బీఎస్సీ ఎంపీసీ (కంప్యూటర్ సైన్స్) చేసినవారికి కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల దరఖాస్తుకు అర్హత ఉంటుంది. ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు మే 26తో ముగిసింది.
పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ముగియడంతో ఎడిట్ కావడంలేదు. ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు సవరణ చేసుకోవచ్చు.
కొత్త నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ ఎక్కడ చదివితే అదే లోకల్ అవుతుంది. దాని ప్రకారం మీకు సూర్యాపేట జిల్లా, యాదాద్రి జోన్ స్థానికత వర్తిస్తుంది.