Post your question

 

    Asked By: Andy

    Ans:

    రెండోసారి చదివిన సంవత్సరాన్నే ఓటీఆర్‌లో అప్‌లోడ్‌ చేయండి. అకడమిక్‌ సంవత్సరాల కాలమ్‌ నింపేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

    Asked By: priyanka

    Ans:

    మీరు మొదటిసారిగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షకు సిద్ధమవుతున్నారు కాబట్టి, సిలబస్‌ ప్రకారం బేసిక్‌ కాన్సెప్ట్ప్‌ను పూర్తిగా అవగాహన చేసుకోండి. ఆ తర్వాత తెలుగు అకాడమీ పుస్తకాలు, దినపత్రిక (ఇంగ్లిష్‌/తెలుగు) రోజూ చదవండి. మీకు పట్టులేని సబ్జెక్టుల కోసం కోచింగ్‌కి చేరడం మంచిది లేదా ఆ సబ్జెక్టుపై అవగాహన ఉన్నవారి నుంచి సూచనలు తీసుకోండి.

    Asked By: Sirisinahal

    Ans:

    ఇండియన్‌ సొసైటీ అంటే ఇందులో భారత సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రభుత్వ విధానాలు, పథకాల గురించి తెలుసుకోవాలి. వీటికి¨ ప్రత్యేకంగా పుస్తకాలు ఉండవు. భారత సమాజానికి సంబంధించిన తెలుగు అకాడమీ (తెలుగు/ఇంగ్లిష్‌ మీడియం) పుస్తకాలను సిలబస్‌ ప్రకారం రిఫర్‌ చేయవచ్చు.  ఆధునిక భారతదేశ విధానాలు, పథకాల గురించి ఇండియా ఇయర్‌ బుక్‌ - 2022ను చదవండి. ప్రిపరేషన్‌కి స్టాండర్డ్‌ పుస్తకాలను మాత్రమే ఎంపిక చేసుకోండి.

    Asked By: Parmeshwar

    Ans:

    నేటివ్‌ విలేజ్‌ అంటే శాశ్వత నివాస గ్రామం. మీరు చాలా కాలంగా ఎక్కడ అయితే నివసిస్తున్నారో ఆ ప్రాంతాన్ని స్థానిక గ్రామంగా పేర్కొనాలి.

    Asked By: రాకేష్‌

    Ans:

    ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు చదివిన ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉంటే, ఆ ప్రాంతానికి చెందిన తహశీల్దార్‌ సంతకం చేసిన నివాస ధ్రువీకరణ పత్రం (రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌)ను సమర్పించగలిగితే మీరు తెలంగాణ లోకల్‌ అవుతారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌లో చదివి ఉంటే తెలంగాణ స్థానికత వర్తించదు.

    Asked By: SHAIK

    Ans:

    ఓటీఆర్‌లోని ఎడిట్‌ ఆఫ్షన్‌కి వెళ్లి మీరు ఎన్నిసార్లయినా అవసరమైన సవరణలు చేసుకోవచ్చు. మళ్లీ తప్పులు రాకుండా చూసుకుంటే సమయం వృథా కాదు