1. శివాజీ ఎవరిని తన గురువుగా పరిగణించాడు?
జ: సమర్థ రామదాసు
2. గొరిల్లా యుద్ధ విధానాన్ని మరాఠాలు ఎవరి నుంచి గ్రహించారు?
జ: మాలిక్ అంబర్
3. కిందివారిలో శివాజీపై ఎక్కువ ప్రభావం చూపిన వ్యక్తి ఎవరు?
ఎ) షాజీ భోన్స్లే బి) జిజాబాయి సి) దాదాజీ కొండదేవ్ డి) జాదవరావ్
జ: బి (జిజాబాయి)
4. కింది అష్ట ప్రధానుల్లో సుర్నావిస్ లేదా చిట్నిస్గా ఎవరిని పిలుస్తారు?
ఎ) సుమంత్ బి) పండితరావ్ సి) సచివ్ డి) అమాత్య
జ: సి (సచివ్)
5. మరాఠా భూభాగంలో భూమిని కొలవడానికి వాడిన యూనిట్ ఏది?
జ: కతి
6. శివాజీ నౌకాదళ కేంద్రం ఎక్కడ ఉండేది?
జ: కొలాబ
7. కిందివారిలో శివాజీ వధించిన బీజపూర్ సేనానిని గుర్తించండి.
ఎ) అఫ్జల్ ఖాన్ బి) షయిస్త ఖాన్ సి) జై సింగ్ డి) కున్వర్ సింగ్
జ: ఎ (అఫ్జల్ ఖాన్)
8. శివాజీ మొగలులతో పురంధర్ సంధిని ఏ సంవత్సరంలో కుదుర్చుకున్నాడు?
జ: 1665
9. 1674 లో శివాజీ పట్టాభిషేకం ఎక్కడ జరిగింది?
జ: రాయ్గఢ్
10. కాల్బలంలో తొమ్మిది మంది సైనికులతో కూడిన యూనిట్కు అధిపతి ఎవరు?
జ: నాయక్