• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సరిహద్దు దళంలోకి స్వాగతం

2,788  ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) 2,788 కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మన్‌) ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటిల్లో పురుషులకు 2,651, మహిళలకు 137 కేటాయించారు. ఐటీఐ, డిప్లొమా పూర్తిచేసుకున్నవారికి ఇదో మంచి అవకాశం. వివిధ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. 

అభ్యర్థులను ఫిజికల్‌ స్టాండర్డ్‌టెస్ట్‌ (పీఎస్‌టీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్‌టెస్ట్, రాత పరీక్ష, వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపికచేస్తారు. పురుష అభ్యర్థుల ఎత్తు 167.5 సెం.మీ.,; ఛాతీ కొలత 78-83 సెం.మీ మధ్య ఉండాలి. స్త్రీలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. 

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాల్సివుంటుంది. ప్రకటనలో పేర్కొన్న విధంగా సొంత రాష్ట్రానికి కేటాయించిన ఖాళీలకు దరఖాస్తు చేయాలి. రిజిస్ట్రేషన్‌ సమయంలో అభ్యరులకు కేటాయించిన రిజిస్ట్రేషన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను భద్రపరుచుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఇవి అవసరమవుతాయి. దరఖాస్తును ప్రింట్‌అవుట్‌ తీసుకుని రికార్డు నిమిత్తం భద్రపరుచుకోవాలి. దీన్ని పోస్టులో పంపాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌ దరఖాస్తులో ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్లను తప్పుల్లేకుండా రాయాలి. భవిష్యత్తులో కరస్పాండెన్స్‌ అంతా ఈమెయిల్‌/ ఎస్‌ఎంఎస్‌ల ద్వారానే జరుగుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపేటప్పుడు వివరాలన్నీ సరిగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత వీటిలో ఎలాంటి మార్పులు చేయడానికీ అవకాశం ఉండదు. ప్రభుత్వ/ పాక్షిక ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నవారు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాల్సి ఉంటుంది. 

ఇతర డాక్యుమెంట్లు:ఆన్‌లైన్‌ దరఖాస్తుతోపాటుగా.. పదోతరగతి పాస్‌ సర్టిఫికెట్, సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవంతో సర్టిఫికెట్, సంబంధిత రాష్ట్రానికి చెందినవారని రుజువుచేసే సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే), మినహాయింపు సర్టిఫికెట్‌ (అవసరమైతే) లను అప్‌లోడ్‌ చేయాలి.

రాత పరీక్ష: ఫిజికల్‌ స్టాండర్డ్‌టెస్ట్‌ (పీఎస్‌టీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్‌టెస్ట్‌లను విజయవంతంగా పూర్తిచేసిన వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ భాషలº్ల ఉండే ఈ పరీక్షను ఓఎంఆర్‌ షీట్ల మీద రాయాలి. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు 35 శాతం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 33 శాతం మార్కులు సాధించాలి. జనరల్‌ అవేర్‌నెస్‌/ జనరల్‌ నాలెడ్జ్, నాలెడ్జ్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్, ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ ఎబిలిటీ టు ఆబ్జర్వ్‌ ద డిస్టింగ్విష్డ్‌ప్యాట్రన్స్, బేసిక్‌ నాలెడ్జ్‌ ఇన్‌ ఇంగ్లిష్‌/ హిందీ. ఈ నాలుగు విభాగాలకు ఒక్కో దానికి 25 మార్కుల చొప్పున.. మొత్తం 100 మార్కులు. పరీక్ష కాలవ్యవధి 2 గంటలు. 

అర్హత: పదో తరగతిలో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాల్లో రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఏడాది సర్టిఫికెట్‌ కోర్సు/ రెండేళ్ల డిప్లొమా లేదా తత్సమాన కోర్సు చదివి ఉండాలి. 

వయసు:18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్లకు అనుగుణంగా వయః పరిమితిలో మినహాయింపులు ఉంటాయి. 

దరఖాస్తు ఫీజు: రూ. 100. నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్‌/ డెబిట్‌ కార్డ్‌ల ద్వారా చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 1, 2022

వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in
 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-02-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌