హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కాకతీయ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ మేరకు అక్టోబరు 19, 20వ తేదీల్లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను వాయిదా వేసి 20, 21వ తేదీల్లో నిర్వహించనుంది. అలాగే యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన ఎంబీఐ నాలుగో సెమిస్టర్ పరీక్షలను సైతం వాయిదా వేసింది. అక్టోబరు 19, 20వ తేదీల్లో జరగాల్సిన ఎంబీఏ పరీక్షలను 21, 22వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 19, 20వ తేదీల్లో నిర్వహించాల్సిన బీఈడీ దూరవిద్య పరీక్షలను నవంబరు 2, 3వ తేదీల్లో జరపనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ని కాకతీయ విశ్వవిద్యాయం వెబ్సైట్లో పొందుపర్చినట్లు స్పష్టం చేసింది.
అక్టోబరు 19, 20, 21వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించింది. 22 నుంచి జరగాల్సిన పరీక్షలను యథాతథంగా జరుగుతాయని తెలిపింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.