Post your question

 

    Asked By: prasanth

    Ans:

    ఇటీవలికాలంలో చాలా ఉద్యోగ/ప్రవేశ పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)గానే నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాలపాటు పెన్ను, పేపర్‌ పరీక్షలకు అలవాటుపడిన తరానికి మొదటిసారి సీబీటీ రాయడం కొంత కంగారు కలిగించవచ్చు. కానీ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని, మాక్‌ టెస్ట్‌లను కంప్యూటర్‌పై సాధన చేస్తే సీబీటీని సులువుగా రాయవచ్చు. సాధారణ రాత పరీక్షలో అభ్యర్థులు తమకు కేటాయించిన బెంచి/ కుర్చీపై కూర్చొని రైటింగ్‌ ప్యాడ్‌/ టేబుల్‌పై పరీక్ష రాస్తారు. కానీ సీబీటీలో వారికి కేటాయించిన కంప్యూటర్‌ ముందు కూర్చుంటారు. కేటాయించిన ఐడీ…, పాస్‌వర్డ్‌లతో లాగిన్‌ అవ్వాలి. ఆపై తెరపై ఉన్న వివరణాత్మక సూచనలను జాగ్రత్తగా చదవాలి. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నలు కంప్యూటర్‌ తెర మీద కనిపిస్తాయి. ప్రశ్నను జాగ్రత్తగా చదివి, సరైన సమాధానాన్ని మౌస్‌తో గుర్తించాలి. పరీక్ష అయ్యేవరకు కీబోర్డ్‌ పనిచేయదు. ఒకవేళ మీరు తప్పు సమాధానాన్ని గుర్తించినట్లు భావిస్తే, పరీక్ష పూర్తయ్యేలోపు ఎప్పుడైనా దాన్ని సరిచేసుకోవచ్చు. ఈ  వెసులుబాటు పెన్ను, పేపర్‌ పరీక్షల్లో ఉండదు.  ఏదైనా కంప్యూటర్‌/మౌస్‌ సరిగా పనిచేయకపోతే, ఆ అభ్యర్ధికి వెంటనే మరొక కంప్యూటర్‌/మౌస్‌ను కేటాయిస్తారు. ఈ మార్పిడిలో కోల్పోయిన సమయం సర్వర్‌లో సర్దుబాటు చేస్తారు. రాత పరీక్షలోలాగా మీరు ప్రతిసారీ టైమ్‌ చూసుకొనే పని లేకుండా, మానిటర్‌పై ఇంకా ఎంత  టైమ్‌ మిగిలి ఉందో కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి టైమర్‌ సున్నాను చూపించగానే పరీక్ష పూర్తవుతుంది. మీరు గుర్తించిన సమాధానాలు వాటికవే అప్‌ లోడ్‌ అయిపోతాయి. ప్రత్యేకించి పరీక్షను క్లోజ్‌ చేయాల్సిన అవసరం లేదు. పరీక్ష రాసేప్పుడు సమయంతో పాటు, ఎన్ని ప్రశ్నలు చదివారు, ఎన్ని  సమాధానాలు రాశారు, ఎన్నింటికి సమాధానాలు రాయలేదు, ఎన్ని సమాధానాలను రివ్యూ చేయాలని భావించారు అనే వివరాలు కూడా డిస్‌ ప్లే అవుతాయి. ఒకవేళ పరీక్ష సమయం పూర్తయ్యేలోపు మీరు రివ్యూ చేయాలనుకున్న సమాధానాలను రివ్యూ చేయలేకపోతే, ఆ సమాధానాలను కూడా మూల్యాంకనం చేస్తారు. మీరు పరీక్ష రాసేప్పుడు అవసరమైన కాలిక్యులేషన్స్‌ అన్నింటినీ ఇచ్చిన రఫ్‌షీట్‌లో మాత్రమే చేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత రఫ్‌ షీట్లను తప్పనిసరిగా విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని సీబీటీని ధైర్యంగా రాయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    ఇటీవలికాలంలో చాలా ఉద్యోగ/ప్రవేశ పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)గానే నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాలపాటు పెన్ను, పేపర్‌ పరీక్షలకు అలవాటుపడిన తరానికి మొదటిసారి సీబీటీ రాయడం కొంత కంగారు కలిగించవచ్చు. కానీ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని, మాక్‌ టెస్ట్‌లను కంప్యూటర్‌పై సాధన చేస్తే సీబీటీని సులువుగా రాయవచ్చు. సాధారణ రాత పరీక్షలో అభ్యర్థులు తమకు కేటాయించిన బెంచి/ కుర్చీపై కూర్చొని రైటింగ్‌ ప్యాడ్‌/ టేబుల్‌పై పరీక్ష రాస్తారు. కానీ సీబీటీలో వారికి కేటాయించిన కంప్యూటర్‌ ముందు కూర్చుంటారు. కేటాయించిన ఐడీ…, పాస్‌వర్డ్‌లతో లాగిన్‌ అవ్వాలి. ఆపై తెరపై ఉన్న వివరణాత్మక సూచనలను జాగ్రత్తగా చదవాలి. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నలు కంప్యూటర్‌ తెర మీద కనిపిస్తాయి. ప్రశ్నను జాగ్రత్తగా చదివి, సరైన సమాధానాన్ని మౌస్‌తో గుర్తించాలి. పరీక్ష అయ్యేవరకు కీబోర్డ్‌ పనిచేయదు. ఒకవేళ మీరు తప్పు సమాధానాన్ని గుర్తించినట్లు భావిస్తే, పరీక్ష పూర్తయ్యేలోపు ఎప్పుడైనా దాన్ని సరిచేసుకోవచ్చు. ఈ  వెసులుబాటు పెన్ను, పేపర్‌ పరీక్షల్లో ఉండదు.  ఏదైనా కంప్యూటర్‌/మౌస్‌ సరిగా పనిచేయకపోతే, ఆ అభ్యర్ధికి వెంటనే మరొక కంప్యూటర్‌/మౌస్‌ను కేటాయిస్తారు. ఈ మార్పిడిలో కోల్పోయిన సమయం సర్వర్‌లో సర్దుబాటు చేస్తారు. రాత పరీక్షలోలాగా మీరు ప్రతిసారీ టైమ్‌ చూసుకొనే పని లేకుండా, మానిటర్‌పై ఇంకా ఎంత  టైమ్‌ మిగిలి ఉందో కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి టైమర్‌ సున్నాను చూపించగానే పరీక్ష పూర్తవుతుంది. మీరు గుర్తించిన సమాధానాలు వాటికవే అప్‌ లోడ్‌ అయిపోతాయి. ప్రత్యేకించి పరీక్షను క్లోజ్‌ చేయాల్సిన అవసరం లేదు. పరీక్ష రాసేప్పుడు సమయంతో పాటు, ఎన్ని ప్రశ్నలు చదివారు, ఎన్ని  సమాధానాలు రాశారు, ఎన్నింటికి సమాధానాలు రాయలేదు, ఎన్ని సమాధానాలను రివ్యూ చేయాలని భావించారు అనే వివరాలు కూడా డిస్‌ ప్లే అవుతాయి. ఒకవేళ పరీక్ష సమయం పూర్తయ్యేలోపు మీరు రివ్యూ చేయాలనుకున్న సమాధానాలను రివ్యూ చేయలేకపోతే, ఆ సమాధానాలను కూడా మూల్యాంకనం చేస్తారు. మీరు పరీక్ష రాసేప్పుడు అవసరమైన కాలిక్యులేషన్స్‌ అన్నింటినీ ఇచ్చిన రఫ్‌షీట్‌లో మాత్రమే చేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత రఫ్‌ షీట్లను తప్పనిసరిగా విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని సీబీటీని ధైర్యంగా రాయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వి. శ్రీలలిత, నెల్లూరు

    Ans:

    గతంలో బీఈడీ ప్రోగ్రామ్‌ దూరవిద్యా విధానంలో చాలా యూనివర్సిటీల్లో ఉండేది. బీఈడీ ప్రోగ్రామ్‌ కాలవ్యవధిని రెండు సంవత్సరాలకు పెంచాక, మారిన ఎన్‌సీటీఈ నిబంధనల దృష్ట్యా చాలా యూనివర్సిటీల్లో ఈ ప్రోగ్రామ్‌ ప్రస్తుతం లేదు. ఎన్‌సీటీఈ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో అనుమతితో మాత్రమే బీఈడీ దూరవిద్య/ కరస్పాండెన్స్‌ విధానంలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీఈడీ ప్రోగ్రామ్‌ ఉంది. బీఈడీని దూరవిద్యలో చేయాలంటే రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ విద్యార్హతతో పాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో కనీసం రెండేళ్ల బోధనానుభవం కచ్చితంగా ఉండాలి. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తమిళనాడులో బీఈడీ ప్రోగ్రామ్‌ దూరవిద్య/ కరస్పాండెన్స్‌ విధానంలో లేదు. వివిధ యూనివర్సిటీల వెబ్‌సైట్‌లను తరచుగా సందర్శిస్తూ బీఈడీ ప్రోగ్రామ్‌ (దూరవిద్య/ కరస్పాండెన్స్‌) సమాచారాన్ని తెలుసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వి. శ్రీలలిత, నెల్లూరు

    Ans:

    గతంలో బీఈడీ ప్రోగ్రామ్‌ దూరవిద్యా విధానంలో చాలా యూనివర్సిటీల్లో ఉండేది. బీఈడీ ప్రోగ్రామ్‌ కాలవ్యవధిని రెండు సంవత్సరాలకు పెంచాక, మారిన ఎన్‌సీటీఈ నిబంధనల దృష్ట్యా చాలా యూనివర్సిటీల్లో ఈ ప్రోగ్రామ్‌ ప్రస్తుతం లేదు. ఎన్‌సీటీఈ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో అనుమతితో మాత్రమే బీఈడీ దూరవిద్య/ కరస్పాండెన్స్‌ విధానంలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీఈడీ ప్రోగ్రామ్‌ ఉంది. బీఈడీని దూరవిద్యలో చేయాలంటే రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ విద్యార్హతతో పాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో కనీసం రెండేళ్ల బోధనానుభవం కచ్చితంగా ఉండాలి. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తమిళనాడులో బీఈడీ ప్రోగ్రామ్‌ దూరవిద్య/ కరస్పాండెన్స్‌ విధానంలో లేదు. వివిధ యూనివర్సిటీల వెబ్‌సైట్‌లను తరచుగా సందర్శిస్తూ బీఈడీ ప్రోగ్రామ్‌ (దూరవిద్య/ కరస్పాండెన్స్‌) సమాచారాన్ని తెలుసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి.నిఖిల్‌

    Ans:

    మీరు ఎంబీఏలో హెచ్‌ఆర్‌ చేసినా, సీఏ కూడా చదివారు కాబట్టి అకౌంట్స్‌ రంగంలో పనిచేయడానికి మీకు విద్యార్హత ఉంది. కాకపోతే, రెండు సంవత్సరాల ఉద్యోగానుభవం హ్యూమన్‌ రిసోర్సెస్‌లో ఉండటం, ఆరేళ్లు ఖాళీగా ఉండటం వల్ల ఇప్పుడు అకౌంట్స్‌ రంగంలోకి వెళ్ళడం కొంత ఇబ్బందే కానీ అసాధ్యం మాత్రం కాదు. ముందుగా మీరు అకౌంట్స్‌లో ప్రాథమిక అంశాలను పునశ్చరణ చేసుకొని ఇటీవలికాలంలో ఈ రంగంలో వచ్చిన మార్పులను తెలుసుకోండి. అందుకు అనుగుణంగా అవసరమైన కోర్సులను ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో చేసే ప్రయత్నం చేయండి. అకౌంటింగ్‌తో పాటు కంప్యూటర్‌ వాడకంపై కనీస పరిజ్ఞానం, ఎంఎస్‌ ఎక్సెల్, అకౌంటింగ్‌ సంబంధిత సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన పెంచుకోండి. జీఎస్టీ, ఇన్‌కమ్‌టాక్స్, ఆడిటింగ్‌ ప్రమాణాలపై కూడా పట్టు సాధించాలి. వీటన్నిటితో పాటు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, విశ్లేషణ సామర్ధ్యం, సమకాలీన వ్యాపార అంశాలు అర్థం చేసుకోవడం చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: రాజేష్‌ సెహ్వాగ్‌

    Ans:

    బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో కంప్యూటర్స్‌తోపాటు మీరు ఏయే సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. కార్డియాలజీ టెక్నీషియన్‌ పీజీ డిప్లొమా చేయాలంటే చాలా యూనివర్సిటీలు, హాస్పటల్‌లు డిగ్రీలో కనీసం ఒక లైఫ్‌సైన్స్‌ కోర్సు చదివి ఉండాలన్న నిబంధన విధిస్తున్నాయి. కార్డియాలజీలో డిప్లొమా కోర్సులకు కూడా ఇంటర్మీడియట్‌లో సైన్స్‌ చదివి ఉండాలన్న నిబంధన ఉంది. మీరు ఇంటర్‌/ డిగ్రీ స్థాయిలో లైఫ్‌ సైన్సెస్‌ కోర్సు చదివివుంటే కార్డియాలజీలో డిప్లొమా/ పీజీ డిప్లొమా చేసే అవకాశం ఉంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ విషయానికొస్తే మీకు ఈ కోర్సు చదివే అర్హత ఉంటే నాన్‌ లోకల్‌ కోటాలో పోటీపడాలి. హైదరాబాద్‌లో చాలా కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ కూడా ఈ  కోర్సును అందిస్తున్నాయి. మీకు విద్యార్హతలు, ఆర్ధిక వెసులుబాటు ఉంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో చదవడానికి ప్రయత్నించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సచిన్

    Ans:

    పరిశోధన చేయాలంటే సాధారణంగా ప్రవేశ పరీక్ష రాయాలి. యూజీసీ రెగ్యులేషన్స్‌ ప్రకారం యూజీసీ‡/ సీ‡ఎస్‌ఐఆర్‌ జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, యూజీసీ/ సీ‡ఎస్‌ఐఆర్‌ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌), స్టేట్‌ లెవెల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (స్లెట్‌), గేట్‌లో ఉత్తీర్ణులయిన వారికి ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీల విషయానికొస్తే.. అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పరీక్ష నియమాలు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ లోనూ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సెంట్రల్‌ యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ అడ్మిషన్‌ కోసం ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షలు రాయవలసి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీలకూ కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష పెట్టాలని ఆలోచిస్తున్నారు. పీహెచ్‌డీ ప్రవేశానికి ఇంటర్వ్యూ తప్పనిసరి. ఇంటర్వ్యూలో పరిశోధన అంశం, సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం, పరిశోధన నైపుణ్యాలను పరిశీలిస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులకు ఇంటర్వ్యూ మార్కులు కలిపి మెరిట్‌ లిస్టు తయారుచేసి పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తారు.      - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: MAREEDU

    Ans:

    No negative marks in Group 1  preliminary exam.