‣ డిగ్రీ, పీజీ అర్హతతో దరఖాస్తుకు అవకాశం
న్యూదిల్లీలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ (సీజీపీడీటీఎం), ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ.. 553 ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఈ మూడు పరీక్షలూ ఇంగ్లిష్లోనే ఉంటాయి.
ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స్ గ్రూప్-ఎ (గెజిటెడ్) పోస్టులు.. బయోటెక్నాలజీ-50, బయోకెమిస్ట్రీ-20, ఫుడ్ టెక్నాలజీ-15, కెమిస్ట్రీ-56, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ-09, బయోమెడికల్ ఇంజినీరింగ్-53, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-108, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-29, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-63, ఫిజిక్స్-30, సివిల్ ఇంజినీరింగ్-09, మెకానికల్ ఇంజినీరింగ్-99, మెటలర్జికల్-04, టెక్స్టైల్ ఇంజినీరింగ్-08.. మొత్తం 553 ఉన్నాయి.
అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ పాసై ఉండాలి. 04.08.2023 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, ఓబీసీలకు, ఎక్స్-సర్వీస్మెన్కు మూడేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.500.
ప్రిలిమినరీ పరీక్ష
ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 150 మార్కులకు.. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒకమార్కు. జనరల్ ఇంగ్లిష్ (15 మార్కులు), వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ (30 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (30 మార్కులు), జనరల్ ఇంగ్లిష్ అండ్ కరెంట్ అఫైర్స్ (30 మార్కులు), జనరల్ సైన్స్ (30 మార్కులు), ఐపీ లెజిస్లేషన్, వీఐపీఓ సంబంధిత అంశాలు (15 మార్కులు). వ్యవధి 2 గంటలు. ఈ పరీక్షలో అన్రిజర్వుడ్ అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 25 శాతం, ఇతరులు 20 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. పోస్టుల సంఖ్యకు ఇరవైరెట్ల మందిని మెయిన్స్ పరీక్షకు ఎంపికచేస్తారు.
సన్నద్ధత మెలకువలు
‣ జనరల్ ఇంగ్లిష్లో కాంప్రహెన్షన్, ప్రెసీ రైటింగ్, ఒకాబ్యులరీ, షార్ట్ ఎస్సేలు ఉంటాయి. విషయాన్ని చదివి, అర్థంచేసుకుని తమ ఆలోచనలను అభ్యర్థులు స్పష్టంగా, కరెక్టుగా తెలియజేయగలరో లేదోనని పరీక్షిస్తారు.
‣ న్యూమరికల్/ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో మేథమెటికల్ కాలిక్యులేషన్స్లో అభ్యర్థికి ఉండేే నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. అరిథ్మెటిక్ రీజనింగ్, గ్రాఫ్ అండ్ టేబుల్ రీడింగ్, పర్సంటేజ్ ఎనాలిసిస్, క్వాంటిటేటివ్ ఎనాలిసిస్.. మొదలైన అంశాలుంటాయి.
‣ వెర్బల్-నాన్ వెర్బల్ రీజనింగ్లో భాగంగా అభ్యర్థి తార్కిక, విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ప్రశ్నలు, చిత్రాల రూపంలో ఇచ్చిన సమాచారాన్ని అర్థంచేసుకుని సమాధానాలను గుర్తించగలగాలి.
‣ జనరల్ సైన్స్లో భాగంగా సైంటిఫిక్ మెథడాలజీ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్, టెక్నిక్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్, ఎర్త్/స్పేస్ సెన్స్, టెక్నాలజీ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
‣ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో వర్తమానాంశాలపై ప్రశ్నలు ఇస్తారు. జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక, క్రీడా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. రోజూ వార్తాపత్రికలు చదవడం, వార్తలు వినడం ద్వారా వర్తమానాంశాలపై అవగాహన పెంచుకోవచ్చు.
‣ పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం వల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. దాని ప్రకారం ప్రణాళిక రూపొందించుకుని సాధన కొనసాగించవచ్చు.
‣ నిర్దిష్ట సమయం లోపలే సమాధానాలు రాయగలుగుతున్నారో లేదో సరిచూసుకోవాలి. ఎక్కువ ప్రశ్న పత్రాల సాధన ద్వారా సమస్యలను వేగంగా పరిష్కరించడం సాధ్యమవుతుంది.
‣ ఆన్లైన్లో అందుబాటులో ఉండే మాక్ టెస్టులనూ రాస్తుండాలి.
మెయిన్స్ పరీక్ష
ఆఫ్లైన్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. పేపర్-1 ఆబ్జెక్టివ్ పద్ధతిలో, పేపర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. పేపర్-1 వంద మార్కులకు, పేపర్-2 మూడు వందల మార్కులకు.
‣ పేపర్-1లో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 100 ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్కు (20 మార్కులు), జనరల్ ఆప్టిట్యూడ్ (20 మార్కులు), ఎలిమెంటరీ మేథమెటిక్స్ (20 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ (20 మార్కులు), ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (20 మార్కులు). వ్యవధి 2 గంటలు.
‣ టెక్నికల్/సైంటిఫిక్ విభాగంలో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా పేపర్-2 ఉంటుంది. 300 మార్కులకు డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 3 గంటలు. అభ్యర్థుల తుది ఎంపికలో ఈ రెండు పేపర్లలో సాధించిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఉంటుంది. పేపర్-2 సిలబస్ను విభాగాలవారీగా, వివరంగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఆయా ఛాప్టర్లను క్షుణ్ణంగా చదువుకుంటే ఫలితం ఉంటుంది.
‣ పేపర్-2లో సమాధానాలను చేతిరాతతో స్పష్టంగా, అర్థమయ్యేలా రాయాలి. గజిబిజిగా, చదవడానికి వీల్లేని విధంగా సమాధానాలు రాస్తే వాటికి మార్కులు ఇవ్వరు. కాబట్టి కొట్టివేతలు లేకుండా అర్థమయ్యేలా రాయడం అలవాటు చేసుకోవాలి. ఖాళీల సంఖ్యకు ఐదురెట్ల మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్ష నుంచి ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ
100 మార్కులకు ఉంటుంది. దీంట్లో ప్రిలిమ్స్, మెయిన్స్లో చర్చించిన అంశాల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలు వేస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు తుది ఎంపికలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 04.08.2023
ప్రిలిమినరీ పరీక్ష: 03.09.2023
మెయిన్స్ పరీక్ష: 01.10.2023
వెబ్సైట్: https://cgpdtm.qcin.org/
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ నర్సింగ్ కోర్సు.. అవకాశాలు అనేకం
‣ డేటా సైన్స్లో ప్రత్యేకతలివిగో!
‣ ఆర్మీలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీం
‣ దినసరి కూలీ.. డాక్టరేట్ సాధించింది