Asked By: ఒక అభ్యర్థి
Ans:
గ్రూప్-2కి పోటీ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి, నోటిఫికేషన్ విడుదల కాకముందు నుంచే ప్రిపరేషన్ను మొదలుపెట్టాలి. సిలబస్ను అనుసరించి తెలుగు అకాడమీ పుస్తకాలను చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువసార్లు పునశ్చరణ చేయండి. సలహాలు, సూచనలకు సీనియర్లను సంప్రదించండి. గత ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్న పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏ అంశాలపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారో గ్రహించి వాటిపై దృష్టి పెట్టండి.