Post your question

 

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    ఎకానమీ సబ్జెక్టుపై పట్టు సాధించాలంటే మొదట 9, 10, 11, 12 తరగతులకు సంబంధించిన ఎన్‌సీఆర్‌టీ పుస్తకాలను క్షుణ్నంగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సుందరం అండ్‌ దత్త రాసిన ఇండియన్‌ ఎకానమీ, ఉమ కపిల - ఇండియాస్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ సిన్స్‌ 1947, మిశ్ర అండ్‌ పురి - ఇండియన్‌ ఎకానమీ లాంటి ప్రామాణిక పుస్తకాలు చదవాలి.

    Asked By: టి. ప్రసాద్

    Ans:

    ఓపెన్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు కాబట్టి ఆ కాలానికి సంబంధించి ఎక్కడ చదివారో ఆ ప్రాంతానికి చెందిన తహసీల్దార్‌ సంతకం చేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించండి.

    Asked By: అరుణ్

    Ans:

    సిలబస్‌ ప్రకారం తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలు (ఇంగ్లిష్‌/ తెలుగు మీడియం) చదవండి.

    Asked By: సలీమ్

    Ans:

    మీరు ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతానికి చెందుతారు. ఎందుకంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడ ఎక్కువ చదివితే ఆ ప్రాంతం లోకల్‌ అవుతుంది. మీరు కర్నూలులో చదవడం వల్ల మిమ్మల్ని తెలంగాణలో నాన్‌-లోకల్‌గా పరిగణిస్తారు.

    Asked By: అహ్మద్

    Ans:

    ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక హోదా తీసుకున్నప్పటికీ ప్రస్తుత నిబంధనల ప్రకారం మీరు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ ఎక్కడ  చదివితే అదే మీకు లోకల్‌ అవుతుంది. మీ చిన్ననాటి విద్యాభ్యాసమంతా తెలంగాణలోనే జరిగి ఉంటే టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Asked By: ఒక అభ్యర్థిని

    Ans:

    ఆధార్‌ కార్డ్‌లో భర్త పేరు ఉన్నప్పటికీ కులంలో ఎటువంటి మార్పు రాదు. ఉద్యోగం విషయంలో మీ పుట్టింటి పేరు, తండ్రి కులమే కొనసాగుతుంది. సర్టిఫికెట్లలోనూ ఎలాంటి మార్పు చేసుకోలేరు. ఓటీఆర్‌ అప్‌డేషన్‌లో తండ్రి కులమే వర్తిస్తుంది. ఆధార్‌లోనూ ఆయన పేరు పెట్టుకుంటే ఇక ఏ సమస్య ఉండదు.

    Asked By: నిఖిల

    Ans:

    మీరు రంగారెడ్డి నుంచి స్టడీ సర్టిఫికెట్లు తీసుకోవాలి. మూడు, నాలుగు, ఆరు ఒకే స్కూల్‌లో చదివి ఉంటే, అయిదో తరగతికి డబుల్‌ జంప్‌ అని ఓటీఆర్‌లో సబ్మిట్‌ చేస్తే సరిపోతుంది.

    Asked By: Nikhila

    Ans:

    జ: మీరు రంగారెడ్డి నుంచి స్టడీ సర్టిఫికెట్లు తీసుకోవాలి. మూడు, నాలుగు, ఆరు ఒకే స్కూల్‌లో చదివి ఉంటే, అయిదో తరగతికి డబుల్‌ జంప్‌ అని ఓటీఆర్‌లో సబ్మిట్‌ చేస్తే సరిపోతుంది.

    Asked By: Babu

    Ans:

    జ: ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ ఎక్కడ చదివితే ఆ ప్రాంతం లోకల్‌ అవుతుంది. దాని ప్రకారం మీరు రంగారెడ్డి జిల్లా కిందకు వస్తారు.

    Asked By: అఖిల్‌

    Ans:

    మీరు తెలంగాణ పరిధిలోకి వస్తారు. కొత్త నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడు తరగతుల్లోపు నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే లోకల్‌ అవుతారు. ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన ఏదైనా ప్రైవేటు పాఠశాలలో చదివి ఉండాలి. ఒకవేళ ప్రభుత్వ గుర్తింపు పొందని ప్రైవేటు స్కూల్‌లో చదివి ఉంటే  స్థానికతను ధ్రువపరుస్తూ ఎంఆర్‌ఓ సంతకం చేసి ఇచ్చిన సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.