1. కిందివారిలో స్వతంత్ర కర్ణాటక రాజ్య స్థాపకుడు ఎవరు?
ఎ) సఫ్దర్ అలీ బి) దోస్త్ అలీ సి) సాదతుల్లా ఖాన్ డి) అన్వరుద్దీన్
జ: సి(సాదతుల్లా ఖాన్)
2. కర్ణాటక రాజ్య రాజధాని ఏది?
జ: ఆర్కాట్
3. హైదర్ అలీ ఏ మైసూరు యుద్ధ సమయంలో మరణించాడు?
జ: రెండో
4. ప్లాసీ యుద్ధం తర్వాత సిరాజ్-ఉద్-దౌలాను బంధించి చంపిన వ్యక్తి ఎవరు?
జ: మీరాన్
5. బక్సార్ యుద్ధ వీరుడు ఎవరు?
జ: హెక్టర్ మన్రో
6. చీకటి గది ఉదంతం గురించి పేర్కొన్న వ్యక్తి ఎవరు?
జ: హాల్వెల్
7. ఆర్కాట్ వీరుడిగా ప్రసిద్ధి గాంచిన బ్రిటిష్ జనరల్ ఎవరు?
జ: రాబర్ట్ క్లైవ్
8. టిప్పు సుల్తాన్ ఎప్పుడు మరణించాడు?
జ: 1799
9. రెండో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది?
జ: మంగళూరు
10. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్కు, కుట్రదారులకు మధ్య రహస్య ఒప్పందాన్ని కుదిర్చిన వ్యక్తి ఎవరు?
జ: అమీన్చంద్