Post your question

 

    Asked By: srinivas

    Ans:

    కుటుంబ ఆదాయం సాలీన రూ.8 లక్షలు మించినవారు క్రీమీలేయర్‌ పరిధిలోకి వస్తారు. మీరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి తండ్రి ఆదాయంతో సంబంధం ఉండదు. మీ ఆదాయం సంవత్సరానికి రూ. 6 లక్షలు కాబట్టి మీకు క్రీమీలేయర్‌ నిబంధన వర్తించదు.

    Asked By: Ram

    Ans:

    ఒకేసారి రెండు తరగతులను పూర్తి చేయడం అసంభవం. మీరు నాలుగు చదవకుండా నేరుగా ఐదో తరగతి చదివి ఉంటే ఓటీఆర్‌ నింపేటప్పుడు అకడమిక్‌ ఇయర్స్‌ కాలమ్‌ నాలుగో తరగతిలో డ్యాష్‌(-) పెట్టి వదిలేయండి. ఉదాహరణకు మీరు మూడో తరగతి 2012-13లో చదివి ఉంటే నాలుగో తరగతి డ్యాష్‌ పెట్టి అయిదో తరగతి కాలమ్‌లో 2013-14 అని నింపితే సరిపోతుంది. మీరు నేరుగా మూడో తరగతి నుంచి అయిదో తరగతిలోకి వెళ్లారని వారికి అర్థమైపోతుంది.

    Asked By: sahithi

    Ans:

    గ్రూప్‌ - 1 ప్రిపరేషన్‌కు యూపీఎస్సీ రిఫరెన్స్‌ పుస్తకాలను చదువుకోవచ్చు. అయితే వీటితోపాటు తెలంగాణ ఉద్యమం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను చదవాలి. అలాగే రోజూ దినపత్రికను చదివి నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకుంటే పరీక్షకు ఉపయోగకరం.

    Asked By: Saketh

    Ans:

    గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్షకు మూడు నుంచి నాలుగు నెలల సమయం   ఉండవచ్చు. వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించండి.

    Asked By: Shiva

    Ans:

    ప్రైవేట్‌ అని నింపితే సరిపోతుంది. మిగిలిన తరగతులన్నింటికీ సంబంధించిన బోనఫైడ్‌లు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.

    Asked By: Rahul

    Ans:

    ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ను తహశీల్దారు వద్ద పొందాలి. ప్రస్తుత జీవో  ప్రకారం కుటుంబ ఆదాయం సాలీన రూ.8 లక్షలకు మించకూడదు, భూమి రెండు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు లాంటి అనేక పరిమితులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం మీ ప్రాంతానికి చెందిన తహశీల్దారు కార్యాలయాన్ని సంప్రదించండి.

    Asked By: ఒక విద్యార్థి

    Ans:

    ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏడో తరగతి వరకు నాలుగేళ్లు వరుసగా ఏ ప్రాంతంలో చదివితే ఆ జిల్లా స్థానికత పొందుతారు. మీరు నాలుగో తరగతి నుంచి ఏడో తరగతి వరకు  కరీంనగర్‌లో చదివారు కాబట్టి అదే జిల్లా స్థానికత కిందకు వస్తారు.