• facebook
  • whatsapp
  • telegram

మౌలిక అంశాలే ముఖ్యం

టెట్‌లో మెర‌వాలంటే పాఠ్యాంశాల‌పై ప‌ట్టుతోపాటు ప‌రీక్ష విధానంపై పూర్తి అవ‌గాహ‌న అవ‌స‌రం. మౌలిక అంశాల‌పై సాధ‌న చేయ‌డం ఎంతో ముఖ్యం. వీటిపై అవ‌గాహ‌న పెంచుకుంటే విజ‌యం మీదే.
* ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్‌ను పరిశీలించి, అవగాహన చేసుకోవాలి.
* మౌలిక అంశాలకూ, ప్రాథమిక భావనలకూ ప్రాధాన్యమిస్తూ అభ్యసించాలి.
* గత ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేసుకొని, ఏ అంశాలకు ప్రాధాన్యముందో స్పష్టత ఏర్పరచుకోవాలి.
* నిర్ణీత కాలంలో సిలబస్‌ పూర్తి అధ్యయనానికి చక్కని ప్రణాళిక సిద్ధం చేసుకొని, సన్నద్ధత ప్రారంభించాలి.
* తెలుగు అకాడమీ డీఈడీ, బీఈడీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని, టెట్‌లో నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం అంశాలు, భావనలను అవగాహనతో అభ్యసించాలి. పరీక్షకు తక్కువ సమయం ఉన్నందున ప్రధాన అంశాలను మాత్రమే సాధన చేయవలసి ఉంటుంది.
* పునశ్చరణ చాలా అవసరం. చదివిన అంశాలను పునశ్చరణ చేస్తే మంచి స్కోరుకు అవకాశం వుంది.
* సమయం తక్కువ ఉన్నందున పరీక్ష దృష్ట్యా ముఖ్య అంశాలనే అభ్యసించి, అభ్యాసం చేస్తూ స్కోరును మెరుగు పరచుకోవచ్చు.

Posted Date : 06-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌