* మానవతా విలువలు, భారతీయ సంస్కృతి, మానవ జీవితధర్మాలను వివరించే ఇతిహాసం 'రామాయణం'.
* రామాయణం నుంచి తల్లిదండ్రుల అనురాగం, సోదరప్రేమ, రాజధర్మం, ఉత్తమ ఆదర్శాలు, రాజ్యపాలన, మానవ స్వభావం, స్నేహబంధం, వినయం, వివేకంతో మెలగడం లాంటి మంచి విషయాలను నేర్చుకుంటాం. అలాగే ప్రతి పాత్రలోని సందేశాలను గ్రహించాలి.
* పబ్లిక్ పరీక్షలో ఉపవాచకం (రామాయణం) నుంచి 11 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.
* మొదటి పేపరులో 'స్వీయ రచన' సామర్థ్యం కింద రెండు ప్రశ్నలు వస్తాయి. వాటిలో ఒకదానికి సమాధానం రాయాలి. సమాధానం 12 నుంచి 15 వాక్యాల్లో రాస్తే సరిపోతుంది. సమాధానానికి '6' మార్కులు కేటాయించారు.
* రెండో పేపరులో 'అవగాహన - ప్రతిస్పందన' సామర్థ్యం కింద మొదటి ప్రశ్నగా గద్యం ఉపవాచకం నుంచి వస్తుంది. గద్యానికి సంబంధించిన ప్రశ్నలు వివిధరకాలుగా అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు చొప్పున '5' మార్కులు కేటాయించారు.
మొదటి పేపరులో '6 మార్కులు' పొందాలంటే...
* ఆరు 'కాండా'ల్లోని విషయాన్ని అవగాహనతో చదవాలి.
* ప్రశ్నలు నేరుగా అడగరు. కాబట్టి విశ్లేషణాత్మక ఊహను పెంపొందించుకోవాలి.
* 'కాండా'ల్లోని పాత్రలు, వాటి స్వభావాన్ని క్షుణ్నంగా పరిశీలించాలి.
* సన్నివేశాలకు అనుగుణంగా అభిప్రాయాలు తెలియజేయాలి.
* 'కాండా'ల ఆధారంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ 'కాండ'లో ఏయే అంశాలు ఉన్నాయో ఆయా కాండల వారిగా గుర్తుపెట్టుకోవాలి.
ఉదా: రాముడు వాలిని చంపడం (కిష్కింధ కాండ)
* చదివేటప్పుడు నిజ జీవితానికి అనుసంధానం చేసుకుంటూ చదవాలి.
రెండో పేపరులో '5' మార్కులు పొందాలంటే...
* ఇచ్చిన గద్యాన్ని క్షుణ్నంగా చదవాలి. గద్యంలోనే సమాధానాలు ఉంటాయి.
* గద్య సంబంధ ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమంటారు. తప్పొప్పులు గుర్తించమని కూడా అడగొచ్చు. ప్రశ్నలను తయారు చేయమనడం, పదాలు ఇచ్చి వివరణలు రాయమనడం. కీలకాంశాలు *రాయమనడం, పదాలు రాయమనడం ఇలా రకరకాలుగా అడగొచ్చు. కాబట్టి ఆయా విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
* ఒక వాక్యంలో సమాధానం రాయాలి.
* 'కాండా'ల వారిగా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి సంబంధిత గద్యం 'ఏ కాండ లోనిది' అని కూడా అడిగే అవకాశం ఉంటుంది.
* ఇచ్చిన గద్యాన్ని చక్కగా చదివి అవగాహన చేసుకోవాలి.