Post your question

 

    Asked By: Nikhila

    Ans:

    జ: మీరు రంగారెడ్డి నుంచి స్టడీ సర్టిఫికెట్లు తీసుకోవాలి. మూడు, నాలుగు, ఆరు ఒకే స్కూల్‌లో చదివి ఉంటే, అయిదో తరగతికి డబుల్‌ జంప్‌ అని ఓటీఆర్‌లో సబ్మిట్‌ చేస్తే సరిపోతుంది.

    Asked By: Babu

    Ans:

    జ: ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ ఎక్కడ చదివితే ఆ ప్రాంతం లోకల్‌ అవుతుంది. దాని ప్రకారం మీరు రంగారెడ్డి జిల్లా కిందకు వస్తారు.

    Asked By: అఖిల్‌

    Ans:

    మీరు తెలంగాణ పరిధిలోకి వస్తారు. కొత్త నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడు తరగతుల్లోపు నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే లోకల్‌ అవుతారు. ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన ఏదైనా ప్రైవేటు పాఠశాలలో చదివి ఉండాలి. ఒకవేళ ప్రభుత్వ గుర్తింపు పొందని ప్రైవేటు స్కూల్‌లో చదివి ఉంటే  స్థానికతను ధ్రువపరుస్తూ ఎంఆర్‌ఓ సంతకం చేసి ఇచ్చిన సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. 

    Asked By: రవికాంత్‌

    Ans:

    గ్రూప్‌-1ను డిస్క్రిప్టివ్‌ ప్రధానంగాను, గ్రూప్‌-2ను ఆబ్జెక్టివ్‌ తరహాలోనూ నిర్వహిస్తారు. గ్రూప్‌-1కి సబ్జెక్టులను విశ్లేషణాత్మక అవగాహనను పెంపొందించుకునే విధంగా చదవాలి. ఈ పరీక్షకు రాత నైపుణ్యం, రాసే భాషపై పట్టు కూడా అవసరం. గ్రూప్‌-2లో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు కాబట్టి సబ్జెక్టు మౌలికాంశాలను క్షుణ్ణంగా చదివి బిట్లు ప్రాక్టీస్‌ చేస్తే సరిపోతుంది. 

    Asked By: Lingala

    Ans:

    సిలబస్‌ ప్రకారం తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలు (ఇంగ్లిష్‌/ తెలుగు మీడియం) చదవండి.

    Asked By: Sravan Kumar

    Ans:

    కొన్ని రకాల పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధిత బ్రాంచిలో డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంకొన్నింటికి పీజీ  ఫస్ట్ క్లాస్ లో పాసై ఉండాలి. 

    Asked By: నిఖిత

    Ans:

    మీ లక్ష్యం అభినందనీయం. టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే పోటీ పరీక్షల్లో ముఖ్యమైనవి గ్రూప్‌-1, 2. ఈ పరీక్షలకు సంబంధించిన స్కీమ్, సిలబస్‌ లాంటివి టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌ లోనుంచి డౌన్‌లోడ్‌ చేసుకోండి. గత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నపత్రాల కోసం అంతర్జాలంలో శోధించండి. వీలుంటే, హైదరాబాద్‌లో ఉండి గ్రూప్‌-1, 2 పరీక్షలకు సన్నద్ధమయ్యే మీ మిత్రబృందంతో ఆన్‌లైన్‌ స్టడీ గ్రూప్‌ ఏర్పాటు చేసుకొని, పరీక్షలకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించండి. సిలబస్‌కు అనుగుణంగా ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ మెటీరియల్‌ చదువుతూ సొంతంగా నోట్స్‌ తయారు చేసుకోండి. కరోనా మూలంగా చాలా కోచింగ్‌ సంస్థలు ఆన్‌లైన్‌ శిక్షణను అందిస్తున్నాయి. వాటిలో మేలైనదాన్ని విచారించి ప్రవేశం పొందండి. తెలంగాణకు సంబంధించిన సిలబస్‌ మినహా, మిగతా సిలబస్‌ చాలావరకూ యూపీఎస్‌సీ సిలబస్‌కి దగ్గరగా ఉంటుంది. యూపీఎస్‌సీ పరీక్షల ఆన్‌లైన్‌ మెటీరియల్‌నూ చదవండి. ఆన్‌లైన్‌లో ఈనాడు విద్యాసమాచారాన్నీ, ప్రతిభ మెటీరియల్‌నూ అనుసరించండి. ముఖ్యంగా సంపాదకీయాలనూ, వ్యాసాలనూ చదివి అర్ధం చేసుకొని నోట్స్‌ రాసుకోండి. గ్రూప్‌-1, గ్రూప్‌-2 శిక్షణలో నిష్ణాతులైనవారిని ఆన్‌లైన్‌లో సంప్రదించి, వారి సూచనలను తీసుకొంటూ మీ ఆశయాన్ని నెరవేర్చుకొనే ప్రయత్నం చేయండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌