Asked By: ఒక అభ్యర్థి
Ans:
గ్రూప్-2కి పోటీ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి, నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచే ప్రిపరేషన్ను మొదలుపెట్టాలి. సిలబస్ను అనుసరించి తెలుగు అకాడమీ పుస్తకాలను చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువసార్లు పునశ్చరణ చేయండి. సలహాలు, సూచనలకు సీనియర్లను సంప్రదించండి. గత ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్న పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏ అంశాలపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారో గ్రహించి వాటిపై దృష్టి పెట్టండి.
Asked By: మాధవి
Ans:
మీరు ఇంటర్మీడియట్ని 2011లో పూర్తిచేసి, డిగ్రీని 2020లో చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లోనూ రెండు కోర్సుల మధ్య విరామం గురించి ప్రత్యేకంగా అడగరు. డిగ్రీ అర్హత ఉన్న అన్నిరకాల ఉద్యోగాలకూ దూరవిద్యలో డిగ్రీ చదివినవారు అర్హులే. ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆయా ఉద్యోగాలకు మీ అర్హతను నిర్థరించుకోండి. ఆపై నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోండి.