Post your question

 

    Asked By: శ్రద్ధ

    Ans:

    మీరు సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదవాలంటే,  ఎన్‌టీఏ నిర్వహించే సెంట్రల్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ-పీజీ) రాయాలి. గత సంవత్సరం నుంచే అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీల్లో  పీజీ అడ్మిషన్ల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్‌/ మే నెలల్లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. త్వరలో నోటిఫికేషన్‌ రావొచ్చు. మీరు తరచుగా  cuet.nta.nic.in వెబ్‌సైట్‌ సందర్శిస్తూ.. ఎంట్రన్స్‌ సమాచారాన్ని తెలుసుకోండి. ఈ పరీక్షలో మీరు సాధించిన మార్కుల ఆధారంగా పీజీ అడ్మిషన్లు నిర్వహిస్తారు. నమూనా కోసం గత సంవత్సరపు ప్రవేశ పరీక్ష పత్రాన్ని పరిశీలించండి. దేశవ్యాప్తంగా పరీక్ష రాసే అభ్యర్థులతో పోటీ పడాలి కాబట్టి, ఇప్పటినుంచే సన్నద్ధం కండి. గత సంవత్సరంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించినప్పటికీ, ప్రవేశాలను యూనివర్సిటీలు విడివిడిగా నిర్వహించుకున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో కేంద్రీకృత కౌన్సెలింగ్‌ ద్వారా అడ్మిషన్లు నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రవేశ పరీక్షలో మెరుగైన మార్కులు సాధించి, మీకు నచ్చిన యూనివర్సిటీలను ఆప్షన్లుగా పెట్టుకోండి. సాధారణంగా సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రవేశాల్లో రాష్ట్రాల వారీగా రిజర్వేషన్లు ఉండవు. సొంత రాష్ట్రంలో ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీలో ప్రవేశానికి కూడా దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన అభ్యర్థులతో సమానంగా పోటీ పడాలి. ఏదైనా కారణం వల్ల, ఈ విద్యా సంవత్సరానికి కేంద్రీకృత కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు నిర్వహించకపోతే... మీకు నచ్చిన యూనివర్సిటీలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కావ్య

    Ans:

    ఓపెన్‌ యూనివర్సిటీ/ దూరవిద్య ద్వారా చేసే డిగ్రీలకూ రెగ్యులర్‌గా చేసే డిగ్రీలకూ ఎలాంటి తేడా లేదు. రెండు డిగ్రీలనూ యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలే ఇస్తున్నాయి కాబట్టి, రెండింటినీ సమానంగానే గుర్తిస్తారు. ఏ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లో అయినా యూజీసీ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ అనే అడుగుతారు కానీ, రెగ్యులర్‌గా డిగ్రీ చేసి ఉండాలని పేర్కొనరు. మీరు నిరభ్యంతరంగా ఉన్నత విద్య/ నెట్‌/ స్లెట్‌/ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేకమైన సందర్భాల్లో ఓపెన్‌/ దూరవిద్య ద్వారా డిగ్రీ చేసినవారు అర్హులు కారు అన్న నిబంధన ఉన్నచోట మినహా, మిగతా అన్ని పోటీ పరీక్షలకూ రెగ్యులర్‌ డిగ్రీ చేసినవారితో సమానంగా మీరూ పోటీపడవచ్చు. సాధారణంగా రెగ్యులర్‌ డిగ్రీ చేసినవారు రోజూ క్లాసులకు వెళ్లి పాఠాలు విని, విషయ పరిజ్ఞానం పొందుతారు. ఓపెన్‌ యూనివర్సిటీ విద్యావిధానంలో విద్యార్థి తనకు తానే సబ్జెక్టును నేర్చుకుంటాడు. పోటీ పరీక్షల్లో ఇద్దరూ పోటీ పడినప్పుడు రెగ్యులర్‌గా డిగ్రీ చేసినవారికి కొంత మొగ్గు ఉండే అవకాశం ఉంది. ఈ ఇబ్బందిని అధిగమించాలంటే ఓపెన్‌ యూనివర్సిటీలో చదివినవారు ఎక్కువ కృషి చేయాలి. ఇలా చదివిన చాలామంది రెగ్యులర్‌గా చదివిన వారితో పోటీపడి, వారికంటే మెరుగైన ప్రతిభని కనపర్చి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన దాఖలాలూ ఉన్నాయి. కాబట్టి ఈ డిగ్రీల సమానార్హత గురించి ఎక్కువగా ఆలోచించి సమయం వృధా చేసుకోకుండా.. నిరభ్యంతరంగా పోటీ పరీక్షలకు సన్నద్ధం కండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: లలిత

    Ans:

    బీబీఏ తరువాత ఉద్యోగం చేస్తూ మీరు వారాంతపు (ఎగ్జిక్యూటివ్‌) ఎంబీఏ చదివే అవకాశం ఉంది. దూరవిద్య ద్వారా పాండిచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి కానీ, వివిధ రాష్ట్ర యూనివర్సిటీల దూరవిద్యా కేంద్రాల ద్వారా కానీ ఎంబీఏ చేయవచ్చు. ఓపెన్‌ యూనివర్సిటీల్లో చదవాలనుకుంటే ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీల గురించి ఆలోచించండి.

    మూడు సంవత్సరాల ఉద్యోగానుభవం ఉన్నవారు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో వారాంతపు ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ చదవొచ్చు. చాలా డీమ్డ్‌ టు బి యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీలు ఉద్యోగస్తుల కోసం వారాంతపు ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ/ ప్రైవేటు బిజినెస్‌ స్కూల్స్, ప్రైవేటు యూనివర్సిటీలు పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ ఎంబీఏ డిగ్రీని కూడా అందిస్తున్నాయి. సాధారణంగా ఈ కోర్సుల్లో ప్రవేశాలను ప్రత్యేక ప్రవేశపరీక్ష/ ఇంటర్వ్యూ/ డిగ్రీలో పొందిన మార్కులు/ ఐసెట్‌ ర్యాంకు లాంటి పద్ధతుల్లో నిర్వహిస్తారు.

    మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్నీ, ఆసక్తినీ బట్టి ఎంబీఏలో స్పెషలైజేషన్‌ ఎంచుకోండి. ఆసక్తి ఉంటే ఎంఏ/ ఎమ్మెస్సీ సైకాలజీ కూడా చేయొచ్చు. మీరు ఏదైనా కోర్సును ఆన్‌లైన్‌/ దూరవిద్య ద్వారా చదవాలనుకుంటే ఆయావిద్యా సంస్థలు అందించే కోర్సులకు ప్రభుత్వ/ యూనివర్సిటీ గుర్తింపు ఉందో, లేదో నిర్ధారించుకోండి. గుర్తింపు లేని డిగ్రీలను చేసి మీ విలువైన సమయం, డబ్బు వృథా చేసుకోకండి.  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: బి.వందన

    Ans:

    పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే గ్రూప్స్‌ ఉద్యోగాలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు. ఇంత పోటీని తట్టుకొని ఉద్యోగం సంపాదించాలంటే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం అవ్వాల్సిందే. జనరల్‌ నాలెడ్జ్, సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ల్లో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. ప్రాంతీయ భౌగోళిక, సామాజిక, సంస్కృతి, వారసత్వం, ఆర్ధికం, కళలు, సాహిత్యం, పాలన విధానాలపై అవగాహన ఏర్పర్చుకోండి. దీంతోపాటు భారత రాజ్యాంగం, భారత భౌగోళిక అంశాలు, భారత ఆర్ధిక వ్యవస్థ, భారత జాతీయోద్యమం అంశాలపై కూడా పట్టు సాధించండి. దైనందిన జీవితంలో సైన్స్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, అంతర్జాతీయ సంబంధాలు, సమకాలీన సంఘటనలపై కూడా ప్రశ్నలుంటాయి. విజయం సాధించాలంటే రోజుకు కనీసం 8 గంటలు చదవాల్సిన అవసరం ఉంది. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి గత సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అంకగణిత/ సంఖ్యా సామర్థ్యాలకు సంబంధించిన సూత్రాలను ఒకచోట రాసుకొని, రోజూ ప్రాక్టీస్‌ చేయండి.
    ఏ  పోటీ పరీక్షలోనైనా సరైన సమాధానాన్ని ఒక నిమిషంలోపే గుర్తించగలిగే సామర్థ్యం ముఖ్యం. సోషల్‌ మీడియాలో వ్యాపించే నెగెటివ్‌ ప్రచారాలకు దూరంగా ఉండండి. ప్రామాణిక పుస్తకాల నుంచి సమాచారాన్ని సేకరించి మీరే సొంతంగా నోట్స్‌ తయారుచేసుకోండి. మార్కెట్‌లో/ సోషల్‌ మీడియాలో దొరికే స్టడీ మెటీరియల్‌ నాణ్యతను పరిశీలించాకే, దానిపై ఆధారపడండి. ప్రశాంతమైన మనసుతో, ఎలాంటి ఆందోళనకూ గురి అవ్వకుండా పరీక్షకు సన్నద్ధమై మీ లక్ష్యాన్ని చేరుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: బి.వందన

    Ans:

    పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే గ్రూప్స్‌ ఉద్యోగాలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు. ఇంత పోటీని తట్టుకొని ఉద్యోగం సంపాదించాలంటే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం అవ్వాల్సిందే. జనరల్‌ నాలెడ్జ్, సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ల్లో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. ప్రాంతీయ భౌగోళిక, సామాజిక, సంస్కృతి, వారసత్వం, ఆర్ధికం, కళలు, సాహిత్యం, పాలన విధానాలపై అవగాహన ఏర్పర్చుకోండి. దీంతోపాటు భారత రాజ్యాంగం, భారత భౌగోళిక అంశాలు, భారత ఆర్ధిక వ్యవస్థ, భారత జాతీయోద్యమం అంశాలపై కూడా పట్టు సాధించండి. దైనందిన జీవితంలో సైన్స్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, అంతర్జాతీయ సంబంధాలు, సమకాలీన సంఘటనలపై కూడా ప్రశ్నలుంటాయి. విజయం సాధించాలంటే రోజుకు కనీసం 8 గంటలు చదవాల్సిన అవసరం ఉంది. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి గత సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అంకగణిత/ సంఖ్యా సామర్థ్యాలకు సంబంధించిన సూత్రాలను ఒకచోట రాసుకొని, రోజూ ప్రాక్టీస్‌ చేయండి.
    ఏ  పోటీ పరీక్షలోనైనా సరైన సమాధానాన్ని ఒక నిమిషంలోపే గుర్తించగలిగే సామర్థ్యం ముఖ్యం. సోషల్‌ మీడియాలో వ్యాపించే నెగెటివ్‌ ప్రచారాలకు దూరంగా ఉండండి. ప్రామాణిక పుస్తకాల నుంచి సమాచారాన్ని సేకరించి మీరే సొంతంగా నోట్స్‌ తయారుచేసుకోండి. మార్కెట్‌లో/ సోషల్‌ మీడియాలో దొరికే స్టడీ మెటీరియల్‌ నాణ్యతను పరిశీలించాకే, దానిపై ఆధారపడండి. ప్రశాంతమైన మనసుతో, ఎలాంటి ఆందోళనకూ గురి అవ్వకుండా పరీక్షకు సన్నద్ధమై మీ లక్ష్యాన్ని చేరుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: kishore kumar

    Ans:

    మీరు నిజామాబాద్‌జిల్లాకు చెందుతారు.  4, 5, 6 తరగతులు కూడా అక్కాకడే చదివారు కాబట్టి, ప్రత్యేకంగా సర్టిఫికెట్‌  అవసరం లేదు . 1, 2, 3 తరగతులకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయం నుంచి రెసిడెన్స్‌సర్టిఫికెట్‌తీసుకుంటే సరిపోతుంది.

    Asked By: sujatha

    Ans:

    You can take study certificate from your school itself. If records are not available you can take residence certificate from MRO offfice for that particular period.

    Asked By: Harshika

    Ans:

    Group -3 detailed notification along with breakup of vacancies, age, scale of pay, community, educational qualification and other instructions will be made available on the Commission’s website https://www.tspsc.gov.in/ from January 24. For Group-4 exam graduation must be completed.