Asked By: ప్రవీణ్
Ans:
ఇతర దేశాల్లో ఒక్కో యూనివర్సిటీ ఒక్కో రకమైన ప్రవేశ పద్ధతిని అనుసరిస్తుంది. విదేశాల్లో ఉన్న చాలా విశ్వవిద్యాలయాలు ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి శాట్ పరీక్షలో వచ్చిన స్కోరుతో పాటు ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యాన్ని పరీక్షించే టోఫెల్/ ఐఈఎల్ టీఎస్/ పీటీఈలో కూడా మంచి స్కోర్ను ఆశిస్తాయి. మరికొన్ని యూనివర్సిటీలు మాత్రం శాట్/యాక్ట్/ టోఫెల్/ఐఈఎల్ టీఎస్/ పీటీఈల్లో ఏదో ఒక స్కోరును పరిగణించి కూడా ప్రవేశాలు కల్పిస్తాయి. ఈ పరీక్షల్లో అత్యుత్తమ స్కోరు సాధించినట్లయితే మీకు మంచి ఫైనాన్సియల్ ఎయిడ్ కూడా వచ్చే అవకాశం ఉంది.
కంప్యూటర్ ఇంజినీరింగ్ కోర్సు విదేశాల్లోని చాలా యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంది. మీరు చదవాలనుకొంటున్న యూనివర్సిటీల వెబ్ సైట్లకు వెళ్ళి ప్రవేశానికి అవసరమైన పరీక్షలు, రావాల్సిన స్కోర్ల గురించి తెలుసుకొని ఆ దిశలో ప్రయత్నాలు చేయండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే- పైన చెప్పిన పరీక్షలతో పాటు దరఖాస్తులో మీరు పేర్కొన్న మీ గత విజయాలు, మార్కులు, ప్రాజెక్టులు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డ్లు, ఈ కోర్సు మీరు ఎందుకు చదవాలనుకొంటున్నారో తెలిపే వ్యాసం, అన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని ప్రవేశం కల్పిస్తారు. వీటన్నింటి గురించి పూర్తి అవగాహనకు అవసరమైతే ఏదైనా నమ్మకమైన ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీనీ సంప్రదించవచ్చు.
- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: సరిత
Ans:
పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ చేసి సైకాలజీ చదవాలనుకొంటున్న నిర్ణయం సరైనదే కానీ, దూరవిద్యలో విదేశీ యూనివర్సిటీ నుంచి చేయాలనుకోవడం గురించి మరోసారి ఆలోచించండి. సాధరణంగా చాలా విదేశీ యూనివర్సిటీలు ఎంబీఏ, ఎంఎస్సీ డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్ లాంటి పాపులర్ కోర్సులను ఆన్లైన్ విధానంలో అందిస్తున్నాయి. ఈ కోర్సులకు ఫీజు కూడా ఎక్కువే. అతితక్కువ విదేశీ వర్సిటీలు మాత్రమే సైకాలజీ కోర్సును ఆన్లైన్లో అందిస్తున్నాయి. చేరేముందు ఆ విదేశీ యూనివర్సిటీల నాణ్యతా ప్రమాణాలను లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సైకాలజీ లాంటి ప్రొఫెషనల్ కోర్సును దూరవిద్య ద్వారా కాకుండా రెగ్యులర్గా చదవడం శ్రేయస్కరం. అవకాశం ఉంటే- విదేశీ వర్సిటీల్లో సైకాలజీని రెగ్యులర్ పద్దతిలో చదివే ప్రయత్నం చేయండి. ఈ సబ్జెక్టుపై అంతగా ఆసక్తి ఉంటే మనదేశంలోనే రెగ్యులర్ /దూరవిద్య ద్వారా చదివి, పీ‡హెచ్డీ కోసం విదేశాలకు వెళ్లటం మేలు. కోర్స్ ఎరా, ఎడెక్స్, యుడెమి లాంటి ఆన్లైన్ వేదికల ద్వారా సైకాలజీలో మీకు నచ్చిన అంశం ఎంచుకొని చదివి సబ్జెక్టుపై అవగాహన పెంచుకోండి. సైకాలజీ రంగంలో స్థిరపడాలనుకొంటే మనదేశంలోనే కౌన్సెలింగ్ లాంటి సబ్జెక్టుల్లో పీజీ/ పీజీ డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సులు చేసే అవకాశం ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: కె. ప్రశాంత్
Ans:
బీఏ ( సోషల్ సైన్స్) చదివినవారు మంచి ఉద్యోగావకాశాల కోసం చాలా రకాల కోర్సులు చదవొచ్చు. బీఏలో మీరు చదివిన సోషల్ సైన్స్ సబ్జెక్టుల్లో, మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేయండి. భాషాశాస్త్రాల్లో ఆసక్తి ఉంటే, డిగ్రీలో మీరు చదివిన లాంగ్వేజెస్కు సంబంధించిన తెలుగు/హిందీ/ఇంగ్లిష్/ లింగ్విస్టిక్స్/ఉర్ద్డూ/ సంస్కృతం/ ట్రాన్స్లేషన్ స్టడీస్/ కంపేరిటివ్ లిటరేచర్లో పీజీ చేయవచ్చు. బోధన వృత్తిపై ఆసక్తి ఉంటే బీఈడీ చేసి ఆ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. ప్రాధమిక పాఠశాలల్లో బోధన కోసం డీఈడీ కోర్సు కూడా చేయవచ్చు. భాషా పండితునిగా స్థిరపడాలనుకొంటే భాషా పండిట్ శిక్షణ పొందవచ్చు. క్రీడల పట్ల ఆసక్తి ఉంటే బేచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో శిక్షణ పొంది వ్యాయామ ఉపాధ్యాయుడిగా స్థిరపడవచ్చు. న్యాయశాస్త్రంలో ఆసక్తి ఉంటే లా కోర్సు, మేనేజ్మెంట్పై ఇష్టముంటే ఎంబీఏ చేయవచ్చు. పర్యాటక రంగంలో అభిరుచి ఉంటే టూరిజం మేనేజ్మెంట్, ఆతిథ్య రంగంలో ఆసక్తి ఉంటే హోటల్ మేనేజ్మెంట్, పురావస్తుశాస్త్రం ఇష్టమైతే ఆర్కియాలజీ, నటనారంగం నచ్చితే థియేటర్ ఆర్ట్స్ లాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఇవే కాకుండా ఫిలాసఫీ, ఆంత్రొపాలజీ, సైకాలజీ, జాగ్రఫీ, ఎడ్యుకేషన్, సోషియాలజీ, హ్యూమన్ రైట్స్, జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటి కోర్సుల గురించీ ఆలోచించవచ్చు. మీరు ఇంటర్మీడియట్ స్థాయిలో మేథమేటిక్స్ చదివివుంటే ఎంసీఏ లాంటి కోర్సులు చేయవచ్చు. పబ్లిక్ పాలసీ, డెవలప్మెంట్ స్టడీస్, రీజనల్ స్టడీస్, ఫైనాన్షియల్ ఎకానమిక్స్, యానిమేషన్, మల్టీమీడియా, ఫ్యాషన్ టెక్నాలజీ లాంటి వినూత్న కోర్సులు కూడా చేసే అవకాశం ఉంది.
Asked By: ఎం. చంద్రశేఖర్
Ans:
డిగ్రీ మొదటి సంవత్సరంలోనే విదేశాల్లో పీజీ చదవడం గురించి ఆలోచించటం అభినందనీయం. సాధారణంగా విదేశాల్లో పీజీ చేయాలంటే ఆంగ్ల భాషలో ప్రావీణ్యం అవసరం. చాలా విదేశీ యూనివర్సిటీలు ఆంగ్లభాషా నైపుణ్యం పరీక్షించడానికి టోఫెల్, ఐఈఎల్టీఎస్, పీటీఈ లాంటి పరీక్షల్లో వచ్చిన స్కోరును ప్రామాణికంగా తీసుకొంటాయిు. కొన్ని యూనివర్సిటీలు ఆంగ్లభాషలో ప్రావీణ్యంతో పాటు జీఆర్ఈ/ జీమ్యాట్ లాంటి పరీక్షల్లో వచ్చిన స్కోరును కూడా పరిగణించి ప్రవేశాలు కల్పిస్తాయి. మీరు చదవాలనుకునే దేశం, కోర్సు, యూనివర్సిటీలను బట్టి రాయాల్సిన పరీక్షలను ఎంచుకోండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: - ఎం. చంద్రశేఖర్
Ans:
డిగ్రీ మొదటి సంవత్సరంలోనే విదేశాల్లో పీజీ చదవడం గురించి ఆలోచించటం అభినందనీయం. సాధారణంగా విదేశాల్లో పీజీ చేయాలంటే ఆంగ్ల భాషలో ప్రావీణ్యం అవసరం. చాలా విదేశీ యూనివర్సిటీలు ఆంగ్లభాషా నైపుణ్యం పరీక్షించడానికి టోఫెల్, ఐఈఎల్టీఎస్, పీటీఈ లాంటి పరీక్షల్లో వచ్చిన స్కోరును ప్రామాణికంగా తీసుకొంటాయిు. కొన్ని యూనివర్సిటీలు ఆంగ్లభాషలో ప్రావీణ్యంతో పాటు జీఆర్ఈ/ జీమ్యాట్ లాంటి పరీక్షల్లో వచ్చిన స్కోరును కూడా పరిగణించి ప్రవేశాలు కల్పిస్తాయి. మీరు చదవాలనుకునే దేశం, కోర్సు, యూనివర్సిటీలను బట్టి రాయాల్సిన పరీక్షలను ఎంచుకోండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: పి. సాయిశ్రీ
Ans:
మీరు నిరభ్యంతరంగా విదేశీ యూనివర్సిటీల్లో ఎంఏ చదవవచ్చు. కొన్ని విదేశీ వర్సిటీలు మాత్రం నాలుగు సంవత్సరాల డిగ్రీ చదివిన వారికే ఎంఏలో ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. చాలా విదేశీ విశ్వవిద్యాలయాలు ఆంగ్ల భాషకు సంబంధించిన పరీక్ష స్కోరుతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఆంగ్ల భాషలో ప్రావీణ్యాన్ని పరీక్షించడం కోసం టోఫెల్, ఐఈఎల్టీఎస్, పీటీఈ లాంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వివిధ దేశాల్లోని వివిధ యూనివర్సిటీలు ఒక్కో రకమైన పరీక్షలో వచ్చిన స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. కొన్ని యూనివర్సిటీలు ఈ మూడు పరీక్షల్లో ఏ పరీక్ష ద్వారానైనా ప్రవేశాలు కల్పిస్తాయి. అతి తక్కువ యూనివర్సిటీలు మాత్రమే ఎలాంటి ప్రవేశ పరీక్షా లేకుండా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మీరు ఎంఏ తరువాత పీ‡హెచ్డీ చేయాలనుకొంటే ఇంటిగ్రేటెడ్ ఎంఏ పీహెచ్డీ ప్రోగ్రామ్ ఉంది. విదేశీ యూనివర్సిటీల్లో పీజీ చేయాలంటే ఖర్చు లక్షల్లో ఉంటుంది. అతి కొద్ది యూనివర్సిటీలు మాత్రమే అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులకు స్కాలర్షిప్లు అందిస్తున్నాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: రాజేష్
Ans:
ఒక రెగ్యులర్ డిగ్రీతో పాటు మరో డిగ్రీని ఓపెన్/ డిస్టెన్స్/ఆన్లైన్లో చేయవచ్చన్న ప్రతిపాదనను యూజీసీ మే 2020లో ఆమోదించినట్లుగా అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. యూజీసీ నోటిఫికేషన్ అన్ని వివరాలతో వస్తుందని అందరూ ఆశించారు. కానీ సంబంధిత పూర్తి నోటిఫికేషన్ యూజీసీ వెబ్సైట్లో ఇంకా అందుబాటులో లేదు. రెండు డిగ్రీల్లో ఒకటి మామూలు డిగ్రీ, మరొకటి ప్రొఫెషనల్ కోర్సు అయితే ఈ అవకాశం వర్తిస్తుందా అనేదానిపై కూడా స్పష్టత లేదు. మీరు విడివిడిగా రెండు డిగ్రీలను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. ఈ నిర్ణయం 2020లో తీసుకున్నారు కాబట్టి, 2020కి ముందు చదివినవారికి వెసులుబాటు ఉంటుందా, ఉండదా అనేది యూజీసీ పూర్తి నోటిఫికేషన్ వచ్చాకే తెలుస్తుంది. - ప్రొ.బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎం నాగరాజు
Ans:
బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ కోర్సును హైదరాబాద్ చంచల్గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలల్లో అందిస్తున్నారు. ఇంకా చాలా కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. లయోలా అకాడెమీ సికిందరాబాద్, సెయింట్ జోసెఫ్ కాలేజ్, భారతీయ విద్యాభవన్, వివేకానంద కాలేజ్, అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్, బద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్, ప్రగతి మహా విద్యాలయ, ఆంధ్ర మహిళాసభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, జాహ్నవి డిగ్రీ కాలేజ్, ప్రగతి డిగ్రీ కాలేజ్, నోబుల్ డిగ్రీ కాలేజ్, ఆర్ జి కేడియా కాలేజ్ ఆఫ్ కామర్స్, గీతాంజలి విమెన్స్ డిగ్రీ కాలేజ్, సిద్దార్థ డిగ్రీ కాలేజ్, ధ్రువ డిగ్రీ కాలేజ్, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సెస్, మేఘన డిగ్రీ కాలేజ్, తపస్య డిగ్రీ కాలేజ్..వాటిలో కొన్ని. మీకు డిగ్రీలో బిజినెస్ అనలిటిక్స్ కోర్సు చేయాలనుకొంటే బీబీఎ బిజినెస్ అనలిటిక్స్ కూడా అందుబాటులో ఉంది. సిలబస్ పరంగా బీకామ్ బిజినెస్ అనలిటిక్స్, బీబీఎ బిజినెస్ అనలిటిక్స్ల మధ్య పెద్ద తేడా లేదు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఆశ్రిత
Ans:
ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ తిరుపతి, ఎన్ఐటీ వరంగల్, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ, కేఎల్ యూనివర్సిటీల్లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ కోర్సు అందుబాటులో ఉంది. వీటితో పాటు కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలూ ఈ కోర్సును అందిస్తున్నాయి. చాలా విద్యాసంస్థల్లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చదవాలంటే బీఈ/ బీటెక్లో సివిల్ ఇంజినీరింగ్ కచ్చితంగా చదివి ఉండాలన్న నిబంధన ఉంది. జీఏంఆర్ఐటీ రాజంలో ఈ కోర్సును కెమికల్ ఇంజినీరింగ్ విభాగం వారు అందిస్తున్నారు.
ఈ కోర్సు చదివిన తరువాత పురుషులకూ, మహిళలకూ ఉద్యోగావకాశాలు సమానమే. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ కోర్సు చదివినవారికి కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇంజినీర్, ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ డిజైన్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు వస్తాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఉమా శ్రీకాంత్
Ans:
ఫిజికల్ కెమిస్ట్రీ కోర్సు మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీల సమ్మేళనం. దీనిలో ఎక్కువగా అనలిటికల్ కెమిస్ట్రీ, కంప్యుటేషనల్ కెమిస్ట్రీలను నేర్చుకొంటారు. ఈ కోర్సులో ముఖ్యంగా పరిశ్రమల్లో కెమిస్ట్రీ వినియోగం తెలుసుకుంటారు. ఫిజికల్ కెమిస్ట్రీ రంగంలో రాణించాలంటే గణితంలోని ప్రాథమిక సూత్రాలపై మంచి అవగాహన ఉండాలి.
ఎంఎస్సీ (ఫిజికల్ కెమిస్ట్రీ) చదివితే ప్రైవేటు ఫార్మా, ఫుడ్, కాస్మొటిక్స్, బయో టెక్నాలజీ లాంటి కంపెనీల్లో, బోధన రంగంలో చాలా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఇస్రో, డీఆర్డీఓ, ఓఎన్జీసీ, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ ప్రయోగశాలల్లో, కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని కెమిస్ట్రీ ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు/సైంటిఫిక్ ఆఫీసర్/ టెక్నికల్ ఆఫీసర్/ సైంటిఫిక్ అసిస్టెంట్/ ల్యాబ్ అసిస్టెంట్/ రిసెర్చ్ అసిస్టెంట్గా ఉద్యోగాలు పొందొచ్చు.
బోధన రంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ చేసి స్కూల్ అసిస్టెంట్/ టీజీటీ/ పీజీటీగా పాఠశాలల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఇవే కాకుండా ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కెమిస్ట్రీ లెక్చరర్గా స్థిర పడవచ్చు. నెట్/సెట్ లో ఉత్తీర్ణత సాధించి డిగ్రీ కళాశాలల్లో కెమిస్ట్రీలో సహాయ ఆచార్యుడిగా ఉద్యోగం పొందవచ్చు. ఫిజికల్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసి కేంద్ర/ రాష్ట్ర/ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుడిగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. పరిశోధనలపై ఎక్కువ ఆసక్తి ఉంటే విదేశాల్లో పోస్ట్ డాక్టొరల్ పరిశోధన కోసం ప్రయత్నించవచ్చు. ఎంఎస్సీ (ఫిజికల్ కెమిస్ట్రీ) తర్వాత గేట్ రాసి ఐఐటీ, ఎన్ఐటీల్లో ఎమ్టెక్ చేసి ఇంజినీరింగ్ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హత సాధించవచ్చు. ఫిజికల్ కెమిస్ట్రీ కోర్సు చేసినవారికి కెమికల్ ఇంజినీరింగ్ పరిశ్రమల్లో అధిక ప్రాధాన్యం ఉంటుంది. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్