• facebook
  • twitter
  • whatsapp
  • telegram

50 కోర్సులకు ఒకే పరీక్ష! 

టిస్‌లో ప్రవేశాలకు ప్రకటన విడుదల


సోషల్‌ వర్క్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌... తదితర కోర్సులకు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌) దేశంలోనే అత్యున్నత సంస్థగా గుర్తింపు పొందింది. వైవిధ్య కోర్సులను విస్తృత స్పెషలైజేషన్లతో అందించడం దీని ప్రత్యేకత. మొత్తం 50 పీజీ కోర్సులను ఈ సంస్థ ముంబయి, తుల్జాపూర్, హైదరాబాద్, గువాహటి క్యాంపసుల్లో అందిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూలతో ప్రవేశాలుంటాయి. వచ్చే విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి తాజాగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం!

టిస్‌ ముంబయి క్యాంపస్‌లో 32, హైదరాబాద్‌లో 6, తుల్జాపూర్‌లో 4, గువాహటిలో 8 పీజీ కోర్సులు ఉన్నాయి. ఏ కోర్సుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ స్టేజ్‌-1 పరీక్ష అందరికీ ఉమ్మడిగానే ఉంటుంది. అభ్యర్థులు డిగ్రీ కోర్సుల్లో చదువుకున్న అంశాలతో ఎలాంటి సంబంధమూ లేదు. ప్రశ్నలన్నీ జనరల్‌ విభాగానికి చెందినవే వస్తాయి. వివిధ పీజీ కోర్సులకు సాధారణ డిగ్రీ విద్యార్హతతో పోటీ పడే అవకాశం కల్పించారు. కొన్ని కోర్సులకు మాత్రం సంబంధిత విభాగంలో యూజీ పూర్తిచేసినవారే అర్హులు. అభ్యర్థులు చేరిన కోర్సులను బట్టి ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంహెచ్‌ఏ, ఎంపీహెచ్‌ డిగ్రీలను ప్రదానం చేస్తారు. ప్రతి అభ్యర్థీ గరిష్ఠంగా 3 ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవీ కోర్సులు

ఎడ్యుకేషన్‌ (ఎలిమెంటరీ), డెవలప్‌మెంట్‌ స్టడీస్, 

ఉమెన్‌ స్టడీస్, క్లైమేట్‌ చేంజ్‌ సస్టెయినబిలిటీ స్టడీస్, 

రెగ్యులేటరీ గవర్నెన్స్, 

అర్బన్‌ పాలసీ గవర్నెన్స్, 

వాటర్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్, 

అప్లయిడ్‌ సైకాలజీ (క్లినికల్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ ప్రాక్టీస్‌), 

గ్లోబలైజేషన్‌ అండ్‌ లేబర్‌; హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ లేబర్‌ రిలేషన్స్, 

ఆర్గనైజేషన్‌ డెవలప్‌మెంట్, 

చేంజ్‌ అండ్‌ లీడర్‌షిప్‌; సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్, 

మీడియా అండ్‌ కల్చరల్‌ స్టడీస్, 

డెవలప్‌మెంట్‌ పాలసీ, 

ప్లానింగ్‌ అండ్‌ ప్రాక్టీస్‌; సస్టెయినబుల్‌ లైవ్లీ హుడ్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ గవర్నెన్స్‌; సోషల్‌ ఇన్నొవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్, 

సోషల్‌ వర్క్‌ ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్, 

సోషల్‌ వర్క్‌: (చిల్డ్రన్‌ అండ్‌ ఫ్యామిలీస్‌ / కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాక్టీస్‌/ క్రిమినాలజీ అండ్‌ జస్టిస్‌/ దళిత్, ట్రైబల్‌ స్టడీస్‌ అండ్‌ యాక్షన్‌ / లైవ్‌లీ హుడ్స్‌ అండ్‌ సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్స్‌/ మెంటల్‌ హెల్త్‌ / పబ్లిక్‌ హెల్త్‌/ ఉమెన్‌ సెంటర్డ్‌ ప్రాక్టీస్‌/ కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాక్టీస్‌/ కౌన్సెలింగ్‌), 

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, 

ఎడ్యుకేషన్, 

పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్, 

నేచురల్‌ రిసోర్స్‌ అండ్‌ గవర్నెన్స్,

రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ గవర్నెన్స్, 

ఎకాలజీ, 

ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌  సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్, 

లేబర్‌ స్టడీస్‌ అండ్‌ సోషల్‌ ప్రొటెక్షన్‌/ పీస్‌ అండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ స్టడీస్, 

సోషియాలజీ అండ్‌ సోషల్‌ ఆంత్రపాలజీ, 

హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంహెచ్‌ఏ), 

పబ్లిక్‌ హెల్త్‌ (హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌/ హెల్త్‌ పాలసీ, ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ / సోషల్‌ ఎపిడమాలజీ), 

ఎల్‌ఎల్‌ఎం, 

ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌- ఎంఎడ్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌.

ఏయే తేదీల్లో?

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 15 

పరీక్ష తేదీ: ఫిబ్రవరి 20

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం

వెబ్‌సైట్‌: https://admissions.tiss.edu

ఎంపిక ఇలా

ఏ కోర్సు ఎంచుకున్నప్పటికీ టిస్‌Ã- నెట్‌ రాయాలి. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి స్టేజ్‌ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో 50 మార్కులకు ప్రోగ్రామింగ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (పీఏటీ), వంద మార్కులకు ఆన్‌లైన్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూ (ఓపీఐ) ఉంటాయి. తుది ఎంపికలో టిస్‌- నెట్‌కు 30, పీఏటీకి 40, ఓపీఐకి 30 శాతం వెయిటేజీ ఉంటుంది. హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ లేబర్‌ రిలేషన్స్, ఆర్గనైజేషన్‌ డెవలప్‌మెంట్‌ చేంజ్‌ అండ్‌ లీడర్‌షిప్‌.. ఈ రెండు కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారు పీఏటీ బదులు టిస్‌ మ్యాట్‌ రాయాల్సి ఉంటుంది.   

టిస్‌ నెట్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి వంద నిమిషాలు. ప్రశ్నలన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే వస్తాయి. జనరల్‌ అవేర్‌నెస్‌ 40, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ 30, మ్యాథ్స్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 30 మార్కులకు ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. ఇంగ్లిష్, రీజనింగ్, మ్యాథ్స్‌ విభాగాల్లోని ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి.
 

Posted Date : 10-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌