Asked By: వి.పవన్
Ans:
- బీఎస్సీ ఎనస్తీషియా చదివాక ఎంఎస్సీ ఎనస్తీషియా కానీ, ఎనస్తీషియాలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు కానీ చేసే అవకాశం ఉంది. మీరు ఉన్నతవిద్యను విదేశాల్లో చేయాలనుకొంటే కనీసం రెండు సంవత్సరాల ఉద్యోగానుభవం పొందాకే, ఆ ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఎనస్తీషియా లాంటి ప్రొఫెషనల్ రంగాల్లో నైపుణ్యాలు చాలా అవసరం. వీటిని కోర్సు చదివే సమయంలో కంటే ఉద్యోగంలోనే ఎక్కువగా నేర్చుకొనే అవకాశం ఉంది. ఎనస్తీషియాలో పీజీ కోర్సులు యూకే, అమెరికా, కెనడా లాంటి దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా కార్డిఫ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ గాల్వే, ది కాలేజ్ ఆఫ్ అనస్తీయాలజిస్ట్స్ ఆఫ్ ఐర్లాండ్, బ్రైటన్ అండ్ ససెక్స్ మెడికల్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్ హామ్, యూనివర్సిటీ ఆఫ్ ఆల్బెట్రా, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ లా క్రోసెల్లో ఎనస్తీషియా కోర్సులున్నాయి. ఈ కోర్సు చేసినవారికి దేశ విదేశాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: prasanth
Ans:
ఎపిగ్రఫీ అంటే కఠినమైన లేదా మన్నికైన పదార్థంపై నమోదైన రాతల అధ్యయనం. దీన్నో ప్రత్యేకమైన కోర్సుగా కాకుండా హిస్టరీ/ ఆర్కియాలజీల్లో స్పెషలైజేషన్గా చదవొచ్చు. ఈ కోర్సు చదివిన తరువాత మీరు ఏ రంగంలో, ఏ విధంగా స్థిరపడాలనుకొంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. సాధారణంగా యూకేలో పీజీ కోర్సుల కాలవ్యవధి ఏడాది. ప్రత్యేకంగా ఎపిగ్రఫీలో పీజీ కోర్సులు అందుబాటులో లేవు. యూకేలో చాలా ప్రముఖ యూనివర్సిటీల్లో హిస్టరీ/ ఆర్కియాలజీలో పీజీ కోర్సులు ఉన్నాయి. వార్విక్ యూనివర్సిటీలో ఏన్షియంట్ విజువల్ అండ్ మెటీరియల్ కల్చర్లో పీజీ, యూనివర్సిటీ కాలేజ్ లండన్లో ఏన్షియంట్ హిస్టరీ పీజీ కోర్సుల్లో ఎపిగ్రఫీ సంబంధ విషయాలను బోధిస్తారు. ఇవేకాకుండా యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, యూనివర్సిటీ ఆఫ్ లండన్, కింగ్స్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరో లాంటి విద్యాసంస్థల్లో కూడా హిస్టరీ/ ఆర్కియాలజీ పీజీ కోర్సుల్లో ఎపిగ్రఫీకి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. మీకు ఆసక్తి ఉంటే హిస్టరీ/ఆర్కియాలజీలో పీజీ చేశాక, ఎపిగ్రఫీలో పీహెచ్డీ చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: సీహెచ్. సిరి
Ans:
మీరు పీజీలో డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ స్పెషలైజేషన్ సంబంధిత కోర్సులు చదవడం శ్రేయస్కరం. బీబీఏ తరువాత కనీసం రెండు సంవత్సరాలు ఈ రంగాల్లో ఏదైనా ఉద్యోగం చేసి CAT, XAT, NMAT, SNAP, MAT, CMAT, IIFT టెస్ట్ లాంటి ప్రవేశ పరీక్షలు రాసి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంబీఏ చేసే ప్రయత్నం చేయండి. చాలా ఎంబీఏ కళాశాలల్లో డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ లాంటి స్పెషలైజేషన్లు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ మార్కెటింగ్, ఆపరేషన్స్ లాంటి స్పెషలైజేషన్లలో ఇవి కోర్సులుగా ఉంటాయి. ఒకవేళ కోర్సులుగా అందుబాటులో లేనప్పటికీ మీరు సమ్మర్ ప్రాజెక్ట్, ఫైనల్ ప్రాజెక్ట్లను ఈ రంగాల్లో చేస్తే గత అనుభవం ఆధారంగా మెరుగైన ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: Manij
Ans:
The following link will help you to get an overall idea about Archeology.
MA history is available in ANU. Please check the following link for complete details.
Asked By: SAITEJA
Ans:
There is no English Medium material
For Telugu medium the following links will help you.
https://pratibha.eenadu.net/appsc
Asked By: prasanth
Ans:
ఇటీవలికాలంలో చాలా ఉద్యోగ/ప్రవేశ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గానే నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాలపాటు పెన్ను, పేపర్ పరీక్షలకు అలవాటుపడిన తరానికి మొదటిసారి సీబీటీ రాయడం కొంత కంగారు కలిగించవచ్చు. కానీ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని, మాక్ టెస్ట్లను కంప్యూటర్పై సాధన చేస్తే సీబీటీని సులువుగా రాయవచ్చు. సాధారణ రాత పరీక్షలో అభ్యర్థులు తమకు కేటాయించిన బెంచి/ కుర్చీపై కూర్చొని రైటింగ్ ప్యాడ్/ టేబుల్పై పరీక్ష రాస్తారు. కానీ సీబీటీలో వారికి కేటాయించిన కంప్యూటర్ ముందు కూర్చుంటారు. కేటాయించిన ఐడీ…, పాస్వర్డ్లతో లాగిన్ అవ్వాలి. ఆపై తెరపై ఉన్న వివరణాత్మక సూచనలను జాగ్రత్తగా చదవాలి. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నలు కంప్యూటర్ తెర మీద కనిపిస్తాయి. ప్రశ్నను జాగ్రత్తగా చదివి, సరైన సమాధానాన్ని మౌస్తో గుర్తించాలి. పరీక్ష అయ్యేవరకు కీబోర్డ్ పనిచేయదు. ఒకవేళ మీరు తప్పు సమాధానాన్ని గుర్తించినట్లు భావిస్తే, పరీక్ష పూర్తయ్యేలోపు ఎప్పుడైనా దాన్ని సరిచేసుకోవచ్చు. ఈ వెసులుబాటు పెన్ను, పేపర్ పరీక్షల్లో ఉండదు. ఏదైనా కంప్యూటర్/మౌస్ సరిగా పనిచేయకపోతే, ఆ అభ్యర్ధికి వెంటనే మరొక కంప్యూటర్/మౌస్ను కేటాయిస్తారు. ఈ మార్పిడిలో కోల్పోయిన సమయం సర్వర్లో సర్దుబాటు చేస్తారు. రాత పరీక్షలోలాగా మీరు ప్రతిసారీ టైమ్ చూసుకొనే పని లేకుండా, మానిటర్పై ఇంకా ఎంత టైమ్ మిగిలి ఉందో కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి టైమర్ సున్నాను చూపించగానే పరీక్ష పూర్తవుతుంది. మీరు గుర్తించిన సమాధానాలు వాటికవే అప్ లోడ్ అయిపోతాయి. ప్రత్యేకించి పరీక్షను క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. పరీక్ష రాసేప్పుడు సమయంతో పాటు, ఎన్ని ప్రశ్నలు చదివారు, ఎన్ని సమాధానాలు రాశారు, ఎన్నింటికి సమాధానాలు రాయలేదు, ఎన్ని సమాధానాలను రివ్యూ చేయాలని భావించారు అనే వివరాలు కూడా డిస్ ప్లే అవుతాయి. ఒకవేళ పరీక్ష సమయం పూర్తయ్యేలోపు మీరు రివ్యూ చేయాలనుకున్న సమాధానాలను రివ్యూ చేయలేకపోతే, ఆ సమాధానాలను కూడా మూల్యాంకనం చేస్తారు. మీరు పరీక్ష రాసేప్పుడు అవసరమైన కాలిక్యులేషన్స్ అన్నింటినీ ఇచ్చిన రఫ్షీట్లో మాత్రమే చేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత రఫ్ షీట్లను తప్పనిసరిగా విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్కు అందజేయాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని సీబీటీని ధైర్యంగా రాయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: రాజేష్ సెహ్వాగ్
Ans:
బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్స్తోపాటు మీరు ఏయే సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. కార్డియాలజీ టెక్నీషియన్ పీజీ డిప్లొమా చేయాలంటే చాలా యూనివర్సిటీలు, హాస్పటల్లు డిగ్రీలో కనీసం ఒక లైఫ్సైన్స్ కోర్సు చదివి ఉండాలన్న నిబంధన విధిస్తున్నాయి. కార్డియాలజీలో డిప్లొమా కోర్సులకు కూడా ఇంటర్మీడియట్లో సైన్స్ చదివి ఉండాలన్న నిబంధన ఉంది. మీరు ఇంటర్/ డిగ్రీ స్థాయిలో లైఫ్ సైన్సెస్ కోర్సు చదివివుంటే కార్డియాలజీలో డిప్లొమా/ పీజీ డిప్లొమా చేసే అవకాశం ఉంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ విషయానికొస్తే మీకు ఈ కోర్సు చదివే అర్హత ఉంటే నాన్ లోకల్ కోటాలో పోటీపడాలి. హైదరాబాద్లో చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి. మీకు విద్యార్హతలు, ఆర్ధిక వెసులుబాటు ఉంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో చదవడానికి ప్రయత్నించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: సచిన్
Ans:
పరిశోధన చేయాలంటే సాధారణంగా ప్రవేశ పరీక్ష రాయాలి. యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం యూజీసీ‡/ సీ‡ఎస్ఐఆర్ జూనియర్ రిసెర్చ్ ఫెలో, యూజీసీ/ సీ‡ఎస్ఐఆర్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్), స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (స్లెట్), గేట్లో ఉత్తీర్ణులయిన వారికి ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీల విషయానికొస్తే.. అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పరీక్ష నియమాలు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని అన్ని యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ లోనూ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సెంట్రల్ యూనివర్సిటీల్లో పీహెచ్డీ అడ్మిషన్ కోసం ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షలు రాయవలసి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకూ కామన్ ఎంట్రన్స్ పరీక్ష పెట్టాలని ఆలోచిస్తున్నారు. పీహెచ్డీ ప్రవేశానికి ఇంటర్వ్యూ తప్పనిసరి. ఇంటర్వ్యూలో పరిశోధన అంశం, సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం, పరిశోధన నైపుణ్యాలను పరిశీలిస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులకు ఇంటర్వ్యూ మార్కులు కలిపి మెరిట్ లిస్టు తయారుచేసి పీహెచ్డీలో ప్రవేశాలు కల్పిస్తారు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: జయశ్రీ
Ans:
- స్కాలస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ (శాట్)ను కాలేజ్ బోర్డ్ నిర్వహిస్తుంది. అమెరికా, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కళాశాలల్లో అడ్మిషన్ తీసుకోవాలనుకునేవారు ఈ పరీక్ష రాయాలి. ఇంటర్మీడియట్/ 12 క్లాస్ పూర్తయినవారు ఈ పరీక్ష రాయవచ్చు. శాట్లో రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్ అనే మూడు విభాగాలుంటాయి. రీడింగ్లో లిటరేచర్, హిస్టారికల్ డాక్యుమెంట్స్, సోషల్ సైన్సెస్, నేచురల్ సైన్సెస్లో ప్యాసేజ్లు ఉంటాయి. రైటింగ్లో గ్రామర్, ఒకాబ్యులరీ, ఎడిటింగ్ మెలకువలు ఉంటాయి. మ్యాథ్స్ విషయానికొస్తే దీనిలో రెండు భాగాలుంటాయి. ఒకటి కాలిక్యులేటర్ ఉపయోగించి సమాధానాలు కనుగొనడం, మరొకటి కాలిక్యులేటర్ ఉపయోగించకుండా సమాధానాలు కనుగొనడం. మ్యాథ్స్ విభాగంలో ప్రశ్నలు ఆల్జీబ్రా, జ్యామెట్రీ, ట్రిగొనమెట్రీల నుంచి ఉంటాయి. శాట్ని ఒక సంవత్సరంలో ఆరు సార్లు నిర్వహిస్తారు. దీన్ని ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. జేఈఈ మెయిన్స్, శాట్ అనేవి రెండు విభిన్నమైన పరీక్షలు. జేఈఈ మెయిన్స్లో మ్యాథ్స్ కంటే, శాట్లో మ్యాథ్స్ సులభంగానే ఉంటుంది. శాట్లో నెగెటివ్ మార్కులు లేవు. ముందునుంచే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయితే శాట్లో మంచి స్కోరు తెచ్చుకోవడం కష్టమేమీ కాదు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: రాజేష్ సెహ్వాగ్
Ans:
ఏ రాష్ట్రంలో డిగ్రీ చదువుకున్నా హైదరాబాద్లో పీజీ డిప్లొమా కోర్సు నిరభ్యంతరంగా చేయవచ్చు. కాకపోతే మీరు డిగ్రీ పొందిన యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉండాలి. మీరు డిగ్రీలో ఏం చదివారో, ఇప్పుడు ఏ కోర్సు, ఏ యూనివర్సిటీలో చదవాలనుకొంటున్నారో చెప్పలేదు. హైదరాబాద్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, నేషనల్ లా యూనివర్సిటీలు పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. ఒక్కో యూనివర్సిటీ, ఒక్కో సమయంలో ప్రకటనలు విడుదలచేస్తుంది. మీరు ఆయా యూనివర్సిటీల వెబ్సైట్లకు వెళ్ళి, అడ్మిషన్ నోటిఫికేషన్ వివరాలు చూసి, నచ్చిన కోర్సుకు మీ విద్యార్హతలు సరిపోతాయో లేదో పరిశీలించి పీజీ డిప్లొమా కోర్సు చేయండి.- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్