన్‌ 28

పరీక్ష తేదీ: జూన్‌ 30 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: www.audoa.in
 

Posted Date : 21-06-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌