‣ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రీ
ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్న అవివాహిత పురుష అభ్యర్థులను ఇండియన్ ఆర్మీ ఆహ్వానిస్తోంది. సర్వీస్ సెలక్షన్ బోర్డు ( ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోకి ఎంపిక చేస్తుంది. ఈ విధానంలో ఎంపికైనవారికి స్టైపెండ్తో కూడిన శిక్షణ అందిస్తారు. అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన పూర్తి సమాచారం చూద్దాం!
టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్టు చేస్తారు. వీరికి సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) బెంగళూరులో అయిదు రోజులుపాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. తొలిరోజు స్టేజ్-1 స్క్రీనింగ్ (ఇంటలిజెన్స్) పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారిని స్టేజ్-2కి ఎంపిక చేస్తారు. అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని శిక్షణకు తీసుకుంటారు.
శిక్షణ 49 వారాలు
కోర్సులోకి ఎంపికైనవారికి ఇండియన్ మిలటరీ అకాడెమీ, దేహ్రాదూన్లో జులై, 2021 నుంచి 49 వారాలపాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్ హోదాతో శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరినవారు తొలి నెల నుంచే సుమారు రూ.లక్ష వేతనం అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయి హోదాలు సొంతం చేసుకోవచ్చు.
ఎన్ని ఖాళీలు?
ఖాళీలు: 40
(సివిల్/ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ 11, మెకానికల్ 3, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 4, కంప్యూటర్ సైన్స్ 9, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ 2, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 1, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 1, శాటిలైట్ కమ్యూనికేషన్ 1, ఏరోనాటికల్/ఏరోస్పేస్/ఏవియానిక్స్ 3, ఆటోమొబైల్ 1, టెక్స్టైల్ 1).
అర్హత: నిర్దేశిత బ్రాంచీల్లో ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అవివాహిత పురుష అభ్యర్థులకు మాత్రమే అవకాశం.
వయసు: జులై 1, 2021 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 2, 1994; జులై 1, 2001 మధ్య జన్మించివుండాలి.
ఆన్లైన్ దరఖాస్తులు: మార్చి 26 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు.
వెబ్సైట్: http://joinindianarmy.nic.in