Asked By: కృష్ణప్రసాద్
Ans:
మంచి కెరియర్ అంటే.. ఎక్కువ డబ్బూ, పేరూ సంపాదించేది అనే ఆలోచన చాలామందిలో స్థిరపడిపోయింది. టీచర్, డాక్టర్, లాయర్, ఇంజినీర్ లాంటి వృత్తి ఉద్యోగాలు చేసేవారికి సేవ మొదటి స్థానంలో, సంతృప్తి రెండో స్థానంలో, డబ్బు చివరి స్థానంలో ఉండాలి. ఇలాంటి వృత్తిలో ఉండేవారు ఎదుటివారి సమస్యలు పరిష్కరిస్తూ, వారి సంతోషానికి కారణమవుతూ కెరియర్ కొనసాగిస్తే ఈ రెండూ వచ్చే అవకాశాలుంటాయి.
సివిల్, క్రిమినల్ రెండు రంగాలూ చాలా మంచివే. కానీ, సమాజంలో క్రిమినల్ లాయర్లకు ఎక్కువ సంపాదన ఉంటుందన్న అపోహ ఉంది. సివిల్ లాయర్లుగా పనిచేస్తూ కూడా మంచి పేరు, డబ్బు సంపాదించినవారు ఉన్నారు. అదే సమయంలో క్రిమినల్ లాయర్గా ఈ రెండూ సంపాదించనివారూ ఉన్నారు. ప్రొఫెషనల్ కోర్సులు చదివినవారు కెరియర్లో రాణించాలంటే డిగ్రీ మాత్రమే ఉంటే సరిపోదు. తెలివితేటలు, వ్యక్తిత్వం, విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు లాంటివి ప్రభావితం చేస్తాయి. న్యాయవాద వృత్తిలో వీటికి అదనంగా నెట్ వర్కింగ్ స్కిల్స్, సమయస్ఫూర్తి, లాజికల్/ అనలిటికల్ రీజనింగ్, జ్ఞాపకశక్తి చాలా అవసరం. ఈ వృత్తిలో పేరు అంత త్వరగా రాదు. కొన్నేళ్లపాటు వాదించిన కేసులు, విజయాల శాతం, ఎన్ని క్లిష్టమైన కేసుల్ని విజయవంతంగా వాదించారు, నిజాయతీ, సమగ్రత లాంటి ఎన్నో కెరియర్ను ప్రభావితం చేస్తాయి. సివిల్, క్రిమినల్.. రెండూ న్యాయవ్యవస్థలో కీలకమైనవి కాబట్టి, మీ ఆసక్తిని బట్టి సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: సుధాకర్
Ans:
ఇంజినీరింగ్ చేయాలని ఎంపీసీ గ్రూప్ తీసుకోవడం సరైన నిర్ణయమే! కానీ మ్యాథ్స్ అంటే భయం అంటున్నారు. ఈ భయం ఎప్పటినుంచి ఉంది? మీకు పదో తరగతిలో మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి? హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్ సరిగా చెప్పకపోవడం వల్ల కానీ, కుటుంబంలో అక్క/అన్న మ్యాథ్స్లో ఫెయిల్ అవ్వడం వల్ల కానీ ఇలాంటి భయాలు మొదలవుతాయి. తోటి మిత్రులు అదే పనిగా మ్యాథ్స్ పట్ల భయం కలిగే మాటలు చెప్పడం వల్లనో, ఇప్పుడు ఇంటర్లో మ్యాథ్స్ లెక్చరర్ సరిగా చెప్పకపోవడం వల్లనో కూడా ఇలా జరగొచ్చు.
నాకు తెలిసిన ఒక విద్యార్థి మీలాగే మ్యాథ్స్ అంటే భయపడి ఇంటర్లో దాన్ని వద్దనుకొని బైపీసీ చదివి, మెడికల్ ఎంట్రెన్స్లో విఫలమయ్యాడు. తరువాత ఇంటర్లో ఉన్న నాలుగు మ్యాథ్స్ పేపర్లను ప్రైవేటుగా రాసి ఎంసెట్ ద్వారా ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. యూఎస్లో ఎమ్మెస్ చేసి, ప్రస్తుతం అక్కడే ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద హోదాలో పనిచేస్తున్నాడు. మీరు కూడా మ్యాథ్స్పై భయం పోగొట్టుకొని, ఇంటర్ పూర్తిచేసి, మంచి కాలేజీలో మ్యాథ్స్తో ఎక్కువగా అవసరం లేని బ్రాంచితో ఇంజినీరింగ్ పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ, మీరు ఇప్పుడు ఎంపీసీ గ్రూపు నుంచి వేరే గ్రూపునకు మారినా, భవిష్యత్తులో మీరు రాయబోయే ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో అరిథ్మెటిక్/ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/ లాజికల్ రీజనింగ్/ డేటా ఇంటర్ప్రెటేషన్ లాంటి సబ్జెక్టులకు మ్యాథ్స్లో ప్రాథమిక పరిజ్ఞానం చాలా అవసరం. ఇంజినీరింగ్ చదవడం కోసం కాకపోయినా భవిష్యత్తులో మెరుగైన ప్రభుత్వ ఉద్యోగం పొందడం కోసమైనా ఇంటర్లో మ్యాథ్స్ చదవడం ఉపయోగకరంగా ఉంటుంది. అవసరమైతే మ్యాథ్స్కు ట్యూషన్కు వెళ్లండి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: prasanth
Ans:
మీ స్నేహితుడికి బీబీఏతో పాటు పది సంవత్సరాల ఉద్యోగానుభవం ఉంది కాబట్టి ఈఎంబీఏ (ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ) చదవడమే మంచిది. డిస్టెన్స్ ఎంబీఏలో చాలామంది విద్యార్థులు ఉద్యోగానుభవం లేకుండా నేరుగా అడ్మిషన్ తీసుకొంటారు. చాలా డిస్టెన్స్ ఎంబీఏ ప్రోగ్రాంలలో కాంటాక్ట్ క్లాసులకు హాజరు అవ్వాల్సిన అవసరం కూడా లేనందున నైపుణ్యాలను నేర్చుకొనే అవకాశం ఉండదు. ఈఎంబీఏ క్లాస్ రూంలో అందరూ ఉద్యోగానుభవం ఉన్నవారే ఉండటం వల్ల ఒకరి అనుభవం నుంచి మరొకరు నేర్చుకొనే అవకాశాలు ఎక్కువ. ఈఎంబీఏ ప్రోగ్రాంలో ప్రతి సెమిస్టర్లో కొన్ని కాంటాక్ట్ క్లాసులు తప్పనిసరి. ప్రొఫెసర్స్ నుంచి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈఎంబీఏ బోధనావిధానం కూడా డిస్టెన్స్ ఎంబీఏ కంటే భిన్నం. ఈఎంబీఏలో ఎక్కువగా కేస్ డిస్కషన్, సెమినార్లు, గేమ్స్, యాక్టివిటీస్ల సహాయంతో బోధన ఉంటుంది. థియరీ కంటే మెనేజీరియల్/ ప్రాక్టికల్ అప్లికేషన్స్కు ప్రాముఖ్యం అధికం. ఈఎంబీఏను ప్రముఖ బిజినెస్ స్కూల్స్ నుంచి చేస్తే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: prasanth
Ans:
బ్యాంకులో ఫైనాన్స్కు సంబంధించిన విభాగాల్లో పనిచేసినట్లయితే మీరు ఎంబీఏలో చదివిన ఫైనాన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న వివిధ రకాల విభాగాలన్నీ పరిశీలించి, వాటిలో ఫైనాన్స్ సంబంధిత రంగాలను ఎంచుకొని అందుకు తగిన నైపుణ్యాలను పెంపొందించుకోండి. సాధారణంగా బ్యాంకుల్లో ఫైనాన్స్కి సంబంధించి కార్పొరేట్ క్రెడిట్, రిటైల్ క్రెడిట్, ట్రెజరీ, ఫారెక్స్, రిస్క్ మేనేజ్మెంట్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ బ్యాంకింగ్ లాంటి విభాగాలుంటాయి. ఏ విభాగంలో పనిచేస్తే మంచి భవిష్యత్ ఉంటుంది అని అడిగారు. మీ దృష్టిలో మంచి భవిష్యత్తు అంటే ఎక్కువ వేతనం పొందడమా? పదోన్నతా? చేసే ఉద్యోగంలో సంతృప్తా? అనే విషయాలపై స్పష్టత అవసరం. మీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఆశయాలను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: prasanth
Ans:
డూన్ బిజినెస్ స్కూల్, డెహ్రాడూన్లో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సు చదవడానికి ప్రవేశ పరీక్ష రాయవలసిన అవసరం లేదు. ఇంటర్మీడియట్ మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారుచేసి ప్రవేశాలు కల్పిస్తారు. అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్లూ ఉంటాయి. మరిన్ని వివరాలకోసం కాలేజీ వెబ్సైట్ని సందర్శించండి. కొన్ని వ్యవసాయ కళాశాలలు యూజీసీ/ ప్రభుత్వ గుర్తింపు ఉన్న యూనివర్సిటీకి అనుబంధంగా ఉండి, ఐసీఏఆర్ నిర్దేశించిన సిలబస్తో డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. ఏదైనా అగ్రికల్చర్ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో చేరేముందు ఆ కోర్సుకు ఐసీఏఆర్ గుర్తింపు ఉందో, లేదో నిర్థరించుకోండి. వ్యవసాయ శాఖలో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలకు ఐసీఏఆర్ గుర్తింపు ఉన్న డిగ్రీ అవసరం. కొన్ని ప్రైవేటురంగ సంస్థలు ఈ గుర్తింపు లేని డిగ్రీ చదివినవారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: prasanth
Ans:
మీరు ప్రస్తుతం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి సెలవు పెట్టి లా డిగ్రీని చదివిన తర్వాత మీరు మళ్లీ ఉద్యోగంలో చేరితే, ఆ డిగ్రీ మీకెలా ఉపయోగపడుతుంది? ఆ డిగ్రీతో ప్రమోషన్ వస్తుందా? అనేవి పరిగణనలోకి తీసుకోండి. ఒకవేళ, మీరు ఉద్యోగానికి రాజీనామా చేసి లాయర్గా ప్రాక్టీస్ చేస్తే, మొదట్లో కొంతకాలం పాటు ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అందుకు సంబంధించిన ఆర్థిక ఆసరాను ఏర్పాటు చేసుకున్నాక రాజీనామా చేయండి.
మీరు లా కోర్సు చదువుతూనే న్యాయవాద వృత్తికి సంబంధించిన పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకుంటున్నారు. కానీ, లా లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్ని చదివేటప్పుడు ఆ కోర్సుపై పూర్తి శ్రద్ధ పెడితే విషయ పరిజ్ఞానం బాగా వస్తుంది. ఆర్థిక ఇబ్బందులవల్ల ఉద్యోగం చేయడం తప్పనిసరైతే ఎవరైనా సీ‡నియర్ లాయర్ దగ్గర అసిస్టెంట్గా చేరే ప్రయత్నం చేయండి. ఈ ప్రయాణంలో మీరు వృత్తి మెలకువలు నేర్చుకొంటారు గానీ, ఆశించినంతగా వేతనాలు లభించవు. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే విషయ పరిజ్ఞానంతోపాటు నైపుణ్యాలూ చాలా అవసరం. చేయబోయే పార్ట్ టైమ్ జాబ్లో వేతనంతో సంబంధం లేకుండా న్యాయవాద వృత్తిలో మెలకువలు, నైపుణ్యాలు నేర్చుకొనే ప్రయత్నం చేయండి.
చివరిగా, మీ నిర్ణయం సరైనదేనా అనేది న్యాయవాద వృత్తిపై మీకున్న ఆసక్తి, మీ సామర్థ్యంపై మీకున్న నమ్మకం, కమ్యూనికేషన్, నెట్ వర్క్ నైపుణ్యాలు, క్లిష్ట సమస్యల్ని పరిష్కరించగల నేర్పు, మీ కుటుంబ ఆర్ధిక పరిస్థితులు లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: prasanth
Ans:
బీఎల్ చేసినవారు కనీసం మూడు సంవత్సరాల లా ప్రాక్టీస్తో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) నియామక పరీక్ష రాయడానికి అర్హత ఉంటుంది. ఒకవేళ మూడేళ్ల లా ప్రాక్టీస్ అనుభవం లేకపోతే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేనాటికి బీఎల్ అయి కనీసం మూడేళ్లు పూర్తి అవ్వడంతో పాటు, బీఎల్లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 55%) మార్కులు పొందాలి. న్యాయవాదిగా నమోదై, మూడేళ్ల అనుభవం లేనివారు కూడా ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్స్ కేటగిరీ కింద అర్హులే. న్యాయవాదిగా అనుభవం ఉన్నవారందరూ బార్ అసోసియేషన్ నుంచి పొందిన ప్రాక్టీస్ సర్టిఫికెట్ను రుజువుగా సమర్పించాలి.
సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉన్నవారికి 23- 35 సంవత్సరాల (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 సంవత్సరాలు) వయసు, న్యాయవాదిగా పనిచేసిన అనుభవం లేనివారికి 23- 26 సంవత్సరాల (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 31 సంవత్సరాలు) వయసు ఉండాలి. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) రాత పరీక్షకు అర్హత సాధించాలంటే రెండు గంటల వ్యవధిలో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో 100 మార్కులకు నిర్వహించే స్క్రీనింగ్ పరీక్ష రాయాలి. ఈ పరీక్షలో కనీసం 40% మార్కులు సాధించినవారినుంచి ప్రకటించిన ఖాళీల సంఖ్యకు 10 రెట్ల సంఖ్యలో అభ్యర్థుÄలను రాత పరీక్షకు అనుమతిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష లో పొందిన మార్కులకు చివరి ఎంపికలో వెయిటేజి ఉండదు. రాత పరీక్ష మూడు పేపర్లు
(సివిల్ లాస్, క్రిమినల్ లాస్, ఇంగ్లిష్)గా, ఒక్కో పేపర్ను మూడు గంటల వ్యవధిలో, 100 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. ఇంగ్లిష్ పరీక్షను క్వాలిఫైయింగ్ పరీక్ష గానే గుర్తించి, మొదటి రెండు పేపర్లలో 200 మార్కులకు అభ్యర్ధులు పొందిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని, ఇంటర్వ్యూ (వైవా వోస్)కి షార్ట్ లిస్ట్ చేస్తారు. సివిల్ లాస్, క్రిమినల్ లాస్.. రెండు పేపర్లలో కనీసం 60% మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 50%) పొందినవారి నుంచి 1: 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది. మొత్తం 230 మార్కుల్లో అభ్యర్ధులు పొందిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: prasanth
Ans:
మీ అబ్బాయి తన కెరియర్ గురించి ఈ పాటికే ఒక నిర్ణయం తీసుకొనివుంటాడు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక కూడా తల్లిదండ్రులు, బంధువులు కెరియర్ను నిర్ణయించడం శ్రేయస్కరం కాదు. ఎంటెక్ చేయాలా, ఎంబీఏ చేయాలా, ఎంబీఏ చేస్తే ఇండియా లోనా, విదేశాల్లోనా అనేవి అతనికే వదిలివేయడం మంచిది. తల్లిదండ్రులుగా అన్ని అవకాశాల్లో ఉన్న సాధకబాధకాలు చర్చించి నిర్ణయం మాత్రం తననే తీసుకోనివ్వండి.
ఐసెట్లో మంచి ర్యాంకు వస్తే రాష్ట్రంలో ఉన్న మంచి ఎంబీఏ కాలేజీల్లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. టిస్నెట్లో మెరుగైన ప్రతిభ కనపరిస్తే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. క్యాట్లో మంచి స్కోరు పొందితే ఐఐఎంల్లో, దేశంలో ఉన్న కొన్ని ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ప్రవేశం పొందవచ్చు. కొన్ని ప్రైవేటు బిజినెస్ స్కూల్స్ ప్రత్యేక ప్రవేశపరీక్షలు తామే నిర్వహించి ఎంబీఏ కోర్సులో అడ్మిషన్లు చేపడుతున్నాయి.
విదేశాల్లో ఎంబీఏ విషయానికొస్తే జీమ్యాట్ తోపాటు టోఫెల్/ఐఈఎల్టీఎస్లో మంచి స్కోరు పొంది, ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ప్రయత్నాలు చేయవచ్చు. సాధారణంగా విదేశాల్లో ఎంబీఏ చేయడానికి కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండటం మంచిది. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ చదవాలంటే కనీసం కోటి రూపాయలు ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: రవిశంకర్
Ans:
- మీ స్నేహితుడికి బీబీఏతో పాటు పది సంవత్సరాల ఉద్యోగానుభవం ఉంది కాబట్టి ఈఎంబీఏ (ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ) చదవడమే మంచిది. డిస్టెన్స్ ఎంబీఏలో చాలామంది విద్యార్థులు ఉద్యోగానుభవం లేకుండా నేరుగా అడ్మిషన్ తీసుకొంటారు. చాలా డిస్టెన్స్ ఎంబీఏ ప్రోగ్రాంలలో కాంటాక్ట్ క్లాసులకు హాజరు అవ్వాల్సిన అవసరం కూడా లేనందున నైపుణ్యాలను నేర్చుకొనే అవకాశం ఉండదు. ఈఎంబీఏ క్లాస్ రూంలో అందరూ ఉద్యోగానుభవం ఉన్నవారే ఉండటం వల్ల ఒకరి అనుభవం నుంచి మరొకరు నేర్చుకొనే అవకాశాలు ఎక్కువ. ఈఎంబీఏ ప్రోగ్రాంలో ప్రతి సెమిస్టర్లో కొన్ని కాంటాక్ట్ క్లాసులు తప్పనిసరి. ప్రొఫెసర్స్ నుంచి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈఎంబీఏ బోధనావిధానం కూడా డిస్టెన్స్ ఎంబీఏ కంటే భిన్నం. ఈఎంబీఏలో ఎక్కువగా కేస్ డిస్కషన్, సెమినార్లు, గేమ్స్, యాక్టివిటీస్ల సహాయంతో బోధన ఉంటుంది. థియరీ కంటే మెనేజీరియల్/ ప్రాక్టికల్ అప్లికేషన్స్కు ప్రాముఖ్యం అధికం. ఈఎంబీఏను ప్రముఖ బిజినెస్ స్కూల్స్ నుంచి చేస్తే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎస్.పద్మ
Ans:
మీ అబ్బాయి తన కెరియర్ గురించి ఈ పాటికే ఒక నిర్ణయం తీసుకొనివుంటాడు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక కూడా తల్లిదండ్రులు, బంధువులు కెరియర్ను నిర్ణయించడం శ్రేయస్కరం కాదు. ఎంటెక్ చేయాలా, ఎంబీఏ చేయాలా, ఎంబీఏ చేస్తే ఇండియా లోనా, విదేశాల్లోనా అనేవి అతనికే వదిలివేయడం మంచిది. తల్లిదండ్రులుగా అన్ని అవకాశాల్లో ఉన్న సాధకబాధకాలు చర్చించి నిర్ణయం మాత్రం తననే తీసుకోనివ్వండి. ఐసెట్లో మంచి ర్యాంకు వస్తే రాష్ట్రంలో ఉన్న మంచి ఎంబీఏ కాలేజీల్లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. టిస్నెట్లో మెరుగైన ప్రతిభ కనపరిస్తే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. క్యాట్లో మంచి స్కోరు పొందితే ఐఐఎంల్లో, దేశంలో ఉన్న కొన్ని ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ప్రవేశం పొందవచ్చు. కొన్ని ప్రైవేటు బిజినెస్ స్కూల్స్ ప్రత్యేక ప్రవేశపరీక్షలు తామే నిర్వహించి ఎంబీఏ కోర్సులో అడ్మిషన్లు చేపడుతున్నాయి. విదేశాల్లో ఎంబీఏ విషయానికొస్తే జీమ్యాట్ తోపాటు టోఫెల్/ఐఈఎల్టీఎస్లో మంచి స్కోరు పొంది, ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ప్రయత్నాలు చేయవచ్చు. సాధారణంగా విదేశాల్లో ఎంబీఏ చేయడానికి కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండటం మంచిది. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూళ్లలో ఎంబీఏ చదవాలంటే కనీసం కోటి రూపాయలు ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్