Asked By: పి.శ్యామ్
Ans:
ఐఏఎస్ అవ్వాలంటే యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపాలి. సివిల్స్ లాంటి పరీక్షకు.. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే సన్నద్ధం అయితే ఫలితాలు బాగుంటాయి. ముందుగా యూపీఎస్సీ వెబ్సైట్ని సందర్శించి సివిల్ సర్వీసెస్కు సంబంధించిన సిలబస్, పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి ఈ పరీక్షపై అవగాహన ఏర్పరుచుకోండి. సిలబస్ ఆధారంగా ప్రామాణిక పుస్తకాలను సమకూర్చుకోండి. క్రమం తప్పకుండా దినపత్రికల్ని చదవండి. సంపాదకీయ పేజీలో వచ్చే వ్యాసాలను తప్పకుండా చదవండి. ఇప్పటికే ఈ పరీక్షకు సన్నద్ధం అయ్యేవారి సలహాలూ, సూచనలను స్వీకరించండి. సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్న సివిల్స్ విజేతల ఇంటర్వ్యూలను చూస్తూ ప్రేరణ పొందండి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విషయ విశ్లేషణా సామర్థ్యాలను కూడా పెంపొందించుకోండి. సీశాట్ పరీక్ష కోసం ఇప్పటినుంచే సన్నద్ధంకండి. మెయిన్స్ పరీక్షకు రాయబోయే ఆప్షనల్ సబ్జెక్ట్ను ముందే ఎంచుకోండి. రోజుకు ఎన్ని గంటలు చదవాలనుకుంటున్నారో.. అందుకు అనుగుణంగా షెడ్యూల్ని సిద్ధం చేసుకోండి. చదివిన విషయాల్ని వీలున్నప్పుడల్లా పునశ్చరణ చేస్తూ ఉండండి. వీలైనన్ని మాక్ టెస్ట్లు రాయండి. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు నేరుగా దొరకవు. ప్రాథమిక అంశాలపై గట్టిపట్టు ఉండి, నిరంతరం చదివే అలవాటు ఉన్నవారు ఈ ప్రశ్నలకు సులువుగా సమాధానాలు రాయగలరు. ముఖ్యంగా మెయిన్స్ పరీక్షలో రాయవలసిన దీర్ఘ వ్యాసాలపై అవగాహన పెంచుకుని, అవి రాయడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోండి. పైన చెప్పిన విషయాలన్నింటినీ పాటిస్తూ.. ఐఏఎస్ అవ్వాలన్న మీ కలను నిజం చేసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎం. విజయ
Ans:
బీఫార్మసీ చదివిన తరువాత ఎంఫార్మసీ, ఫార్మ్ డీ.., ఎంఎస్సీ- ఫార్మాస్యూటికల్ సైన్స్, ఎంబీఏ- ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్, ఎంబీఏ- హెల్త్కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ లాంటి కోర్సులు చేయవచ్చు. వీటితో పాటు ఫార్మసీ మేనేజ్మెంట్, క్లినికల్ రిసెర్చ్, డ్రగ్ స్టోర్ మేనేజ్మెంట్, క్లినికల్ ట్రయల్ మేనేజ్మెంట్ల్లో డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సులు కూడా చేసే వీలుంది. ఉద్యోగావకాశాల విషయానికొస్తే- బీఫార్మసీ విద్యార్హతతో డ్రగ్ ఇన్స్పెక్టర్, హాస్పిటల్ ఫార్మసిస్ట్, కమ్యూనిటీ ఫార్మసిస్ట్, క్లినికల్ రిసెర్చ్ అసోసియేట్, క్వాలిటీ కంట్రోల్ అసోసియేట్, మెడికల్ రిప్రజెంటేటివ్, ఫార్ములేషన్ డెవలప్మెంట్ అసోసియేట్, మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ లాంటి ఉద్యోగావకాశాలుంటాయి.
ప్రస్తుతం గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేరవుతున్నాను అన్నారు. ఈ పరీక్షలకు అన్నిరకాల డిగ్రీలు చదివినవారూ అర్హులే కాబట్టి, పోటీ ఎక్కువ. అంతేకాకుండా మీరు బీఫార్మసీలో చదివిన సిలబస్కూ, గ్రూప్స్ సిలబస్కూ సంబంధం ఉండదు. దీంతో మీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఫార్మసీ ఉద్యోగాలకు ఫార్మసీ చదివినవారితోనే పోటీపడతారు కాబట్టి పోటీకి తక్కువ అవకాశం ఉంటుంది. గ్రూప్స్కు సన్నద్ధమయ్యే క్రమంలో మీరు కనీసం రెండు సంవత్సరాలు ఫార్మసీ సబ్జెక్టుకు దూరం అవుతారు. ఒకవేళ మీరు గ్రూప్స్లో విజయం సాధించలేకపోతే తరువాత ఫార్మసీ రంగంలో ఉద్యోగం పొందడం కొంత కష్టం కావొచ్చు. గ్రూప్స్ పరీక్షలు రాయాలా, ఫార్మసీ రంగంలో ఉద్యోగం చేయాలా అనేది మీ కెరియర్ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
Asked By: అపురూప
Ans:
మీరు ఫ్రీలాన్సర్గా ఏ రంగంలో ఉండాలనుకొంటున్నారు? అందుకు సాంకేతిక నైపుణ్యం ఎందుకు అవసరం? ఈ విషయాలపై స్పష్టత లేదు. ఫ్రీలాన్సర్గా పనిచేయాలంటే సమకాలీన సమాజ పరిస్థితులపై స్పష్టత, నిశిత పరిశీలన, సంబంధిత పుస్తకాలను విమర్శనాత్మకంగా చదవడం, పరిశోధనలో ప్రాథ]మిక పద్దతులపై అవగాహన, సృజనాత్మకత, భాషపై మంచి పట్టు, అనువాద నైపుణ్యాలు చాలా అవసరం. ఇక సాంకేతిక నైపుణ్యాల విషయానికొస్తే- కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంటర్నెట్ వాడటంలో మెలకువలు పెంపొందించుకోండి. ఎంఎస్ ఆఫీస్లో శిక్షణ పొందండి. తెలుగు, ఇంగ్లిష్ల్లో వేగంగా టైప్ చేయడం నేర్చుకోండి. చివరిగా.. ప్రాంతీయ భాషల్లో ఫ్రీలాన్సర్గా ఉంటే ఆకర్షణీయ వేతనాలు అంతగా ఉండవు. మీరు ఏదైనా వృత్తితో పాటు ఫ్రీలాన్సింగ్ని ఒక ప్రవృత్తిగా మాత్రమే పెట్టుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: విశ్వనాథ్
Ans:
ముందుగా మీరు సప్లయ్ చెయిన్ మేనేజ్మెంట్ (ఎస్సీఎం) కోర్సును ఎందుకు చదవాలనుకుంటున్నారు.. ఇది చదివాక ఏ రంగంలో, ఏ ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటున్నారు.. అనే విషయాలపై స్పష్టత అవసరం. సాధారణంగా సప్లయ్ చెయిన్ మేనేజ్మెంట్ ఎంబీఏలో ఒక స్పెషలైజేషన్గా కానీ, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్లో ఒక సబ్జెక్ట్గా కానీ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీలు ప్రత్యేకమైన ఎంబీఏ-ఎస్సీఎం కోర్సును కూడా అందిస్తున్నాయి. చాలా ప్రైవేటు యూనివర్సిటీలు ఆన్లైన్లోనూ ఎస్సీఎం ఎంబీఏ అందిస్తున్నాయి. మణిపాల్, నార్సీమోన్జి, సింబయాసిస్, లవ్లీ ప్రాఫెషనల్, శివనాడార్, ఎస్ఆర్ఎం, శాస్త్ర, డీవై పాటిల్, కోనేరు లక్ష్మయ్య, విజ్ఞాన్, జైన్ యూనివర్సిటీలతోపాటు మరికొన్ని యూనివర్సిటీల్లో కూడా ఈ కోర్సు ఎంబీఏ/పీజీ డిప్ల్లొమా ప్రోగ్రామ్ల్లో అందుబాటులో ఉంది.
ఫీజు విషయానికొస్తే.. ఒక్కో విద్యా సంస్థలో, ఒక్కో రకంగా ఉంటోంది. మన దేశంలో నాలుగు సెమిస్టర్లతో కూడిన రెండు సంవత్సరాల ఎంబీఏ - సప్లయ్ చెయిన్ మేనేజ్మెంట్ కోర్సుకు కనీసం రూ. యాభై వేలు చెల్లించాలి. ఏదైనా యూనివర్సిటీని ఎంచుకునే ముందు.. ఆ యూనివర్సిటీకి, కోర్సుకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో నిర్ధారించుకోవాలి. అయితే ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులను దూరవిద్య ద్వారా కాకుండా రెగ్యులర్గా చదివితేనే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: prasanth
Ans:
- ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ చదివితే ఇస్లామిక్ ట్రాన్స్లేటర్, ఇస్లామిక్ జర్నలిస్టు అవొచ్చు. బీఈడీ చేసి ఇస్లామిక్ టీచర్లుగా, పీహెచ్డీ చేసి ఇస్లామిక్ అధ్యాపకులుగా, ఇస్లామిక్ పరిశోధకులుగా, ఇస్లామిక్ కంటెంట్ రైటర్లుగా, ఇస్లాం మత ప్రచారకులుగా, క్యాలిగ్రాఫర్లుగా ఉద్యోగాలు చేయవచ్చు. ఇవేకాకుండా స్వచ్ఛంద సేవా సంస్థల్లో, వ్యాపార సంస్థల్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీసుల్లో, డిఫెన్స్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్లలో కొలువుల్లో చేరే అవకాశం ఉంది. వీటితో పాటు డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ప్రయత్నించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: పి.బాలకృష్ణ
Ans:
మీకు నచ్చిన ఉద్యోగం చేయడం ఎప్పుడూ శ్రేయస్కరం. చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం చేయడం అదృష్టం కూడా! ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది చదివిన కోర్సుకూ, చేయాలనుకొన్న - చేస్తున్న కొలువుకూ ఎలాంటి సంబంధం ఉండట్లేదు. దీంతో కొందరు ఉద్యోగాలు మారే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. టూరిజం రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు హిస్టరీ అండ్ టూరిజంలో పీజీ చేశారు కాబట్టి ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం, బీబీఏ టూరిజం చదివినవారితో పోటీ పడాల్సి ఉంటుంది. మీరు ఈ రంగంలో రాణించాలంటే- కంప్యూటర్, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోండి. అవకాశం ఉంటే తెలుగు, ఇంగ్లిష్లతో పాటు హిందీ, మరో విదేశీ భాషను నేర్చుకొనే ప్రయత్నం చేయండి. టూరిజం రంగంలోనే స్థిరపడాలనుకొంటే ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ చదివే ప్రయత్నం కూడా చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: పి.హరితేజ
Ans:
ఇంజినీరింగ్లో ఈసీఈ చదువుతూ సీ‡ఎస్ఈ విద్యార్థిలా కోడింగ్ చేయగలగడం పెద్ద కష్టమేమీ కాదు. ముందుగా ఈ రెండు బ్రాంచ్ల సిలబస్ పరిశీలించండి. రెండిటిలో కామన్గా ఉన్న సబ్జెక్టులను ఎలాగూ మీరు చదువుతారు. సీఎస్ఈలో కోడింగ్కి సంబంధించిన సబ్జెక్టులు ఏమున్నాయో తెలుసుకొని వాటిని నేర్చుకొనే ప్రయత్నం చేయండి. ముందుగా ఎంఎస్ ఎక్సెల్, సీ, సీ ప్లస్ ప్లస్, ఆర్, జావా, పైతాన్ ప్రోగ్రామింగ్లను నేర్చుకోవడం మొదలుపెట్టండి. తరువాత వెబ్ డెవలప్మెంట్ లాంటి కోర్సులను కూడా చేయండి. వీటితో పాటు కోర్స్ఎరా, యుడెమి, ఎడెక్స్, ఉడాసిటీ, ఖాన్ అకాడెమీ, స్వయం, ఎన్పీటెల్తో పాటు కోడింగ్కి సంబంధించిన ప్రత్యేక ఆన్లైన్ ప్లాట్ఫామ్ల నుంచి సరైన కోర్సులు చేయండి. కోడింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈసీఈ కోర్సును నిర్లక్ష్యం చేయకండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: లావణ్య
Ans:
ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. చాలామంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నదే! ఈ సమస్యకు పరిష్కారం చెప్పడం తేలికే కానీ, దాని అమలులో చాలా ఇబ్బందులున్నాయి. మీ అబ్బాయి డిగ్రీ చదివి, సివిల్స్కు సన్నద్ధం అవుతున్నాడంటే, అతడికి కనీసం 22 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ వయసు పిల్లల్ని నియంత్రించాలి అనుకోవడమే అసలు సమస్య. సివిల్స్ సన్నద్ధత అనేది అతని ఆశయమా? మీ ఆశయమా? ఒకవేళ, అది అతని ఆశయమే అయితే ఒకసారి మాట్లాడి చూడండి. చాలా సందర్భాల్లో సమస్య పరిష్కారం కాకపోగా జటిలం అయ్యే అవకాశాలూ ఉంటాయి కాబట్టి, తెగేవరకు లాగకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అలా మాట్లాడటంలో మీకేమైనా ఇబ్బంది ఉంటే, మీ బంధువుల్లో మీ అబ్బాయికి బాగా నచ్చినవారితో మాట్లాడించండి. అలా కూడా కుదరని పక్షంలో, మీ అబ్బాయి స్నేహితులు ఎవరైనా ఉంటే, వారితో మాట్లాడించండి, లేదా మీ అబ్బాయికి నచ్చిన ఉపాధ్యాయులతో లేదా అధ్యాపకులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. చివరి ప్రయత్నంగా ఎవరైనా కౌన్సెలర్ దగ్గరకు తీసుకు వెళ్ళండి. వీటన్నింటికి ముందు మీ అబ్బాయికి సివిల్స్ పరీక్ష రాయడానికి అవసరమైన ప్రేరణ ఉందో, లేదో నిర్ధÄరించుకోండి. అందుకోసం, ఇప్పటికే సివిల్స్లో ర్యాంకు సాధించినవారితో మాట్లాడించి చూడండి.
ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు ఉద్యోగం చేయడం లేదని చెప్పడం ఇష్టం లేక, సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నామని చెబుతున్నారు. పైన చెప్పిన వాటిలో మీ అబ్బాయి సమస్యకు ఏది సరైన పరిష్కారమో మీరే నిర్థరించుకోండి. రాత్రులు సోషల్ మీడియాలో ఉండటం, వీడియో గేమ్స్ ఆడటం, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, వారాంతాల్లో సినిమాలు చూడటం.. ఈతరం పిల్లల్లో దాదాపుగా సహజం అయిపోయింది. ముఖ్యంగా 2000 సంవత్సరానికి అటూ, ఇటుగా పుట్టిన పిల్లల్లో చాలామంది ఇలానే ఉన్నారు. మీ అబ్బాయిని ప్రత్యేకంగా చూడకండి. ఈ తరం పిల్లల్లో ఉన్న మరో ముఖ్యమైన లక్షణం ఏంటంటే- వారికి నచ్చినదాన్ని సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. ఇష్టం లేకపోతే, లక్షల రూపాయల ఉద్యోగాన్ని కూడా మరో ఆలోచన లేకుండా వదిలివేయగలరు.
మీ అబ్బాయి భవిష్యత్తు గురించి ఎక్కువగా దిగులు పడకండి. చివరిగా- సివిల్స్ పరీక్షకు ఎన్ని గంటలు చదవాలి అనే ప్రామాణికాలు ఏమీ ఉండవు. ఎంతసేపు చదవాలి అనేది, మీ అబ్బాయి మేధా సామర్థ్యం, ఎంచుకొన్న ఆప్షనల్, జ్ఞాపకశక్తి, విశ్లేషణ శక్తి, ప్రేరణ లాంటి చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఎక్కువసేపు చదవకపోయినా సంగ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. మరికొంతమందికి ఎంతసేపు చదివినా అర్థం కాకపోవచ్చు. మీ అబ్బాయి ఏ రకానికి చెందినవాడో తెలుసుకోండి. సివిల్స్ కోచింగ్లో నిపుణులైన వారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: విక్రమ్
Ans:
ఏ ఉద్యోగం అయినా కొంతకాలం అయ్యాక బోర్ కొడుతుంది. విసుగుపుట్టడం అనేది ఉద్యోగంలో ఉండదు. ఉద్యోగం చేసే వారి మానసిక స్థితిని బట్టీ, ఉద్యోగాన్ని చూసే తీరుని బట్టీ ఉంటుంది. చేసే పనిని ఇష్టంగా చేసుకొని, ఆ పనిని సృజనాత్మకంగా చేస్తే, విసుగు అనిపించదు. భవిష్యత్తులో మీరు అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగానికి వెళితే, కొంతకాలానికి అది కూడా బోర్ కొట్టదన్న గ్యారంటీ ఏమీ లేదు. ముందుగా, మీకు ఏం కావాలో, మీ అభిరుచులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి. ఒకవేళ, అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగం మీకు అత్యంత ఇష్టమైతే దాన్ని ఎంచుకోండి. భవిష్యత్తులో మీ బయోడేటాలో ఒకదానికొకటి సంబంధం లేని ఇన్ని రకాల ఉద్యోగాలు చూసి, మీకు ఉద్యోగం ఇవ్వాలంటే ఉద్యోగ సంస్థలు కూడా భయపడతాయి. కెరియర్ మొదట్లో ఇలాంటివి సహజం కానీ, జీవితకాలం ఉద్యోగాలు మారుతూ ఉంటే, చేరే ప్రతి ఉద్యోగంలోనూ అతి చిన్న ఉద్యోగాన్ని, తక్కువ వేతనంతో మొదలుపెట్టాల్సి వస్తుంది. అలాగే మీకంటే చిన్న వయసులో ఉన్నవారు, మీ పై స్థాయిలో ఉంటే.. అప్పుడూ ఇబ్బంది పడతారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఉద్యోగం చేయాలంటే రెండు మార్గాలున్నాయి. మొదటిది, మీ డిగ్రీ విద్యార్హతతో యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకోసం ప్రయత్నించి, అడ్మినిస్ట్రేటర్గా స్థిరపడొచ్చు. అలా కాకుండా, ఎంబీఏ లాంటి కోర్సును ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి చదివితే మంచి వేతనంతో జీవితకాలం అడ్మినిస్ట్రేటర్గా ఉద్యోగం చేయొచ్చు. మనదేశంలో ప్రముఖ మేనేజ్మెంట్ విద్యాసంస్థలు కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) ద్వారా ప్రవేశాలు చేపడుతున్నాయి. క్యాట్ స్కోరు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: పి.బాలకృష్ణ
Ans:
మీకు నచ్చిన ఉద్యోగం చేయడం ఎప్పుడూ శ్రేయస్కరం. చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం చేయడం అదృష్టం కూడా! ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది చదివిన కోర్సుకూ, చేయాలనుకొన్న - చేస్తున్న కొలువుకూ ఎలాంటి సంబంధం ఉండట్లేదు. దీంతో కొందరు ఉద్యోగాలు మారే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. టూరిజం రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు హిస్టరీ అండ్ టూరిజంలో పీజీ చేశారు కాబట్టి ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం, బీబీఏ టూరిజం చదివినవారితో పోటీ పడాల్సి ఉంటుంది. మీరు ఈ రంగంలో రాణించాలంటే- కంప్యూటర్, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోండి. అవకాశం ఉంటే తెలుగు, ఇంగ్లిష్లతో పాటు హిందీ, మరో విదేశీ భాషను నేర్చుకొనే ప్రయత్నం చేయండి. టూరిజం రంగంలోనే స్థిరపడాలనుకొంటే ఎంబీఏ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ చదివే ప్రయత్నం కూడా చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్