• facebook
  • whatsapp
  • telegram

ఎంబీబీఎస్‌తో కేంద్ర సర్వీసుల్లోకి! 

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల

ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్లు కేంద్ర సర్వీసుల్లో పనిచేసే అవకాశం వచ్చింది. ఇందుకోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) దాదాపు ఏటా నిర్వహిస్తోన్న కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (సీఎంఎస్‌) ప్రకటన వెలువడింది. అన్ని విభాగాల్లోనూ కలుపుకుని 838 ఖాళీలు ఉన్నాయి. పరీక్ష, ఇంటర్వ్యూలతో వీటిని సొంతం చేసుకోవచ్చు. ఎంపికైనవారు రూ.లక్షకుపైగా వేతనం అందుకోవచ్చు. 

ఎంబీబీఎస్‌ అనంతరం ప్రభుత్వోద్యోగంలో స్థిరపడాలనుకున్నవారికి యూపీఎస్‌సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ చక్కని మార్గంగా చెప్పుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారికి ఆకర్షణీయ వేతనం, మంచి హోదా సొంతమవుతాయి. ఎన్నో సౌకర్యాలనూ కల్పిస్తారు. 

ఎంపిక విధానం: ముందుగా కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. దీనికి 500 మార్కులను కేటాయించారు. ఇందులో రెండు పేపర్‌లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులు. ఒక్కోదాని వ్యవధి 2 గంటలు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. రుణాత్మక మార్కులున్నాయి. ఇందులో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది. 

ఈ పోస్టులకు ఎంపికైతే లెవెల్‌ 10 మూలవేతనం రూ.56,100 అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అదనం. నాన్‌ ప్రాక్టీస్‌ అలవెన్సునూ చెల్లిస్తారు. విధుల్లో చేరినవారు మొత్తం అన్నీ కలుపుకుని రూ.లక్ష కంటే ఎక్కువ వేతనం పొందవచ్చు. 

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఖాళీలు ఎన్ని?

మొత్తం ఖాళీలు: 838 

విభాగాలవారీ: సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌లో జూనియర్‌ స్కేల్‌ పోస్టులు 349, రైల్వేలో అసిస్టెంట్‌ డివిజినల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ 300, న్యూదిల్లీ మునిసిపల్‌ కార్యాలయాల్లో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ 189

వయసు: ఆగస్టు 1, 2021 నాటికి 32 ఏళ్లకు మించరాదు. ఆగస్టు 2, 1989 కంటే ముందు జన్మించినవారు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జులై 27 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు. 

వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/
 

Posted Date : 20-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌