• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నవంబరు 2 నుంచి గ్రూపు-1 పరీక్షలు

ఈనాడు, అమరావతి: వాయిదాపడిన గ్రూపు-1, గెజిటెడ్‌, నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగ నియామక ప్రధాన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. గ్రూపు-1 ప్రధాన పరీక్షలు నవంబరు 2 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపింది. నవంబరు 2, 3 తేదీల్లో తెలుగు, ఆంగ్ల పేపర్లు, 5న పేపరు-1, 7న పేపరు-2, 9న పేపరు-3, 11న పేపరు-4, 13న పేపరు-5 జరుగుతుందని తెలిపింది. డిగ్రీ కళాశాలల అధ్యాపకుల నియామక పరీక్షలు సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరుగుతాయి. గెజిటెడ్‌ పోస్టులకు సెప్టెంబరు 21 నుంచి 23 మధ్య, నాన్‌ గెజిటెడ్‌ కేటగిరికి 25 నుంచి 27వ తేదీ మధ్య పరీక్షలు జరుపుతామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు

Posted Date : 24-06-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌