అధ్యాపకులుగా పదోన్నతి పొందాలన్నా కూడా నెట్/సెట్ అర్హత తప్పనిసరి. పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఈ అర్హత వీలు కల్పిస్తుంది. సెట్ పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి.
పేపర్ - 1లో
పేపర్-1 జనరల్ పేపర్. మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. 60 ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులు 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది. ఒకవేళ అభ్యర్థి 60 ప్రశ్నలకూ జవాబులు గుర్తిస్తే 1-50 ప్రశ్నలను మాత్రమే మూల్యాంకనానికి పరిగణనలోకి తీసుకుంటారు. 51-60 వరకూ ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించినా అవి అభ్యర్థి స్కోరింగ్ కింద జమ కావు.
పేపర్-1 సిలబస్ 10 యూనిట్లుగా ఉంటుంది. 1) బోధనా సామర్థ్యం 2) పరిశోధన సామర్థ్యం 3) రీడింగ్ కాంప్రహెన్షన్ 4) కమ్యూనికేషన్ 5) 6) 7) అభ్యర్థి వివేచన, అంకగణిత సామర్థ్యాల పరీక్ష 8) ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 9) పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్ 10) హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ పాలిటీ
* గతంలో పేపర్-2, 3లను మూల్యాంకనం చేయడానికి ఇందులో అర్హత మార్కులు (40 శాతం) మాత్రం సాధిస్తే సరిపోయేది. కానీ మారిన విధానం ప్రకారం అర్హత నిర్ణయించటంలో మూడు పేపర్లలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కాబట్టి పేపర్-1ను అశ్రద్ధ చేయకూడదు.
* గత నెట్/సెట్ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే జ్ఞానాత్మకమైన ప్రశ్నల సంఖ్య తగ్గి, అవగాహన, అనువర్తిత సామర్థ్యాలను మదింపు వేసే ప్రశ్నల సంఖ్య పెరిగిందని అర్థమవుతుంది. అందుకని బట్టీ పట్టే విధానంలో చదవకుండా భావనల ఆధారంగా భిన్న దృక్కోణాల్లో ఆలోచించడం అలవర్చుకోవాలి.
* గతంలో జరిగిన యూజీసీ నెట్, ఇతర రాష్ట్రాల సెట్ పరీక్షల నుంచే దాదాపు 5 శాతం ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. వాటినీ అధ్యయనం చేస్తే మేలు.
* ఈ పేపర్లోని 10 యూనిట్లూ వేటికవే ప్రత్యేకమైనవి. సొంతంగా మెటీరియల్ సేకరించటానికి సమయం, డబ్బు వృథా అవుతాయి. కాబట్టి మార్కెట్లో ప్రామాణికమైన పుస్తకాన్ని సేకరించుకోవాలి.