1. ప్రాచీన కాలంలో బోధన, అభ్యసన ప్రక్రియలో కేంద్ర బిందువు ఎవరు?
జవాబు: ఉపాధ్యాయుడు
2. ఉత్తమమైన ప్రణాళిక, సరైన బోధనా పద్ధతులు సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటాయి అని పేర్కొన్నది?
జవాబు: డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్
3. మంచి బోధనా పద్ధతి లక్షణం ఏది?
1) విద్యార్థులకు ఆసక్తి కలిగించేది 2) సృజనాత్మక శక్తులను వెలికితీసేది
3) వైవిధ్యభరితమైన అభ్యసన అనుభవాలు ఇచ్చేది 4) పైవన్నీ
జవాబు: 4 (పైవన్నీ)
4. మేధోమథనం ఉపయోగం ఏమిటి?
1) కొత్త విషయాలను ఆలోచింపజేస్తుంది 2) ఆలోచనలను ఒక అంశంపై కేంద్రీకరింపచేస్తుంది.
3) విజ్ఞానాన్ని పెంపొందించడానికి అవకాశం కల్పిస్తుంది. 4) పైవన్నీ
జవాబు: 4 (పైవన్నీ)
5. 'సింపోజియం' వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుంది అని అన్నదెవరు?
జవాబు: స్ట్రక్
6. వాగ్వాదం నిర్వహించేటప్పుడు సమన్వయకర్తగా (Moderator) వ్యవహరించేదెవరు?
జవాబు: ఉపాధ్యాయుడు
7. సామాజీకృత కథనం ఉద్దేశాలు తెలిపిన విద్యావేత్త ఎవరు?
జవాబు: హెరాల్డ్ బెంజిమెన్
8. బోధన సామాన్యంగా పిలిచే చర్యల వరుస క్రమంలోని లాంఛనమైన స్వరూపం అని నిర్వచించింది ఎవరు?
జవాబు: బ్రేడి
9. చర్చా పద్ధతిలో చర్చను నిర్వహించేటప్పుడు నాయకుడు ఎవరు?
జవాబు: ఉపాధ్యాయుడు
10. సాంఘీకృత ఉద్గార పద్ధతి రూపం ఏది?
జవాబు: సింపోజియం
11. సాంఘీకృత కథనంలో లేని సోపానం ఏది?
1) ప్రణాళిక 2) సంసిద్ధత 3) నిర్వహణ 4) నివేదిక
జవాబు: 2) సంసిద్ధత
12. చర్చాపద్ధతికి ఒక రూపాంతరంగా చెప్పే కృత్యం ఏది?
జవాబు: వక్తృత్వం
13. ఏ పద్ధతిని ఒక మానసిక ప్రక్రియగా చెప్పవచ్చు?
జవాబు: చర్చ
14. సాంఘీకృత ఉద్గార పద్ధతి విజయవంతం కావడానికి దోహదపడే అంశం ఏది?
1) స్నేహపూరిత వాతావరణం 2) విద్యార్థుల మధ్య స్పర్థలు లేకుండా చూడటం.
3) విద్యార్థులపై నియంత్రణ ఉండటం 4) పైవన్నీ
జవాబు: 4 (పైవన్నీ)
15. ఆధునిక బోధన పద్ధతులకు మూలపురుషుడెవరు?
జవాబు: జాన్ అమోఘస్ కొమినియస్
16. ''మొత్తం నుంచి భాగాలకు వెళ్లడం" అనేది ఒక ....
జవాబు: నియమం
17. విద్యార్థులు అభ్యసనంలో క్రియాశీలురుగా, ఉత్సాహంగా, ఆసక్తితో పాల్గొనడానికి దోహదపడే పద్ధతి ఏది?
జవాబు: శిశు కేంద్రీకృత పద్ధతి
18. సామాజీకృత కథనాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉండే విధానం ఏది?
జవాబు: నియత, అనియత పద్ధతులు