1. సమాజంలో వ్యక్తి కార్యకలాపాల గురించి తెలియజేసేది ఏది?
జ: సామాజిక శాస్త్రం
2. మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రమేది?
జ: సాంఘిక శాస్త్రం
3. 'ఓకియోనామస్' అంటే-
జ: గృహనిర్వహణాధికారం
4. పరిసరాల విజ్ఞానం 1, 2 లను వేర్వేరుగా బోధించాలని పేర్కొంది
జ: ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ
5. 'హిస్టోరియా' అంటే అర్థమేమిటి?
జ: పరిశోధన, పరిశీలన
6. 'సివిటాస్' అనే పదం ఏ భాష నుంచి ఆవిర్భవించింది?
జ: లాటిన్
7. ప్రాథమిక స్థాయిలో సాంఘికశాస్త్రాన్ని సూక్ష్మంగా బోధించాలని పేర్కొంది
జ: కొఠారీ కమిషన్
8. పాఠ్యపుస్తకాల బరువును, ఇంటి పనిభారాన్ని తగ్గించాలని పేర్కొన్న కమిటీ ఏది?
జ: యశ్పాల్ కమిటీ
9. సాంఘికశాస్త్ర స్వభావం ఏమిటి?
జ: సాంకేతికపరమైన, మానవ సంబంధమైన, సాంఘికపరమైన
10. 6, 7 తరగతుల్లో పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించింది-
జ: ఎన్.సి.ఎఫ్. 2005
11. ఏ విద్యా సంవత్సరం నుంచి పరిసరాల విజ్ఞానం-I, IIలను వేర్వేరుగా బోధిస్తున్నారు?
జ: 1979-80
12. ప్రస్తుతం 1-5 తరగతుల్లో సాంఘిక, సామాన్య శాస్త్రాలను ఏమని పిలుస్తున్నారు?
జ: పరిసరాల విజ్ఞానం
13. 'పాఠశాల అనేది సూక్ష్మరూపంలో ఉన్న భారతదేశం' అని అన్నదెవరు?
జ: గాంధీజీ
14. 'మన సాంస్కృతిక వారసత్వ సంపదలను పదిలంగా కాపాడి, రాబోయే తరాల వారికి అందించడం' అనేది
జ: పరిపోషిత వికాసాభివృద్ధి