Post your question

 

    Asked By: బాల యశశ్వి

    Ans:

    చాలామంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షల మాదిరిగానే జేఈఈకి కూడా సన్నద్ధమైతే సరిపోతుందనుకుంటారు. కానీ ఈ రెండు పరీక్షలు పూర్తిగా భిన్నమైనవి. జేఈఈ మెయిన్స్‌లో ఎక్కువగా అప్లికేషన్‌ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో, రుణాత్మక మార్కులతో ఉంటుంది. కాబట్టి ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంక్‌ సాధించాలంటే ముఖ్యంగా ప్రాథమికాంశాలపై మంచి పట్టుండాలి. ఇంటర్‌ పుస్తకాలు, జేఈఈ మెటీరియల్‌తోపాటు ఎన్‌సీఈఆర్‌టీ 11, 12వ తరగతి పుస్తకాలను చదివి వాటిపై అవగాహన ఏర్పరుచుకోవాలి. ఫార్ములాలను బట్టీపట్టడం కాకుండా, వాటి మూలాల్లోకి వెళ్లి పూర్తిగా నేర్చుకోవాలి. జేఈఈ పరీక్షలో విజయం సాధించాలంటే విషయ పరిజ్ఞానంతోపాటు లాజికల్‌ రీజనింగ్, ఎనలిటికల్‌ రీజనింగ్‌ కూడా చాలా అవసరం. అలాగే ప్రామాణిక పుస్తకాలతోపాటు, పాత ప్రశ్నపత్రాలను కూడా సమకూర్చుకుని సిలబస్, ప్రశ్నల సరళిపై  అవగాహన పెంచుకోవాలి. ప్రణాళికతోపాటు సమయ నిర్వహణ కూడా చాలా అవసరం. వీలున్నన్ని నమూనా పరీక్షలు రాసి మీ బలాలు, బలహీనతలను అంచనా వేసుకోవాలి. దానికి అనుగుణంగా మీ సన్నద్ధతా ప్రణాళికను మార్చుకోండి. ఇవేకాకుండా.. జేఈఈలో విజయం సాధించిన మీ సీనియర్ల సలహాలతో ఎన్‌ఐటీలాంటి ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్‌ సంపాదించాలనే మీ కలను సాకారం చేసుకోండి.

    Asked By: pratibha

    Ans:

    Dear Naveen, Your ambition is really appreciable. If you are strong in your basics, then don't worry.  Follow college schedule until it is convenient for you. At any point if you get any confusion ask your Lecturer without any hesitation. You can ask your seniors also or you can drop question in our website.  Ask personally your Chemistry sir about your confusion, definitely he will help you.