ఈనాడు, అమరావతి: వాయిదాపడిన గ్రూపు-1, గెజిటెడ్, నాన్-గెజిటెడ్ ఉద్యోగ నియామక ప్రధాన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గ్రూపు-1 ప్రధాన పరీక్షలు నవంబరు 2 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపింది. నవంబరు 2, 3 తేదీల్లో తెలుగు, ఆంగ్ల పేపర్లు, 5న పేపరు-1, 7న పేపరు-2, 9న పేపరు-3, 11న పేపరు-4, 13న పేపరు-5 జరుగుతుందని తెలిపింది. డిగ్రీ కళాశాలల అధ్యాపకుల నియామక పరీక్షలు సెప్టెంబరు 15, 16 తేదీల్లో జరుగుతాయి. గెజిటెడ్ పోస్టులకు సెప్టెంబరు 21 నుంచి 23 మధ్య, నాన్ గెజిటెడ్ కేటగిరికి 25 నుంచి 27వ తేదీ మధ్య పరీక్షలు జరుపుతామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు
నవంబరు 2 నుంచి గ్రూపు-1 పరీక్షలు
Posted Date : 24-06-2020 .