• facebook
  • whatsapp
  • telegram

వీటిపై దృష్టిపెట్టాలి

టెట్‌ పేపర్‌-2లో గణితం, సైన్సు విభాగ అభ్యర్థులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించవలసిన ఆవశ్యకత ఉంది. డిగ్రీ స్థాయిలో గణితం అభ్యసించినవారు జీవశాస్త్ర విషయాలను, డిగ్రీస్థాయిలో సామాన్యశాస్త్రాన్ని అభ్యసించినవారు గణిత, భౌతికశాస్త్ర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. సులభంగా ఉండి ఇప్పటికే బాగా పట్టు సాధించిన అంశాలకు కాకుండా మిగతా విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
పేపర్‌-2లో కంటెంట్‌ పదోతరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. ప్రాథమిక, కీలక భావనలపై అవగాహన అవసరం. అందరు అభ్యర్థులూ పదో తరగతి వరకు గణితం అభ్యసించినవారే కాబట్టి ఆందోళన అనవసరం. ప్రశ్నలు కనీస సామర్థ్యాలను పరీక్షించేవిగా, అవగాహనను పరిశీలించేవిగా ఉంటాయి. తరచూ పునరావృతమయ్యే భావనలకు సంబంధించిన సమస్యలను ఎక్కువసార్లు సాధిస్తే మంచి మార్కులు పొందవచ్చు. బీజగణితం, క్షేత్రమితి, రేఖాగణితం, అంకగణితం అంశాలు ఉన్నత పాఠశాల స్థాయిలోనివే. ఆత్మవిశ్వాసంతో నిర్విరామ సాధన అవసరం.
ఇవి గమనించండి
‣ ఇప్పుడు మిగిలున్న కొద్ది రోజులూ నిరుత్సాహాన్ని వదిలి ఉత్సాహపూరిత వాతావరణంలో అభ్యసించాలి.
‣ ఈ నిర్ణీత సమయంలో సిలబస్‌లోని ప్రధాన అంశాలకే పరీక్ష దృష్ట్యా ప్రాధాన్యమివ్వాలి.
‣ ఇప్పటికే ప్రాథమిక భావనలపై పట్టు సాధించి ఉంటారు కాబట్టి అవగాహన, వినియోగస్థాయి ప్రశ్నలపై ప్రత్యేక దృష్టిసారించాలి.
‣ గత టెట్‌ ప్రశ్నపత్రాల పరిశీలన, విశ్లేషణ ఆధారంగా అధికశాతం ప్రశ్నలు అభ్యర్థి అవగాహనను, అనుప్రయుక్త సామర్థ్యాలను అంచనావేసే ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ విధమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసేలా మెలకువలు, నైపుణ్యం అత్యావశ్యకం.
‣ నూతన అంశాల జోలికి వెళ్లకుండా గతంలో అధ్యయనం చేసిన ప్రామాణిక మెటీరియల్‌నే పునరభ్యసం, పునశ్చరణ చేయాలి.
‣ వీలైనన్ని మాదిరి- ప్రామాణిక ప్రశ్నపత్రాలు సాధన చేయాలి.
‣ ఉన్న కొద్దిపాటి సమయాన్ని ఏకాగ్రత, ఓర్పు, క్రమశిక్షణతో సద్వినియోగం చేసుకోవాలి. పరీక్ష హాలులో సకాలంలో అన్నిటికీ జవాబులు రాసేలా మెలకువలు పాటించాలి.
‣ మెథడాలజీలో కామన్‌గా ఉండే అధ్యాయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చాలావరకు ఇతర సబ్జెక్టు మెథడాలజీలో కూడా అవే అంశాలు పునరావృతమయ్యే అవకాశం ఎక్కువ. ఇలా సమయం ఆదా అవుతుంది. విషయంపై పునర్బలనం కలుగుతుంది. ఈ సమయం వేరొక సబ్జెక్టు అభ్యసనానికి దోహదపడుతుంది.
‣ శిశువికాసం- అధ్యాపనం, బోధన విధానాలు రెండు పేపర్లకూ ఒకే సన్నద్ధత ఉపయోగపడుతుంది.
‣ డిగ్రీలో తాము చదివిన ప్రధాన సబ్జెక్టు కాకుండా మిగతావాటిపైనా పట్టు సాధించాలి.
‣ విషయంపై జ్ఞానంతోపాటు అవగాహన, అనుప్రయుక్తం అవసరం.
‣ సమాధానం గుర్తించడంలో సరైన మెలకువలు పాటించాలి.
‣ కఠినతా స్థాయి ఎక్కువగా ఉండే ప్రశ్నలను సాధించే క్రమంలో సమయం వృథా కాకుండా జాగ్రత్త వహించి, ఒత్తిడికి దూరంగా ఉండాలి. వీటికి పరీక్ష చివరి సమయంలో సమాధానాలు రాయాలి.
‣ ఆత్మవిశ్వాసం, మనోబలం, నైపుణ్యం, మెలకువలు.. ఇవీ మీ విజయానికి సోపానాలు!

Posted Date : 02-09-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌