‣ డిగ్రీ విద్యార్హతతో..
కేంద్ర ప్రభుత్వ సమాచార మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 54 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థుల ఎంపిక అసెస్మెంట్, గ్రూప్ డిస్కషన్/ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది. ఎంపికైనవారిని దిల్లీ, ముంబయి, చైన్నైలలో నియమిస్తారు.
మొత్తం 54 ఉద్యోగాల్లో అన్రిజర్వుడ్కు 27, ఈడబ్ల్యూఎస్లకు 4, ఓబీసీలకు 13, ఎస్సీలకు 7, ఎస్టీలకు 3 కేటాయించారు.
1. ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్)-28:
కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్లో బీఈ/ బీటెక్ పాసవ్వాలి. లేదా
‣ మూడేళ్ల మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) ఉత్తీర్ణులవ్వాలి. లేదా
‣ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ లో బీసీఏ/ బీఎస్సీ పూర్తిచేయాలి.
‣ వయసు 22 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
‣ ఏడాది ఉద్యోగానుభవం అవసరం.
‣ ఎంపికైన వారికి ఏడాదికి గరిష్ఠంగా రూ.10 లక్షల సీటీసీ దక్కుతుంది.
2. ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్)- 21: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్లో బీఈ/ బీటెక్ పాసవ్వాలి. లేదా
‣ మూడేళ్ల మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉత్తీర్ణులవ్వాలి. లేదా
‣ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్లో బీసీఏ/ బీఎస్సీ పూర్తిచేయాలి.
‣ వయసు 22 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
‣ నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
‣ ఎంపికైనవారికి ఏడాది రూ.15 లక్షల సీటీసీ అందజేస్తారు.
3. ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్)-5: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. లేదా
‣ మూడేళ్ల మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ పూర్తిచేయాలి. లేదా కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్లో బీసీఏ/ బీఎస్సీ పాసవ్వాలి.
‣ వయసు 22 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
‣ ఆరేళ్ల ఉద్యోగానుభవం తప్పనిసరి.
‣ ఎంపికైనవారు ఏడాదికి రూ.25 లక్షల సీటీసీ పొందుతారు.
దరఖాస్తు రుసుము రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.150.
ఎంపిక: పోస్టులను అనుసరించి అసెస్మెంట్, గ్రూప్ డిస్కషన్/ ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
‣ విద్యార్హతలు, అనుభవం, కేటగిరీలవారీగా ఉన్న ఖాళీల ఆధారంగా స్క్రీనింగ్ నిర్వహించి అభ్యర్థుల షార్ట్లిస్టును తయారుచేస్తారు.
‣ వివిధ దశల్లో అర్హత సాధించి.. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను వెబ్సైట్లో ప్రచురిస్తారు.
‣ ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తుచేసేవారు.. ప్రతి పోస్టుకూ వేర్వేరుగా దరఖాస్తులు పంపాలి.
‣ రాత పరీక్ష/ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారికి ఎలాంటి టీఏ/ డీఏలను చెల్లించరు.
‣ దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.05.2024
వెబ్సైట్: https://www.ippbonline.com/
మరింత సమాచారం... మీ కోసం!
‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!
‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!
‣ టెక్స్టైల్ కమిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ కొలువులు!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!