ప్రస్తుతానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్కు సంబంధించిన సిలబస్ను మార్చే యోచనలో ఉన్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి సిలబస్ మారే అవకాశం ఏమీలేదు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిజిటల్ మూల్యాంకనం ప్రక్రియను బహిరంగంగా వెల్లడించలేదు. అభ్యర్థుల సమాధాన పత్రాలను స్కాన్ చేసి ఆ ఈ-కాపీలను ఎగ్జామినర్కి మూల్యాంకనం కోసం పంపించే అవకాశం ఉంది.
పోలీసు కానిస్టేబుల్స్, ఎస్ఐ ప్రిలిమ్స్కి ఉన్న నెగెటివ్ మార్కింగ్ విధానం మెయిన్స్కి కూడా ఉంది. టీఎస్పీఎస్సీ గ్రూప్స్లో నెగెటివ్ మార్కింగ్ లేదు.
మీరు ఇంజినీరింగ్లో గణితాన్ని ఒక పేపర్గా మాత్రమే చదివారు. కాబట్టి, గ్రూప్-1 నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్ట్ నంబర్ 16కి దరఖాస్తు చేసుకోవడానికి మీకు అర్హత లేదు.
మీరు పదోతరగతి వరకు తెలంగాణలోనే ఉండి ప్రైవేట్గా చదివినట్లయితే, సంబంధిత ప్రాంత తహసీల్దార్ నుంచి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ను తెచ్చుకోవాలి. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానికతను పొందవచ్చు.
టీఎస్పీఎస్సీ ఓటీఆర్లో రెండో తరగతికి సంబంధించిన వివరాలను పూరించే బాక్స్ ఖాళీగా ఉంచకుండా ఒక డ్యాష్ (-) పెట్టండి. ఆ తర్వాత మూడో తరగతి చదివిన సంవత్సరాన్ని నింపండి. అప్పుడు వారికి మీరు ఒకటో తరగతి నుంచి నేరుగా మూడో తరగతికి ప్రమోట్ అయ్యారని అర్థమవుతుంది.
 
Do you want to delete your account from Pratibha website?