Asked By: లింగరాజు జల
Ans:
ప్రస్తుతం బీఈడీలో చదువుతున్న ఇంగ్లిష్, సోషల్ స్టడీస్ మెథడాలజీలతో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ రెండు పోస్టులకూ మీరు అర్హులే. వీటితో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు కూడా అర్హత ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలంటే ఇంటర్మీడియట్/ దీనికి సమానమైన కోర్సు కచ్చితంగా చదివివుండాలి. డీఈడీ/ బీఈడీల శిక్షణ తరువాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్లో ఉత్తీర్ణత సాధించాలి. టెట్లో 1 నుంచి 5 వరకు బోధించడానికి పేపర్-1 లో, 6 నుంచి 8 వరకు బోధించడానికి పేపర్-2లో ఉత్తీర్ణత సాధించాలి. పేపర్-1లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్), మేథమ్యాటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. పేపర్-2లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్), మేథమ్యాటిక్స్/ సైన్స్/సోషల్ స్టడీస్ల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి.
ఇంటర్మీడియట్, డీఈడీ లేదా ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడీ, టెట్ల్లో ఉత్తీర్ణులయినవారు డీ…ఎస్సీ పరీక్ష రాయాల్సివుంటుంది. దీనిలో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ సైకాలజీ, ఎంచుకున్న సబ్జెక్టులో కంటెంట్, మెథడాలజీల్లో ప్రశ్నలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు నవోదయ, కేంద్రీయ విద్యాలయ లాంటి జాతీయ విద్యాసంస్థల్లోనూ ప్రయత్నించండి. వీటి కోసం సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్ రాయవలసి ఉంటుంది. టెట్, సీటెట్.. రెండు పరీక్షలకూ ఒకే సిలబస్ ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్