భూమి దున్నడం ప్రకృతి విరుద్ధం.. నేరం!
ఆదిమ జీవనం నుంచి స్థిర జీవనానికి మారే పరిణామ క్రమంలో మనిషి, మొదట జంతువులను మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాత వ్యవసాయం చేశాడు. ఆ విధంగా పశుపోషణను ప్రధాన వృత్తిగా, జీవనాధారంగా మలచుకున్న జాతులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. ఆధునిక యుగంలో ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వలస పాలన ప్రారంభమైన తర్వాత వీరికి కష్టకాలం వచ్చింది. అప్పటి వరకు అడవుల్లో, మైదానాల్లో, స్వేచ్ఛగా, ఎలాంటి హద్దులు లేకుండా సంచార జాతులుగా సాగుతున్న వీరి జీవనంపై నియంత్రణలు మొదలయ్యాయి. సాగు భూములు పెంచి పన్నులు రాబట్టుకునే చట్టాల కారణంగా మేత భూములు తగ్గాయి. దీంతో పశుపోషకులు చాలా వరకు వ్యవసాయదారులుగా మారారు. ఈ అంశాలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. వివిధ ఖండాల్లో ప్రధాన పశుపోషక జాతులు, వారి విశ్వాసాలు, జీవన విధానం, మన దేశంలో రాష్ట్రాల వారీగా పశుపోషణ ప్రధానాధార జాతులు, వాటి ప్రత్యేకతలను తెలుసుకోవాలి.
1. పర్వత ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధమైన విశాల పచ్చిక బయళ్లను ఏమంటారు?
1) గద్వాల్ 2) గడ్వాల్
3) బుగ్వాల్ 4) పైవన్నీ
2. జమ్ము-కశ్మీర్లోని గిరిజన జాతులు ప్రధానంగా....
1) గుజ్జర్ బకర్వాల్ 2) కోలు
3) గోండ్ 4) లంబాడి
3. కశ్మీర్కు చెందిన పశుపోషకులు ఏ పేరుతో సమూహాలుగా ఏర్పడి ప్రయాణం సాగిస్తారు?
1) కపిల 2) గద్వాల్
3) కానుగ 4) పైవన్నీ
4. హిమాచల్ ప్రాంతానికి చెందిన ‘గడ్డి పోషకులు’ (పశు పోషకులు) ఏప్రిల్లో ఎక్కడ విడిది చేసేవారు?
1) లాహుల్ 2) స్పితి
3) 1, 2 4) లాహూర్
5. గడ్వాల్, కుమయాన్ ప్రాంతాల్లోని గుజ్జర్లు శీతాకాలంలో ఏ శుష్క అటవీ ప్రాంతాలకు వలస వెళ్లేవారు?
1) బాబర్ 2) ఖాదర్ 3) టెరాయి 4) బుగ్వాల్
6. కులు ప్రాంతంలోని ‘గడ్డీలు’ వేటిని మేపుతారు?
1) గొర్రెలు 2) ఆవులు
3) పందులు 4) గాడిదలు
7. ధంగర్లు ఏ రాష్ట్రానికి చెందిన పశుపోషక జాతి?
1) రాజస్థాన్ 2) గుజరాత్
3) మహారాష్ట్ర 4) ఆంధ్రప్రదేశ్
8. ధంగర్లు సాధారణంగా ఏ పనులు చేస్తారు?
1) గొర్రెల కాపరులు 2) కంబళ్లు నేస్తారు
3) గేదెలను పెంచుతారు 4) పైవన్నీ
9. మహారాష్ట్రలోని ధంగర్లు జొన్న పంట కోత తరువాత ఏ తీరానికి వలస వెళతారు?
1) కెనరా తీరం 2) కొంకణ్ తీరం
3) మలబార్ తీరం 4) కచ్ తీరం
10. కిందివాటిలో సరైనవి?
ఎ) ఖరీఫ్ - వర్షాకాలపు పంట. సెప్టెంబరు, అక్టోబరుల మధ్య కోతకు వస్తుంది.
బి) రబీ - వసంతకాలపు పంట. మార్చి తరువాత కోతకు వస్తుంది.
1) ఎ, బి లు సరైనవి 2) ఎ సరైంది, బి సరికాదు
3) ఎ, బి లు సరికావు 4) ఎ సరికాదు, బి సరైంది
11. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని పశుపోషకులను గుర్తించండి.
1) గొల్ల 2) కురుమ 3) కురుబ 4) పైవన్నీ
12. బంజారాలు ఏ రాష్ట్రాల్లోని పశుపోషక సమాజం?
1) ఉత్తర్ప్రదేశ్ 2) పంజాబ్, రాజస్థాన్
3) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర 4) పైవన్నీ
13. ‘రైకాలు’ నివసించే ప్రాంతం?
1) రాజస్థాన్ 2) మధ్యప్రదేశ్, మహారాష్ట్ర
3) గుజరాత్ 4) పైవన్నీ
14. 19 వ శతాబ్దం తొలినాళ్లలో మైసూర్లోని గొల్లలను కలిసిన బుచనన్ రాసిన అంశంలో సరైంది గుర్తించండి.
ఎ) గొల్లలు అడవులకు దగ్గరగా ఉన్న చిన్న గ్రామాల్లో నివసిస్తున్నారు.
బి) కొద్దిపాటి వ్యవసాయం చేస్తూ పాల ఉత్పత్తులను దగ్గరలోని పట్టణాల్లో అమ్ముతారు.
సి) సాధారణంగా ప్రతి కుటుంబంలో 7 నుంచి 8 మంది యువకులు ఉంటారు.
డి) యువకుల్లో కొందరు పశువులను మేతకు తీసుకెళ్లేవారు.
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, డి సరైనవి
3) ఎ, బి, సి సరైనవి 4) ఎ, డి సరైనవి
15. పశ్చిమ రాజస్థాన్ బాలోత్ర సంతలో ఏం అమ్ముతారు?
1) ఒంటెలు 2) గుర్రాలు
3) గాడిదలు 4) 1, 2
16. ‘‘పశువుల మేతకు ఉపయోగపడే అడవులు ఏ ఇతర పనులకు ఉపయోగపడవు. కలప, ఇంధనం లాంటి శాస్త్రీయ ఉత్పత్తులు లభించవు.’’ అని అన్నవారు?
1) హెచ్.ఎస్.డాల్టన్ 2) హెచ్.ఎస్.గిబ్సన్
3) హెచ్.టి.కోల్బ్రూక్ 4) డెట్రిచ్
17. వలస పాలన పశుపోషకుల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది?
ఎ) వలస ప్రభుత్వం పచ్చిక బయళ్లను వ్యవసాయ భూములుగా మార్చడం.
బి) 19వ శతాబ్దం మధ్యకాలానికి అటవీ చట్టాలు అమల్లోకి తీసుకురావడం.
సి) చేతివృత్తులు, పశుపోషకుల పట్ల ప్రభుత్వం అపనమ్మకం.
డి) ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం వీలైనన్ని పన్నులు విధించడం.
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
18. వలస తెగల చట్టాన్ని భారతదేశం ఎప్పుడు ఆమోదించింది?
1) 1871 2) 1872 3) 1873 4) 1875
19. కిందివాటిని జత చేయండి.
రాష్ట్రం గిరిజన జాతి
1)మహారాష్ట్ర ఎ) డాంగ్రాలు
2) మధ్యప్రదేశ్ బి) బంజారాలు
3) ఆంధ్రప్రదేశ్ సి) కురుమ
4) గుజరాత్ డి) మాల్దారీలు
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
20. వలసవాద ప్రభుత్వం చేసిన చట్టాలతో పశుపోషకులు ఎలా మారారు?
ఎ) పశువుల సంఖ్యను తగ్గించుకున్నారు.
బి) కొందరు పశుపోషకులు కొత్త పచ్చిక బయళ్లు వెతుక్కున్నారు.
సి) ధనవంతులైన పశుపోషకులు భూములు కొనుగోలు చేసి స్థిర జీవనానికి మారారు.
డి) కొందరు పశుపోషకులు భూమిని సాగు చేస్తూ వ్యవసాయదారులుగా మారారు.
1) ఎ, సి, డి సరైనవి 2) ఎ, బి, సి సరైనవి
3) ఎ, బి, సి, డి సరైనవి 4) ఎ, బి, డి సరైనవి
21. ప్రపంచంలో సగం పశుపోషక జనాభా నివసించే ఖండం?
1) ఆసియా 2) ఆఫ్రికా
3) దక్షిణ అమెరికా 4) ఆస్ట్రేలియా
22. ఆఫ్రికాలోని పశుపోషక సమాజంవారు?
1) బిడౌన్లు, బెర్బర్లు 2) మసాయి, సోమాలి
3) బోరాన్, టర్కానా 4) పైవన్నీ
23. ‘భూమిని దున్నడం ప్రకృతి విరుద్ధం, నేరం’ అని భావించే జాతి?
1) మసాయి 2) సోమాలి
3) బెర్బర్లు 4) పైవారంతా
24. మసాయి తెగ వారు ప్రధానంగా నివసించే ప్రాంతాలు?
1) దక్షిణ కెన్యా 2) టాంజానియా 3) 1, 2 4) ఏదీకాదు
25. వలస చట్టాలు ఆఫ్రికాలోని ప్రజలను ప్రభావితం చేసిన విధానాన్ని గుర్తించండి.
1) మేత భూమి అంతమైంది
2) సరిహద్దులను మూసేశారు
3) పచ్చిక బయళ్లు ఎండిపోయాయి
4) పైవన్నీ
26. వలస పాలనకు ముందు మసాయి తెగవారి భూములు ఎక్కడ విస్తరించాయి?
1) దక్షిణ కెన్యా నుంచి ఉత్తర టాంజానియా వరకు
2) ఉత్తర కెన్యా నుంచి ఉత్తర టాంజానియా వరకు
3) ఉత్తర కెన్యా నుంచి దక్షిణ టాంజానియా వరకు
4) తూర్పు కెన్యా నుంచి తూర్పు టాంజానియా వరకు
27. ఆఫ్రికాలో 1885లో ఏర్పడిన అంతర్జాతీయ సరిహద్దులు?
1) బ్రిటిష్ - కెన్యా 2) బర్మన్ - టంగ్వానిక
3) 1, 2 4) బ్రిటిష్ - ఆఫ్రికా
28. టాంజానియా బ్రిటిష్ ఆధీనంలోకి ఎప్పుడు వచ్చింది?
1) 1917 2) 1919 3) 1918 4) 1920
29. సంబూరు జాతీయ ఉద్యానవనం, సెరెంగెటి ఉద్యానవనం ఉన్న ప్రాంతాలు వరుసగా?
1) టాంజానియా, కెన్యా 2) కెన్యా, టాంజానియా
3) ఉగాండా, కెన్యా 4) టాంజానియా, ఉగాండా
30. మా-సాయి (మసాయి) అంటే?
1) దేశ ప్రజలు 2) నా ప్రజలు
3) గ్రామ ప్రజలు 4) అందరూ
31. ‘కావోకారాండ్’ అనే గిరిజన జాతి ఉన్న ప్రాంతాలు?
1) నమీబియా 2) నైరుతి ఆఫ్రికా
3) 1, 2 4) దక్షిణ ఆఫ్రికా
32. ఆఫ్రికా ప్రజలను వలస పాలకులు ఏ శతాబ్దం నుంచి నియంత్రించారు?
1) 17వ 2) 18వ 3) 19వ 4) 20వ
33. భారతదేశంలో వలస ప్రభుత్వం నేరస్థ తెగల చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది?
1) 1873 2) 1871 3) 1901 4) 1842
34. ప్రపంచంలోనే సగం పశుపోషక జనాభా నివసించే ఖండం?
1) ఆసియా 2) ఆఫ్రికా
3) దక్షిణ అమెరికా 4) ఆస్ట్రేలియా
35. మసాయి తెగ ఏ పర్వతాల్లో జీవనం సాగిస్తుంది?
1) ఆల్ఫేన్స్
2) హిమాలయ పర్వతాలు
3) రాకీ పర్వతాలు, కిలిమంజారో పర్వతాలు
4) యూరల్ పర్వతాలు
36. సంబూర జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది?
1) మధ్య ఆసియా 2) దక్షిణ ఆఫ్రికా
3) కెన్యా 4) టాంజానియా
37. పర్యాటక రంగం నుంచి గత ఏడాది 240 మిలియన్లు కెన్యా షిల్లింగుల ఆదాయాన్ని పొందిన జాతీయ ఉద్యానవనం?
1) పంచ్ మర్ష 2) గ్రేట్ నికోబార్
3) కాలిడో 4) అంబొగ్సాలి
38. 19వ శతాబ్దంలో తూర్పు ఆఫ్రికాలోని బ్రిటిష్ వలస పాలకులు వ్యవసాయాన్ని విస్తరించే దిశగా ఏ సమూహాలను ప్రోత్సహించారు?
1) అటవిక సమూహాలను
2) ఝూం వ్యవసాయదారులను
3) స్థానిక రైతుల సమూహాలను
4) గ్రామాధికారులు
39. భారతీయ వ్యవసాయానికి సంబంధించిన కమిషన్ నివేదిక? రచయిత: గద్దె నరసింహారావు
ఎ) హెచ్.ఎస్. గిబ్బన్ నివేదిక
బి) రాయల్ కమిషన్ నివేదిక
1) ఎ సరైంది, బి సరికాదు
2) ఎ, బి సరికావు
3) బి మాత్రమే సరైంది
4) బి సరికాదు
సమాధానాలు
1-3, 2-1, 3-1, 4-3, 5-1, 6-1, 7-3, 8-4, 9-2, 10-1, 11-4, 12-4, 13-1, 14-1, 15-4, 16-2, 17-4, 18-1, 19-3, 20-3, 21-2, 22-4, 23-1, 24-3, 25-4, 26-2, 27-3, 28-2, 29-2, 30-2, 31-3, 32-3, 33-2, 34-2, 35-3, 36-3, 37-4, 38-3, 39-3.