ఐఎస్బీ కార్యనిర్వాహక సంచాలకుడు డాక్టర్ కృష్ణ తణుకుతో ఇంటర్వ్యూ
నేటి యువతీయువకుల్లో సొంతంగా ఏదైనా చేయాలనే తపన పెరుగుతోంది, అందుకే ఉద్యోగానికి బదులు వ్యాపారం వైపు వారు మొగ్గు చూపుతున్నారు, రెండు మూడు దశాబ్దాల కిందట ఇలాంటి ధోరణి లేదని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) కార్యనిర్వాహక సంచాలకుడు (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్- ఈడీ) డాక్టర్ కృష్ణ తణుకు అంటున్నారు.