* ప్రశ్నపత్రంలో తప్పులతో విద్యార్థుల్లో ఆందోళన
విజయవాడ (కరెన్సీనగర్), న్యూస్టుడే: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం జరిగిన ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలో ప్రశ్నపత్రం తప్పుల తడకలా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విజయవాడ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇచ్చిన ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లడంతో తమకు మార్కులు తక్కువగా రావచ్చని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం జనరల్ సర్జరీ విభాగం పరీక్ష రాసేందుకు మంగళవారం విద్యార్థులు హాజరయ్యారు. ముందుగా 20 మార్కులకు (పార్ట్-ఎ) మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత, మిగిలిన 80 మార్కులకు పార్ట్-బి ప్రశ్నపత్రాన్ని ఇవ్వాలి. అయితే కొన్ని చోట్ల విద్యార్థులకు తొలుత పార్ట్-బి ఇచ్చారు. ఇదేమని అడిగితే..పార్ట్-ఎలో తప్పులు దొర్లాయని, అందుకే పార్ట్-బి ఇచ్చామని ఇన్విజిలేటర్లు బదులిచ్చారు. కొన్ని కళాశాలల్లో పార్ట్-ఎ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చారు. అందులో తప్పులున్నాయి. ఈ నెల 14వ తేదీన జరగాల్సిన జనరల్ సర్జరీ రెండో పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఉండటంతో విద్యార్థులు అవాక్కయ్యారు. ఇదేమని అధికారులను ప్రశ్నించగా విశ్వవిద్యాలయం ఇచ్చిన ప్రశ్నపత్రాలనే తాము ఇచ్చామని సమాధానమిచ్చారు. దీనిపై పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు వివరణ కోరగా.. పార్ట్-ఎ ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లాయని గుర్తించి వాటిని మార్చిన తరవాత ఆన్లైన్లో పేపర్ని పొందుపరిచినట్లు తెలిపారు. జనరల్ సర్జరీ ప్రశ్నపత్రంలో ఈ ప్రశ్నలు రావని చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 995 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కొలువులు
‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!
‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్లో ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.