మాదిరి ప్రశ్నలు
1. నిజాం నవాబు వెట్టిచాకిరీని నిషేధిస్తూ ఎప్పుడు ఫర్మానా జారీ చేశాడు?
1) 1921 2) 1923 3) 1925 4) 1927
2. కిందివారిలో ఎవరికి ఖిద్మతి ఇనాము భూములను ఇచ్చేవారు?
1) శివాలయ పూజారులు 2) విష్ణు ఆలయ పూజారులు
3) దేవదాసీలు 4) జోగినీలు
3. హైదరాబాద్ రాజ్యంలో ముస్లింల శాతం?
1) 8% 2) 10% 3) 11% 4) 13%
4. నిజాం రాజ్య కోశాగారంలో ప్రభుత్వ ఖర్చుతో ఏ దేవత పూజ చేసేవారు?
1) సరస్వతి 2) పార్వతి 3) దుర్గ 4) లక్ష్మి
5. హైదరాబాద్ రాజ్యంలో ఏ సాంఘిక దురాచారం ఉండేది?
1) ఆడపాపలు 2) వీరగుళ్లు 3) వీరపూజ 4) వీరగళ్లు
6. హైదరాబాద్ రాజ్యంలో హిందూ ప్రజల శాతం?
1) 60% 2) 78% 3) 88% 4) 90%
7. ఏ అసఫ్జాహీ పాలకుడు వెట్టిచాకిరీని నిషేధిస్తూ ఫర్మానా జారీ చేశాడు?
1) మహబూబ్ అలీఖాన్ 2) ఉస్మాన్ అలీఖాన్
3) నాసిరుద్దౌలా 4) అప్జలుద్దౌలా
8. వెట్టిచాకిరీ ఏ ప్రాంతంలో ఉండేది?
1) మరట్వాడ 2) కర్ణాటక 3) బీరారు 4) తెలంగాణ
9. తెలంగాణలో ఎన్ని రకాల వెట్టిచాకిరీలు ఉండేవి?
1) 1 2) 2 3) 3 4) 4
10. హైదరాబాద్ రాజ్యంలోని ఏ ప్రాంతంలో స్త్రీల పరిస్థితి దయనీయంగా ఉండేది?
1) మరట్వాడ 2) కన్నడ 3) తెలంగాణ 4) బీరారు
11. హైదరాబాద్ రాజ్యంలోని ఏ ప్రాంతంలో ఆడపాపలు అనే సాంఘిక దురాచారం ఉండేది?
1) కర్ణాటక 2) మరాఠ 3) దార్వాడ్ 4) తెలంగాణ
సమాధానాలు
1-2; 2-1; 3-3; 4-4; 5-1; 6-3; 7-2; 8-4; 9-2; 10-3; 11-4.