Post your question

 

    Asked By: సంతోష్

    Ans:

    ప్రస్తుతానికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్స్‌కు సంబంధించిన సిలబస్‌ను మార్చే యోచనలో ఉన్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి సిలబస్‌ మారే అవకాశం ఏమీలేదు.

    Asked By: జి.వై. బాలా జార్జి

    Ans:

    టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌లో మీకు ఇచ్చే జవాబు పత్రం ప్లెయిన్‌ షీట్‌ రూపంలో ఉంటుంది.

    Asked By: శివాని దండవేని

    Ans:

    మీరు ఇంకా ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నారు. కాబట్టి ఈ ఏడాది అవకాశం ఉండదు

    Asked By: వినయ్ కుమార్

    Ans:

    తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డిజిటల్‌ మూల్యాంకనం ప్రక్రియను బహిరంగంగా వెల్లడించలేదు. అభ్యర్థుల సమాధాన పత్రాలను స్కాన్‌ చేసి ఆ ఈ-కాపీలను ఎగ్జామినర్‌కి మూల్యాంకనం కోసం పంపించే అవకాశం ఉంది.  

    Asked By: శ్రీకాంత్

    Ans:

    పోలీసు కానిస్టేబుల్స్, ఎస్‌ఐ ప్రిలిమ్స్‌కి ఉన్న నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం మెయిన్స్‌కి కూడా ఉంది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌లో నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు.

    Asked By: శేఖర్

    Ans:

    మీరు ఇంజినీరింగ్‌లో గణితాన్ని ఒక పేపర్‌గా మాత్రమే చదివారు. కాబట్టి,  గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్ట్‌ నంబర్‌ 16కి దరఖాస్తు చేసుకోవడానికి మీకు అర్హత లేదు.

    Asked By: దువ్వా సిద్ధార్థ్

    Ans:

    మీరు పదోతరగతి వరకు తెలంగాణలోనే ఉండి ప్రైవేట్‌గా చదివినట్లయితే, సంబంధిత ప్రాంత తహసీల్దార్‌ నుంచి రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ను తెచ్చుకోవాలి. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానికతను పొందవచ్చు.

    Asked By: షేక్

    Ans:

    టీఎస్‌పీఎస్‌సీ ఓటీఆర్‌లో రెండో తరగతికి సంబంధించిన వివరాలను పూరించే బాక్స్‌ ఖాళీగా ఉంచకుండా ఒక డ్యాష్‌ (-) పెట్టండి. ఆ తర్వాత మూడో తరగతి చదివిన సంవత్సరాన్ని నింపండి. అప్పుడు వారికి మీరు ఒకటో తరగతి నుంచి నేరుగా మూడో తరగతికి ప్రమోట్‌  అయ్యారని అర్థమవుతుంది.